తిరుమలకు బయలుదేరిన గొడుగులు | Umbrellas coming to Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు బయలుదేరిన గొడుగులు

Published Sat, Oct 5 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

Umbrellas coming to Tirumala

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు కన్నుల పండుగే. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు శుక్రవారం బయలుదేరాయి. దారి పొడవునా భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. 
 
 తిరువ ళ్లూరు, న్యూస్‌లైన్: తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా సమర్పించే గొడుగులు చెన్నై నుంచి తిరువళ్లూరుకు చేరాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నేతలు, భక్తులు గొడుగులకు పూజలు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి కాలి నడకన గొడుగులు తీసుకెళ్లి గరుడసేవకు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
 వీటికి ప్రతి గ్రామంలోనూ పూజలు నిర్వహించి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే గొడుగులు గురువారం రాత్రి తిరువళ్లూరు చేరాయి. ఈ సందర్భంగా భక్తులు, వీహెచ్‌పీ నేతలు, హిందువులు పెద్ద సంఖ్యలో గొడుగులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గొడుగులను ఊరేగించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement