Tiruvalluru
-
Engineering Student: ఇంజినీరింగ్ మధ్యలో హిజ్రాగా మారి
సాక్షి, చెన్నై: ఇంజినీరింగ్ చదువుతూ హిజ్రాగా మారిన ఓ యువకుడిని చదువు కొనసాగించేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితుడు కలెక్టర్ను ఆశ్రయించాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన కూలీ తెన్నరసు, శశికళ కుమారుడు లోకేష్. రెడ్హిల్స్ సమీపంలోని ఆర్వీఎస్ పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులో చేరాడు. రెండో సెమిస్టర్ పూర్తయిన తరువాత లోకేష్ హిజ్రాగా మారి గెజిట్లో ఓవియాగా పేరును మార్చుకున్నాడు. అంత వరకు సాఫిగా సాగిన లోకష్ కళాశాల జీవితం పూర్తిగా మారిపోయింది. హిజ్రాగా మారిన లోకేష్ అలియాస్ ఓవియాకు కళాశాల అనుమతి నిరాకరించింది. దీంతో మద్యలోనే ఇంజినీరింగ్ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చదువుపై మక్కువతో 2022–23వ సంవత్సరంగానూ డిగ్రీ చేయాలని పచ్చప్ప కళాశాలలో హిజ్రా కోటాలో సీటు ఆశించింది. అయితే హిజ్రా కోటాకు సంబందించి ప్రభుత్వం ఉత్తర్వులు లేకపోవడం, వయస్సు దాటడంతో సీటును నిరాకరించారు. దీంతో ఓవియా గత 18న కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్ను కలిసి పరిస్థితిని వివరించి కళాశాలలో సీటు ఇప్పించాలని కోరింది. ఈ సంఘటనపై స్పందించిన కలెక్టర్ పొన్నేరిలో ప్రభుత్వ కళాశాలలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సీటు కేటాయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం ఓవియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఓవియా మాట్లాడుతూ.. బాగా చదువుకుని టీచర్గా రాణిస్తానని మీడియాకు వివరించింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) -
ప్రియురాలి విషయంలో వాగ్వాదం.. స్నేహితుడే హంతకుడు
సాక్షి, చెన్నై: ప్రియురాలి విషయంలో జరిగిన వాగ్వాదంలో స్నేహితుడిని హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ రైల్వే స్టేషన్కు సమీపంలో గత జూలై12న ట్రాక్పై యువకుడి మృతదేహం లభించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి బాలాజీ జిల్లా పిచ్చాటూరు గ్రామానికి చెందిన అర్జున్గా గుర్తించారు. మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు సాధారణ విచారణ చేపట్టారు. అయితే పోస్టుమార్టం నివేదికలో యువకుడిని కొట్టి హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. అర్జున్ చివరి సారిగా ఫోన్లో మాట్లాడిన తిరునిండ్రవూర్కు చెందిన దినేష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో దినేష్, అర్జున్ ఒకే చోట పని చేస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరికి తిరువళ్లూరు జిల్లా పాక్కంలోని స్వచ్ఛంద సంస్థలో పని చేసే యువతులతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు నిర్ధారించారు. ఘటన జరిగిన రోజు తిరునిండ్రవూర్కు సమీపంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో దినేష్ ప్రియురాలి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో దినేష్ చేతిలో అర్జున్ హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. చదవండి: చదువుకోవడం ఇష్టం లేక... మర్డర్ ప్లాన్ చేసిన విద్యార్థి! -
ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు మృతి
సాక్షి, చెన్నై: ప్రియురాలితో కలిసి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బయలుదేరిన ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు ప్రాంతానికి చెందిన కుప్పన్ కుమారుడు శాంతకుమార్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమ వ్యవహరం తెలిసి ఇరు కుటుంబీకులు ఇటీవల నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో కలిసి శాంతకుమార్ శనివారం రాత్రి ఈకాడులోని బంధువుల ఇంటికి బైక్లో బయలుదేరాడు. తిరువళ్లూరు సమీపంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి స్వల్ప గాయాలతో బయటపడగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తిరువళ్లూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుప్పన్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!) -
ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్కు చెందిన శేఖర్(40) స్వీట్స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది. బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కీలేడీ మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. -
తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): తాళి కట్టిన గంటలోనే తనను నడిరోడ్డుపై వదిలేశాడని..తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మెయ్యూరు గ్రామానికి చెందిన మునస్వామి కుమార్తె లక్ష్మి(23) నర్సింగ్ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. సమీప బంధువైన అదే గ్రామానికి చెందిన చిన్నరాజ్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చిన్నరాజ్ నమ్మించడంతో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. గత డిసెంబర్లో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. వడమధురైకి చెందిన వేరే యువతితో చిన్నరాజ్కు పెళ్లి సంబంధం కుదుర్చారు. విషయం తెలుసుకుని యువకుడిని నిలదీయగా, నిర్లక్ష్యంగా సమాధామిచ్చాడు. దీంతో డిసెంబర్ 18న ఊత్తుకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది జనవరి 8న ఊత్తుకోటలోని చర్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళతానంటూ ఊత్తుకోట దాటిన తరువాత లక్ష్మిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెలన్నర తరువాత శుక్రవారం ఉదయం ఇంటికి రావడంతో లక్ష్మి అతడి ఇంటికి వెళ్లింది. తనకు న్యాయం చేయాలని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన చిన్నరాజ్ బంధువులు యువతిపై దాడి చేసి ఇంటి లోపలికి రానివ్వకుండా తాళం వేశారు. దీంతో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యువతికి ఐద్వా సంఘం నేతలు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఊత్తుకోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతిని విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లారు. -
నిప్పంటించుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు
తిరువళ్లూరు: శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి.. వ్యక్తి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా నెమిలిచ్చేరిలో చోటు చేసుకుంది. చెన్నై విల్లివాక్కం ప్రాంతానికి చెందిన బాలాజీకి సత్యనారాయణ (26), సూర్యనారాయణ (24) కుమారులు ఉన్నారు. సూర్యనారాయణకు వివాహం కాగా, సత్యనారాయణకు కాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తిరునిండ్రవూర్లోని మేన మామ ఇంట్లో ఉంటూ శంకరమఠంలో పనిచేస్తున్నాడు. సోమవారం నెమిలిచ్చేరి బ్రిడ్జిపైకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా.. -
తల్లితో వివాహేతర సంబంధం.. బిడ్డను గర్భవతి చేసిన డ్రైవర్
తిరువళ్లూరు: నాలుగు నెలలుగా పరారీలో ఉన్న ఓ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దేవందవాక్కం గ్రామానికి చెందిన డ్రైవర్ చరణ్రాజ్ అలియాస్ చరణ్రాజ్ (50) శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్గా పని చేసేవాడు. అతనితో పాటు సత్తరై గ్రామానికి చెందిన కుప్పుస్వామి (45) బస్సు క్లీనర్గా పని చేస్తాడు. ఈ నేపథ్యంలో చరణ్రాజ్కు కుప్పుస్వామి భార్య కోమదితో అక్రమ సంబంధం ఏర్పడింది. భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కోమది తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి పెద్దకుప్పంలో అద్దె ఇంట్లో చరణ్రాజ్తో కలిసి కొత్తకాపురం పెట్టింది. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా, గర్భిణి అని డాక్టర్లు చెప్పారు. చరణ్రాజ్ తరచూ బెదిరింపులకు గురి చేసి అత్యాచారం చేశాడని బాలిక చెప్పగా కోమది దీనిపై తిరువళ్లూరు మహిళా పోలీసు స్టేషన్లో నాలుగు నెలల కింద ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పరారీలో ఉన్న చరణ్రాజ్ తిరువణ్ణామలైలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం తిరువళ్లూరు న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. చరణ్రాజ్ వల్ల గర్భం దాల్చిన బాలిక రెండు వారాల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నిబంధనలకు విరుద్ధంగా స్నేహితులకు విందు
తిరువళ్లూరు : జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా కొంతమంది యువకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆరుగురు యువకులు నిబంధనలు ఉల్లంఘించి విందు చేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపుగా ఒకచోట చేరకూడదని నిబంధన విధించారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ పెనాలూరుపేట సమీపంలోని తన్నీకుళం గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఒకేచోట బిర్యానీ చేసుకొని భౌతిక దూరం పాటించకుండా ఒకేచోట కూర్చుని తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ సంఘటన ఎస్పీ అరవిందన్ దృష్టికి రావడంతో యువకులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో పెనాలూరుపేట పోలీసులు విందులో పాల్గొన్న యువకులను గుర్తించి అరెస్టు చేశారు. -
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు
సాక్షి, తిరువళ్లూరు(చిత్తూరు) : భర్తను హత్య చేసినందుకు ఓ మహిళకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఐదు వేలు రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి దీప్తి అరువునిధి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు చిత్తూరు జిల్లా నాగాలాపురం బీసీ కాలనీకి చెందిన గౌరి(23)కి తిరువళ్లూరు జిల్లా పట్టాభిరాం తండరై ప్రాంతానికి చెందిన రాజీ(27)తో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన రాజీ తరచూ గౌరీని వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2016 ఫిబ్రవరి 13న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజీ భార్యతో ఘర్షణకు దిగాడు. భర్త వేధింపులను తట్టుకోలేనీ గౌరి అతని తలపై రుబ్బురోలు రాయితో కొట్టి హత్య చేసింది. తిరువళ్లూరు జిల్లా అదనపు కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నేరం రుజువు కావడంతో శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి దీప్తి అరువునిధి తీర్పును వెలువరించారు. గౌరికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్రావు మీడియాకు వివరించారు. అనంతరం ముద్దాయిని పుళల్ జైలుకు తరలించారు. -
బీఎస్పీ నేత అరెస్ట్ అన్యాయం
తిరువళ్లూరు: బీఎస్పీ నేతపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోర్టు ఆవరణలోకి దూసుకెళ్లడానికి మహిళలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లాలో బీఎస్పీ ఉపకార్యదర్శిగా ప్రేమ్ను సోమవారం ఉదయం పోలీసులు విచారణ పేరిట తీసుకెళ్లారు. అనంతరం ప్రేమ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయం స్థానికులకు తెలియడంతో పెద్దఎత్తున కోర్టు ఆవరణలోకి చేరుకున్న మహిళలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. ఇదే సమయంలో కోర్టు నుంచి జైలుకు ప్రేమ్ను తీసుకెళుతున్న వాహనం రావడంతో మహిళలు పోలీసుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. గతంలో ప్రేమ్పై పలు ఆరోపణలు, కేసులు ఉన్నాయని వివరించిన మహిళలు, ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్న అతనిపై కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన మహిళలను పక్కకు తప్పించిన పోలీసులు ప్రేమ్ను రిమాండ్కు తరలించారు. కోర్టు ఆవరణలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్తత నెలకొంది. -
పరామర్శ
► వర్దా బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన ► పరామర్శలు...పలకరింపులు ►షార్ట్ఫిల్్మలా సాగిన స్టాలిన్ పర్యటన ► వ్యవసాయరుణాలు రద్దు చేయాలని డిమాండ్ తిరువళ్లూరు : వర్దా తుపాను సృష్టించిన బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు జాతీయ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ అన్నారు. వర్దా తుపాను బీభత్సానికి భారీ నష్టం ఏర్పడడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యం లో తిరువళ్లూరు జిల్లా తుపాను బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించి బాధితులకు సహాయకాలను పంపిణీ చేయడంతో పాటు రైతులను పరామర్శించారు. మొదట కొండంజేరి ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే పదికిలోల బియ్యం, దుప్పటితో పాటు పలు సహాయకాలను పంపిణీ చేశారు. అనంతరం సత్రం వద్ద రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. అక్కడి నుంచి విడయూర్కు వెళ్లగా మధ్యలో కన్నిమానగర్ ప్రజలు తమ సమస్యలను స్టాలిన్ దృష్టికి తెచ్చారు. తాగునీరు, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. అనంతరం విడయూర్, తిరువళ్లూరు, వల్లువర్పురం ప్రాంతాల్లో స్టాలిన్పర్యటించి సహాయకాలను అందజేశారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి : సహాయకాల పంపిణీ అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వర్దా తుపాను వల్ల కాంచీపురం, తిరువళ్లూరులో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, వారికి అండగా నిలిచేం దుకు రుణాలను రద్దు చేయడంతో పాటు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్దా తుపానుకు తిరువళ్లూరు తీవ్రంగా నష్టపోయినా సహాయకాలు మాత్రం అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి తమిళనాడులో తరచూ విపత్తులు సంభవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సాయం చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం వర్దా తుపానుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినా రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విపత్తు సంభవించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి సరిపుచ్చుకుంటుందని విమర్శించిన ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా కలిసి నష్టాన్ని వివరించి నిధులను రాబట్టాలని సూచించారు. వర్దా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుఉ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ఐఏఎస్లతో ప్రత్యేక కమిటీని నియమించి కేంద్రం సాయం కోరాలని సూచించారు. వర్దా తుపానుతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకునీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షార్ట్ ఫిల్్మలా సాగిన స్టాలిన్ పర్యటన: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాలిన్ పర్యటన పరామర్శలు, పలకరింపులతో సాగింది. ప్రతి చోటా ఐదు నిమిషాలు మాత్రమే ఆగిన స్టాలిన్, ఆ ప్రాంతాల్లో ప్రజల కష్టాలను వింటూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలు వినడం, కార్యకర్తలకు పలకరింపు, డీఎంకే నేతలకు సూచన, మీడియా పోలీసుల హడావిడి కనిపించింది. మొత్తానికి స్టాలిన్ పర్యటన షార్ట్ ఫిల్్మలా సాగింది. -
తిరువళ్లూరులో వర్ద బీభత్సం
తిరువళ్లూరు:తిరువళ్లూరు జిల్లాను వార్దా తుపాన్ అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో జిల్లాలో బీభత్స పరిస్థితి ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లాలో వార్దా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందుకు రెట్టింపు ప్రభావాన్ని చూపింది. జిల్లాలో ఆదివారం రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం సామవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతలా కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో రాత్రి నుంచే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో అంధకారంగా మారింది. జిల్లా అంతా నిర్మాణుష్యంగా మారింది. దీంతో పాటు సెల్ఫోన్లు, ఇంటర్నెట్, బీఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఉదయం నుంచే భారీ వర్షం పడడంతో ఆవడి, పట్టాభిరాం, ఏకాటూరు తదితర ప్రాంతాల్లో రైలు తీగలు తెగిపడడంతో రైలు సేవలను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో వేలాది మంది ప్రయాఇకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువళ్లూరు నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు పెట్టేల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి తాగునీరు, అన్నంతో పాటు ఇతర వస్తువులు దొరక్కపోవడంతో అవస్థలు పడ్డారు. జిల్లా నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపి వేశారు. రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తరలించారు. మత్స్యకారులను చేపల వేటకు అనుమతించకపోవడంతో పాటు సముద్రతీర ప్రాం తాలకు చెందిన ప్రజలను ఎప్పటికప్పడు అధికారులు అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ను సిద్ధంగా ఉంచారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పోలీవాక్కం, కడంబత్తూరు తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది ఇలా వుండగా జిల్లాలో నీ ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉదయం నుంచే కారు చీకటి కమ్ముకుంది. ఉదయం నుంచి స్వల్పగాలులు వీచినా మధ్యాహ్ననానికి గాలి మరింత పెరిగి బీభత్సం సృష్టించింది. ఇప్పటికే జిల్లా అంతటా వందలాది విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో మరో రెండు రోజుల వరకు విద్యుత్ వచ్చే పరిస్థితి ఉండదని అధికారులు వెల్లడించారు. అచ్చిరాని డిసెంబర్: తిరువళ్లూరు జిల్లాకు డిసెంబర్ నెల అచ్చిరావడం లేదన్న అభిప్రాయం ఉంది. గత డిసంబర్లో కురుసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేయగా, ప్రస్తుతం భారీ ఈదురు గాలీతో తమ ప్రతాపాన్ని చూపింది. దీంతో జిల్లాలో డిసెంబర్ నెలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
వానర ప్రేమ
తిరువళ్లూరు: అమ్మ ప్రేమకు మించి ఏదీ లేదన్నది వాస్తవం. చనిపోయిన తన పిల్లను ఎత్తుకుని రెండు రోజుల నుంచి ఓ వానరం తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తిరుగుతున్న వైనం అందరినీ కలిచి వేస్తోంది. ఈ ఘటన తల్లీబిడ్డలకు మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం చిన్న వానరం రెండుతస్తుల భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. నిర్జీవంగా పడి ఉన్న చిన్న వానరం శరీరాన్ని తనతోపాటు ఉంచుకుని తిరుగుతూనే ఉంది. పది నిమిషాలు అటుఇటూ తిరిగిన తరువాత మృతి చెందిన వానరాన్ని లేపడానికి తల్లి కోతి చేయని ప్రయత్నం లేదు. ఎంత ప్రయత్నించినా నిర్జీవంగా ఉన్న చిన్న వానరంలో చలనం లేకపోవడంతో తల్లికోతి తల్లడిల్లిపోతోంది. ఈ సంఘటన కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారి కంట తడి పెట్టించింది. రెండు రోజులైనా తల్లి వానరం తన బిడ్డ లేస్తుందన్న నమ్మకంతో చేయని ప్రయత్నం లేదు. బహుశా తల్లి వానరానికి తెలియదేమో తన బిడ్డ చనిపోయిందని. -
ఇద్దరు నకిలీ డాక్టర్ల అరెస్ట్
తిరువళ్లూరు : అనుమతి లేకుండా క్లినిక్లు నిర్వహించడంతో పాటు అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వైద్యశాఖ అధికారులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల డెంగీ వేగంగా విస్తరించడంతో దాదాపు 12 మంది మృత్యవాత పడిన సంఘటన తెలిసిం దే. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనం ఏర్పరచిన నేపథ్యంలో అధికారులు న కిలీ డాక్టర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పరిధిలోని వెన్మనముదూర్లో నకలీ డాక్టర్ ఉన్నట్టు అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెన్మనముదూర్ గ్రామానికి చెందిన గణేషన్ కుమారుడు వసంత్కుమార్ ప్లస్టూ వరకు చదివి క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించి అధికారులు అతనిని అరెస్టు చేశారు. ఇదే విధంగా పేరంబాక్కం గ్రామానికి చెందిన కోమగన్. ఇతను ఫిజియోథెరపీ పూర్తీ చేసి ఏడేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తని ఖీల్లో గుర్తించి వారిని సైతం అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేసిన వైద్యశాఖ అధికారులు శుక్రవారం రాత్రి మరో ఇద్దరిని అరెస్టు చేయడం జిల్లాలో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 35కు చేరింది. -
తమ్ముడిని కడతేర్చిన అన్న
తిరువళ్లూరు : అన్నాతమ్ముళ్ల మద్య ఏర్పడిన గొడవలో మద్యం మత్తులో ఉన్న అన్న కత్తితో పొడిచి తమ్ముడిని హత్య చేశాడు. ఈ సంఘటన తిరువళ్లూరులోని మాపోసి నగర్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరులోని మాపోసి నగర్కు చెందిన మదన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతనికి జయబుద్ధన్, సిద్ధార్థన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు జయబుద్ధన్ కెమెరా మెకానిక్గా పనిచేస్తుండగా చిన్న కొడుకు సిద్ధార్థన్ తిరుపతిలోని లా కళాశాలో బీఎల్ చదువుతున్నాడు. మద్యానికి బానిసైన జయబుద్ధన్ నిత్యం ఘర్షణ పడేవాడని తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అన్నాదమ్ముళ్లు ఇద్దరు ఘర్షణ పడ్డారు. దీంతో సిద్ధార్థన్ జయబుద్ధన్పై దాడి చేయడంతో ఆగ్రహించిన జయబుద్ధన్ తమ్ముడు సిద్ధార్థన్పై కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనపై మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మద్యం మత్తులో తమ్ముడిని హత్య చేసిన జయబుద్ధన్ను పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
పోలీసులు వర్సెస్ న్యాయవాదులు
తిరువళ్లూరు: న్యాయవాదులకు వ్యతిరేకంగా తమిళనాడులో చట్టాన్ని రూపొం దించడానికి తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ తిరువళ్లూరు జిల్లా బార్ అసోసియేషన్ ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైలురోకోకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మద్యం తాగి కోర్టుకు హాజరు కాకూడదు, కేసును వాదించే సమయంలో న్యాయమూర్తిని కించపరిచేలా వ్యవహరించకూడదు, తప్పులు చేసే న్యాయవాదిని బార్ అసోసియేషన్కు సంబంధం లేకుండా న్యాయమూర్తే చర్యలు తీసుకుకోవచ్చనే వెసులుబాటును కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి కౌల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యలను నిరసిస్తూ రెండు వారాల నుంచి న్యాయవాదులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. దశల వారి ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రైలురోకో చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరులో న్యాయవాదుల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైలురోకోకు యత్నించారు. న్యాయవాదుల హక్కులను హరించేలా చట్టాలను రూపొందిస్తున్న కౌల్ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చట్టాలను వెంటనే వెనుక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం రైలురోకోకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర స్తాయిలో వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్యామ్సన్, అదనపు ఎస్పీ స్టాలిన్, డీఎస్పీ విజయకుమార్ న్యాయవాదులతో చర్చలు జరిపి న్యాయవాదులను వదలిపెట్టారు. -
అన్నాడీఎంకేలో అంతర్గత పోరు
తిరువళ్లూరు: ఐదేళ్లుగా బయటకు పొక్కని అధికార పార్టీ అంతర్గత విభేదాలు ఒక్క సారిగా భగ్గుమనడంతోపాటు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి రావడంతో పార్టీ పరువు బజారున పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అధికార అన్నాడీఎంకే పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. క్రమశిక్షణ గలిగిన పార్టీగా పేరున్న అన్నాడీఎంకేలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు లేవు. గతంలో గ్రూపు రాజకీయాలు ఉన్నా, మాజీ మంత్రి రమణ జిల్లా కార్యదర్శి పదవిని చేపట్టిన తరువాత వాటికి చెక్ పెట్టి పార్టీనీ ఏకతాటిపై నడిపించారు. చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటినీ తానే చక్కదిద్దేవారు. అయితే రమణ తన సతీమణితో ఏకాంతంగా వున్న పోటోలు బయటకు రావడంతో మంత్రి పదవి, జిల్లా కార్యదర్శి తదితర జోడు పదవుల నుంచి ముఖ్యమంత్రి జయలలిత రమణనూ తొలగించారు. దీంతో రమణ జిల్లా రాజకీయాలకు దూరంగా వుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక విధిలేనీ పరిస్థితుల్లో కాంచీపురం జిల్లా కన్వీనర్గా వున్న వాలాజాబాద్ గణేషన్కు జిల్లా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం గణేష్కు రెండు జిల్లాల బాధ్యతలను చూడడం కష్టంగా మారింది. పైగా నియోజకవర్గం ప్రచారంలోనూ బిజీగా ఉండడంతో అయన తిరువళ్లూరుపై పెద్దగా దృష్టి పెట్టలేనీ పరిస్థితి ఏర్పడి ంది. ఈ నేపథ్యంలో రమణ ఉన్నంత వరకు నిశ్శబ్దంగా వున్న అంతర్గత విభేదాలు రమణ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది. గత రెండు వారాల క్రితం జరిగిన అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో అంతర్గత విబేధాలు బయటపడి ఇరువర్గాలు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విభేదాలు అధికార పార్టీలో రావడంతో ఒక్క సారీగా పార్టీ నేతలు షాక్ తిన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో వర్గాలుగా చీలి ఘర్షణ పడడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పలువురు సీనీయర్ నేతలు సైతం వాపోతున్నారు. చైర్మన్పై ఫేస్బుక్లో ప్రచారం: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానీకి ఆసక్తి ఉన్న నేతల నుంచి అన్నాడీఎంకే దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ చైర్మన్ భాస్కరన్, ఇటీవల ఇంటర్వ్యూలకు సైతం హాజరయ్యారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పరిస్థితి వున్న నేపథ్యంలో తిరువళ్లూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భాస్కరన్ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జయలలితకు థ్యాంక్స్ అంటూ కొందరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. క్షణాల్లో సంబంధిత పోస్టు షేర్ కావడంతో పాటు అన్నాడీఎంకే పేజ్లోనే షేర్ చేశారు. వీటిని గమనించిన అధిష్టానం, మీకు ఎవరు సీటు ఇచ్చారు, సీటు ఇవ్వకుండానే ఇదేమీ ప్రచారం అంటూ నిలదీసినట్టు తెలిసింది. దీంతో తనకు సీటు రాకుండా తన వ్యతిరేక వర్గం ఇలా చేసిందని భావించిన భాస్కరన్ డీఎస్పీ విజయకుమార్కు ఫిర్యాదు చేశారు. తనపై ఫేస్బుక్లో వచ్చిన పోస్టింగ్ను వెంటనే నిలిపివేయడంతోపాటు పోస్టింగ్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు. నన్ను బెదించారు: భాస్కరన్పై వచ్చిన పోస్టింగ్ను తిరువళ్లూరు యువజన అన్నాడీఎంకే కార్యదర్శి జయవీరన్ పెట్టినట్టు గుర్తించారు. ఇతను భాస్కరన్ వ్యతిరేక వర్గం లో కొనసాగుతున్నట్టు గుర్తించిన భాస్కరన్ అతని ఇంటి వద్దకు వెళ్లి హత్య చేస్తానని బెదిరించారనీ తిరువళ్లూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించడంతో పాటు హత్య చేస్తాననీ బెదిరించిన మున్సిపల్ చైర్మన్ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు వర్గాల వద్ద విచారణ చేపడుతున్నారు. ఇది ఇలా వుండగా ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి కూడా లేని పక్షంలో అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు బయటకురావడం చర్చీనీయాం శంగా మారింది. అధికార పార్టీలో నానాటికీ పెరుగుతున్న కుమ్మలాటల వల్ల పార్టీకి ఎలాంటి పరిస్థితి పడుతుందోనన్న ఆందోళన కరుడుగట్టిన పార్టీ నేతల్లో ఏర్పడింది. -
లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా
తిరువళ్లూరు: లింగ నిర్ధారణ చేసి ఆడ శిశువుల భ్రూణహత్యలకు ప్రోత్సహించే కేంద్రాలపై నిఘా ఉంచినట్టు తిరువళ్లూరు డీఎస్పీ విజయకుమార్ వివరించారు. జాతీయ ఆడ శిశు దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడీ డాక్టర్ దయాళన్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డీఎస్పీ విజయకుమార్, విశిష్టఅతిథిగా భాస్కరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం భ్రూణహత్యలు తగ్గినట్టు పలు నివేదికలు ఇచ్చిన వివరాలను గుర్తు చేశారు. అయితే తిరువళ్లూరులోని స్కానింగ్ సెంటర్లపై ఇప్పటికీ నిఘా ఉందని వివరించారు. హర్యానా, పంజాబ్లలో ఆడ శిశు జననాల సంఖ్య ఆశాజనంగా ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో అంతటి స్థాయిలో ఆడ శిశువులు లేరన్న అంశాన్ని ఆయన వివరించారు. ప్రస్తుత కాలంలో ఆడశిశువు పెంపకంతో పాటు వివాహ సమయంలో కట్న కానుకలంటూ వస్తున్న దోపిడే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని ఆయన వివరించారు. అనంతరం చైర్మన్ భాస్కరన్ మాట్లాడుతూ ఆడ శిశువులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణించే సత్తా వారికుందని తెలిపారు. భారతదేశంలో నేడు పురుషులకు సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇటీవల మైనర్ నిందితుడి వయసును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చట్టాన్ని ప్రజలందరూ ఆహ్వానించాలని చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు యోగేంద్ర, జగదీషన్తో పలువురు పాల్గొన్నారు. ఆడ శిశువులకు ప్రభుత్వ కిట్తో పాటు ఇతర సహాయకాలను వారికి అందజేశారు. -
12 రోజుల తరువాత మహిళ మృతదేహానికి పోస్ట్మార్టం
- అనుమానాలను నివృత్తి చేయండి తిరువళ్లూరు : మహిళ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారీ పోలీసు బందోబస్తు నడుమ 12 రోజుల క్రితం మృతి చెందిన మహిళా మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. చెన్నై సమీపంలోని మణపాక్కం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె గాయత్రికి తిరువళ్లూరు జిల్లా కొత్తియంబాక్కం గ్రామానికి చెందిన విల్లర్కు ఎనిమిదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సామువేల్(7), సాల్మన్(5) ఇద్దరు పిల్లలు. విల్లర్ న్యాయవాదినని అబద్దం చెప్పి వివాహం చేసుకున్నట్టు తెలిసింది. విషయం తెలిసి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల విచారణలో తెలిసింది. ప్రస్తుతం విల్లర్ పూంద మల్లిలోని ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ రాత్రుళ్లు మద్యం సేవించి అదనపు క ట్నం కోసం తరచూ భార్యను వేధించేవాడని గాయత్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో గాయత్రి నాలుగవ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఐదున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నేపథ్యంలో గాయత్రి మృతదేహం నుంచి రక్తం రావడంతో అనుమానించిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం డీఎస్పీ విజయకుమార్, పూందమల్లి తహశీల్దార్ అభిషేకం పర్యవేక్షణలో వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ర్పాటు చేశారు. -
భర్తపై చర్యలు తీసుకోండి
తిరువళ్లూరు : మగసంతానం లేదన్న కారణంతో రెండో పెళ్లి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళ ఆందోళన చేసింది. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ రామమూర్తి(33). ఇతను అదే ప్రాంతానికి చెందిన పునితా(28)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి విశాలి(07), మనీషా(05), శిరీషా(03) ముగ్గురు ఆడపిల్లలు. పునితాకు ముగ్గురూ ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం లేదని తరచూ భార్యను వేధించేవాడు. తనకు మగ సంతానం కలగనందున పుట్టింటి నుంచి మూడు లక్షల రూపాయలను కట్నంగా తేవాలని బలవంతపెట్టేవాడు. అంతేగాక గత జనవరి 23న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామానికి సమీపంలో ఉన్న అత్తకూతూరు వేదవతిని రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పునితా తన బంధువులతో కలిసి గత జనవరి 30న ఎస్పీ శ్యామ్సన్ను ఆశ్రయించింది. అయితే ఎస్పీకి ఇంతవరకు స్పందించలేదు. ఆగ్రహించిన పునితా తన ముగ్గరు పిల్లలతో వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయడంతో పాటు భర్తను అప్పగించాలని రోదించింది. -
భార్యను హత్య చేసి ఆత్మహత్య
తిరువళ్లూరు: భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త ఆ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేపంబట్టులోని వల్లలార్ నగర్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా అత్తిపట్టు గ్రామానికి చెందిన రాజేష్కుమార్(24) కాల్ టాక్సీ డ్రైవర్. ఇదే ప్రాంతానికి చెందిన కోదండరామన్ చెన్నైలో ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె తమిళ్సెల్వి శ్రీపెరంబదూరులోని శ్రీవెంకటేశ్వరా కళాశాలలో ఈసీఈ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతూ వుంది. ఈ నేపథ్యంలో రాజేష్కుమార్కు తమిళ్సెల్వికి మధ్య వున్న పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదు నెలల బాలుడు వున్నాడు. వివాహ మైనప్పటి నుంచి అత్తారింటిలో వున్న రాజేష్కుమార్ దంపతులు మూడు రోజుల కిందట వేపంబట్టులోని వల్లలార్ నగర్లో అద్దెకు దిగారు. ఈ నేపథ్యంలో రాజేష్కుమార్ తమిళ్సెల్వి సోమవారం ఉదయం పది గంటలు దాటుతున్నా బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఇంటి యజమాని తలుపులు తెరిచి చూసి షాక్కు గురయ్యాడు. రక్తపు మడుగులో వున్న తమిళ్సెల్వి, ఉరి వేసుకుని రాజేష్కుమార్ మృతి చెంది వుండడాన్ని గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా తమిళ్సెల్వి గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం రాజేష్కుమార్ సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు భావించి, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం వైద్యశాలకు తరలించారు. రాజేష్కుమా ర్ తమిళ్సెల్విల వైవాహిక జీవితం సజావుగా సాగినా ఆరు నెలల నుంచి తర చూ ఘర్షణ పడేవారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రాజేష్కుమార్ తన వదినతో అక్రమ సంబంధం కలిగి ఉన్నారన్న అనుమానంతో భార్యభర్తలు ఇద్దరు తరచూ ఘర్షణ పడేవారని పోలీసులు వివరించారు. అయితే తల్లి హత్యకు గురి కావడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఐదు నెలల చిన్నారి అనాథగా మారిపోయింది. విగతజీవులుగా పడి వున్న తల్లి వద్ద పాలు కోసం ఏడూస్తూ చిన్నారి రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
ఆగిన లాల్బాగ్
ఇంజిన్లో సాంకేతిక లోపం రెండు గంటలు ఆగిన ఎక్స్ప్రెస్ ఆందోళనకు దిగిన ప్రయాణికులు తిరువళ్లూరు : లాల్బాగ్ ఎక్స్ప్రెస్లోని ఇంజిన్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా దాదాపు రెండు గంటల పాటు రైలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చెన్నై నుంచి బెంగళూరుకు లాల్బాగ్ ఎక్స్ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరింది. ఎక్స్ప్రెస్ సెవ్వాపేట దాటి పుట్లూరు వైపు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో రైలు పశువును ఢీ కొట్టింది. దీంతో పశువు మృతదేహం తిరువళ్లూరు వైపు వస్తున్న లాల్బాగ్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో చిక్కుకుంది. దీంతో సెవ్వాపేట- పుట్లూరు మధ్యలో 4.15 గంటలకు రైలు ఇంజిన్కు వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంట సమయం దాటుతున్నా రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ఇంజిన్ డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజన్లో సాంకేతిక లోపం వుందని, వాటిని సరి చేయడానికి మరో గంట సమయం పడుతుందనీ డ్రైవర్ వివరణ ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైల్రోకో చేసి తిరువళ్లూరు వైపు వెళుతున్న రైలును ఆపడాన్ని యత్నించారు. అనంతరం డ్రైవర్ అరక్కోణం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్ను ఏర్పాటు చేసి రైలును 6 గంటలకు ముందుకు కదిలించారు. -
వానరాల సేవకుడు
సమయం ఉదయం ఏడు గంటలు.... అసలే పర్యాటక ప్రాంతం... సమీపంలోని మ్యూజియంకు పర్యాటకుల రాక అప్పుడే మొదలై ఎవరి హడావిడిలో వారున్నారు....తనకేమీ పట్టనట్టు ఓ యువకుడు మాత్రం ఎదురుచూస్తున్నాడు. నిన్న డల్గా కనిపించిన చిన్నారి వానరం జాడలేదు.....మొన్న పర్యాటకుని చేతిలో గాయపడిన వానరం ఎటూ పోయి ఉందో అంటూ తన సేననూ లెక్కగట్టసాగాడు .... ఇంతలోనే ఒక వ్యక్తి సార్ నాకు ఈ అడ్రస్ కాస్త చెబుతారా అంటూ అడగ్గా...ఐదు నిమిషాలు ఆగండి.... పెద్ద వానరాలు రాకముందే చిన్నవాటికి బిస్కెట్లు(టిఫిన్) పెట్టాలి...పెద్దవి వస్తే చిన్నవాటికి ముక్క కూడా దొరకదు అంటూ తన పెంపుడు కోతుల సేవలో నిమగ్నమయ్యాడు వెంకటేశ్. నాలుగేళ్ల నుంచి దాదాపు 50 కోతులకు ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడి కథలోకి వెళితే... తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పీడబ్ల్యూడీ అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్. హోంగార్డుగా రెండేళ్ల క్రితం వరకు విధులు నిర్వహించి రాజీనామా చేసి ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య నదియా, పిల్లలు తరుణ్, రేష్మ ఉన్నారు. తండ్రి పీడబ్ల్యూడీ అధికారి కావడంతో డ్యూటీ మొత్తం పూండి రిజర్వాయర్ వద్దే సాగేది. ఇలా రిజర్వాయర్ వద్ద విధులు నిర్వహిస్తున్న తండ్రికి భోజనం తీసుకె ళ్లే తల్లితో పాటు వెళ్లే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న పాట్లు వెంకటేశ్ను కంటతడి పెట్టించాయి. అప్పుడే రోజుకు కనీసం పది రూపాయలకు బిస్కెట్లను కొనిపెట్టి కొన్నింటికి అయినా ఆకలి తీర్చేవారు. అప్పుడే నిర్ణరుుంచుకున్నాడు పదేళ్ల తరువాతైనా రోజుకు కనీసం 50 కోతులకైనా ఆకలి తీర్చాలని. పార్టటైమ్ పని చేసి.. తన లక్ష్యం ప్రకారం నాలుగేళ్ల నుంచి కోతులకు బిస్కెట్లు పెట్టడం ప్రారంభించారు. అయితే హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం ఇంటికి తన పెంపుడు కోతులకు కుటుంబానికి సరిపడకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్టైమ్గా చేసి తద్వారా వచ్చే ఆదాయంతో వానరాలను పెంచుతున్నట్టు వివరించారు వెంకటేశన్. తాను కోతులను పెంచడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అయినా కేవలం పదేళ్లపాటు మాత్రమే జీవించగలిగే కోతులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నదే తన ఆశయంగా వివరించేవాడు. వెంకటేశన్ ఏమంటున్నారంటే.... కోతులు దాడి చేస్తాయని వాటిని శారీరకంగా హింసించడాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. వాస్తవానికి సహజంగా దొరికే ఆహారం కోతులకు దొరకనప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి. సర్కస్కు, యాచనకు కోతులను ఉపయోగించే వారు వాటి ద్వారా వచ్చే సంపాదనలో కేవలం పది శాతం మాత్రమే వాటికి ఖర్చు చేస్తారు. తన యజమాని తన కోసం చూపిన ఆప్యాయతనూ దృష్టిలో వుంచుకుని అతను చెప్పిందల్లా కోతులు చేస్తున్నారుు. ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకున్నా భవిష్యత్తులో మానవుడు ఉద్భవించిన తీరును వివరించడానికి వుపయోగపడుతుంది. నాలుగేళ్ల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాను. బ్లూ క్రాస్ నుంచి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెడితే, మరి కొందరు కోతుల నుంచి ఇబ్బందులు వున్నాయని నాపై గొడవలకు దిగారు. దీంతో వేరే ప్రాంతంలో పెంచుతున్నాను. తన దరఖాస్తుకు స్పందించి కోతుల పెంపకానికి బ్లూక్రాస్ అనుమతి ఇస్తే ఇష్టంగా పెంచుకుంటాను. ఐదు గంటలు గడిపేస్తా ఒక్క రోజు నా రాముడు, లక్ష్మీ, పెరుమాల్, శివ, అజిత్, జిమ్మీ(ఇవి కోతుల పేర్లు) చూడకపోతే ఏదోలా వుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా రాత్రికంతా వానరాల వద్దకు వచ్చి విజిల్ వేస్తే ఎక్కడున్నా అవే పరిగెత్తుకొస్తాయి. ఇలా నా కోసం 50 ప్రాణులు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించి బిస్కెట్లు వేయడానికి వస్తుంటా ను. నేను ఒక్క రోజు రాకుంటే వానరాలు ఎదురుచూస్తున్నాయని ఫ్రెండ్స్ నాకు చెబుతుంటే, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క రోజు సెలవు దొరికితే ఐదు గంటల పాటు వాటితోనే గడిపేస్తాను. -
భార్య నుంచి రక్షణ కల్పించండి
తిరువళ్లూరు:ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద భర్త నిరాహార దీక్షకు పూనుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా కొట్టయూర్ ప్రాంతానికి చెందిన త్యాగరాజన్ కుమారుడు విజయమూర్తికి తిరుత్తణికి చెందిన భాగ్యలక్ష్మీకి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన జానకి రామన్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి పద్ధతి మార్చుకోవాలని భార్యను పలు సార్లు హెచ్చరించాడు. దీంతో భాగ్యలక్ష్మి తన ప్రియుడు జానకిరామన్తో సహజీనం చేస్తుండగా, విజయమూర్తి తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తిరుత్తణిలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న విజయమూర్తిని భార్య భాగ్యలక్ష్మీ, ఆమె ప్రియుడు జానకి రామన్, అతని స్నేహితులు రవి, బలరామన్ కలిసి ఈనెల 17న తిరుత్తణిలో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి సమయంలో విజయ మూర్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడి 108 ద్వారా తిరుత్తణి వైద్యశాలకు తరలించారు. ఇతనికి తల, కాళ్లు, చేతులు తదితర ప్రాంతాల్లో బలమైన గాయాలు వున్నాయి. ఫిర్యాదు స్వీకరణకు నిరాకరణ తన పై దాడి చేసిన భార్య, ఆమె ప్రియుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోవాలని విజయమూర్తి తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో బాధితుడు, తల్లి, తండ్రి, అన్నతో కలిసి బుధవారం ఉదయం ఎస్పీ శరవణన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన విజయమూర్తి, గురువారం ఉదయం కలెక్టర్ కారుకు ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, తమ కేసుపై ఉదాసీనతగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలోకి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి వారిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన ఆయన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
కోరిక తీర్చలేదని ప్రియురాలిని హతమార్చాడు
తిరువళ్లూరు: కోరిక తీర్చలేదన్న కోపంతో ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేశాడు. యువకుడిని పెనాలూరు పేట పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమారై చాముండేశ్వరి(19). ఈమె మనవాలనగర్లోని లోకిదాస్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. సోమవారం రాత్రి డ్యూటీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇంటి సమీపంలోని చాముండేశ్వరి ముళ్లపొదల్లోకి వెళ్లింది. ఆమె ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుప్పన్ సమీప ప్రాంతాల్లో గాలించడం ప్రారంభించారు. ముళ్లపొదల్లో చాముండేశ్వరి హత్యకు గురైనట్టు గుర్తించిన గ్రామస్తులు, పెనాలూరు పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతి మృతదేహన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు గ్రామస్తులు నిరాకరించారు. యువతి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, నిందితుడిని పట్టుకోవడానికి డాగ్స్వాడ్ను రప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించారు. అనంతరం మృతదేహన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. ;ప్రియుడి అరెస్ట్: ఈ హత్య కేసులో అసలైన నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మొదట చాముండేశ్వరి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరిగా చాముండేశ్వరి మాట్లాడిన నెంబర్లపై ఆరా తీశారు. పోలీసుల విచారణలో చాముండేశ్వరి అదే గ్రామానికి చెందిన రాజ్కుమార్తో గంటల తరబడి మాట్లాడడంతో పాటు చివరి కాల్ యువకుడితో మాట్లాడినట్టు నిర్ధారించారు. దీంతో రాజ్కుమార్ ను నిందితుడిగా గుర్తించి గాలింపు చర్యలు చేట్టారు. ఊత్తుకోట వద్ద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో చాముండేశ్వరి, రాజ్కుమార్ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతంలో ఉన్న మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్కుమార్ ను దూరంగా ఉంచినట్టు తెలిపాడు. చివరి సారిగా మాట్లాడాలని పిలిపించిన రాజ్కుమార్, తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్టు తెలిసింది. ఇందుకు చాముండేశ్వరి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన రాజ్కుమార్ బండరాయిని తలపై మోది హత్య చేసినట్టు విచారణలో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రణరంగం
తిరువళ్లూరు: పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కం క్రాస్ రోడ్డు వద్ద వున్న రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణ రణరంగంగా మారింది. తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం, వెళ్లియూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు వెల్లియూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వెల్లియూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు కొందరు ఒక రాజకీయ పార్టీకి చెందిన రబ్బర్ బ్యాండ్ను ధరించగా, పున్నపాక్కం గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు ఆ బ్యాండ్ను చింపి దాడి చేశారు. దీంతో పున్నపాక్కం, వెల్లియూర్ గ్రామాల విద్యార్థులు శని వారం పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పున్నపాక్కం గ్రామానికి చెందిన విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పున్నపాక్కం యువకులు బస్టాండులో ఉన్న కొందరు వెల్లియూర్ యువకులను చితక బాదారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిశాంత్, నాగరాజ్ అనే యువకులను వెంగల్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం జరిగిన దాడుల్లో తామరపాక్కం గ్రామానికి చెందిన యువకులు సైతం గాయపడ్డారు. పున్నపాకం, తామరపాక్కం గ్రామాల ప్రజలు కూడా బద్ధ విరోధులుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన అమ్మవారి జాతరలో ఈ రెండు గ్రామాల ప్రజలు పలుసార్లు గొడవపడ్డారు. కావున ఈ రెండు గ్రామాల మధ్య కూడా వైరం ఉంది. రాస్తారోకో : పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నూ, సోమవారం బస్టాండు వద్ద జరిగిన ఘర్షణలోనూ సంబంధం లేని తామరపాక్కం గ్రామస్తులు గాయపడ్డారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తామరపాక్కం గ్రామస్తులు మంగళవారం ఉదయం రాస్తారోకోకు దిగారు. దీన్ని విరమింపచేయూలని పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. రాస్తారోకోలో పాల్గొన్న యువకులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో ఆందోళన కారులను అదుపు చేయలేకపోయూరు. దీంతో ఆందోళనారులు రెచ్చిపోయారు. దుకాణాలను ధ్వంసం చేశారు. కనిపించిన వాహనాల అద్దాలను పగులగొట్టి వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి, ఆందోళనకారులపై లాఠీ చార్జి చేశారు. ఈ సంఘటనలో దాదాపు ఏడుగురు స్థానికులు, రాధన్ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. కత్తులు, కర్రలతో దాడులు: పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే సమాచారం అందుకున్న పున్నపాక్కం యువ కులు దాదాపు వంద మంది కత్తులు, కర్రలతో వచ్చి తామరపాక్కం గ్రామస్తులపై విచక్షణరహితంగా దాడులు చేశారు. ఇళ్లలోకి చొరబడి ద్విచక్ర వాహనాలు, ఇంటి అద్దా లు బీభత్సం సృష్టించారు. ఇది చూసిన వాహన చోదకులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ శరవణన్, కలెక్టర్ వీరరాఘవరావు నేరుగా పరిస్థితిని పరిశీలించి అప్రమత్తం చేశారు. అనంతరం మరిన్ని పోలీసు బలగాలు, వజ్రా వాహనం, టియర్ గ్యాస్ వాహనాలను రప్పించి ఇరు గ్రామాల మధ్య మోహరించారు. దీంతో కత్తులు, కర్రలతో దాడులకు దిగిన వారిని చితకబాది పరిస్థితిని అదుపుచేశారు. మూడు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, దాదాపు 300 మంది పోలీసులను మోహరించారు. 70 మందిపై కేసు నమోదు: పోలీసులపై దాడి, వాహనాల ధ్వంసం, తామరపాక్కంలోని ఇళ్లపై దాడి చేసిన ఘటనలో వెల్లియూర్, తామరపాక్కం, పున్నపాక్కం మూడు గ్రామాలకు చెందిన 70 మందిని గుర్తించి పోలీసులు వారిపై కేసు లు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, కత్తులతో రోడ్డుపై తిరిగి ప్రజలను భయాందోళనకు గురి చేయ డం, పలు వాహనాలను ధ్వంసం కింద కేసు నమోదు చేసినట్టు తిరువళ్లూరు ఎస్పీ శరవణన్ వివరించారు. ప్రజలు ప్రశాంతతనూ పాటించాలని సూచించిన ఎస్పీ శరవణన్, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు
తిరువళ్లూరు:బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడిని తిరువళ్లూరు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు యూనియన్ పరిధిలోని వరదాపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాజ్కుమార్(62). ఇతను పక్కింటిలో ఉంటున్న 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ విషయం మూడు వారాల క్రితం వెలుగులోకి వచ్చినప్పటికీ గ్రామస్తులు విషయాన్ని దాచారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాజ్కుమార్ వరదాపురం నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం సాయంత్రం వరదాపురం వచ్చిన రాజ్కుమార్ను గ్రామస్తులు పట్టుకుని పట్రపెరంబదూరు పంచాయతీ అధ్యక్షుడు చిన్నదురైకి అప్పగించారు. ఆయన గ్రామంలోకి వె ళ్లి బాధిత బాలిక, వృద్ధుడి బంధువుల వద్ద విచారణ జరిపారు. విచారణలో బాలిక గర్భం దాల్చడంతో పాటు ఇందుకు రాజ్కుమార్ కారణమని నిర్ధారించారు. సోమవారం ఉదయం తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం రాజ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో నిందితుడు రాజ్కుమార్ నేరం అంగీకరించడంతో మంగళవారం ఉదయం అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ న్యాయమూర్తి తమిళరసి ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. ప్రసుత్తం ఏడు నెలల గర్భిణిగా ఉన్న ైబాలికకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
పోలీస్ క్వార్టర్స్లో చోరీ
తిరువళ్లూరు, న్యూస్లైన్ : తిరువళ్లూరులోని పోలీస్ క్వార్టర్స్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. తిరువళ్లూరులోని సేలై రోడ్డులో పోలీస్ క్వార్టర్స్ ఉంది. ఈ క్వార్టర్స్లో రిజర్వ్ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న జయశీలన్ నివాసం ఉంటున్నా డు. ఇతను కుటుంబంతో కలిసి గురువారం ఉదయం పళ్లిపట్టులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి పలు వస్తువులు, బంగారు నగలను చోరీ చేసుకెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టిన విషయాన్ని పక్కింటి వారు జయశీలన్కు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేలిముద్రల నిఫుణులను రప్పించి వేలి ముద్రలను సేకరించారు. కాగా బంగారు నగ లు చోరీ జరిగినా పోలీసులు విషయం బయటకు చెప్పలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చురుగ్గా కౌంటింగ్ ఏర్పాట్లు
తిరువళ్లూరు, న్యూస్లైన్: కౌంటింగ్కు చురుగ్గా ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించిన కలెక్టర్ వీరరాఘవరావు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 24న ఏన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తిరువళ్లూరు సమీపంలోని శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి మూడెంచల భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 16 శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌటింగ్కు సంబందించిన ఏర్పాట్లను కలెక్టర్ వీరరాఘవరావు పరిశీలించారు. ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మీడియా రూమ్ను ఆయన పరిశీలించారు. కంప్యూటర్ ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పలువురు అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. -
ఆంధ్రా ఎన్నికలపై చర్చలు
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల వేడి, ఎండల వేడి తగ్గిన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న తిరువళ్లూరుకు ఆంధ్రా ఎన్నికలు తాకాయి. దీంతో ఎక్కడ చూసినా ఆంధ్ర రాజకీయాలపైనే చర్చలు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఏ పార్టీకి ఉందన్న అంశంపై తిరువళ్లూరు ప్రజలు ఆంధ్రాలో ఉన్న తమ బంధువుల వద్ద ఆరా తీయడం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా నగరిలో రోజాకు ఎంత మెజారిటీ వస్తుంది, సత్యవేడులో వైఎస్సార్సీపీకి ఉన్న గెలుపు అవకాశాలు, చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు మెజారీటీ తదితర అంశాలపై రచ్చబండ చర్చలు ముమ్మరంగా సాగుతున్నారుు. తిరువళ్లూరు జిల్లా అరంబాక్కంకు సరిహద్దు ప్రాంతంగా వున్న సూళూరుపేటలో జగన్ ప్రభంజనంపై ప్రజలు భారీగా అంచనా వేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లాకు ఆంధ్రా -తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి వేర్వేరు పనుల నిమిత్తం ప్రజలు నిత్యం తిరువళ్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రా నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడి వచ్చి స్థిర పడిన వారు అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 24న తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగారుు. అప్పటి వరకు ఇక్కడి ప్రధాన పార్టీల గెలుపు ఓటముల మధ్య భారీగానే చర్చలు జరిగాయి. అయితే తిరువళ్లూరులో ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం సరిహద్దు ప్రాం తంగా వున్న ఆంధ్రా ఎన్నికలపైనే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆంధ్రా ఎన్నికలపై తమకు తెలిసిన బంధువుల వద్ద తిరువళ్లూరు ప్రజలు ఎక్కువగా ఆరా తీయడం కనిపిస్తుంది. ఏ నలుగురు గుమికూడినా ఆంధ్రా రాజకీయాలపైనే చర్చించుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభంజనంపైనే ఆరా: చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయంపై జిల్లా ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తునానరు. సత్యవేడులో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మెజారిటీ ఎంత వస్తుంది. నగరిలో రోజాకు ఉన్న సానూభూతితో పాటు జగన్ ప్రభ ంజనం, సూళూరుపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంత మోజారిటీ వస్తుందన్న దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే వేర్వేరు ప్రాంతాల జిల్లా ప్రజలు ఇస్తున్న సమాచారం మేరకు జగన్ సీఎం కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు అవసరాలను కరెక్ట్గా అంచనా వేయడంలో జగన్ సక్సెస్ అయ్యారనీ, అక్రమంగా జగన్ను జైలులో పెట్టినా తల్లి, చెల్లి ద్వారా పార్టీనీ విజయవంతంగా సాగించారనీ తెలుగు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్తో రాజీలేనీ పోరాటం చేయడం, అభ్యర్థుల ప్రకటన విషయంలో అసంతృప్తులు లేకపోవడం జగన్కు వున్న రాజకీయ పరిపక్వానికి నిదర్శనమనీ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రా ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్వే చేసిన ఐబీ అధికారులు, జగన్కు గ్రామాల్లో మంచి పట్టు ఉందనీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఐబీ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు సీల్
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ ఎన్నికలు గురువారం ముగియడంతో శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎంలను భద్రపరిచిన అధికారులు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించారు. గుమ్మిడిపూండి, తిరువళ్లూరు, పూందమల్లి, ఆవడి, మాదవ రం పొన్నేరి నియోజక వర్గాల ఈవీఎంలను పోలీసు బందోబస్తు నడుమ శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అనంతరం అభ్యర్థుల చేత ఈవీఎంలను భద్రపరిచి స్క్రూటినింగ్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పోలైన ఓట్లను సరి చూసుకున్న తరువాత వాటికి సీల్ వేశారు. అనంతరం కలెక్టర్ వీరరాఘవరావుమాట్లాడుతూ ఆరంబాక్కం ప్రాంతంలోని నాలుగు మత్స్యకార గ్రామాలలో 10 శాతం ఓటింగ్ కూడా పోల్ కాలేదన్నారు. అక్కడ రీపోలింగ్కు అవకాశం లేదని వివరించారు. ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను చేపట్టినట్టు వివరించారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నట్టయితే అక్కడే తమ ఎజెంట్లను ఉంచుకోవచ్చని ఆయన వివరించారు. -
తిరువళ్లూరులో 73 శాతం ఓటింగ్
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలో 73 శాతం పోలింగ్ నమైంది. గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు బారులు తీరారు. తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలో గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. అయితే మనవాలనగర్ ప్రాం తంలోని పోలింగ్ కేంద్రం, తోయుదావూర్ పోలింగ్ కేంద్రంతోపాటు దాదాపు పది పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభమయ్యూరు. ఈవీఎంలను మొరాయించడంతో ఎన్నికలు ఆల స్యంగా ప్రారంభమయ్యూరు. అయితే వాటిని సరి చేసిన అధికారులు పోలింగ్ ను ప్రారంభించారు. మొదటి గంట సమయంలో పది శాతం ఓటింగ్ ప్రారంభమైనా, దాదాపు 12 గంటల వరకు 30 శాతం ఓటింగ్ దాటలేదు. అయితే మధ్యాహ్నం తరువాత వేగం పుంజుకుని 6 గంటల వరకు 73 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఓటరు స్లిప్పులు ఉన్నవారినే లోపలికి అనుమతించారు. ఏజెంట్ ల వద్ద నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సెండ్రాన్ పాళ్యం వద్ద గొడవలు: తిరువళ్లూరు జిల్లాలో అన్నాడీఎంకే, వీసీకే కార్యకర్తలు మధ్య గొడవలు చోటుచేసుకున్నారు. ఓటింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా, వీసీకే నేతలు వాటిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇదే విధంగా రామంజేరి వద్ద అన్నాడీఎంకే నేతలు, డీఎంకే నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. డీఎంకే పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే రంగనాథన్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఇదే సమయంలో మంజాకుప్పం వద్ద ఓటర్లు తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించని రాజకీయ పార్టీలకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పడంతో అక్కడ సాయంత్రం వరకు కేవలం 20 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద జనం లేక వెలవెలపోయింది. తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు తప్ప ప్రశాతంగా ముగిసింది. -
పోలింగ్కు విస్తృతంగా ఏర్పాట్లు
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరు పార్లమెంట్కు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికారులు బుధవారం శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరువళ్లూరు సెయింటానిస్ పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎంల గదిని ఉదయం నాలుగున్నర గంటలకు తెరిచి అన్నింటిని పరిశీలించారు. ఉదయం నుంచే అధికారులు, పోలీసులు, కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ శరవణన్తోపాటు ఇతర అధికారులు పాఠశాలకు చేరుకుని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నానికే 24 జోన్లకు ఈవీఎంలను తరలించారు. దీంతో 4 గంటలకు అన్ని ఈవీఎంలను తరలించే పనులను భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలిం చారు. ఎస్పీ విలేకరులతో మాట్లాడు తూ, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పోలీసులు తమ వంతు కృషి చేస్తారని వారు వివరించారు. పోలీసులకు ప్రజలు, రాజకీయ పార్టీలు తమ సహకారాన్ని పోలీసులకు అందజేయాలని వారు కోరారు. ఎన్నికలను దృష్టిలో వుంచుకుని దాదాపు 4 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల ను నిర్వహిస్తారని ఆయన వివరించా రు. అనంతరం కలెక్టర్ వీరరాఘవరావుకు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే అధికారులకు నిర్వహించనున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలింగ్ వివరాలను గంటగంటకూ చేరవేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అధికారులు ఉదాసీనతగా వ్యవహరించొద్దని ఆయన సూచించా రు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లు, పోలీసుల బందోబస్తు సంబంధించిన విషయూలపై ఆరా తీశారు. -
డీఎండీకే ఎమ్మెల్యే ఇంటిపై దాడి
తిరువళ్లూరు, న్యూస్లైన్: డీఎండికే గుర్తుపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించిన తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎండీకే పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి అన్నాడీఎంకేలో చేరడంపై ఆగ్రహం చెందిన కార్యకర్తలు మనవాలనగర్లోని ఆయన ఇంటిపై, కార్యాలయంపై రాళ్లు చెప్పులతో దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేయలేక నానాఇబ్బంది పడ్డారు. తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్సుబ్రమణ్యం గురువారం ఉదయం చెన్నైలో ముఖమంత్రి జయలలిత సమక్షంలో పార్ట్టీలో చేరారు. విషయం తెలుసుకున్న డీఎండీకే కార్యకర్తలు దాదాపు వంద మంది మనవాలనగర్కు చేరుకున్నారు. మొదట అరుణ్సుబ్రమణ్యంకు చెందిన కళాశాల, వ్యక్తిగత కార్యాలయంపై ఉన్న డీఎండీకే బ్యానర్లను చించేశారు. బాణసంచా కాల్చి సంబరాలు: డీఎండీకే పార్టీకి రాజీనామా చేసిన అరుణ్సుబ్రమణ్యంతో పార్టీకి పట్టిన శని వదలిందని పేర్కొంటూ భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా రెండవ విడత అరుణ్ సుబ్రమణ్యం ఇంటి వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, డీఎండీకే కార్యకర్తలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అయన ఇంటిపైకి రాళ్లు, చెప్పులు విసిరి ఆందోళన చేపట్టారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు ఆందోళనకారులను లాక్కెళ్లి దూరంగా పడేశారు. అనంతరం దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేయడంతో పాటు చెప్పులతో కొట్టి ఊరేగించారు. మొదటి ఎమ్మెల్యే అవుట్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎండీకే, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని 40 స్థానాలకు పోటీ చేసింది. వీటిలో 24 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి నుంచి అరుణ్సుబ్రమణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్ దాదాపు 30 వేల ఓట్లతో విజయం సాధించారు. డీఎండీకే ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన సమయంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్సుబ్రమణ్యం ప్రమాణం చేసి పార్టీ మొదటి ఎమ్మెల్యేగా ఘనతనూ సాధించారు. అయితే ప్రమాణం చేసిన మొదటి ఎమ్మె ల్యే పార్టీని వీడడం కార్యకర్తల్లో అసంతృప్తి నింపింది. ఫలించిన ఒత్తిడి: డీఎండీకేకు గుడ్బై చెప్పి అన్నాడీఎంకేలో చేరిన అరుణ్సుబ్రమణ్యంపై ఆయన వియ్యంకుడు, అన్నాడీఎంకే పార్టీ కీలక నేత ఢిల్లీ మాజీ ప్రతినిధి నరసింహన్ ఒత్తిడి ఫలించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గతంలో కేబినెట్ హోదాలో వున్న నరసింహన్ పదవిని ఇటీవల ముఖ్యమంత్రి తొలగించారు. ఇందుకు ప్రదాన కారణం అరుణ్సుబ్రమణ్యం పార్ట్టీలో చేరుతాననీ గతంలో ఇచ్చిన హామీ మేరకు నడుచుకోకపోవడమేనని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. అరుణ్సుబ్రమణ్యం అన్నాడీఎంకేలో చేరకపోవడం, ఢిల్లీ ప్రతినిధి నరసింహన్ పదవి పోవడం లాంటి సంఘటనతో నరసింహన్ అరుణ్సుబ్రమణ్యంపై ఒత్తిడి పెంచి అన్నాడీఎంకేలో చేరేలా చేశారని డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానించాయి. బీజేపీతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యే పిరాయించడంతో ఇటు పార్టీ కార్యకర్తలలోనూ, అటుహైకమాండ్కు తలనొప్పిగా మారినట్టు పలువురు వ్యాఖ్యానించారు. డీఎండీకే కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తిరుత్తణికి చెందిన సీనియర్ నేత కృష్ణమూర్తికి పదవి దక్కే అవకాశం వుండగా, పదవి కోసం పలువురు పోటీ పడుతుండడంతో పోటాపోటీ నెలకొంది. -
లైంగిక దాడులకు పాల్పడితే చర్యలు
తిరువళ్లూరు, న్యూస్లైన్:చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు నివారణ, వారికి భద్రత కల్పించే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి చిన్నారుల సంక్షేమశాఖ అధికారి సయ్యద్, కలెక్టర్ వీరరాఘవరావు హాజరయ్యారు. కలెక్టర్ వీరరాఘవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బాలకార్మికుల వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇటుక బట్టీల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి ఇటుక బట్టీ, రైస్మిల్ వద్ద బాలకార్మికులు లేరన్న బోర్డును ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిన్నారులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అప్పులబాధతో కుటుంబం ఆత్మహత్య
తిరువళ్లూరు, న్యూస్లైన్: అప్పులు, రుణదాతల ఒత్తిళ్లు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలూ అనంతలోకాలకు వెళ్లిపోవడం స్థానికంగా కలచి వేసింది. ఈ విషాద సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టు వద్ద చోటు చేసుకుంది. చెన్నై సమీపంలోని పెరంబూరు ప్రాం తానికి చెందిన సుకుమారన్ (45) పెరంబూరులోని రైల్వే గ్యారేజీ వ ర్క్స్లో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య జయంతి (40). కుమార్తె ఆశా(19), కుమారుడు హరీష్ అలియాస్ జగదీష్(15)తో కలిసి వేపంబట్టులో నివాసం ఉంటున్నాడు. భార్య జయంతి గృహిణికాగా, కుమార్తె ఆశా చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం, కుమారుడు జగదీష్ సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సుకుమారన్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం రుణదాతలు కొందరు వచ్చి అప్పు చెల్లించాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో సుకుమారన్ మనస్తాపం చెంది నట్టు బంధువులు చెబుతున్నారు. అప్పులు, గొడవలను పెరంబూరులో ఉన్న బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆదివారం జరిగిన గొడవలపై ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయంతి తమకు అప్పుల భారం ఎక్కువగా ఉందని, తమకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని బంధువుల వద్ద రోదించినట్టు తెలుస్తోంది. అప్పులపై కలత చెందవద్దని వారించిన బంధువులు, సోమవారం మాట్లాడుకుందామని నచ్చచెప్పినట్టు తెలుస్తుంది. సోమవారం మధ్యాహ్నం జయంతి అన్న కొడుకు సతీష్ ఫోన్ చేశాడు. అయితే ఫోన్ తీయలేదు. అనుమానం కలిగిన సతీష్ ఇంటి వద్దకు వచ్చి చూడగా తలుపులకు లోపల గడియ పెట్టి ఉండడం చూశాడు. కిటికీ తెరిచి చూడగా సుకుమార్, జయంతి, ఆశా, జగదీష్లు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించాడు. సెవ్వాపేట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళాలను గడ్డపారతో పగులగొట్టి మృత దేహాలను వెలికితీసి తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. కారణం ఇదేనా! పెరంబూరుకు చెందిన సుకుమారన్ వేపంబట్టులో ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలుకు అప్పలు చేసినట్టు తెలుస్తుంది. అప్పలు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఆత్మహత్యకు గల ప్రధాన కారణంగా పోలీసులు వివరించారు. దీంతో పాటు రైల్వే ఉద్యోగి అయిన సుకుమారన్, అదే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 2లక్షల నుంచి 4 లక్షల వరకు వ సూలు చేసినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. నగదు ఇచ్చిన వారు కొందరు ఆదివారం ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు నిర్ధారించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
తిరువళ్లూరు, న్యూస్లైన్: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతుల్లో ఒకరి కళ్లను కుటుంబసభ్యులు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం గ్రామానికి చెందిన హోటల్ సర్వెంట్ సుందరవేలన్. ఇతని రెండవ కుమారుడు మైత్రేయన్, తిరువళ్లూరు సమీపంలోని వెల్లియూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదొవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు ప్రభుత్వ బస్సులో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరాడు. బస్సు రద్దీగా ఉండడంతో మైత్రేయన్ ఫుట్బోర్డుపై ప్రయాణం చేస్తున్నాడు. పాఠశాల సమీపంలో బస్సు రాగానే మైత్రేయన్ అదుపు తప్పి బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మైత్రేయన్ 108లో చెన్నై వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ సంఘటన తామరపాక్కం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. మృతుని కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరి అనుమతితో చెన్నై వైద్యశాలలో కళ్లను స్వీకరించారు. డిప్లొమా విద్యార్థి మృతి: స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంలో తిరువళ్లూరుకు వచ్చిన డిప్లొమా విద్యార్థ్ది గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ప్రాంతంలోని పింజువాక్కం గ్రామానికి చెం దిన సుబ్రమణ్యం కుమారుడు ప్రతాప్(21). ఇతను తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టులో వున్న శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తన స్నేహితుడు రాహల్తో కలిసి బైక్లో తిరువళ్లూరుకు బయలుదేరాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్ను వ్యాన్ ఢీకొంది. ఈ సంఘటనలో ప్రతాప్ తీవ్రంగా, రాహుల్ స్వల్పం గా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రతాప్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. రాహుల్ చికిత్స పొందు తున్నాడు. ఈ సంఘటనపై తిరువళ్లూరు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా వాసుల ఆందోళన
తిరువళ్లూరు, న్యూస్లైన్: అక్రమ కేసులను బనాయించి ప్రభుత్వ రవాణా శాఖాలో పనిచేస్తున్న వ్యక్తిని అనవసరంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిందితుడు తల్లి, సోదరి కిరోసిన్ క్యాన్తో తిరువళ్లూరు ఫుడ్సెల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి, ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన సుగుణ (40). ఈమె భర్త నగరి ప్రాంతంలో పార్శిల్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సుగుణ తల్లి రత్నగణి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులు కావడంతో తూత్తుకుడి జిల్లాకు చెందిన సుగుణ సోదరుడు థామస్ సురేందర్ తన కుటుంబంతో కలిసి నగరికి వచ్చాడు. మూడు రోజలు పాటు సెలవులను గడిపాడు. ఇదే సమయంలో సుగుణ కుమారుడు తిరువళ్లూరు జిల్లాలోని పంచెట్టి పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ చదువుతుండడంతో అతనిని వదలి పెట్టడానికి ఇన్నోవా కారులో బయలుదేరాడు. పంచెట్టిలోని పాఠశాలలో వదలిపెట్టి తిరిగి వస్తుండగా పొన్నేరి వద్ద థామస్ను రేషన్బియ్యం తరలిస్తున్నారన్న నెపంతో తిరువళ్లూరు ఫుడ్సెల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ బృందం అరెస్టు చేశారు. కిరోసిన్ క్యాన్తో ఆందోళన తూత్తుకుడి జిల్లాలోని రవాణా శాఖలో డ్రైవర్గా పని చేస్తున్న థామస్ను అరెస్టు చేయడంతో అతని తల్లి రత్నగణి, సోదరి సుగుణ తదితరులు ఫుడ్సెల్ కార్యాలయానికి చేరుకుని అరెస్టుకు గల కారణాలను చెప్పాలని ఇన్స్పెక్టర్ ప్రకాష్ను నిలదీశారు. దీనిపై సమాధానం ఇచ్చిన ఇన్స్పెక్టర్ ప్రకాష్, ఇన్నోవా కారులో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్టు తమకు అందిన సమాచారం మేరకు అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు. దీనిపై సంతృప్తి చెందని బంధువులు, పాఠశాలకు వెళ్లి వస్తున్న తమపై నేరాన్ని మోపి అరెస్టు చేసారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన ఇన్స్పెక్టర్ థామస్ బంధువులను బలవంతంగా బయటకు పంపి విచారణ ప్రారంభించారు. కారును, నిందితుడిని వదలిపెట్టే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన థామస్ తల్లి కి రోసిన్ క్యాన్ తెచ్చి ఆత్మాహత్యకు పాల్పడుతామని హెచ్చరించింది. దీంతో ఫుడ్సెల్ కార్యాలయం వద్ద దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బయటకు వచ్చిన పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. తమపై అక్రమంగా కేసులు బనాయించారని వారు విలపించారు. -
సంక్రాంతి సరుకుల పంపిణీ
తిరువళ్లూరు, న్యూస్లైన్: జిల్లాలో ఉన్న నాలుగు లక్షల మంది అర్హులకు సంక్రాంతి సరుకులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సంకాంత్రి సరుకులను పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం తిరువళ్లూరులో మంత్రి రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు అధ్యక్షత వహించారు. మంత్రి రమణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా 10 లక్షల మందికి చీరలు, ధోవతులను అందజేస్తామన్నారు. అదేవిధఃగా కిలో బియ్యం, చక్కెర, ఇతర వస్తువులు, రూ.100 అందజేస్తున్నట్టు మంత్రి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు మణిమారన్, పొన్రాజా, జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
రన్ ఫర్ యూనిటీకి స్పందన
తిరువళ్లూరు, న్యూస్లైన్:సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి ప్రతిష్టాత్మకంగా పిలుపు నిచ్చిన రన్ పర్ యూనిటీకి తిరువళ్లూరులో అపూర్వ స్వాగతం లభించింది. తిరువళ్లూరు బీజేపీ నగర అధ్యక్షుడు బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ నేతలు సుఖదేవ్, జానకిరామన్, దురైపాండ్యన్ హాజరయ్యారు. రన్ పర్ యూనిటీ పరుగుపందెంలో పాల్గొనడానికి తిరువళ్లూరు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు హాజరయ్యారు. తిరువళ్లూరు ఆయిల్ మిల్ నుంచి ప్రారంభమైన పరుగుపందెం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరాజర్ విగ్రహం వరకు సాగింది. ఈ పందెంలో పాల్గొన్న పలువురు యువకులు దేశ సమైక్యత కోసం పాల్గొన్నట్టు వివరించారు. అనంతర ం ముగింపు సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రన్ పర్ యూనిటీ పేరుతో మోడి ఇచ్చిన పిలుపునకు జిల్లా నలుమూలల నుంచి వేలమంది యువకులు హాజరుకావడంపై ఆయన పట్ల యువతకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుందని తెలి పారు. పరుగు పందెంలో పాల్గొన్న చిన్నారులు, యువకులకు సర్టిపికెట్లు అందజేశారు. -
బ్యాంకు వెనుక గుంత తవ్వి..
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరు సమీపంలోని తిరుప్పాచ్చూర్లో ఇండియన్ బ్యాంకు వెనుక గుర్తు తెలియని దుండగులు ఐదు అడుగుల మేర గుంతను తవ్వారు. లాకర్లో ఉన్న నగదు, నగలను అపహరించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం తవ్విన గుంతను ఆ గ్రామ మహిళలు గుర్తించారు. బ్యాంకు లాకర్లో రెండు కోట్లకుపైగా విలువజేసే నగదు, నగలు భద్రంగా ఉండడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ ప్రాంతంలో ఇండియన్ బ్యాంకు బ్రాంచి ఉంది. దీని వెనుక భాగంలో పిచ్చిమొక్కలతో పాటు ఇతర ముళ్లపొదులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని తొలగించాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. తిరుప్పాచ్చూర్ గ్రామంలోని మహిళలకు పిచ్చిమొక్కలను తొలగించే పనిని అప్పగించారు. పనిలో నిమగ్నమైన కూలీలు లాకర్ రూమ్ ప్రాంతంలో ఐదు అడుగుల మేరకు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. వారు వెంటనే బ్యాంకు మేనేజర్ సుమతికి సమాచారం అందించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మేనేజర్ తాలుకా ఇన్స్పెక్టర్ ఏకాంబరానికి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు, బ్యాంకు వెనుక నుంచి లాకర్కు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. అనంతరం ఇండియన్ బ్యాంకు భద్రతా అధికారి కుమరవేలు సంఘటన స్థలానికి చేరుకు పరిశీలించారు. బ్యాంకు లాకర్లో వుంచిన రెండు కోట్ల విలువ చేసే నగలు, నగదు భద్రంగా ఉండడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బ్యాంకు భద్రతాధికారి కుమర వేలు మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకులో చోరీయత్నం జరిగిన నేపథ్యంలో నైట్ వాచ్మన్ను నియమిస్తామన్నారు. దీంతో పాటు బ్యాంకు ముందు, వెనుక భాగంలో కెమెరాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. -
కాంట్రాక్టర్ల మధ్య ఘర్షణ
తిరువళ్లూరు, న్యూస్లైన్: జిల్లాలోని అండర్సన్ పేట గ్రామంలో కాంట్రాక్టర్ల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లా అండర్సన్పేట గ్రామంలో కృష్ణాస్వీట్స్ తయారీ కేంద్రం ఉంది. ఇక్కడి నుంచి పలు షాపులకు స్వీట్లు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణా స్వీట్స్ కంపెనీ దీపావళి, సరస్వతి పూజకు పెద్ద ఎత్తున స్వీట్లు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్ట్ పద్ధతిలో నెల రోజుల వరకు 200 మంది మహిళలను ఉద్యోగులుగా నియమించేందుకు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అదే ప్రాంతానికి చెందిన రామచంద్రన్, ప్రేమ్నాథ్ టెండర్ దాఖలు చేశారు. వీరిలో రామచంద్రన్కు కాంట్రాక్ట్ దక్కింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రామచంద్రన్ అనుచరులు విధుల్లో ఉండగా ప్రేమ్నాథ్ అనుచరులు వారిపై దాడులకు దిగారు. ఈ సంఘటనలో రామచంద్రన్ (32), మహేష్ (34), మహేంద్రన్ (38), విమల్రాజ్(34), కార్తీక్ (33) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. ఇరు వర్గాలు కర్రలతో దాడులకు దిగడంతో అండర్సన్పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వీరరాఘవుని ఆలయంలో భక్తుల రద్దీ
తిరువళ్లూరు, న్యూస్లైన్: మహాలయ అమావాస్య సందర్భంగా వీరరాఘవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పెరటాసి నెలలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా భావించి భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తుంటారు. ఇందులో భాగంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రి నుంచే భక్తులు రాక మొదలైంది. ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఇదిలావుండగా గురువారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదు కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు, పెట్రోల్బంక్ తదితర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం వీరరాఘవుని సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించి తమ పితృదేవతలకు పిండాలు ప్రదానం చేశారు. అనంతరం బెల్లం, పాలు, ఉప్పు తదితరాలను పుష్కరిణిలో వదిలి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాంచీపురం, వేలూరు, చెన్నై, ఆంధ్రా, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
తిరుమలకు బయలుదేరిన గొడుగులు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు కన్నుల పండుగే. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు శుక్రవారం బయలుదేరాయి. దారి పొడవునా భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. తిరువ ళ్లూరు, న్యూస్లైన్: తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా సమర్పించే గొడుగులు చెన్నై నుంచి తిరువళ్లూరుకు చేరాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నేతలు, భక్తులు గొడుగులకు పూజలు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి కాలి నడకన గొడుగులు తీసుకెళ్లి గరుడసేవకు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. వీటికి ప్రతి గ్రామంలోనూ పూజలు నిర్వహించి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే గొడుగులు గురువారం రాత్రి తిరువళ్లూరు చేరాయి. ఈ సందర్భంగా భక్తులు, వీహెచ్పీ నేతలు, హిందువులు పెద్ద సంఖ్యలో గొడుగులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గొడుగులను ఊరేగించారు. -
విభజనతో జల సమస్య రాదు: గవర్నర్
తిరువళ్లూరు(తమిళనాడు), న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ రెండు ప్రాంతాల మధ్య నదీ జలాల సమస్య ఉత్పన్నం కాబోదని ఆ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తిరువళ్లూరు జిల్లాలోని వీరరాఘవస్వామి ఆల యంలో శుక్రవారం జరిగిన పవిత్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినా కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి, కృష్ణా జలాల సమస్య ఉత్పన్నం కాబోదన్నారు. తమిళనాడుకు నీటి విడుదలలో కోర్టు ఆదేశాలను సైతం కర్ణాటక ఖాతరు చేయట్లేదని, మరి ఆంధ్రప్రదేశ్లో సమస్య రాదా? అని ప్రశ్నించగా.. ఆంధ్రా, తెలంగాణ మధ్య నీటి సమస్యే ఉత్పన్నం కాదంటూ నరసింహన్ అసహనం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరూ రాజీనామా చేసినట్లు తనకు తెలియదన్నారు. రాజీనామాలు చేస్తున్నట్లు మీడియా, పత్రికల్లో వార్తలు రావడం, నేతల ప్రకటనల్ని విలేకరులు ప్రస్తావించారు. అయితే ఆయా విషయాల్ని మీడియానే అడగండంటూ ఆయన జవాబు దాటే శారు. రాజీనామాలు ఎవరూ చేయలేదని, రాజీనామా చేసినట్టు తన దృష్టికి రాలేదని పునరుద్ఘాటిం చారు. నగరి, పుత్తూరు, తిరుపతి, తడ ప్రాంతాల్ని తమిళనాడులో విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ, రాయల తెలంగాణలో దేనికి మద్దతిస్తారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతపై కేంద్రానికి నివేదిక ఇస్తున్నారా? అని విలేకరులు గవర్నర్ను ప్రశ్నించారు. దీనికి ఆయన ‘సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందా?’ అంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలో హాస్టల్స్ మూసివేత అంశం తన దృష్టికి వచ్చిందని, వర్సిటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
విభజనతో జల సమస్య రాదు: గవర్నర్
తిరువళ్లూరు(తమిళనాడు), న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ రెండు ప్రాంతాల మధ్య నదీ జలాల సమస్య ఉత్పన్నం కాబోదని ఆ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తిరువళ్లూరు జిల్లాలోని వీరరాఘవస్వామి ఆల యంలో శుక్రవారం జరిగిన పవిత్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినా కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి, కృష్ణా జలాల సమస్య ఉత్పన్నం కాబోదన్నారు. తమిళనాడుకు నీటి విడుదలలో కోర్టు ఆదేశాలను సైతం కర్ణాటక ఖాతరు చేయట్లేదని, మరి ఆంధ్రప్రదేశ్లో సమస్య రాదా? అని ప్రశ్నించగా.. ఆంధ్రా, తెలంగాణ మధ్య నీటి సమస్యే ఉత్పన్నం కాదంటూ నరసింహన్ అసహనం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరూ రాజీనామా చేసినట్లు తనకు తెలియదన్నారు. రాజీనామాలు చేస్తున్నట్లు మీడియా, పత్రికల్లో వార్తలు రావడం, నేతల ప్రకటనల్ని విలేకరులు ప్రస్తావించారు. అయితే ఆయా విషయాల్ని మీడియానే అడగండంటూ ఆయన జవాబు దాటే శారు. రాజీనామాలు ఎవరూ చేయలేదని, రాజీనామా చేసినట్టు తన దృష్టికి రాలేదని పునరుద్ఘాటిం చారు. నగరి, పుత్తూరు, తిరుపతి, తడ ప్రాంతాల్ని తమిళనాడులో విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ, రాయల తెలంగాణలో దేనికి మద్దతిస్తారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతపై కేంద్రానికి నివేదిక ఇస్తున్నారా? అని విలేకరులు గవర్నర్ను ప్రశ్నించారు. దీనికి ఆయన ‘సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందా?’ అంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలో హాస్టల్స్ మూసివేత అంశం తన దృష్టికి వచ్చిందని, వర్సిటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
గూడ్స్ రైల్లో మంటలు
తిరువళ్లూరు, న్యూస్లైన్: చెన్నై షిప్ యార్డు నుంచి నేల బొగ్గులోడుతో మేట్టూరుకు వెళుతున్న గూడ్స్రైలులో కడంబత్తూరు వద్ద హఠాత్తుగా మంటలు వచ్చాయి. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గూడ్సు రైల్లోంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెన్నై షిప్యార్డు నుంచి మేట్టూరుకు 40 పెట్టెలతో కూడిన గూడ్స్రైలు నేల బొగ్గుతో గురువారం తెల్లవారుజాము 4.10 గంటలకు బయలు దేరింది. గూడ్స్ రైలు తిరువళ్లూరు సమీపంలోని సెవ్వాపేట వద్దకు వస్తున్న సమయంలో రెండు పశువులను ఢీ కొట్టింది. దీంతో అక్కడే నిలిచిపోయిన గూడ్స్ దాదాపు రెండు గంటల అనంతరం 6.10 గంటలకు బయలుదేరింది. రైలు తిరువళ్లూరును దాటుతున్న సమయంలో 11వ పెట్టె నుంచి పొగ, స్వల్పంగా మంటలు రావడాన్ని స్టేషన్ అధికారులు గుర్తించి కడంబత్తూరు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో గూడ్స్ రైలును కడంబత్తూరు వద్దనే నిలిపి వేశారు. కడంబత్తూరు రైల్వేస్టేషన్లో వేచి వున్న ప్రయాణికులు గూడ్స్ రైలులో వస్తున్న పొగలను చూసి ఆందోళనకు గురయ్యారు. మంటలను చూసి భయాందోళన చెందిన ప్రయాణికులు పరుగులు తీశారు. దీంతో కడంబత్తూరు రైల్వేపోలీసులకు సమాచారం అదించారు. ఈ నేపథ్యంలో గూడ్స్ రైలులో మంటలు మరింతగా చెలరేగే అవకాశం వుండడంతో పేరంబాక్కం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి 20 నిమిషాల వ్యవధిలోనే చేరుకున్నా మంటలను ఆర్పడానికి దాదాపు గంట పాటు వేచి వుండాల్సిన పరిస్థితి తలెత్తింది. రైలు పై విద్యుత్ తీగలు ఉన్నాయి. ద్యుత్ సరపరాను నిలిపి వేస్తేనే మంటలను అర్పడానికి అవకాశం వుంటుందని సిబ్బంది తేల్చిచెప్పడంతో చెన్నై అధికారులకు సమాచారం అందించారు. వారు ఉన్నత అధికారులతో సంప్రదింపులు జరిపి 9 గంటలకు మంటలను ఆర్పడం ప్రారంభించారు. దాదాపు గంట సేపు పోరాడి మంటలను అదుపు చేశారు. కాగా గూడ్స్ రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో తిరువళ్లూరు, కడంబత్తూరు, ఏకాటూరు తదితర ప్రాంతాల నుంచి నడిచే రైలు సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. ఇది ఇలా వుండగా కడంబత్తూరులో ఉద్రిక్తత కారణంగా ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకూ గేట్లు మూసి వేయడంతో గేటుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.