
'ప్యాకేజీ చదివి చదవి నాకు సైట్ వచ్చింది'
కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో కొత్తగా ఇచ్చినవి ఏవీ లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవ్వని హోదాకు కొంతమంది హీరోలు కూడా అయ్యారని ఆయన విమర్శించారు.
అనంతపురం: కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో కొత్తగా ఇచ్చినవి ఏవీ లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవ్వని హోదాకు కొంతమంది హీరోలు కూడా అయ్యారని ఆయన విమర్శించారు. గురువారం సాయంత్రం అనంతపురంలో నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ప్రకటన చదివి చదివి తనకు సైట్ కూడా వచ్చిందని చెప్పారు. పేపర్లో ఈ విషయాలు చెప్పడానికి కేంద్రం రెండున్నరేళ్లు తీసుకుందని మండిపడ్డారు. పేపర్లపై ప్రకటనలకే అంత సమయం పడితే సీమాంధ్ర పరిశ్రమల స్థాపనకు ఎంత సమయం పట్టాలని ప్రశ్నించారు.