చెట్టును ఢీకొన్న బస్సు..10 మందికి గాయాలు | 10 injured in RTC bus accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బస్సు..10 మందికి గాయాలు

Published Wed, Jul 1 2015 8:05 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

10 injured in RTC bus accident

మంచిర్యాల రూరల్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం ఉరిపేట వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడం, అదే సమయంలో డ్రైవర్ వేగంగా నడపడం వల్ల బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement