rtc bus accident
-
ట్రక్కును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రకు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాడిగోద్రి – జల్నా మార్గంలోని షాహపూర్ ఏరియా వద్ద మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన ఆర్టీసీ బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. #जालना वडीगोद्री मार्गावर शहापूर गावाजवळ आज सकाळी बस आणि आयशर ट्रकच्या भीषण अपघातात बसच्या वाहकासह ६ जण ठार झाले असून १० जण जखमी झाले आहेत. #Jalna #Accident pic.twitter.com/HJkbmoapzX— AIR News Mumbai, आकाशवाणी मुंबई (@airnews_mumbai) September 20, 2024అయితే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. బస్సు అద్దాలను పగులగొట్టి, చాలా మందిని బయటకు లాగి ప్రాణాలతో రక్షించారు. అనంతరం గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బస్సు జెవారి నుంచి జల్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ట్రక్కులో ఆరెంజ్ పండ్లను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇది కూడా చదవండి: నా హత్యకు కుట్ర: పన్నూ -
వర్షాల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల బీభత్సం
సాక్షి, వనపర్తి/ఆదిలాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రెండు ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సందర్భంగా ఓ బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్-భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పింది.ఈ అనంతరం బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి అనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సందర్భంగా కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. దీంతో, ఎద్దు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు. అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సుఆదిలాబాద్ - భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పి బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి ఆనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లి.. కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది.ఆ… pic.twitter.com/AvqlYGKQnF— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024వీడియో క్రెడిట్: Telugu Scribe -
యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు బోల్తా
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు ఉదయం 10 గంటలకు బయలుదేరింది. కాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పల్టీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మరణించారు. మృతులను అడ్డ గూడూరు మండలం చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్కు చెందిన కొండా రాములుగా గుర్తించారు. కొండ రాములు అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తేలింది. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ -
పాడేరులో బస్సు ప్రమాదం
సాక్షి, పాడేరు, పాడేరు రూరల్, సాక్షి, అమరావతి, నెట్వర్క్: విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అత్యవసర వైద్యం అవసరమైతే విశాఖ కేజీహెచ్ లేదా కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేశారు. పాడేరు ఘాట్లో ప్రమాదాలు నివారించేందుకు రవాణ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. ఎలా జరిగింది..? మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ 31జెడ్ 0285) పాడేరుకు బయలుదేరింది. ఈ క్రమంలో చోడవరంలో కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. మొత్తం 34 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఘాట్లోని వ్యూపాయింట్ వద్ద మలుపులో రోడ్డు పక్కన చెట్టు కొమ్మలను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి వందడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన నరవ నారాయణమ్మ(50), అల్లూరి జల్లా పాడేరు మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనుడు సీసా కొండన్న(55) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన ద్విచక్రవాహనదారులు గడ్డంగి రమేష్, ఆనంద్, కారులో వెళ్తున్న టి.శేషగిరి లోయలోకి దిగి బాధితులను కాపాడారు. గాయాలపాలైన వారిన రోడ్డుపైకి మోసుకొచ్చి 108 సాయంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. లోయలో బస్సు కింద పడి ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సీఐ సుధాకర్, ఎస్ఐ రంజిత్, స్థానికులంతా ఎంతో శ్రమించారు. కలెక్టర్ సుమిత్కుమార్ జిల్లా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మెడికవర్కు తరలింపు క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం రాత్రి విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రోలుగుంట మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కిల్లో బోడిరాజు (39), బొట్ట చిన్నమ్ములు (48), బొట్ట దుర్గాభవాణి (14), బొట్ట రామన్న (14), సామర్ల బాబురావు (50) ఉన్నారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నమ్ములుకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మనవడు, మనవరాలిని చూసేందుకు వెళ్లి.. బస్సు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నారాయణమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అనారోగ్యంతో ఉన్న తమ మనవడు, మనవరాలిని చూసేందుకు ఈశ్వరరావు, నారాయణమ్మ దంపతులు ఉదయం 10 గంటల సమయంలో సబ్బవరం వద్ద బస్సు ఎక్కారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోడలికి ఫోన్ చేసి దారిలో ఉన్నట్లు చెప్పారు. అంతలో ప్రమాదం జరగడంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే భార్య చనిపోవడంతో ఈశ్వరరావు గుండెలవిసేలా రోదించారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి మృతి చెందిన వార్త తెలియటంతో కుమారులు ప్రసాద్, అర్జునరావు, వెంకట రమణ విషాదంలో కూరుకుపోయారు. చెట్టును తప్పించబోయి.. ‘వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్’ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టు పక్క నుంచి బస్సును పోనిచ్చే క్రమంలో డ్రైవర్ అంచనా తప్పింది. బస్సు రోడ్డు అంచు వరకు వెళ్లడంతో వెనుక చక్రాలు రక్షణ గోడను దాటి లోయవైపు జారిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో నేను పాడేరు నుంచి బైకుపై ఘాట్ రోడ్డులో దిగువకు వస్తున్నా. ఎదురుగా బస్సును చూసి బైకు పక్కకు తీసి ఆపా. చెట్టును దాటుకుని వస్తుందనుకున్న బస్సు ఒక్కసారిగా లోయలోకి జారిపోవటాన్ని చూసి చేష్టలుడిగిపోయా! రోడ్డు అంచుకు పరిగెత్తుకుని వెళ్లాం. అన్నీ పరిమి డొంకలు కావడంతో కిందకు వెళ్లడానికి అవకాశం లేదు. తుప్పల్లో పడిపోయి ఒకరు చనిపోగా.. బస్సులో మరొకరు మృతి చెందారు. గాయాలతో బయట పడ్డ వారిని అంతా కలసి 108, ఇతర వాహనాల్లో పాడేరు ఆస్పత్రికి తరలించాం. బస్సులో ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది. కళ్ల ముందే లోయలోకి.. మైదాన ప్రాంతానికి కారులో వెళుతున్నాం. మా కళ్ల ముందే ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయింది. లోయలోకి దిగి తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను రోడ్డుపైకి మోసుకొచ్చాం. అదే దారిలో వస్తున్న కొందరు వాహనదారులు మాకు సహాయపడ్డారు. ఇద్దరు వృద్ధులు చనిపోయారు. పోలీసులకు సమాచారం అందించి అంబులెన్స్లు, 108 వాహనాల్లో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాం. – ప్రత్యక్ష సాక్షులు గడ్డంగి రమేష్బాబు, పూజారి ఆనంద్, శేషగిరి చెట్టు కొమ్మను తప్పించబోయి.. ఘాట్లో బస్సును నెమ్మదిగా నడుపుతున్నా. మలుపులో రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మను తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో ఓ బైక్ ఎదురుగా రావడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. చెట్టు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దిగువ రోడ్డులో బస్సు బోల్తా కొట్టి ఉంటే ప్రాణనష్టం అధికంగా ఉండేది. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడం, అనేకమంది గాయపడడం ఎంతో బాధగా ఉంది. –కిముడు సత్తిబాబు, బస్సు డ్రైవర్ ఆ చిన్నారి మృత్యుంజయురాలు.. పాడేరు ఘాట్లో జరిగిన బస్సు ప్రమాదంలో నెలల వయసున్న ఓ శిశువు సురక్షితంగా బయటపడింది. డుంబ్రిగుడ మండలం తూటంగి గ్రామానికి చెందిన తాంగుల జ్యోతి, సత్యనారాయణ దంపతులకు నాలుగు నెలల క్రితం శిశువు జన్మించింది. ప్రస్తుతం వీరు విశాఖలో ఉంటున్నారు. పాడేరు మండలం పి.గొందూరులో తమ బంధువుల ఇంటికి వచ్చేందుకు విశాఖలో బస్సెక్కారు. ప్రమాదంలో తల్లి జ్యోతి తన బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకుంది. ఆమె తలకు మాత్రం తీవ్ర గాయమైంది. క్షతగాత్రులలో కొందరి వివరాలు.. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోటగున్నలకు చెందిన పాంగి సింహాద్రి, హుకుంపేట మండలం ఇసుకగరువుకు చెందిన వంతాల కోటిబాబు, అడ్డుమండకు చెందిన వంచంగిబోయిన రవిబాబు, పాడేరు మండలం దిగుమోదాపుట్టుకు చెందిన కిరసాని వెంకటేష్, కించూరు పంచాయతీ దోనెలకు చెందిన కోడా పద్మ, కిండంగి గ్రామానికి చెందిన జంబు మాధవి, డోకులూరు పంచాయతీ మండిపుట్టుకు చెందిన బోయిన నాగేశ్వరరావు, గెడ్డంపుట్టుకు చెందిన చల్లా పెంటమ్మ, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీకి చెందిన పి.చిట్టిబాబు, అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం లోవ కృష్ణాపురం గ్రామానికి చెందిన కిముడు సత్తిబాబు, చింతపల్లి మండలం కోటగున్నల గ్రామానికి చెందిన పాంగి సింహాద్రి, గెమ్మెలి నగేష్, హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాకకు చెందిన బంటు రఘునాథ్, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నరవ ఈశ్వరరావు, నాతవరం మండలం యర్రవరంలోని ఒకే కుటుంబానికి చెందిన బొట్టా చిన్నమ్మలు, బొట్టా నర్శింహమూర్తి, బొట్టా దుర్గాభవాని, బొట్టా రమణ, ముంచంగిపుట్టు మండలం సొనియాపుట్టుకు చెందిన కిల్లో బొదినేష్, హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు చెందిన సమల లక్ష్మీకాంత్. -
బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. చదవండి: మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి -
గతి తప్పుతున్న ప్రగతి చక్రం
సాక్షి, హైదరాబాద్: వరుసపెట్టి జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఆ సంస్థను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుశిక్షితులైన డ్రైవర్లు ఉండి కూడా ప్రమాదాలు చోటు చేసుకోవడం అధికారులను కలవరబెడుతోంది. ప్రమాదాల నివారణపై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించింది. వాస్తవానికి ప్రైవేటు వాహన డ్రైవర్లతో పోలిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వద్ద మంచి నైపుణ్యం ఉంటుంది. డ్రైవర్గా విధుల్లో చేరేటప్పుడు మంచి శిక్షణ పొందటమే కాకుండా, తరచూ పునఃశ్చరణ తరగతులు, డిపోల్లో గేట్ మీటింగ్స్ ద్వారా వారికి ప్రత్యేక సూచనలు అందుతుంటాయి. ఫలితంగా ఆర్టీసీ బస్సులు అతి తక్కువ ప్రమాదాలకు గురవుతుంటాయి. ఎదుటి వాహనాల తప్పిదం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ దీనికి భిన్నంగా ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయంపైనే శ్రద్ధ.. కొరవడిన నిఘా కొంతకాలంగా ఆర్టీసీ తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇది డ్రైవర్లపై ప్రభావం చూపుతోంది. గతంలో నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నవారిని, ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించి ప్రత్యేక సిబ్బంది సూచనలు చేసేవారు. డ్రైవర్లపై నిఘా ఉండేది. ఆదాయం పెంచుకునే క్రమంలో కొంతకాలంగా ఈ కసరత్తు గతి తప్పింది. డ్రైవర్ల డ్యూటీల విషయంలోనూ చోటుచేసుకున్న మార్పులు వారిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇటీవల వరంగల్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డుపక్కన నిలిచిఉన్న మరో ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీకొంది. పట్టపగలే ఈ ప్రమాదం జరగటం ఆర్టీసీ అధికారులను విస్మయానికి గురిచేసింది. అప్పటికే ఆ డ్రైవర్ డబుల్ డ్యూటీ చేసి విశ్రాంతి లేకుండా మరో డ్యూటీకి వచ్చాడని గుర్తించినట్టు తెలిసింది. 12 ఏళ్లుగా నియామకాలు లేవు.. ఆర్టీసీలో 2010 తర్వాత డ్రైవర్ నియామకాలు జరగలేదు. 12 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారే కొనసాగుతున్నారు. దీంతో యువ డ్రైవర్ల కొరత ఉంది. కొంతమంది సీనియర్ డ్రైవర్లకు అనారోగ్య కారణాలు, త్వరగా అలసిపోవటం, నిద్రను నియంత్రించుకోలేకపోవటం లాంటి సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. ఇక కొన్ని డిపోల్లో డ్రైవర్లకు సెలవులు దొరకటం లేదన్న ఫిర్యాదులున్నాయి. డ్యూటీ–డ్యూటీకి మధ్య ఉండాల్సిన విరామం సరిగా పాటించటం లేదని, వరస డ్యూటీలతో అలసిపోయే డ్రైవర్లు ఏమరపాటుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్న వాదనలున్నాయి. ప్రత్యేక శిక్షణ అవసరం.. మూడు రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ హైదరాబాద్– బెంగుళూరు గరుడ ప్లస్ బస్సు అతి వేగంగా వెళ్తూ ఓ చెరుకులోడు ట్రాక్టర్ను ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే లోడు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తప్పించే విషయంలో డ్రైవర్లకు మరింత శిక్షణ అవసరమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. చలికాలం సూచనలు జారీ.. పొగమంచు ఆవహిస్తున్నందున డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పొగమంచు ఉన్నప్పుడు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, ఎదుటి వాహనాలను గమనిస్తూ ఉండటం, ఓవర్టేకింగ్స్తో జాగ్రత్తలు, మంచు లైట్లు, ఇండికేటర్లు, వైపర్ల వినియోగం, అవసరమైతే రోడ్డుపక్కన ఆపేసి మంచు తగ్గాక వెళ్లటం, సెంట్రల్ లైనును దాటకపోవటం, రాంగ్రూట్లో వెళ్లకపోవటం, విధిగా డ్రైవర్లు అర్ధరాత్రి–తెల్లవారుజాము సమయాల్లో నిద్ర తేలిపోయేలా నీటితో మొహం కడుక్కోవటం, డ్యూటీకి వచ్చే ముందు సరైన విశ్రాంతి తీసుకోవటం లాంటి అంశాలపై సూచనలు జారీ చేసింది. -
ఆర్టీసీ బస్సుకు తగిలిన ‘విమానం’ రెక్క.. పలువురికి గాయాలు
తిరువనంతపురం: రోడ్డుపై వెళ్తున్న బస్సుకు విమానం రెక్క తగిలి ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో వెళ్లే విమానం.. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు ఎలా తగిలిందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ విమానం లేదు. ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం రెక్క.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు తగిలింది. ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. విమానం రెక్క తరలిస్తున్న ట్రెయిలర్ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. దీంతో రహదారిని కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా
సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. ప్రముఖుల దిగ్భ్రాంతి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్: కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు. జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు నిమిషాల వ్యవధిలో... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్ రవికిరణ్ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు. సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల వివరాలు.... పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల). ఈత రావడంతో.. బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు. – శివ, రమేష్, భద్రాచలం (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు) ఆర్డీవోతో విచారణ కమిటీ క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ సానుభూతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాకు ఆదేశం సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ బాసట సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. బాధాకరం: మండలి చైర్మన్ సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆర్టీసీ బస్సు బోల్తా
మర్పల్లి/ ఖమ్మం మయూరిసెంటర్: ఓ ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో కండక్టర్సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు 70 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్పల్లి మీదుగా తాండూరుకు వెళుతోంది. వేగంగా ఉన్న బస్సు మర్పల్లి సమీపంలోని గుర్రంగట్టు తండా మూల మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో భయాం దోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొందరు బస్సు అద్దాలను పగులగొట్టి బయట కు వచ్చారు. కండక్టర్ రాజమణి తలకు బలమైన గాయం కాగా, ఓ ప్రయాణికురాలి కం టికి తీవ్ర గాయం అయ్యింది. మరొకరికి కాళ్లూ చే తులు విరిగాయి. క్షతగాత్రులను మర్పల్లి ఎస్ఐ వెంకట శ్రీను తన వాహనం, మరో ఆటోలో మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన 10 మందిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో 15 మందిని హైదరాబాద్కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ భుజంగం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ వెంకట శ్రీను తెలిపారు. బస్సు వేగంగా నడపడం వల్లే మూలమలుపు వద్ద అదుపు తప్పిందన్నారు. మంత్రులు పువ్వాడ, సబితారెడ్డి ఆరా ప్రమాదం ఘటనపై మంత్రులు సబితారెడ్డి, పు వ్వాడ అజయ్ అధికారులను ఆరా తీశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్, సంగారెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్లను పువ్వాడ ఆదేశించారు. -
వైరల్: ఆమె అదృష్టం బాగుంది.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
అనంతపురం క్రైం: అదృష్టం బాగుండి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. అనంతపురంలోని క్లాక్టవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు.. నగరంలోని మారుతీనగర్కు చెందిన నాగలక్ష్మి... ఐర్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు నెల కిందట అనంతపురానికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం టవర్క్లాక్ సమీపంలోని దుకాణంలో మందులు కొనుగోలు చేసి, సోదరి దివ్యాంజలితో కలిసి స్కూటీపై మారుతీనగర్కు వెళ్లేందుకు రాంగ్రూట్లోకి ప్రవేశించారు. ట్రాఫిక్ సిగ్నల్ వెలగడంతో అప్పటి వరకూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సును గమనించని నాగలక్ష్మి తన స్కూటీని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో బస్సు బంపర్ తగిలి కిందకు పడ్డారు. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసేలోపు ముందు చక్రం స్కూటీ పైకి వెళ్లింది. ఘటనలో నాగలక్ష్మి కాలు విరిగింది. వెనుక కూర్చొన్న దివ్యాంజలికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తన అజాగ్రత్త కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై ఎలాంటి కేసు అవసరం లేదంటూ పోలీసులకు విన్నవించారు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. -
అతి వేగానికి బలైన ఇద్దరు యువకులు
సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ బస్సులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తరుచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రయాణికులను కలవరానికి గురిచేస్తోంది. ఆర్టీసీలో 42 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం.. అంతంతగానే త నిఖీలు, మరమ్మతు చేయకుండానే.. సా మర్థ్యాన్ని పరీక్షించకుండానే బస్సులు రోడెక్కడంతో గాడి తప్పుతున్నాయి. డిపో అధికారి మినహయిస్తే అన్ని విభా గాల కార్మికులు సమ్మెలోకి వెళ్లటంతో గ్యారేజీల్లో మరమ్మతు నామమాత్రంగా మారాయి. పదిమందిలోపు తాత్కాలిక సిబ్బందితో బస్సుల మరమ్మతు చేయిస్తున్నా.. అవగాహనన లేమితో అధ్వానంగా మారుతోంది. ఎంతో అనుభవం ఉన్న ప్రత్యేక నిపుణులు తప్ప.. ఆర్టీసీ బస్సుల సామర్థ్యాన్ని గాడిలో పెట్టడం సాధ్యంకాదు. మరోవైపు సరైనా మరమ్మతుల్లేక అక్కడక్కడా బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు గజ్వేల్లో ముందు భాగం నుజ్జునుజ్జయిన ఘటన మరవకముందే తాజాగా కరీంనగర్లో బస్సురోడ్డు ప్రమాదానికి గురికావటం.. పలువురికి గాయాలు కావటం ఆందోళన కల్గిస్తోంది. బస్సులకు మరమ్మతులేవి..? ప్రతిరోజు బస్సు ప్రత్యేకంగా గ్యారేజీలో బస్సుల మరమ్మతు చేస్తుంటారు. విధిగా బస్సులకు మరమ్మతు, చెకప్లు పూర్తి చేస్తారు. 350 కిలోమీటర్లు తిరిగిన బస్సుకు ఇది తప్పనిసరి. పొద్దున బయల్దేరిన బస్సుకు సాయంత్రం.. నైట్హాల్ట్ పోయిన బస్సుకు పగలు మరమ్మతు చేస్తుంటారు. ఏదైనా పెద్ద సమస్య తలెత్తితే పూర్తిచేసిన తర్వాతే బస్సును రోడ్డుపై తిప్పుతారు. జిల్లాలో 141 బస్సుల్లో 50 బస్సులు అద్దెవి కాగా 91 బస్సులు ఆర్టీసీ సంస్థ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. డిపోలో 557 మంది ఉద్యోగులు, కార్మికులుండగా సమ్మె కారణంగా 549 మంది వి«ధులకు దూరంగా ఉంటున్నారు. ఒక డిపో మేనేజర్, ఏడుగురు సెక్యూరిటీ గార్డులతో ఇతరత్రా డిపార్ట్మెంట్ అధికారులను తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. 76 మంది గ్యారేజ్ కార్మికులు విధులు నిర్వర్తించాల్సిన చోట పదిమందిలోపు మెకానిక్, సహాయకులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీంతో బస్సు మరమ్మతు, చెకప్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని తెలుస్తోంది. బస్సుకు ఏమేమి పరీక్షలు చేయాలంటే..? ఆర్టీసీ బస్సు సామర్థ్యం సవ్యంగా కొనసాగాలంటే కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. బస్సుల టైర్లు, ఇంజిన్ కండీషన్, డీజిల్ ట్యాంకు, బ్రేక్ ఆయిల్, ప్రధానమైన అంశాలుగా కండీషన్ను సరిచేసుకోవాలి. టైర్లు పనితీరు, డ్రమ్స్ ఎలా పనిచేస్తున్నాయో ఒకటికి రెండుసార్లు చూడాలి. గ్రీజింగ్ సవ్యంగా ఉందోలేదో పూర్తిస్థాయిలో పరీక్షించుకుని లోపాలు సరిచేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ మార్చటం, బ్రేక్ ఆయిల్ ఫిల్టర్ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇదంతా సజావుగా సాగినప్పుడే బస్సులను రోడ్డు మీదకు తీసుకొచ్చే అవకాశాలుంటాయి. ఆర్టీసీ బస్సుల కండీషన్ పరీక్షించి రోజులు గడిచిపోతున్నాయి. వారంలో అన్ని దశల్లో బస్సుల మరమ్మతు పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి. అలా చేయకపోవటంతో బ్రేక్లు పనిచేయకపోవటం, గమనంలో ఉన్న బస్సు అదుపుతప్పటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. గేర్బాక్స్ ఇరుక్కుపోవటం వంటి ప్రమాదాలు తప్పవు. ఇంకోవైపు ప్రస్తుతం మరమ్మతు చేయిస్తున్న తాత్కాలిక సిబ్బంది తమకు వచ్చిన మెకానిజం చేయటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న హైడ్రాలిక్పవర్ స్టీరింగ్ బస్సులకు సంబంధించిన విడిభాగాలు అందుబాటులో లేకపోవటంతో నానాతంటాలు పడుతూ తాత్కాలిక కార్మికులు బస్సులను రోడ్డుపైకి అనుమతి ఇస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్ల చేతిలో బస్సుల క్లచ్లు, గేర్లు ఎక్కువగా చెడిపోతున్నాయని తెలుస్తోంది. దీంతో బస్సు వేగం తగ్గిపోతోందనే అభిప్రాయాలున్నాయి. ఘటనలు ఇవిగో.. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద బస్సు డివైడర్ను ఢీకొట్టిన సంఘటనలో ముందు భాగం నుంచి కండక్టర్ సీటు వరకు పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. హైదరాబాద్–మంచిర్యాల నడిచే బస్సు కూడా గేర్ బాక్స్ ఫెయిల్ అయి అక్కడి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలోనే బస్సులు ఉంచాల్సి వచ్చింది. ఈనెల 14న రాత్రి మంచిర్యాల–బెల్లంపల్లి ప్రధాన రహదారిపై శ్రీనివాసగార్డెన్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంకోవైపు డ్రైవర్ తప్పిదాలతో 17 బస్సుల అద్దాలు (సైడ్గ్యాస్లు) పగిలిపోయాయి. తాజాగా మంచిర్యాల నుంచి బయల్దేరిన ‘రాజధాని’ బస్సు కరీంనగర్ జిల్లా నీరుకుల్ల వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. వెనుకాలే వస్తున్న మరో లారీ ఈ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఇలా ఏదోచోట బస్సులు ప్రమాదాలకు గురికావటంతో పూడ్చుకోలేని నష్టం ఆర్టీíసీ సంస్థకు వాటిల్లుతోంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
సాక్షి, భువనగిరి : యాద్రాద్రి జిల్లా భువనగి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరకాల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలు దేరిన బస్సు.. భువనగిరి బైపాస్ రోడ్డు దగ్గరకు రాగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కొంత మంది ప్రయాణికులు కాల్వలో పడిపోయారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు
సాక్షి, పెనమలూరు(కృష్ణా) : ఆర్టీసీ బస్సు కరకట్టపై పల్టీ కొట్టి 15 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన మండలంలోని చోడవరం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ నుంచి అవనిగడ్డకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరింది. కరకట్టపై పెదపులిపాక– చోడవరం గ్రామాల మధ్యలో ఉన్న ఉండరపు కట్ట వద్దకు చేరింది. అక్కడ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ను బస్సు డ్రైవర్ కాసాని నానిబాబు గమనించకుండా బస్సును వేగంగా దూకించాడు. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి కుడివైపు కట్ట దిగువకు పల్టీ కొట్టింది. అయితే చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఎడమ వైపుకు పల్టీ కొట్టి ఉంటే కేఈబీ కెనాల్లోకి పడి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన వద్ద.. బస్సు ఒక్కసారిగా కరకట్ట దిగువకు పల్టీ కొట్టడంతో భయాందోళణకు గురైన ప్రయాణికుల ఆరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ కేఎస్హెచ్ బాబు తెలిపారు. బస్సు పడిపోవటంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో బస్సులో తొక్కిసిలాటలో 15 మందికి గాయపడ్డారు. గాయపడిన వారిలో కోడూరుకు చెందిన అన్నంరమేష్ (16), అన్నంఓంకార్(17), చాగంటాపాడుకు చెందిన దేవరకొండ గోపీకృష్ణ(24), అవనిగడ్డకు చెందిన శివపార్వతి(50), మోపిదేవికి చెందిన మత్తి శివనాగబాబు(23), కలపాల రజిత్కుమార్(18), కలపాల రజిత(19), రామానగరానికి చెందిన కొత్తపల్లి భుజంగరావు(64), కాసాని సాంబశివరావు(64), కాసానివెంకటరామమూర్తి(24), విజయవాడకు చెందిన గొలికొండ మహేష్, ముబారక్హుస్సేన్, నాగాయలంకకు చెందిన వెంకటశివనాగరాజు, చల్లపల్లికి చెందిన శివనాగమణి, కాసరనేనివారిపాలేనికి చెందిన బి.రత్నంరాజు గాయపడ్డారు. గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పది మందిని తరలించగా, 108 వాహనం సిబ్బంది మిగితా వారికి చికిత్స చేశారు. బస్సులో ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. ఇంత నిర్లక్ష్యమా... ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపగా, సామర్థ్యానికి మించి 70 మంది ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పిందని,లేక పోతే భారీగా ప్రాణనష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఎమ్మెల్యేలు.. ఘటనా స్థలం వద్దకు తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చేరుకున్నారు. ఆ తరువాత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వచ్చారు. వారు ప్రయాణికులను పరామర్శించారు. జరిగిన ఘటన పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి వైద్యం అందించాలని అధికారులను కోరారు. -
ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సులు
ఉమ్మడికరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, హుజూరాబాద్లలో ఆదివారం ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సిరిసిల్ల రగుడు శివారులో జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ వైద్యుడు జలగం యాదగిరిరావు(45), హుజూరాబాద్లోఆర్టీసీ డిపో క్రాస్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రభాకర్ (46) అనే ఎల్ఐసీ ఉద్యోగి మృతి చెందాడు. సిరిసిల్లక్రైం/సిరిసిల్లటౌన్: సిరిసిల్ల రగుడు శివారులో ఆదివారం బైకుపై వస్తున్న ప్రభుత్వ వైద్యుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని సాయి మణికంఠ ఫంక్షన్హాల్లో బంధువుల పెళ్లికి ప్రభుత్వ వైద్యుడు జలగం యాదగిరిరావు(45) హాజరయ్యారు. భోజనం చేసి బైకుపై సిరిసిల్లకు రావడానికి రంగినేని ట్రస్ట్ ప్రాంతంలో యూటర్ను తీసుకుంటుండగా కరీంనగర్ నుంచి సిరిసిల్ల వైపు వస్తున్న నాన్స్టాప్ బస్సు వేగంగా ఢీకొట్టింది. బస్సు అతివేగంతో ఉండటంతో బ్రేకులు సరిగా పడక ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో యాదగిరిరావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా చేసి పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ నారా గౌడ్పై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య శ్వేత, కుమారుడు కృతిక్, కూతురు ఉన్నారు. జిల్లా వైద్యశాఖలో విషాధం.. రోడ్డు ప్రమాదంలో డాక్టర్ యాదగిరిరావు మృతిచెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యశాఖలో పెను విషాదం నెలకొంది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామ వాస్తవ్యులైన ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన జలగం మాధవరావు–భారతమ్మల కుమారుడు యాదగిరిరావు తల్లిదండ్రులతోపాటు సిరిసిల్ల అనంతనగర్లో నివాసముంటున్నాడు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్సీలో యాదగిరిరావు ఐదేళ్లపాటు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నగునూరులోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో మెడిసిన్లో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో సంఘటన స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం కోసం జిల్లా ఏరియాస్పత్రికి తీసుకురాగా ఆస్పత్రి ప్రాంగణం రోధనలతో దద్దరిల్లింది. సిరిసిల్లలో వైద్యుడిగా యాదగిరిరావు మంచి కీర్తి గడించారు.ఆయన మృతికి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఐఎంఏ అధ్యక్షుడు చింతోజు శంకర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి, ప్రముఖ వైద్యులు పెంచలయ్య, మానేరు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంతాపం ప్రకటించారు. బస్సు ఢీకొని ఎల్ఐసీ ఉద్యోగి మృతి హుజూరాబాద్: పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ (46) అనే ఎల్ఐసీ ఉద్యోగి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ప్రభాకర్ (46) పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరిత్యా పట్టణంలోని కాకతీయకాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటికి నిత్యవసర వస్తువులు తీసుకొని వెళ్తుండగా ఆర్టీసీ డీపో నుంచి బయటకు వస్తున్న బస్సు ఢీకొనడంతో ప్రభాకర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతివార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గమ్యం చేరని ప్రయాణం
విశాఖపట్నం,నల్లజర్ల: నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్తో పాటు నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. నల్లజర్ల ఎస్సై వి.సుబ్రహ్మణ్యం అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం డిపో బస్సు గురువారం విజయవాడ నుంచి ఏలేశ్వరం వెళుతుండగా పుల్లలపాడు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో వెనుక సీట్లో ఉన్న హైదరాబాదు నుంచి ఏలేశ్వరం వెళుతున్న తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం, కె.పెదపూడికి చెందిన చింతా విజయ భ్రమరాంబ (50)కు తీవ్రగాయాలయ్యయి. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న రెస్ట్ డ్రైవర్ నాగం సత్యనారాయణ (ఏలేశ్వరం) తీవ్రంగా గాయపడటంతో ఆయనను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీతానగరంకు చెందిన నేమాని సత్యవతి ఆమె కుమారుడు రామ్మోహనచౌదరి, మృతురాలు కుమారుడు పవన్కుమార్ కు స్వల్పగాయాలయ్యాయి. వీరందరికి నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం: తహసీల్దార్ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది వచ్చి ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదని తహసీల్దార్ గౌరినాయుడు ఆరోపించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తాను సంఘటనా స్థలానికి వెళ్లానని, 108కు ఫోన్ చేస్తే సిబ్బంది డ్యూటీలు మారుతున్నామని చెప్పి ఆలస్యం చేశారని, ముందుగా వచ్చి ఉంటే ప్రయాణికురాలు భ్రమరాంబ బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కళ్లేదుటే ఆమె చనిపోయిందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కాటారం(మల్హర్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ పీవీనగర్ వద్ద కాటారం – మంథని ప్రధాన రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని డిపోకు చెందిన (ఏపీ 01 వై 2992) నంబర్ అద్దె బస్సు గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లికి 63 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పెద్దపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన అడవిసోమన్పల్లి మానేరు వంతెన దాటిన అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు పక్కకు దిగి పల్టీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు అప్రమత్తమై బస్సు లోపల భాగాలను గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, 30 మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలవ్వగా మరో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికుల తల, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు 108, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను కాటారం, మహదేవపూర్, మంథని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
-
డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో..
సాక్షి, భూపాలపల్లి: గోదావరిఖని నుంచి మంథని మీదుగా భూపాలపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీనగర్ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. గోదావరి ఖని డిపోకు చెందిన ఈ బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కాగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్ వదిలేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : డ్రైవర్ నిర్లక్ష్యం బోల్తా పడిన ఆర్టీసీ బస్సు -
దారితప్పిన ప్రగతి రథం
సాక్షి, హైదరాబాద్: ఎర్ర బస్సు అనగానే ఓ అనుబంధం.. ఓ ఆత్మీయత.. అది మన ఇంటి వాహనమన్నంత ప్రేమ.. ఊరికి బస్సు వచ్చిందంటే అదో ఆనందం.. నైట్ హాల్ట్ చేస్తే, ఆ రాత్రికి డ్రైవర్, కం డక్టర్ ఆ ఊరికి అతిథులే.. ఆర్టీసీ బస్సంటే అంత అభిమానం మరి. అందులో ప్రయాణిస్తే హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయేంత నమ్మకం. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని బస్సుపై ఉన్న నినాదం నిజమేన్న విశ్వాసం. మరి.. వాస్తవంగా పరిస్థితి అలాగే ఉందా..? ఆర్టీసీ బస్సు ప్రయా ణం సురక్షితమేనా? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. గత ఐదేళ్లలో ఆర్టీసీ ప్రస్థానం చూశాక, ఆ బస్సెక్కాలంటే కొంచెం ఆందోళన చెం దాల్సిన దుస్థితి. కాలక్రమంలో బస్సు నుంచి ఎర్ర రంగు పోయినా.. వరుస ప్రమాదాలతో మన బస్సు మళ్లీ ‘ఎర్ర’బడుతోంది. మసకబారుతున్న ప్రతిష్ట... దేశంలోనే అతి తక్కువ ప్రమాదాలు నమోదయ్యే రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీకి పేరుంది. కానీ నెమ్మదిగా ఆ ప్రతిష్ట మసకబారుతోంది. గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల తీరు చూస్తే ఆందోళన కలుగుతోంది. 2013–14 నుంచి గతేడాది డిసెంబర్ వరకు ఏకంగా 5వేల రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సు భాగస్వామ్యమైంది. ఈ ప్రమాదాల్లో 2,304 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం.. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున రాష్ట్ర సరిహద్దు దాటాక బోల్తాపడింది. అందులోని ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు. గతంలో ఈ సర్వీసు గుంటూరు వరకు ఉండగా, అక్కడికి మరో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు వరకు పొడిగించారు. కానీ డ్రైవర్ విశ్రాంతి సమయం మాత్రం పెరగలేదు. సాధారణంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గమ్యం చేరిన తర్వాత డ్రైవర్కు కనీసం 8 గంటల విశ్రాంతి ఉండాలి. కానీ అది 6 గంటలకే పరిమితమవుతోంది. ట్రాఫిక్ జాంలు, రోడ్లు బాగాలేకపోవటం వంటి కారణాలతో అందులో రెండు గంటల సమయం హరించుకుపోతోంది. దీంతో డ్రైవర్కు నికరంగా మిగిలే సమయం నాలుగు గంటలు మాత్రమే. తిరుగు ప్రయాణానికి గంట ముందు సన్నద్ధం కావాల్సి ఉంటున్నందున అది మరీ తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు రెండు మూడు గంటలే పడుకుంటున్నారు. గతంలో దూరప్రాంతాలకు వెళ్లొచ్చాక మధ్యలో ఒకరోజు పూర్తి విశ్రాంతి ఉండేది. ఇప్పుడు డ్రైవర్ల కొరత వల్ల అది ఉండటంలేదు. ఒంగోలు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడానికి కారణం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడమేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యం ఉన్నా డ్యూటీకి... రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ డిపోకు చెందిన డ్రైవర్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణం మధ్యలో కళ్లు తిరుగుతుండటంతో బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఓ గంట తర్వాత తేరుకుని బస్సు తీసుకుని డిపోకు వచ్చి, అనారోగ్యంగా ఉన్నందున ఒక్కరోజు సెలవు కావాలని అడిగారు. అయితే, డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉందని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఒత్తిడి చేయటంతో డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తోటి కార్మికుల ఆందోళనతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అనుమతించారు. అలాగే వారం రోజుల క్రితం పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ వీక్లీఆఫ్ రోజున ఇంటిపట్టునే ఉండి మద్యం తాగారు. కానీ, ఇద్దరు డ్రైవర్లు అనుకోకుండా సెలవు పెట్టడంతో వెంటనే డ్యూటీకి రావాల్సిందిగా డిపో నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను బస్సు నడిపే స్థితిలో లేనన్నా సిబ్బంది వినిపించుకోలేదు. డిపోకు వచ్చిన తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశాక, అతిగా మద్యం సేవించినట్టు తేలడంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి పంపించారు. కానీ ఆ లెవల్స్ తక్కువగా ఉంటే డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కార్మికులు చెబుతున్నారు. ఒత్తిడితో చిత్తు.. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్రమైన డ్రైవర్ల కొరత ఎదుర్కొంటోంది. ఆరేళ్లుగా నియామకాలు లేకపోవటంతో ప్రస్తుతం 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పదవీ విరమణ చేస్తుండటం, మృత్యువాత పడుతుండటంతో డ్రైవర్ల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం సంస్థ అవసరాల మేరకు 20,300 డ్రైవర్లు కావాల్సి ఉండగా.. 18,500 మంది మాత్రమే ఉన్నారు. డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో నిత్యం కొన్ని సర్వీసులు డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. అసలే ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో కొన్ని సర్వీసులు నిలిపివేయాల్సి రావడం సమస్యను మరింత పెంచుతోంది. దీంతో ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేసి పనిచేయించాల్సి వస్తోంది. దీంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. అసలే డ్రైవింగ్ సవాల్తో కూడుకున్న పని కావడం.. దానికి ఒత్తిడి తోడు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ డ్రైవర్లు మంచి నైపుణ్యం ఉన్నవారే కావడంతో జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ, ఎదురుగా వచ్చే వాహనదారుల తప్పిదం, చాలా ప్రాంతాల్లో రోడ్లు ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శిక్షణ లేని అద్దె బస్సు డ్రైవర్లు... సొంత బస్సుల నిర్వహణ భారం నుంచి తప్పించుకునేందుకు కొంతకాలంగా ఆర్టీసీ అద్దె బస్సులను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,800 అద్దె బస్సులున్నాయి. వీటి యజమానులే డ్రైవర్లను నియమిస్తారు. వారు ఆర్టీసీ సొంత డ్రైవర్ల తరహాలో శిక్షణ తీసుకున్నవారు కాదు. ఇది కూడా ప్రమాదాలు పెరిగేందుకు కారణమవుతోంది. గతంలో గోదావరిఖని సమీపంలోని బసంత్నగర్ వద్ద లోయలో బస్సు పడి ఏడుగురు ప్రాణాలను హరించింది అద్దె బస్సే. ఆ ప్రమాదంలో దాని డ్రైవర్ కూడా చనిపోయాడు. బస్సు రోడ్డెక్కితే చాలు అనుకుంటున్న ఆర్టీసీ.. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇప్పించాలన్న విషయాన్ని విస్మరిస్తోంది. ఆటోలు నడిపినవారు కూడా అద్దె బస్సు స్టీరింగ్ పట్టుకుని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ జీతంతో అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమిస్తున్నారు. దీనిని సంస్థ పట్టించుకోవడంలేదు. అక్కడలా.. ఇక్కడిలా.. 2013 అక్టోబర్: మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద ఓ ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి కావటంతో 45 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన రోడ్లకు వోల్వో బస్సు డిజైన్ అనుకూలం కాదన్న వాదన రావడంతో ఆ కంపెనీ దిగొచ్చింది. ఉన్నతస్థాయి బృందాన్ని పంపి బస్సును పరిశీలించి, కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదకరంగా ఉండటంతో జాతీయ రహదారుల విభాగం అధికారులు సర్వే చేసి దానిని సరిచేశారు. అలాంటి లోపాలు మిగతా చోట్ల ఎక్కడున్నాయో పరిశీలించి కొన్ని మరమ్మతులు చేశారు. 2015 జూన్: గజ్వేల్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొనడంతో 17 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ను యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మేరకు రైల్వేశాఖ తగిన చర్యలు కూడా తీసుకుంది. 2018 సెప్టెంబర్ 11: కొండగట్టు వద్ద ఘాట్రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న ఆర్టీసీ బస్సు.. పక్కనే ఉన్న గుంతలో పడిపోయి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 67 మంది దుర్మరణం పాలయ్యారు. కానీ తర్వాత ఏం జరిగింది? ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే అని తేల్చేసి ఆర్టీసీ చేతులు దులుపుకొంది. నిజానికి ఆ బస్సు నడిపింది గతంలో ఉత్తమ డ్రైవర్ పురస్కారం అందుకున్న వ్యక్తే. కానీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ బస్సులో వంద మంది కంటే ఎక్కువ మంది ఎక్కిన విషయాన్నీ విస్మరించారు. డీజిల్ పొదుపు పేరుతో దూరం నుంచి వెళ్లాల్సిన బస్సును ఘాట్ రోడ్డు మీదుగా మళ్లించాలని ఆదేశించిన తీరునూ తొక్కిపెట్టారు. అన్నింటికీ మించి ఆ బస్సు అప్పటికే 13 లక్షల కిలోమీటర్లు తిరిగి పనికిరాకుండా పోయిన డొక్కు బస్సనే సంగతీ పట్టించుకోలేదు. ఇంత భారీ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీలో ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు చేటు చేసుకోకుండా కొత్తగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుతం నడుస్తున్న డొక్కు బస్సులను పక్కన కూడా పెట్టలేదు. ఆర్టీసీలో అంతా గందరగోళం... ఆర్టీసీలో అంతా గందరగోళం రాజ్యమేలుతోంది. గత ఐదేళ్లుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. సాధారణంగా ఆర్టీసీకి ఐపీఎస్ అధికారి ఎండీగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యాక.. ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణరావు ఎండీ అయ్యారు. ఆయన మాటను తోటి ఈడీలు పట్టించుకోలేదు. చైర్మన్గా ఉన్న సోమారపు సత్యనారాయణను ఆయన లెక్క చేయలేదు. ఫలితంగా ఆర్టీసీ పతనావస్థకు చేరింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎండీ లేరు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈడీల మధ్య సఖ్యత లేక అంతర్గత కీచులాటలు పెరిగాయి. ఓ అధికారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి స్థితిలో బస్సు ప్రమాదాల నివారణపై దృష్టి సారించే పరిస్థితే లేకుండా పోయింది. అప్పు తెచ్చి పరిహారం చెల్లింపు ప్రస్తుతం ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతినెలా జీతాలు చెల్లించేందుకే దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న ప్రమాదాలు సంస్థను మరింత గుల్ల చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 2018లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.46 కోట్లు, అంతకుముందు సంవత్సరం రూ.45 కోట్లు చెల్లించారు. ఇలా గత ఆరేళ్లలో ఏకంగా రూ.200 కోట్లు చెల్లించింది. ఆర్టీసీ పురోగతి చర్యలకు నిధులు ఉండటంలేదు. దీంతో ప్రతి పనికీ అప్పు తేవాల్సిన దుస్థితి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం గ్రాంటు రూపంలో డబ్బులు ఇవ్వకున్నా, రుణం తీసుకునేందుకు మాత్రం అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ అప్పు తెచ్చుకుంటోంది. ఆ అప్పు నుంచే పరిహారం కూడా చెల్లిస్తోంది. బస్సుల సంఖ్య పెంచాలి తెలంగాణలో వెంటనే ఆర్టీసీ బస్సుల సంఖ్య, అందుకు అనుగుణంగా డ్రైవర్ల సంఖ్య పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు పరస్పరం ఢీకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. బస్సులు సరిపోకపోవడంతో జనం ఆటోల్లో పది, పదిహేను మంది వరకు ఎక్కుతున్నారు. అనువుగా లేని రోడ్లలో ఇవి ఢీకొంటున్నాయి. ఈ సమస్య పోవాలంటే వెంటనే ఆర్టీసీ కనీసం 2వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిందే. రోడ్లను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. – సుదర్శనం పాదం, మాజీ డైరక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్టు ఇప్పటికైనా సంస్థ కళ్లు తెరవాలి తెలంగాణ ఆర్టీసీ బస్సులు సురక్షితమన్న పేరు కొనసాగేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలి. డొక్కు బస్సులు తొలగించటంతోపాటు డ్రైవర్లపై పనిభారాన్ని కూడా తగ్గించాలి. పని ఒత్తిడితో డ్రైవర్లు డ్యూటీలోనే గుండెపోటుతో చనిపోవడం, ప్రమాదాలకు గురికావడం ఇటీవల పెరిగింది. బస్సులో పెద్ద సంఖ్యలో ఉండే ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని వెంటనే సంస్థ కళ్లు తెరవాలి. డ్రైవరకు విరామం కల్పించటంతోపాటు వారికి వైద్య వసతి పెంచాలి. తరచూ మెడికల్ టెస్టులు నిర్వహించాలి. – నాగేశ్వరరావు, ఎన్ఎంయూ ప్రతి డ్రైవర్ అప్రమత్తంగా ఉండాల్సిందే చాలాచోట్ల రోడ్లు సరిగా లేవు. ట్రాఫిక్ ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతి ఆర్టీసీ డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు తప్పవు. బస్సులో తాను కాకుండా కనీసం మరో 50 మంది ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని డ్రైవింగ్ చేయాలి. ఆరోగ్యం సరిగా లేకుంటే డ్రైవింగ్కు వెళ్లకపోవడం చాలా ఉత్తమం. ఏవైనా అనుమానాలుంటే శిక్షణకు హాజరు కావాలి. – కంది సురేందర్ రెడ్డి, ఉత్తమ డ్రైవర్ పురస్కార గ్రహీత -
బస్సు ఢీకొని మహిళ మృతి
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: బ్యాంక్ పని ముగించుకుని స్కూటర్పై ఇంటిముఖం పట్టిన భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలైన ఘటన పూలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, పాలకొల్లు మండలం వెలివెల గ్రామానికి చెందిన కొప్పినీడి పద్మ ఆంజనేయులు, అతడి భార్య సరోజిని (43) బ్యాంక్ పనిమీద స్కూటర్పై పాలకొల్లు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా పూలపల్లి వద్ద భీమవరం నుంచి పాలకొల్లు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సరోజిని అక్కడికక్కడే మృతి చెందగా ఆంజనేయులు వెన్నెముక జారిపోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె సాయిరత్నం గ్రామంలో డ్వాక్రా యానిమేటర్గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె వెంకట దుర్గ డిగ్రీ పాసై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం
హైదరాబాద్: సికింద్రాబాద్ క్లాక్టవర్ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి నాలుగు వాహనాలను, ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఓ పాదచారి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్లోని గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు... మియాపూర్ డిపో–2 ఆర్టీసీ బస్సు(రూట్ నంబర్ 10జే) జేఎన్టీయూ నుంచి సికింద్రాబాద్కు వస్తోంది. బస్సు క్లాక్టవర్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద మెట్రో పిల్లర్ నంబర్ 14 వద్దకు రాగానే అదుపు తప్పి పాదచారిని ఢీ కొట్టింది. వెంటనే డ్రైవర్ అహ్మద్ బ్రేకులు వేసేందుకు యత్నించినా బస్సు అలాగే ముందుకు వెళ్లి 16–17 పిల్లర్ల మధ్య డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు మరోవైపు వచ్చింది. అక్కడి నుంచి రాంగ్రూట్లో వెళ్లి కారు, ఆటోలు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లి పిల్లర్ 24ను ఢీకొట్టి ఆగిపోయింది. ఒకరు మృతి– ముగ్గురికి గాయాలు పిల్లర్ 14 వద్ద ఓ యాచకుడి(51)ని బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఒంగోలుకు చెందిన ప్రసాద్, పద్మజారాణి డ్రైవర్ వెంకటేశ్తో కలసి కారులో అమీర్పేట్ వైపు వెళుతుండగా బస్సు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు వీరికి గాయాలుకాలేదు. దాని వెనుకాలే ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టింది. దీంతో బోయిన్పల్లి సిక్విలేజ్కి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్కు గాయాలయ్యాయి. మేడ్చల్ కండ్లకోయకు చెందిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస్ సికింద్రాబాద్కు వచ్చి వెళుతుండగా ఢీకొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వెళ్తున్న ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన డి.ధనమ్మ(45)ను ఢీ కొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 2015లో బీహెచ్ఈఎల్ డిపోలో పనిచేసే సమయంలోనే ఆర్సీ పురం వద్ద ఓ పాదచారిని అహ్మద్ నడుపుతున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీంతో యాజమాన్యం 14 నెలల పాటు అహ్మద్ను సస్పెండ్ చేసింది. మళ్లీ విధుల్లో చేరిన కొద్ది నెలల్లోనే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బస్సు కండీషన్లోనే ఉంది: ఆర్ఎం రమాకాంత్ (సికింద్రాబాద్) బస్సును మా నిపుణులు వచ్చి పరిశీలించారు. బస్సు బ్రేక్ మీటర్లో ఎయిర్ 6 పాయింట్లు చూపిస్తోంది. అంటే.. బ్రేకు బాగున్నట్లే. ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేది తర్వాత దర్యాప్తులో తేలుతుంది. ఫిట్నెస్ బాగానే ఉంది. డిసెంబర్ 27, 28వ తేదీల్లో బస్సు పూర్తిస్థాయి సర్వీసింగ్ చేశాం. ఎలాంటి లోటుపాట్లు లేవు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తికి ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం. గాయపడినవారికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాం. బ్రేకులు పడలేదు: డ్రైవర్ అహ్మద్ క్లాక్టవర్ చౌరస్తాకు రాగానే పాదచారి వచ్చాడు. బస్సు బ్రేకులు వేసేందుకు యత్నిం చినా ఆగలేదు. బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. అందరూ కేకలు వేస్తున్నారు. నేను సీటులోంచి లేచి నిల్చుని బ్రేకులు ఒత్తిపట్టినా పడలేదు. ముందుకు వెళ్లి మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో ఆగిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి...
బోడుప్పల్: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో దంపతులు మృతి చెందారు. మేడిపల్లి ఇనస్పెక్టర్ డి.అంజిరెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం... రాజమండ్రికి చెందిన పి.కోటేశ్వరరావు (29) గత కొంత కాలంగా నగరంలో ఉంటూ తార్నాకలోని ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగినేని పల్లికి చెందిన స్వప్న(27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నివసిస్తున్న వీరు ఆదివారం పనిమీద అన్నోజిగూడకు బయలుదేరారు. నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఏపీ 29జడ్ 2157 నంబరు కలిగిన ఆర్టీసీబస్సును మరో టూవీలర్ వేగంగా క్రాస్ చేసి వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి హఠాత్తుగా సీట్లో నుంచి బస్సులో కింద పడిపోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ ఎక్కింది. బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ టీవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాజ్గిరి ఏసీపీ గోనె సందీప్రావు సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపడమే కారణమని కొందరు స్థానికులు చెప్పారు. -
బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
గోపాల్పేట (వనపర్తి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన నాగపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన చక్రి (13), బాలరాజు (20), వినయ్ లు గురువారం బావాయిపల్లి నుంచి గౌరిదేవి పల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అదే స మయంలో కొల్లాపూర్ డిపోకు చెందిన (ఏపీ 28 జెడ్ 4173) నంబర్గల ఆర్టీసీ బస్సు నాగర్కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళుతుండగా నాగపూర్ గ్రా మం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చక్రి అనే యువకుడికి తీ వ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలరాజును స్థానికులు నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగపూర్ సమీపంలో ప్రాణాలు వది లాడు.వినయ్ తీవ్ర గాయాలతో కొల్లాపూ ర్ ప్ర భుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఒ క్కగానొక కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రు లు తిరుపతయ్య, పార్వతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. చక్రిమృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రేవల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్నోవా ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి గాయాలు పెంట్లవెల్లి (కొల్లాపూర్): మండల కేంద్రంలోని న మాజ్ చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయప డ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. జటప్రోల్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మిద్దేటి వెంకటేశ్వర్లు (52), మిద్దేటి శ్రీధర్ కొల్లాపూర్కు బ్యాండ్ వాయించడానికి వెళ్లారు. ప ని ముగించుకుని తిరిగి జటప్రోల్కు వస్తుండగా మార్గమధ్యలో కేవైఎఫ్ సంస్థకు చెందిన కారు ప్ర చారానికి వెళ్లి వస్తూ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకటేశ్వర్లు ప్రాణాలు వదిలాడు. శ్రీధర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనపై డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. -
ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సు ఆటోట్రాలీని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, 12 మంది గాయపడిన సం ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రతి రోజు ఆకుకూరలను అమ్ముకునేందుకు హైదరబాద్ మార్కెట్కు వెళ్తుంటారు. రోజూ మాదిరిగానే ఆటోట్రాలీలో కూరగాయాలు నింపుకొని గ్రామం నుంచి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ సమీపంలో రైతులు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న గొడుకాండ్లు యాదయ్య(59) అక్కడికక్కడే మృతిచెందగా కట్టెల రాములు(40), మంచాల జంగయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన మర్రిపల్లి వినోద్కుమార్, గుర్రం మధుకర్రెడ్డి, బోరిగె మహేందర్, కట్టల మహే ందర్, మేకల యాదగిరిరెడ్డి, మొగిలి జంగారెడ్డి, జి. రవీందర్, శ్యామల లక్ష్మమ్మ, గుడాల బాలమ్మ, మేకల కల్పనలను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉస్మానియా, యశోద, సాయి సంజీవిని ఆస్పత్రులకు తరలించారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపించిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మొండిగౌరెల్లిలో విషాదఛాయలు యాచారం: కరువు పరిస్థితులు పండించిన ఆకుకూరలకు మంచి ధర వస్తుందనే ఆశ ప్రాణాల మీదకు తెచ్చింది. పూదీనా, కొత్తిమీరా పండించే మొండిగౌరెల్లి రైతులు నిత్యం ప్రైవేట్ వాహనా ల్లో హైదరాబాద్లోని మాదన్నపేట మార్కెట్కు తరలించి 5:30 గంటల్లోపే విక్రయాలు జరిపి తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఏళ్లుగా ఇదే మాదిరిగా గ్రామానికి చెందిన రైతులు ఆకుకూరలను మార్కెట్లో విక్రయిస్తారు. అదే మాదిరిగా ఆదివారం ఉదయం 4 గంటలకు ఆటోలో పూదీనా, కొత్తిమీరా తదితర ఆకుకూరలను తీసుకుని 13 మంది రైతులు మాదన్నపేట మార్కెట్కు బయల్దేరారు. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు రైతులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలైన గొడుకొండ్ల యాదయ్య మృతిచెందగా, పలువురు తీవ్ర గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాదయ్య మృతితో వీధిన పడిన కుటుంబం... గొడుకొండ్ల యాదయ్య మృతితో ఆయన కుటుంబం వీధిన పడింది. యాదయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నప్పటికీ బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో యాచారం గ్రామానికి చెందిన కుమ్మరి గాలయ్య వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని ఆకుకూరలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదయ్యకు భార్య మల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు ప్రవీణ్కుమార్, రాంప్రసాద్కుమార్, దివ్యాంగురాలైన కూతురు జంగమ్మ ఉంది. యాదయ్య మృతితో కుటుంబం వీధినపడింది. ఈ ప్రమాదంతో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటోట్రాలీ ప్రమాదాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు చేశాడు. యాదయ్య కుటుంబీలకు సాయం అందించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్, యాచారం జెడ్పీటీసీ కర్నాటి రమేష్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అచ్చెన మల్లీకార్జున్ తదితరులు ఉన్నారు. -
కొండగట్టు సాయానికి ‘కోడ్’ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషి యా చెల్లింపునకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎక్స్గ్రేషియా చెల్లింపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రమాదంలో 62 మంది మృత్యువాత పడగా, మరో 43 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
తప్పిన ఘోర ప్రమాదం
నాగర్కర్నూల్ క్రైం: కాలం చెల్లిన బస్సులు.. సా మర్థ్యానికి మించి ప్రయాణికుల తరలింపు.. కొం దరు డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి.. ప్రయాణికుల జీవితా ల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. జిగిత్యాల జి ల్లా కొండగట్టు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు బో ల్తాపడి 62మంది దుర్మరణం పాలైన విషాద సంఘటనను మరవకముందే అలాంటి ఘోర ప్ర మాదమే త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదంలో నుంచి ప్రయాణికులు మృత్యువు అంచు దాకా వెళ్లి క్షేమంగా బయటపడ్డారు. బిజినేపల్లి మం డలం వట్టెం సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం ప్రభుత్వం, అధికారుల తీ రును ప్రశ్నిస్తోంది. వీఆర్వో పరీక్షకు వెళ్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో పరిమితికి రెండింతలు మించి ఎక్కడంతో ఆర్టీసీ బస్సు టైర్ రాడ్ ఊడిపోయి పొలంలోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్రంగా గా యపడ్డారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. వీఆర్ఓ పరీక్షకు వెళ్లి.. వీఆర్ఓ పరీక్ష జరగనుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి అభ్యర్థులు వనపర్తి జిల్లాకేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోని సెంటర్లలో పరీక్ష రాసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో బయలుదేరిన యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జడ్చర్లలో ఎక్కారు. దాదాపు వంద మందికిపైగా బస్సు లోపల, టాప్పై ప్రయాణికులతో బయలుదేరింది. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలోకి రాగానే బస్సు ముందు టైర్ ఊడిపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లింది. బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. దీంతో టాప్పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు కుదుపులకు బస్సు మీద నుంచి చెల్లాచెదురుగా కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనస్థలిలో ఆర్తనాదాలు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడం, పక్కకు ఒరిగిపోవడం, బయట నుంచి ఆర్తనాదాలు వినిపిస్తునండటంతో లోపల ఉన్న ప్రయాణికులకు ఇవేమీ అర్థం కాలేదు. అయితే ఏదో ప్రమాదం జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారంతా ఒక్కసారిగా బస్సు లోపలి నుంచి బయట పడేందుకు ఇబ్బంది పడ్డారు. బయటికి వచ్చే డోరు సైతం బిగుసుకుపోవడంతో.. బస్సు ముందు భాగం అద్దాలు పగులగొట్టి అందులోంచి బయటకు వచ్చారు. అయితే ప్రయాణికులలో అత్యధిక శాతం వీఆర్ఓ పరీక్షలు రాసే వారే కావడం.. ఒక్కొక్కరే ప్రయాణిస్తుండటంతో కొత్త వారైనా గాయపడిన తోటి ప్రయాణికులకు సురక్షితంగా ఉన్నవారు సఫర్యలు చేశారు. ఆస్పత్రికి తరలింపు.. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లలో నాగర్కర్నూల్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రి ఆవరణ మొత్తం క్షతగాత్రులు, ప్రయాణికుల రోదనలతో దద్దరిల్లిపోయింది. సంఘటన విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా ఆస్పత్రికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. అయితే తీవ్రంగా గాయపడిన 11 మందిలో 9 మందిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించండి నాగర్కర్నూల్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బాధితులను కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారి వెంట జేసీ శ్రీనివాస్రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్నాయక్ తదితరులున్నారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘనందన్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు పరామర్శించారు. -
టైరు ఊడి.. అదుపుతప్పి..
సాక్షి, బిజినేపల్లి రూరల్/హైదరాబాద్/నర్సాపూర్: కొండగట్టు బస్సు ప్రమాదం మరువక ముందే నాగర్కర్నూల్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి పంట పొలాల్లోకి దూసుకెళ్ల డంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9మందిని నిమ్స్కు, మిగిలిన వారిని నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో అందరూ వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు టాప్పై.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన (ఏపీ 24జడ్ 0037) బస్సు ఆదివారం హైదరాబాద్ నుంచి వనపర్తి బయలుదేరింది. వీఆర్వో పరీక్ష ఉండటం, బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో కొందరు బస్సు టాప్ పైకి ఎక్కారు. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్దకు బస్సు రాగానే ముందు టైరు పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. బస్సు టాప్పై ఉన్న వారు కిందపడ్డారు. కిందపడిన వారిలో 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ శ్రీనివాస్రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 100 మందిలో 65 మంది వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. చాలా కాలంగా పరీక్షకు సిద్ధమవుతున్నామని, పరీక్షకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి రాయలేకపోయామని అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పరామర్శించారు. తక్షణ సహాయంగా కొంత నగదును బాధితుల బంధువులకు అందజేశారు. క్షతగాత్రుల వివరాలు మ«ధుకర్ (బైరాపూర్), భూపాల్ (బోడంపహాడ్), రాజు (బాలానగర్), అనిల్ (కొడంగల్) నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ (మాడ్గుల), ప్రభాకరాచారి (హైదరాబాద్), రాంచందర్ (బాలానగర్), నాగమల్లయ్య (తెల్కపల్లి), జింకల శివకుమార్ (ఆలేరు), నర్సింహులు (పెద్దఅల్వాల్), కృష్ణ (వెల్జాల)ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. కలెక్టర్ చొరవతో పరీక్షకు.. పాన్గల్: ప్రమాదంలో గాయపడి ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థి కలెక్టర్ శ్వేతామహంతి చొరవతో పరీక్ష రాసేందుకు సిబ్బంది అనుమతించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ చెందిన పవన్ కల్యాణ్.. వనపర్తి జిల్లా పాన్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. కానీ నాగర్కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదంలో పవన్ కూడా గాయపడ్డాడు. అయినా 11.28 నిమిషాలకు కేంద్రానికి చేరుకున్నాడు. కానీ ఆలస్యమవడంతో అధికారులు అనుమతించలేదు. విషయం కలెక్టర్కు తెలియడంతో పరీక్షకు అనుమతించారు. అప్పటికే పవన్ వెనుదిరిగినా పాన్గల్ ఎస్సై తిరుపాజీ హుటాహుటిన వెళ్లి వనపర్తి మండలం అంజనగిరి వద్ద బస్సును ఆపి పవన్ను తన వాహనంపై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రత్యేక గదిలో 12.40కి పరీక్ష రాసేందుకు అనుమతించారు. నర్సాపూర్లో మరో ప్రమాదం నర్సాపూర్లో మరో బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని ఢీ కొట్టింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఏపీ 28 జెడ్ 0480 నంబర్ బస్సు ఆదివారం సాయంత్రం సంగారెడ్డి నుంచి గజ్వేల్ బయలుదేరింది. నర్సాపూర్ పట్టణ శివారులోని బీవీఆర్టీ కాలేజీ దగ్గరకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ రాములు సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు నవ్య, మనోహర, బూదమ్మలను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవ్య, మనోహర సంగారెడ్డిలో వీఆర్వో పరీక్ష రాసి వస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులున్నారని కండక్టర్ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. కాలేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేకులు పడకపోవడంతో ముందున్న లారీని ఢీ కొట్టిందని డ్రైవర్ తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన ‘వీఆర్వో’ అభ్యర్థులు -
మన బస్సు భద్రమేనా..?
‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం’ అన్నది సంస్థ నినాదం. ఈ నినాదం అన్ని ఆర్టీసీ బస్సులపైనా నిత్యం కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో సోమవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 57 మంది మరణించడంతో మన బస్సులు ఎంత భద్రం? అన్న ప్రశ్న జిల్లా వాసుల్లో తలెత్తింది. సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆర్టీసీ సంస్థకు మొత్తం 1075 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వాటిలో 260 అద్దె బస్సులు. మొత్తం బస్సుల్లో 10 శాతం కాలం చెల్లినవేనని సమాచారం. ఆర్టీసీ యాజమాన్యం, అద్దె బస్సులు యజమానులు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలో బస్సులను కండీషన్ లేకపోయినా నడుపుతున్నారు. దీంతో ఆ బస్సులు మృత్యుశకటాలను తలపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం కారణంగా గతంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. గత ఏడది డిసెంబర్ 27న ఫిరంగిపురం వద్ద బస్సు డ్రైవర్ అతివేగంగా వెళ్లి ఆటోను ఢీ కొట్టడంతో నలుగురు చిన్నారులు, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయలపాలై నేటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. గత నెల 27న సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద బైక్ వెళ్తున్న ముగ్గురిని వేగంగా వచ్చిన గుంటూరు–1 డిపో బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలోబెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా డ్రైవర్లు నిర్లక్ష్యం వీడటంలేదన్న విమర్శలు ఉన్నాయి. అద్దె బస్సుల డ్రైవర్లకు అరకొర శిక్షణే! జిల్లాలో 260 అద్దె బస్సులు ఆర్టీసీ సంస్థ తరఫున నడుస్తున్నాయి. అయితే వాటి యజమానులు ప్రైవేట్ వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. వారందరూ గతంలో లారీలు, డీసీఎంలు తదితర వాహనాలు నడిపిన వారు. ఆర్టీసీలోకి ప్రవేశించినా వారికి సరైన శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రయాణికులతో వ్యవహరిం చాల్సిన తీరు, రహదారి నిబంధనలపై వారికి అవగాహన లేకపోవడంతో ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగి పోలీసులు కేసులు నమోదు చేసినా, వ్యక్తిగతంగా, విధి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ప్రైవేటు డ్రైవర్లు అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. డ్రైవర్ల చేతికే టిమ్లు ఆర్టీసీలో కండక్టర్ వ్యవస్థను రద్దు చేసే క్రమంలో డ్రైవర్ల చేతికి టికెట్లు జారీ చేసే టిమ్లను ఇస్తున్నారు. డ్రైవర్లు టికెట్లు ఇస్తూనే వాహనాలు నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రాంభించిన కార్గో సేవలను డ్రైవర్ల నెత్తిన పెట్టడంతో వారు ఒత్తిడికి గురై ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బస్సుల నిర్వహణ గాలికే.. జిల్లాలో ఆర్టీసీ ఆధీనంలో నడుస్తున్న బస్సుల నిర్వహణ ఫర్వాలేదని అపిస్తున్నా, అద్దె బస్సులు మాత్రం ఆందోళన కరంగానే ఉన్నాయి. ఆ బస్సులు తరచూ బ్రేక్డౌన్ అవుతున్నాయి. అసలే సరైన శిక్షణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేని డ్రైవర్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించడానికి ప్రతి బస్సులో విధిగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలి. అయితే జిల్లాలోని చాలా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్, ఫైర్ కిట్లు కనిపించవు. ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్సులు ఉన్నా వాటిలో అవసరమైన మందులు కనిపించవు. పరిమితికి మించి ప్రయాణికులు.. రాజధాని అమరావతి, సింగపూర్ అంటూ ఊదర గొడుతున్న ప్రభుత్వం జిల్లాలో చాలా ప్రాంతాలకు సరైన బస్సు, రోడ్డు సౌకర్యాలు లేకున్నా పట్టించుకోవడం లేదు. చాలా ప్రాంతా లకు సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు పరిమితికి మించి బస్సులు ఎక్కుతున్నారు. టాప్పై ఎక్కి ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కితే వాహనం డ్రైవర్ అదుపులో ఉండదు. ఇది కూడా ప్రమాదాలు జరగడానికి కారణమే. కొండగట్టు ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదానికి పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండటమేనన్న ఆరోపణలూ ఉన్నాయి. అనుకోని ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదానికి ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే విషయాన్ని కొండగట్లు ఘాట్రోడ్డు ప్రమాదంతో అయినా ప్రభుత్వం, ఆర్టీసీ పెద్దలు, రవాణా శాఖ అధికారులు గుర్తించుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. -
రోడ్డెక్కాలంటేనే భయం..
తాజాగా.. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డెక్కాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా హన్మకొండ అశోకా జంక్షన్లో ఆగస్టు 19న రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. హన్మకొండ చౌరస్తా నుంచి అశోక్ జంక్షన్కు వస్తున్న పాపని సరిత(32), ఆమె కుమారుడు రిత్విక్ హన్మకొండ చౌరస్తా నుంచి ప్రీ లెఫ్ట్లో నడిచి వస్తున్నారు. వారు నడిచే దారిలో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు రాకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు ప్రీ లెఫ్ట్లోకి ప్రవేశించి రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తప్పు నూటికి నూరు పాళ్లు ఉంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు అధికారులు పెట్రోల్ పంపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక దారి ఏర్పాటు చేసి హన్మకొండ నుంచి వచ్చే ప్రీ లెఫ్ట్లోకి వాహనాలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చే శారు. ఇదే పని ముందు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అధికారులు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో రెండు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. వరంగల్ క్రైం: ప్రజలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బస్సు, లారీ, డీసీఎం తదితర భారీ వాహనాలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యంతో ద్విచక్రవాహన దారులు, పాదచారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినవారు తిరిగొచ్చేవరకు గ్యారంటీ లేకుండా పోయింది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 50 మంది మరణించారు. సోమవారం హైదరాబాద్లో గచ్చిబౌలి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాల అతివేగం ప్రాణాలను బలితీసుకుంటోంది. మార్కెట్లోకి విడుదలవుతున్న కార్లు, బైక్ల వేగం కంట్రోల్ కావడం లేదు. ఆనందం కోసం వేగంగా వాహనాలను నడిపితే.. అదే వేగం ప్రాణాలు హరిస్తోంది. వరంగల్ పోలీ సు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను గత ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గించామని అధికారులు చెబుతున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరగడం.. ప్రాణాలు పోవడం మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం.. హన్మకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనుగొండ సరిత నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన కూతురితో కలిసి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం చివరికి ఇలా ఇద్దరి ఆత్మహత్యకు కారణమైంది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 274 మరణాలు వరంగల్ పోలీసు కమిషనరేట్లో 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 274 మంది మృతిచెందగా, మరో 1,193 మందికి గాయాలైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి కమిషనరేట్లో ప్రమాదాల తీవ్రత అర్థమవుతోంది. కమిషనరేట్లో ఒక మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్–ఖమ్మం 563 హైవేపై 2016లో 15 మంది మరణించగా 20 మందికి గాయాలయ్యాయి. 2017లో 14 మంది మరణించగా 17 మందికి గాయాలయ్యయి. 2018లో ఇప్పటి వరకు ఈ రవహదారిపై ఐదుగురు మరణించగా 8 మందికి గాయాలయ్యాయి. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని ఊహించవచ్చు. శాఖల మధ్య సమన్వయ లోపం... రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సంఘటన స్థలాలకు చేరుకుని చేరుకోని తుతూ మంత్రంగా నివేదికలు సమర్పిస్తున్నారు. కానీ ప్రమాదాలకుగల కారణాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్ అనాలసిస్ గ్రూప్(రాగ్)లో పోలీసు శాఖ, ఆర్టీఏ, రవాణాశాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతిరాజ్ శాఖలు ఉన్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగిన తర్వాత ఈ శాఖల అధికారులు ప్రమాదాలకు గల కారణాలపై నివేదికలు రూపొందిస్తున్నారు. కానీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా అక్కడక్కడ చిన్నచిన్న సైన్ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. భద్రత లేని ఆర్టీసీ బస్సులు... ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి కేరాఫ్గా నిలిచిన ఆర్టీసీ బస్సులు ఇటీవల మృత్యుశకటాలుగా మారుతున్నాయి. హన్మకొండ నయీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగపహాడ్కు చెందిన ఒక ఏఎన్ఎం ప్రాణాలు కోల్పోయింది. హన్మకొండ పోలీసు స్టేషన్ సమీపంలోని అశోకా జంక్షన్లో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి తల్లి, కుమారుడు బలయ్యారు. ఆర్టీసీలాంటి సంస్థల్లో డ్రైవర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాతే రోడ్డుపైకి పంపుతారు. కానీ కొందరు డ్రైవర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారీ వాహనాలతో భద్రత కరువు.. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల అతివేగం, వారు మద్యం తాగి నడపడం, నిద్రలేమి వల్లే జరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను విరివిగా నిర్వహించడంతో మద్యం తాగి వాహనాలు నడపాలంటే కొంత భయపడుతున్నారు. కానీ భారీ వాహనాలు(బస్సులు, లారీలు, కంటైనర్లు) నడిపే వారికి బ్రీత్ ఎన్లైజర్ పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో కొంతమంది మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీ వాహనాలను నడిపే డ్రైవర్లకు కూడా పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. పని ఒత్తిడీ కారణమే కొంతకాలంగా ఆర్టీసీలో నియామకాలు లేవు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు సైతం లేవు. కొన్ని రూట్ల బస్సుల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. సంస్థలో ఉన్న డ్రైవర్లతోనే పని చేయిస్తున్నారు. దీంతో అదనంగా పని భారం పెరుగుతోంది. పని భారం పెరగడంతో కూడా డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. – చొల్లేటి కిరణ్, టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు -
పగిలిన అద్దాలు.. విరిగిన డోర్లు
బస్సు ప్రయాణం భద్రత లేకుండా పోతోంది. ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పైనే దృష్టి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లకు పని ఒత్తిడి పెరగడం ప్రమాదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. నిజామాబాద్నాగారం: ఘెరమైన బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. పగిలిన అద్దాలు, ఊడి పోయిన డోర్లతో శిథిలా వస్థలో కనిపించే బస్సులను నడపడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.ఏడాదిన్నర కాలంలో ఉమ్మ డి జిల్లాలో 28 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటు చేసుకోగా 31 మంది మరణించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని ఆర్టీసీ బస్సుల సామర్థ్యంపై సర్వ త్రా చర్చసాగుతోంది. నిజామాబాద్ రీజియన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిజామాబాద్ డిపో–1, డిపో–2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. మొత్తం 670 బస్సుల్లో 190 అద్దె బస్సులు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్టీసీ ప్రమాదాల శాతం 0.05 శాతం నమోదైంది. ప్రస్తుతం 1లక్ష కిలోమీటర్కు 0.05 శాతం ప్రమాదాల రేటు ఉంది. ఇటీవల కమ్మర్పల్లి, డిచ్పల్లి, నస్రుల్లాబాద్, నందిపేట్ రూట్లలో ప్రమాదాలు జరిగాయి. ఫలితం లేని భద్రత వారోత్సవాలు... ప్రతి సంవత్సరం ఆర్టీసీలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే డిపోలో ఈ వారోత్సవాలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ఇచ్చిన వారికే ఉత్తమ డ్రైవర్లుగా మళ్లీ అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రతి డిపోలో 500 మందిపైగా కార్మికులు ఉంటే కేవలం యూనియన్ నాయకులకు, లేదంటే 10 మంది కార్మికులకు శిక్షణ పేరుతో మమ అనిపిస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైవర్లు నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సెలవుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని అంటున్నారు. ఆదాయంపైనే దృష్టి... ఆర్టీసీ నష్టాల్లో ఉందని యాజమాన్యం ప్రతినిత్యం డ్రైవర్లను లాభాలు తేవాల్సిందేనని ఒత్తిడి పెంచుతోంది. కేవలం ఆదాయంపైనే అధికారులు దృష్టి పెట్టారని, డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడితో ప్రమాదాలకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. బస్సుల సామర్థ్యం నామమాత్రమే... ఆర్టీసీ నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుల సామర్థ్యం తగ్గిపోయిన విషయం తెలిసినా వాటిని దూరప్రాంతాలకు పంపిస్తున్నారు. డ్రైవర్లు నానా తిప్పలు పడుతూ బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులను నడపడం సాధ్యం కాదంటే ఇబ్బందులకు గురి చేసి సస్పెండ్ చేస్తారని, అందుకే ఇబ్బందులు ఎదురైనా నడిపిస్తున్నట్లు కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని (ఇంద్ర) బస్సులు సైతం చెడిపోయి రోడ్డు మ«ధ్యలో మొరాయించిన ఘటనలు ఉన్నాయి. కండిషనల్ లేని బస్సులను వరంగల్, నాందేడ్ రూట్లతో తిప్పుతున్నారు. ముఖ్యంగా నాన్స్టాప్ బస్సులో కేవలం 30 మంది ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అయితే నందిపేట్ నుంచి నిజామాబాద్, ఆర్మూర్ నుంచి నిజామాబాద్, బోధన్ నుంచి నిజామాబాద్ నాన్స్టాప్ బస్సుల్లో సామర్థ్యానికి మించి సుమారు 60 మంది వరకు ప్రయాణికులను ఎక్కించి రాకపోకలు సాగిస్తున్నారు. అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు.. ఆర్టీసీలో అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు. కనీస నిబంధనలు పాటించకున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లకు సరైన శిక్షణ కూడా ఉండడం లేదు. అద్దె బస్సుల ప్రమదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల్లో తరుచు గా డ్రైవర్కు, ఆర్టీసీ కండక్టర్లకు సైతం గొడవలు జరిగిన ఘనలు ఉన్నాయి. కెపాసిటీకి మించి బస్సుల రాకపోకలు సాగిస్తున్నారు. నందిపేట్ నుంచి నిజామాబాద్కు రాకపోకలు సాగిస్తున్న ఒకే బస్సు ఆరు నెలల వ్యవధిలో డ్రైవర్లు అత్యంత వేగంగా నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. అయినా ఆ బస్సు యాథావిధిగా తిరుగుతోంది. తనిఖీలు చేపడుతున్నాం మేము ఖచ్చితంగా తనిఖీలు చేపడుతున్నాం. ఫిట్నెస్ లేని అద్దె బస్సులపై చర్యలు తీసుకుంటాము. ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ విషయంలో డిపో మేనేజర్లకు సైతం ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలు అద్దె బస్సులు పాటించాలి. కా లం చెల్లిన బస్సులను లేకుండా చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటునే ఉన్నాము. అనిల్కుమార్, డీవీఎం, నిజామాబాద్ -
మలుపుల్లో 'మృత్యువు'
ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గతేడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకు 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో రోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో 9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే 1,856 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లో గతేడాది 1,406 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది మరణించారు. జగిత్యాల క్రైం/టౌన్: కొండగట్టు రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలానికి చెందిన వారే 50 మంది మృతిచెందారు. శనివారంపేటకు చెందిన 15 మంది, హిమ్మత్రావుపేటకు చెందిన 10 మంది, డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన 10 మంది, రాంసాగర్కు చెందిన 9 మంది, తిర్మలాపూర్కు చెందిన ఆరుగురు మృతిచెందారు. దీంతో మండలమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారంపేటకు చెందిన గర్భిణులు సుమలత (తొమ్మిది నెలలు), నామాల మౌనిక (5 నెలలు) ప్రమాదంలో చనిపోయారు. కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి ఘాట్రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్ మిర్రర్స్ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతు న్నాయి. ఆ ఘాట్ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్రోడ్లపై కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి. రోడ్డు తీరుతెన్నులు, ప్రతికూల పరిస్థితులు, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, నిబంధనల్ని పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి’ అని ట్రాన్స్పోర్ట్ ప్లానర్ ప్రొఫెసర్ ఎన్.రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ప్రమాదాలకు కారణాలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో ఇరుకు దారులు, ప్రమాదకర మలుపులు, చెత్త రోడ్లు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి డ్రైౖవర్లు ప్రయత్నించడం, మద్యం సేవించడం వంటివి ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు కారణాలుగా చెప్పొచ్చు. ప్రమాదాల్లో 50% ప్రమాదకరమైన మలుపుల కారణంగా, డ్రైవర్ నిర్లక్ష్యంతో 25% ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల కారణంగా ప్రమాదాలు.. రోడ్లపై గుంతల కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గత మూడేళ్లలో రహదారులపై గోతుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 9,300 మందికి పైగా మరణించారు. 25 వేల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రహదారుల శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ పార్లమెంటులో చెప్పారు. అంటే రోడ్లపై గుంతల కారణంగా దాదాపు రోజుకు 10 మంది మృతి చెందుతున్నారన్నమాట. 2015లో 3,416 మంది, 2016లో 2,324 మంది రోడ్లపై గోతుల కారణంగా మరణించారు. 2017లో పై తరహా ప్రమాదాల్లో 3,597 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి గత సంవత్సరం తీవ్రవాద దాడుల కారణంగా సంభవించిన మరణాల (803) కంటే ఎక్కువ. 2016లో నిర్మాణంలో ఉన్న రోడ్ల దగ్గర జరిగిన ప్రమాదాల్లో 3,878 మంది మరణించారు. 2017 నాటికి ఈ సంఖ్య 4,250కి పెరిగింది. బస్సులు137 డ్రైవర్లు 62 జగిత్యాల డిపోలో పని ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అంకెలే సాక్ష్యం. మొత్తం 137 బస్సులు ఉన్న జగిత్యాల డిపోలో 62 మంది డ్రైవర్లే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన ప్రతి రెండు బస్సులకు ఒక్క డ్రైవరు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అందుకే ప్రతి డ్రైవర్కు పని ఒత్తిడి తప్పట్లేదు. చాలాసార్లు తమకు విధులు వద్దని చెప్పినా వినకుండా.. విధులు చేయాల్సిందేనని బలవంతం చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఘాట్ రోడ్ కోసం శిక్షణేదీ? కొండగట్టు ప్రమాదం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆదాయం కోసం చూపిన ఉత్సాహం ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో చూపట్లేదని తేటతెల్లమైంది. వాస్తవానికి తిరుమలలో ప్రత్యేకమైన బస్సును డిజైన్ చేసి నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేక కంట్రోలర్ ఉంటారు. ఎవరినీ నిలబడనీయరు. అసలు ఎవరు నిలుచుని ఉన్నా.. బస్సు ముందుకు కదలదు. అంతా కూర్చున్నాకే బస్సు స్టార్టవుతుంది. అక్కడి డ్రైవర్లకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేస్తారు. రద్దీ వల్లే.. వేములవాడ నుంచి కొండగట్టు మీదుగా జగిత్యాలకు ఒకే ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఆర్టీసీ.. భక్తుల రద్దీ నేపథ్యంలో 10 రోజుల క్రితం కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు మీదుగా మరో బస్సును (ప్రమాదానికి గురైంది) ప్రారంభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవాలయం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఎక్కినట్లు తెలుస్తోంది. కాపాడాలని వేడుకున్నరు కొండగట్టు ఘాట్ రోడ్డు కింద ఓ రైతు భూమిని జేసీబీతో చదును చేస్తున్నం. గుట్ట పైనుంచి వస్తున్న బస్సులో నుంచి కాపాడండంటూ అరుపులు వినిపించాయి. మేము అటు చూస్తుండగానే బస్సు లోయలో పడిపోయింది. మేం వెంటనే లోయ వద్దకు వచ్చినం. అప్పటికే అందరూ చెల్లాచెదురుగా పడ్డరు. బస్సులో ఉన్న కొందరిని మొదట మేమే బయటకు తీసినం. ఒక్కొక్కరినీ బయటకు తీస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగినయ్. బస్సులో వెనుక ఉన్న వాళ్లందరూ ముందుకొచ్చి పడ్డరు. – ప్రత్యక్ష సాక్షులు చంద్రశేఖర్,రవిప్రతాప్, జేసీబీ డ్రైవర్లు మా ఆటోకు తాకింది.. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి టాటా ఏస్ ఆటోలో వెళ్లినం. ఆటోలో ఆరుగురు పెద్దవాళ్లం. నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. కొండగట్టు గుట్టమీదికి వెళ్తుండగా కిందకు పడుతున్న బస్సు నుంచి అరుపులు వినబడ్డయ్. పక్కకు జరగమని అరిచారు. మా ఆటో డ్రైవర్ వెంటనే స్పీడ్ పెంచిండు. క్షణాల్లో బస్సు మా దగ్గరికి వచ్చి ఆటోకు తాకి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఏమైందో తెల్వలేదు. బస్సు ఆటోను తాకడంతో అద్దాలు పగిలినయ్. అదృష్టం కొద్ది ఆటోలో ఉన్నవారెవరికీ దెబ్బలు తగల్లేదు. మెడబోయిన కొమురయ్య,చిగురుమామిడి వేగానికి భయపడి మధ్యలోనే బస్సు దిగిన.. మా ఊరు కొడిమ్యాల. జగిత్యాలకు వెళ్లేందుకు తిర్మలాపూర్ వద్ద బస్సు ఎక్కిన. డ్రైవర్ బస్సును వేగంగా పోనిస్తూ ముందు వెళ్లే వాహనాలను వేగంగా ఓవర్ టేక్ చేశాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. దీంతో జేఎన్టీయూ కాలేజీ బస్స్టాప్ వద్ద దిగిన. కొద్దిసేపటికే బస్సు కొండగట్టు ఘాట్రోడ్డు లోయలో పడిందని తెలిసింది. నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడు కూడా దారి మధ్యలో బస్సు దిగిపోలేదు. మొదటిసారిగా బస్సు వేగంగా వెళ్తుంటే భయపడి దిగిన..ప్రాణాలు దక్కినయ్. – ప్రకాశ్, కొడిమ్యాల స్వచ్ఛందంగా యువకుల సాయం మల్యాల: కొండగట్టు ఘాట్రోడ్డు సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో క్షత గాత్రులను తరలించేందుకు యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయిల్నేని సాగర్రావు క్షతగాత్రులను ఎత్తుకుని తీసుకొచ్చి తన వాహనంలో జగిత్యాలకు తరలించారు. నేళ్ల రాజేశ్వర్రెడ్డి, కొక్కుల రఘు, కృష్ణారావు, దూస వెంకన్న తదితరులు క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి, అంబులెన్స్లతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు సరిపోకపోవడంతో అధికారులు సైతం తమ వాహనాల్లో తరలించారు. కొండ కింద ట్యాక్సీ జీపులు నడిపే డ్రైవర్లు కూడా సంఘటనా స్థలా నికి చేరుకుని తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలోనూ స్థానిక ముస్లిం యువకులు, ఎన్సీసీ కేడెట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృత దేహాలను పోస్టుమార్టం గదికి తరలించడం.. క్షతగాత్రులను వాహనాల నుంచి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లడంలో జిల్లా యంత్రాంగానికి సాయం అందించారు. కడవరకూ కలసే.. కొడిమ్యాల (చొప్పదండి): ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ మూడు జంటలు నిలబెట్టుకున్నాయి. కడవరకూ కలసే సాగాయి. కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గొల్కొండ దేవయ్య (60) –గోల్కొండ లక్ష్మి (55), వొడ్నాల కాశీరాం (60)–వొడ్నాల లక్ష్మి (55), శనివారంపేట గ్రామానికి చెందిన గోలి రాయమల్లు (55)–గోలి అమ్మాయి (50) దంపతులు ప్రమాదంలో మృతిచెందారు. దేవయ్యకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం దంపతులు జగిత్యాల ఆసుపత్రికి.. వొడ్నాల కాశీరాం చికిత్స నిమిత్తం జగిత్యాలకు, వొడ్నాల లక్ష్మి కూతురు వద్దకు.. గోలి రాయమల్లు, గోలి అమ్మాయిలు బంధువుల ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదంలో మృతి చెందారు. -
మృత్యు శకటాలు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఆర్టీసీ బస్సులు మృత్యుశకటాలను తలపిస్తున్నాయి. నడిరోడ్డుపై నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. సోమవారం గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగానికి ముగ్గురు అమాయకులు బలైన సంఘటన నగరవాసులను భయాందోళనకు గురి చేసింది. గతంలో ఇదే డ్రైవరే నిర్లక్ష్యంగా బస్సు నడిపి జూబ్లీహిల్స్లో ఒక మహిళ మృతికి కారణమయ్యాడు. రెండేళ్ల క్రితం కవాడిగూడలో జరిగిన ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలికలు మృత్యువు పాలయ్యారు. ఈ ఘటనలో చెంగిచెర్ల డిపోకు చెందిన డ్రైవర్కు పక్షవాతం లక్షణాలు తిరగబెట్టడంతో బస్సును నియంత్రించలేకపోవడంతో ప్రమాదం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఇదే కాకుండా ఇటీవల అనేక ప్రమాదాల్లోనూ ఆర్టీసీ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుభవం, నైపుణ్యం, శిక్షణ లేని డ్రైవర్లకు బస్సులను అప్పగించడంతో రహదారులపైకి యమదూతల్లా దూసుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సిటీ బస్సుల కారణంగా 62 ప్రమాదాలు జరగగా 17 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా, 27 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సరైన శిక్షణ లేనందునే... ♦ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్లోని 29 డిపోల పరిధిలో 8 వేల మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సగానికి పైగా గతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వాళ్లే. ♦ గతంలో లారీలు, డీసీఎంలు తదితర వాహనాలు నడుపుతూ ఆర్టీసీలోకి ప్రవేశించిన వీరికి సరైన శిక్షణ లేకపోవడం, ప్రయాణికుల పట్ల, రహదారి నిబంధనల పట్ల నడుచుకోవలసిన తీరుపై అవగాహన కల్పించకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారు. ♦ ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా వ్యక్తిగతంగా డ్రైవర్ల విధి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ♦ ప్రస్తుత ప్రమాదానికి కారకుడైన జహంగీర్ గతంలో జూబ్లీహిల్స్ ప్రాతంలో రోడ్డుదాటుతున్న కమలమ్మ అనే మహిళ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది. దీంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఫిట్‘లెస్’ బస్సులు.... ♦ మరోవైపు డొక్కు బస్సులు కూడా ప్రజల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. నగరంలో 3850 బస్సులు ఉండగా, వాటిలో కనీసం 800 బస్సులు కాలం చెల్లినవే కావడం గమనార్హం. ఇలాంటి బస్సులు తరచూ చెడిపోయి బ్రేక్డౌన్లకు గురవుతున్నాయి. అసలే సరైన శిక్షణ, ట్రాఫి క్ నిబంధనల పట్ల అవగాహన లేని డ్రైవర్ల కార ణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ♦ నగరంలో ఆర్టీసీ బస్సుల కారణంగానే 11 శా తం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ♦ సిగ్నల్ జంపింగ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకైతే లెక్కే ఉండడం లేదు. వేల సంఖ్యలో ఇలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. -
ధర్మపోరాట దీక్షకు ఒకరు బలి
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కర్నూలు జిల్లాలో నిర్వహించిని ధర్మపోరాట దీక్షకు ఒకరు బలైయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూల్లో జరుగుతున్న సీఎం సభకు టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ హహనంలో బయలు దేరారు. మార్గం మధ్యలో భోజనం చేయడానికి గార్గేయపురం గ్రామం చేరువు దగ్గర దిగారు. భోజనం చేసి తిరిగి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో టీడీపీ కార్యకర్త అయ్యస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చేరుకుచెర్ల గ్రామానికి చెందిన అయ్యస్వామిగా పోలీసులు గుర్తించారు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నాయుడుపేటటౌన్(నెల్లూరు): ముందు వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఆత్మకూరుకు చెందిన చెరువుపల్లి వేణు (33) అనే ప్రయాణికుడు మృతిచెందిన ఘటన నాయుడుపేట మండల అన్నమేడు జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా, 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు చెందిన సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులో ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన షేక్ సుభానీ డ్రైవర్ కమ్ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తిరుపతి నుంచి నెల్లూరు వరకు వెళ్లే బస్సుకు డ్రైవర్గా ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో నెల్లూరు నుంచి తిరుపతికి 16 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. బస్సులో ఖాళీగా ఉందని గూడూరు వద్ద ఆత్మకూరు పట్టణానికి చెందిన చెరువుపల్లి వేణు (33) అనే వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అతను డ్రైవర్ ఎడమవైపు కూర్చున్నాడు. జాగ్రత్తగా నడపాలని చెప్పినా.. కాగా డ్రైవర్ కునుకు తీస్తూ బస్సు నడుపుతుండటంతో ప్రయాణికులు జాగ్రత్తగా నడపాలని సూచనలు ఇచ్చారు. బస్సు మార్గమధ్యంలో మండల పరిధిలోని అన్నమేడు జాతీయ రహదారి కూడలి వద్ద ముందు వెళుతున్న సిమెంట్లోడు లారీని వేగంగా ఢీకొంది. దీంతో బస్సు ఎడమవైపు నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరగడంతో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న వేణు ఇరుక్కుని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంకా బస్సులో ఉన్న నాయుడుపేటలోని రజక కాలనీకి చెందిన రమేష్ అనే వ్యక్తితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా 13 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బస్సు ఎడమ వైపు శకలాల్లో ఇరుక్కున్న మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సల్పగాయాలతో ఉన్న వారిని మరో బస్సులో పంపించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదుచేశారు. వేణు మృతదేహానికి పోస్ట్మార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద విషాదఛాయలు ఆత్మకూరు పట్టణంలో సెలూన్ షాపు నిర్వహించుకునే వేణు దైవదర్శనం చేసుకునేందుకు వెళుతూ మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నాయుడుపేట వైద్యశాలకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
వెంటాడిన మృత్యువు
లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్ కడప): మండలంలోని రాయచోటి –వేంపల్లె రహదారిలో లక్కిరెడ్డిపల్లె సమీపంలోని దాసిరెడ్డి మిట్ట వద్ద బుధవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో అక్బర్ అలీ(35)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ సురేష్రెడ్డి కథనం మేరకు.. మండలంలోని దిన్నెపాడు గ్రామం దూదేకులపల్లెకు చెందిన అహ్మద్, షబీనా అనే దంపతులు రాయచోటిలో వారి పనులు ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. రామాపురం మండలం బండపల్లె దూదేకులపల్లెకు చెందిన ఖలందర్, అక్బర్ అలీ అనే ఇద్దరు లక్కిరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి వస్తుండగా వర్షం పడుతుండడంతో ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించక రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వీరిని గమనించని రాయచోటికి వెళ్లే పూలుకుంట ఆర్టీసి బస్సు(ఏపీ29జడ్ 2784)ద్విచక్రవాహనంతో పాటు అహ్మద్,షబీనాను రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖలందర్,అక్బర్ అలీ అనే ఇద్దరు కూడా రోడ్డుకు మరో వైపు గాయాలతో పడి ఉండగా అతి వేగంగా వస్తున్న గుర్తు తెలియని కారు అక్బర్ అలీ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే అతను మృతి చెందగా ఖలందర్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉన్న ఖలందర్,అహ్మద్, షబీనాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అంతా ఊపిరి పీల్చుకున్నారు
మద్దూరు : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ముంబాయికి వెళ్లే బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నారాయణపేట నుంచి మద్దూరు మీదుగా ముంబాయికి వెళ్లే ఆర్టీసీ బస్సు మద్దూరు బస్టాండ్కు చేరింది. పాతబస్టాండ్ మీదుగా వెళ్లాల్సిన బస్సు పాతబస్టాండ్లోమిషన్ భగీరథ పైప్లైన్ పనులు జరుగుతుండడంతో ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వెళ్లడానికి బస్సుడ్రైవర్ బస్టాండ్లో సీసీ రోడ్డుపైకి బస్సును ఎక్కించే ప్రయత్నం చేశారు. సీసీ రోడ్డు వారం రోజుల క్రితమే వేయడంతో క్యూరింగ్ కోసం కట్టలు కట్టారు. దీంతో బస్సు అదుపుతప్పి బొల్తా పడబోయింది. బస్సు డ్రైవర్ ప్రయాణికులు గమనించడంతో బస్సును అపి అందులోని ప్రయాణికులను దింపేశారు. బస్సును సీసీ రోడ్డుపైకి తోశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొని విద్యార్థి..
కదిరి అర్బన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఓబుళదేవరచెరువు మండలం తుమ్మలకుంట్లపల్లికి చెందిన విజయశేఖర్ (21) కదిరిలోని నారాయణ పాఠశాల వద్దనుంచి అడపాలవీధిలోకి వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రోడ్డు దాటే క్రమంలో తన ముందు పోతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన విజయశేఖర్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగాఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మలక్పేటలో తప్పిన పెనుముప్పు
హైదరాబాద్: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మలక్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు..తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా.. నగరంలోని మలక్పేట్ వద్దకు రాగనే సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు జరిపి ప్రయాణికులను కిందకు దించాడు. అదే సమయంలో దిల్సుఖ్నగర్ నుంచి చాదర్ఘాట్ వైపు వెళ్తున్న వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ ఢీకొట్టిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని.. యువకుడి మృతి
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. వెంటనే వెనుక నుంచి వచ్చిన బస్సు బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మెడిపల్లి పోలీస్ స్టేసన్ పరిధిలోని ఫిర్జౌదిగూడ కమాన్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా కేశవపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన మిత్రుడితో కలిసి నగరానికి ద్విచక్రవాహనం పై వస్తుండగా ఫిర్జౌదిగూడ వద్దకు చేరుకోగానే వేగంగా వస్తున్న బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న శ్రీనివాస్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అతని తలపై నుంచి బస్సు వెళ్లడంతో అతను చనిపోయాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
లేపాక్షి : చిలమత్తూరు మండలం దేమకేతేపల్లికి చెందిన బేల్దారి చంద్రశేఖర్ (48) ఆదివారం స్వగ్రామం నుంచి లేపాక్షి వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్నాడు. లేపాక్షి నంది విగ్రహం వెనుక వైపునకు వచ్చే సరికి ఎదురుగా హిందూపురం నుంచి గోరంట్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 28 జెడ్ 5224) వస్తోంది. అదే సమయంలో మరో ద్విచక్రవాహనదారుడు అతివేగంతో వెళ్తున్నాడు. అతడిని తప్పించడానికి ఆర్టీసీ డ్రైవర్ ప్రయత్నిస్తుండగానే చంద్రశేఖర్ ద్విచక్రవాహనం బస్సుకు తగిలి వెనుకచక్రం కింద పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో ఇక తమకు దిక్కు ఎవరని కుటుంబ సభ్యులు విలపించారు. లేపాక్షి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను హిందూపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గోపినాథ్, స్థానిక కంట్రోలర్ ఆర్ఎస్కే బాషా ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాల గురించి ఎస్ఐ శ్రీధర్ను అడిగి తెలుసుకున్నారు. -
మహిళా హోంగార్డును ఢీకొట్టిన బస్సు
హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా హోంగార్డును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నగరంలోని జగద్గిరిగుట్ట బస్లాండ్లో సోమవారం చోటు చేసుకుంది. బస్టాండ్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా హోంగార్డును జగద్గిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు వెనుక చక్రాలు హోంగార్డు కాళ్ల పై నుంచి వెళ్లడంతో..ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కురుపాం: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన విజయనగరం జిల్లా కురుపాం మండల సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పార్వతీపురం నుంచి సాకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఇద్దరి మృతి
చంద్రగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన కుటుంబం కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రియా ఆస్పత్రికి తరలించగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరి ఉసురు తీసిన కేఎస్ ఆర్టీసీ బస్సు
అనంతపురం క్రైం : డ్రైవర్ కునుకుపాటుతో ఓ ఆర్టీసీ బస్సు ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో 22 మంది ప్రయాణికులను ఆస్పత్రిపాలు చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం... బెంగళూరు నుంచి కర్ణాటక ఆర్టీసీ బస్సు మంత్రాలయానికి శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరింది. అందులో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజాము 3.05 గంటలకు ఇస్కాన్ టెంపుల్ సమీపానికి వచ్చింది. ఆ సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ బసప్ప వలీధార్ కునుకుతీయడంతో బస్సు అదుపుతప్పింది. డివైడర్ను దాటి అవతలకు వెళ్లి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనం డ్రైవర్, క్లీనర్ అందులోనే విరుక్కుపోయి మృతి చెందారు. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ప్రయాణికుల ప్రాణభయంతో కేకలు పెట్టారు. బస్సు కుదుపునకు ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీట్లలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్పీ నరసింగప్ప, ఎస్ఐ జాకీర్ హుస్సేన్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాగేపల్లికి చెందిన ఐచర్ డ్రైవర్ రామాంజినప్ప (30), క్లీనర్ రమణ (26)ను వాహనంలో నుంచి బయటకు తీశారు. గాయపడిన ప్రయాణికులను 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రయాణికులు ఈరన్న, ఆయన భార్య పార్వతి(కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు)ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అనంతపురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రయాణికులు వీరే.. బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో పూర్విక (బెంగళూరు), గౌరి (బెంగళూరు), రాజు (ఆదోని), జానకి (తుముకూరు), మునిస్వామి (ఎమ్మిగనూరు), విక్రత్ (రామదుర్గ), రామాచారి (మంత్రాలయం), మధు సుధీక్ రాజ్ (మైసూర్), కె.వి.రాజీవ్ (మైసూర్), ముబారక్ అలీ (బెంగళూరు), తీర్థయ్య గౌడ్ (బెంగళూరు), శ్రీనివాస్ (బెంగళూరు), మునిమ్మ (బెంగళూరు), అణ్ణమ్మ (బెంగళూరు), జయప్రకాష్ జేమ్స్బాండ్ (బెంగళూరు), ప్రకాష్ (బెంగళూరు), స్వామి జశ్వంత్ (బెంగళూరు), సుజాత (బెంగళూరు), లక్ష్మి (రామదుర్గ), జాఫర్ (ఎమ్మిగనూరు) ఉన్నారు. బస్సు డ్రైవర్ కునుకుపాటు వల్లే ప్రమాదం బస్సు డ్రైవర్ కునుకుపాటు వల్లే ప్రమాదం జరిగింది. బస్సులో 52 మంది ప్రయాణికుల మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. కానీ మరో 15 మందిని అదనంగా ఎ క్కించారు. డ్రైవర్ నిద్రలో తూగడం, సామర్థ్యానికి మంచి ప్రయాణికులు ఉండటంతో బస్సు అదుపుతప్పింది. -యు.నరసింగప్ప, ట్రాఫిక్ డీఎస్పీ, అనంతపురం -
నిద్రమత్తులో డ్రైవింగ్: 20 మందికి గాయాలు
చిత్తూరు(చంద్రగిరి): డ్రైవర్ నిత్ర మత్తులో ఉండి ఆర్టీసీ బస్సును నడపడంతో 20 మంది తీవ్రంగా గాయపడగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పలమనేరు డిపోకు చెందిన బస్సు పలమనేరు నుంచి తిరుపతికి వెళుతుండగా స్వర్ణముఖి నది వద్ద డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది. దీంతో బస్సు చెట్టును ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. కాగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రియా ఆస్పత్రికి తరలించారు. -
అప్పటి దాకా సంతోషం.. అంతలోనే విషాదం
♦ పుష్కరాలకు వెళ్లివస్తూ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు ♦ 42 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం ♦ రక్తసిక్తమైన ప్రమాదస్థలి.. మిన్నంటిన క్షతగాత్రుల ఆర్తనాదాలు రామాయంపేట : పుష్కర స్నానాన్ని పూర్తిచేసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరిన వారిని అంతలోనే ఆవిరైంది. పుష్కర అనుభూతులను తోటి ప్రయాణికులతో పంచుకుంటూ సాగుతున్న ప్రయాణం విషాదం మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పుష్కరాల్లో పాల్గొనేం దుకు బాసర వెళ్లిన హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన భక్తులు శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ డిపోకు చెందిన పుష్కరాల ప్రత్యేక బస్సులో ఎక్కారు. బస్సు రామాయంపేట ఎల్లమ్మ గుడివద్దకు చేరుకోగా బస్సు వెనుక టైరు పగి లిపోవడంతో అదుపు తప్పి బోల్తాపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకి తీసి వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 48 మంది ఉండగా బస్ డ్రైవర్ కండక్టర్తో పాటు 42మంది గాయపడ్డారు. బ్రస్సులో నుంచి బయటపడిన వారు రక్తమోడుతున్న గాయాలతో తమవారి కోసం గాలిం చడం, చిన్నపిల్లలను హత్తుకోవ డం కంటతడి పెట్టించింది. బాధితుల ఆర్తనాదాలు, విరిగిన కాళ్లు, చేతులు, రక్తసిక్తమైన పరిసరాలతో గం దరగోళంగా తయారైంది. కాగా 42 మందిలో త్రీవంగా గాయపడిన 16 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వీరి లో భవాని, గణేశ్తో పాటు మనోహర్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో మెదక్ జిల్లా హ త్నూరకు చెందిన నరేందర్, నగేశ్, దేవయ్య, మనోహర్, సాగర్, రాజు, చేగుంట మండలం మక్కరాజ్పేటకు చెందిన కొండల్రెడ్డి, వర్గల్ మండలం అనంతసాగర్కు చెందిన సుధాకర్ తదితరులు ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన డిప్యూటీ స్పీకర్.. ప్రమాద విషయం తెలియగానే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ ఆస్పత్రికి వెళ్లి రో గుల పరిస్థితిని సమీక్షించారు. వైద్య సేవలను పరిశీలించారు. అలాగే ఇదే సమయంలో హైదరాబాద్ వెళ్తున్న ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాధోడ్ బాబూరావు సంఘటనా స్థలంలో ఆగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల తీరు ప్రశంసనీయం రామాయంపేటవద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడంతో పాటు వారికి సపర్యలు చేసే విషయమై పోలీసులు ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ నాగార్జునగౌడ్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు వాహనాలను సమకూర్చడంతో పాటు స్వయంగా స్ట్రెచర్పై తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. -
ఆర్టీసీ బస్సు ఢీ: మహిళ మృతి
చిత్తూరు (తిరుపతి): తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఆమె పట్టణంలోని పెద్దకాపు వీధికి చెందిన లక్ష్మి(30) గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న బస్సు..10 మందికి గాయాలు
మంచిర్యాల రూరల్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం ఉరిపేట వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడం, అదే సమయంలో డ్రైవర్ వేగంగా నడపడం వల్ల బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదం
ఖమ్మం రూరల్ :డ్రైవర్ నిర్లక్ష్యం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణం కాగా కండక్టర్ ప్రా ణాలు కోల్పోయాడు. 23 మంది ప్రయూణికులు గాయపడ్డారు. ఖమ్మం రూరల్ మండలం చిన్నతండా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నారుు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు ఖమ్మం బస్టాండ్ నుంచి శనివారం సా యంత్రం నాలుగు గంటల సమయంలో సుమారు 50 ప్రయూణికులతో మహబూబాబాద్కు బయల్దేరింది. బస్సు చిన్నతండా నుంచి మౌలానా పెట్రోల్బంక్ దాటి ముత్తగూడెం వైపునకు మళ్లిన కొద్ది నిమిషాల్లోనే రోడ్డు పక్కన ఎండిపోయిన తాటిచెట్టు ను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయం లో కండక్టర్ కందుకూరి ప్రసాద్(42) బస్సు వెనుకవైపు డోరు వద్ద టికెట్లు కొడుతున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే భయంతో డోర్ నుంచి బయట కు దూకాడు. బస్సు కూడా కండక్టర్ దూకిన వైపే పల్టీ కొట్టడంతో దాని కిందపడి నలిగిపోయూడు. మృతుడు వరంగ ల్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొం డ గ్రామానికిచెందిన వాడు. బస్సులోని ప్రయాణికులు వరంగల్ జిల్లా నెల్లుకూరి మండలం నర్సింహుల గూడెంకు చెందిన గుగులోత్ భోజ్యా, మరిపెడ మండలం మంగోళివారిపాలెం నకు చెందిన బంటు ఉప్పలమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. భోజ్యాకు తొంటికాలు విరిగింది. ఉప్పలమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు గుగులోత్ గమి లి, అంబ్రాజు సైతమ్మ, బానోత్ చంద్ర మ్మ, పడిశాల పరుశురామ్, కల్లూరి పుల్ల య్య, కల్లూరి నిర్మల, బానోత్ అంబాలి, బానోత్ కాంతి, బానోత్ సరోజ, బానోత్ బాలి, కలకోట తిరుపమ్మ, బానోత్ రాజేశ్వరి, పునెం సుమిత్ర, పునెం లక్ష్మీ, పునెం బొర్రయ్య, బానోత్ చిన్న రాము లు, జక్కుల మల్లమ్మ, గంధసిరి కనకమ్మ, గంధసిరి వెంకటయ్య, పేర్ల అరు ణ, కాసాని రమేష్లకు కాళ్ళకు, చేతుల కు, తలకు గాయాలయ్యాయి. సమాచా రం అందుకున్న సీఐ ఆంజనేయులు, ఎస్ఐ గోపి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో ఖ మ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఎండిన తాటిచెట్టు కారణంగా ఘోరప్రమాదం నుంచి తప్పించుకున్న ట్లు కొంతమంది ప్రయూణికులు తెలిపారు. బస్సు మొదట తాటి చెట్టును ఢీకొనడంతో వేగం తగ్గి నెమ్మదిగా పొలాల్లోకి వెళ్లింది. పల్టీ కొట్టడంతో అందులోని ప్రయాణికు లు ఒక్కసారిగా ఒక వైపునకు ఒరిగిపోవడంతో వారికి బస్సులోని ఇనుప కడ్డీలు, బస్సు సీట్ల కడ్డీలు తగిలి గాయపడ్డారు. ఒక చేతిలో సిగరెట్.. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ ఒక చేత స్టీరింగ్ పట్టుకొని మరో చేత సిగరెట్ తాగినట్లు ప్రయాణికులు తెలిపారు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ కిటికీ లోంచి దూకి ఆటోలో పారిపోరుునట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో నిండు గర్భిణి వరంగల్ జిల్లా మరిపెడ మండలం మంగళగూడెంనకు చెందిన బానోత్ రాజేశ్వరి అనే నిండు గర్భిణి కూడా బస్సు ప్రమాదంలో గాయపడింది. వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం వచ్చి హాస్పిటల్లో చూపించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. రాజేశ్వరి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వా సుపత్రిలో జెడ్పీ చైర్పర్సన్ గడిపెల్లి కవిత పరామర్శించారు. -
బస్సును ఢీకొన్న బైకు: ఒకరికి గాయాలు
బిజినేపల్లి (మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గాంధీ చౌరస్తా సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. నాగర్కర్నూల్ నుంచి బిజినేపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక బైకుపై వస్తున్న పుల్జాల సాయిశివప్రసాద్ బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో పాటు ఎడమచేయి విరిగింది. వెంటనే అతణ్ని 108 అంబులెన్స్లో నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి, అనంతరం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు
నల్లగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లా మునగాలలో కారు - బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిర్లక్ష్యమే ముంచింది
►ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కర్ణాటక బస్సు ►నలుగురి మృతి.. 15మందికి తీవ్ర గాయాలు ►మృతుల్లో తల్లీబిడ్డ, మహిళ, ఓ బాలుడు ►డ్రైవర్ గుట్కా అలవాటు వల్లే ప్రమాదం ►బాధితులను ఆదుకుంటాం: మంత్రి మహేందర్రెడ్డి మహబూబ్నగర్ క్రైం : ఆర్టీసీ బస్సును కర్టాటకకు చెందిన ఓ బస్సు ఢీకొనడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాల వద్ద చోటుచేసుకుంది. హైదారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి ఉదయం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలో మరికల్ స్టేజీ వద్ద ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన సుంకరి బాలమ్మ(28), తన కొడుకు(నాలుగు నెలలు) అజయ్తో కలిసి బస్సు ఎక్కింది. మరికల్కు చెందిన విద్యార్థి సోహైల్(14)జిల్లా కేంద్రానికి రావడానికి బస్సులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు మక్తల్కు చెందిన మరికొందరు కూడా అందులో ఎక్కారు. ధర్మాపూర్ గ్రామశివారులోని జేపీఎన్ఎస్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కర్ణాటక బస్సును డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టాడు. బస్సులో ఉన్న బాలమ్మతో పాటు కొడుకు అజయ్, సోహైల్, హసీనాబేగం(45) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే సంఘటనస్థలంలో ప్రాణాలు విడిచారు. వీరిలో జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మినగర్ కాలనీకి చెందిన సాయబన్న కుడిచేయి పూర్తిగా విరిగి రోడ్డుపై పడింది. అతడితో పాటు మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్గౌడ్, డీఎస్పీ కృష్ణమూర్తి సంఘటనస్థలాన్ని సందర్శించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్గౌడ్ పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే.. కర్ణాటక బస్సు డ్రైవర్ గుట్కా వేసుకుని బస్సు నడుపుతున్నాడు. సంఘటన సమీపంలోకి రాగానే బస్సు అద్దాల నుంచి గుట్కా ఉమ్మేస్తుండగానే బస్సుపూర్తిగా కుడివైపు మళ్లి.. ఎదురుగా వస్తున్న హైదరాబాద్కు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ గుట్కా వల్లే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 14మంది క్షతగాత్రులుగా మారారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన డ్రైవర్లు ఎక్కువగా గుట్కా, తంబాకు, పాన్ మసాలాలు తింటూ ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. బాధితకుటుంబాలకు పరిహారం విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్గౌడ్, అ డిషనల్ ఎస్పీ మల్లారెడ్డి జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వీరితోపాటు క్షతగాత్రులకు రూ.ఐదువేలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. 15ఏళ్లకే నూరేళ్లు ధన్వాడ: చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కు టుంబంలో విషాదం నిండింది. మండలంలోని మరికల్కు చెందిన బాబా, గౌషియాకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరి ది పేద కుంటుంబం కావడంతో తండ్రి బాబా సైకిల్ ట్యాక్సీని నిర్వహిస్తూ కుం టుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. సోహైల్(15)ఆర్టీసీ బస్సులో మహబూబ్నగర్కు వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఒక్కగానొక కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు సోహైల్ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మక్తల్: అమ్మ అనే పిలుపునకు దూరమయ్యారు ఆ చిన్నారులు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ చిన్నారుల రోదన గుండెల్ని పిండేసింది. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బాలమ్మ(35) జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స కోసం ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ధర్మాపూర్ సమీపంలో క ర్టాటక బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలమ్మతోపాటు తన నాలుగు నెలల కొడుకు అజయ్ చనిపోయారు. విషయం తెలుసుకున్న బాలమ్మ అత్త అనంతమ్మ, భర్త రాజు సంఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు. తల్లితో పాటు తమ్ముడి మృతితో లావణ్య, కావేరి, హారిక రోదనలు చూపరులను కంటతడిపెట్టించాయి. ‘అమ్మా.. అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా..’ అని విలపిస్తుండగా అక్కడున్నవారు కంటతడిపెట్టారు. -
అప్పుడే నూరేళ్లు నిండాయా... నాన్నా
అనంతపురం మెడికల్ : లేయ్ నాన్న లేయ్ కాలేజ్కి పోదువు..లేయప్పా...ఎంత పనై పోయిందయ్యా అంటూ అశోక్కుమార్ తండ్రి రామాంజనప్ప బోరున విలపించాడు. చెట్టంత కొడుకు కళ్ల ముందే చచ్చిపోయాడ్ సార్...ఇంతకన్నా ఘోరం ఏముంటుందా.. వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి చదివించుకుంటున్నాం. అంతలోనే నూరేళ్లు నిండిపోయాయయ్యా...అంటూ కన్నీరుమున్నీరుగా రోధించడం అందరినీ కలచి వేసింది. మడకశిర-పెనుకొండ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన వారిలో ఇద్దరు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. క్షతగాత్రులలో ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తీసుకువచ్చారు. వీరిలో ఆనందపురానికి చెందిన రామాంజప్ప కుమారుడు అశోక్ కుమార్(17), మావుటూరుకు చెందిన సిద్దప్ప కుమారుడు గంగాధర్(18) మృతి చెందారు. బండ్లపల్లికి చెందిన కదిరప్ప కుమారుడు అశోక్కుమార్(18)ను మెరుగైన చికిత్స కోసం నేత్ర ఐ కేర్ నిర్వాహకులు గాంధీ తన అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మావుటూరుకు చెందిన సుబ్బయ్య కుమారుడు శివశంకర్(17), రొద్దంకు చెందిన పతిమన్న కుమారుడు జీ కొండయ్య(32), మేకలపల్లికి చెందిన రామాంజి కూతురు రాధ(16), రొద్దం మండలం గొబ్బరపల్లికి చెందిన అంజినప్ప కుమారుడు వెంకటేశులు(17) స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా క్షతగాత్రులు, వారి బంధువులతో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోయింది. మరోవైపు రోగుల ఆర్తనాదాలతో వార్డు మార్మోగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి, క్యాజువాలిటీ ఇన్చార్జ్ డాక్టర్ శివకుమార్ రోగులకు దగ్గరుండి సేవలందించారు. 20 మంది హౌస్సర్జన్లు, 20 మంది స్టాఫ్నర్సులు, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినిలు శ్రమించారు. ఆక్సిజన్ను అందిస్తూ ఎప్పటికప్పుడు పల్స్ను గమనించి సేవలందించారు. తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషా, ఆర్ఐ రవిశంకర్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
అనంత శోకం
* ఏపీలోని పెనుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం * లోతైన గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు * మృతుల్లో 12 మంది విద్యార్థులు.. 65 మందికి తీవ్ర గాయాలు * రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి * హుటాహుటిన హైదరాబాద్ నుంచి దుర్ఘటన స్థలానికి వైఎస్ జగన్ * క్షతగాత్రులకు పరామర్శ, మృతుల కుటుంబాలకు ఓదార్పు పెనుకొండ నుంచి సాక్షి ప్రతినిధి: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ‘షీప్-ఫామ్’. బుధవారం ఉదయం 8.24 గంటలు. మడకశిర నుంచి బయలుదేరిన ‘పల్లె వెలుగు బస్సు’ పెనుకొండకు వెళుతోంది. స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన వివిధ గ్రామాల విద్యార్థులతో పాటు 87 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. మరో 5 నిమిషాల్లో పెనుకొండకు చేరుతుందనగా.. ముందు వెళుతున్న ఆటోను దాటివెళ్లే క్రమంలో బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది. 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. బస్సు ఇరుకు ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న సుమా రు 150 అడుగుల లోతైన గుంతలో పడిపోవడంతో కుప్పలా అయిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మా ర్మోగింది. 11మంది అక్కడికక్కడే మరణిం చగా, నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందు తూ మృతి చెందారు. డ్రైవర్, కండక్టర్ సహా 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెనుకొండ, హిందూపురం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. మరణించిన 15 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నారు. నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.. ఏపీ 28 జెడ్ 1053 పల్లె వెలుగు బస్సు మడకశిర నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరింది. 7.50కి పెనుకొండ మండలం మావటూరుకు చేరింది. బండపల్లి, నాగలూరు, మావటూరు విద్యార్థులంతా బస్సు ఎక్కారు. కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో అనేకమంది నిలుచునే ప్రయాణిస్తున్నారు. మావటూరు నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన బస్సు ఘాట్ రోడ్డులోని షీప్ ఫామ్ (గొర్రెల పెంపక కేంద్రం) సమీపంలోకి చేరింది. అక్కడి నుండి మరో 4 కిలోమీటర్లు వెళితే పెనుకొండ వచ్చేస్తుంది. ఐదారు నిమిషాలు గడి స్తే గమ్యం చేరుతుందనగా ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఇరుకైన మట్టిరోడ్డు. పట్టుమని పది అడుగుల వెడల్పు కూడా లేదు. దీని పక్కనే కొత్త రోడ్డు కోసం లోతైన గుంత తవ్వారు. కానీ రోడ్డు పక్కన రక్షణ కోసం కనీసం రాళ్లు కూడా పెట్టలేదు. కాంట్రాక్టర్ హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. డ్రైవర్ గంగప్ప (లేపాక్షి మండలంలోని కల్లూరు స్వస్థలం) ఆటోను ఓవర్టేక్ చేయబోగా బస్సు అదుపు తప్పడంతో రోడ్డు కోసం తవ్విన లోయలాంటి గుంతలో పడిపోయింది. చేతులు, కాళ్లు, నడుం విరిగి పోరుు కొందరు, తల పగిలి మరికొందరు ఆర్తనాదాలు చేశారు. ఇంకొందరి శరీరంలో బస్సులోని ఇనుపరాడ్లు, రేకులు దిగబడిపోయాయి. 87 మంది ప్రయాణికుల్లో నలుగురు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు బస్సు పడిపోతున్న సమయంలో రోడ్డుపైకి దూకేశారు. ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి ఘటన జరిగిన వెంటనే 108 వాహనాలు, జీపులు, ఆటోల్లో క్షతగాత్రులందర్నీ 40 పడకల పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోని వరండాలో కుప్పగా పడేశారు. సుమారు 50 మందిని హిందూపురం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న బస్సు డ్రైవర్ గంగప్ప సహా 16 మందిని బెంగళూరు ఆస్పత్రి (నిమ్హాన్స్)కి తరలించారు. ఆస్పత్రిలో శ్రీనివాసులు, గంగాధర్ అనే ఇద్దరు చనిపోయారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు ఆస్పత్రి ప్రత్యేక హెల్ప్లైన్ (080-26995008, 26995021)ను ఏర్పాటు చేసింది. బస్సు దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిమ్హాన్సలో బాధితులను కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం 40 మంది హిందూపురంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేయగా వారిలో అశోక్కుమార్, గంగాధర్ అనే ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. సీరియస్గా ఉన్న జి.అశోక్కుమార్ అనే విద్యార్థిని కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రస్తుతం అనంతపురంలో నలుగురు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..: మంత్రి శిద్ధా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. శిద్ధా తో పాటు జిల్లాకు చెం దిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం! పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. షీప్ ఫామ్ వద్ద ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం ఘాట్ను తవ్వి కొత్త రోడ్డు నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను మంత్రి పరిటాల సునీత సమీప బంధువైన ఎల్.నారాయణ చౌదరికి చెందిన శ్రీ కృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రోడ్డు వేయడం కోసం ఘాట్లో ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆనుకుని దాదాపు 150 అడుగుల లోతు గుంతలా తవ్వారు. ఇలాంటి చోట ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఉంచక పోవడం క్షమార్హం కాని నిర్లక్ష్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బస్సు కండీషన్ డొల్ల ప్రమాదానికి కారణమైన పల్లె వెలుగు బస్సు మడకశిర డిపోకు చెందినది. ఏమాత్రం కండీషన్ బాగోలేదు. 8.75 లక్షల కిలోమీటర్లు తిరిగింది. స్క్రాప్కు దాదాపుగా దగ్గరలో ఉంది. పైగా స్థాయికి మించి ప్రయాణికులు ఎక్కారు. ఈ మార్గంలో ఆటోల రద్దీ ఎక్కువ. ఉదయం వేళ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులంతా పాసులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. చాలామంది డ్రైవర్లు విద్యార్థులు కన్పిస్తే బస్సు ఆపరనే ఆరోపణలున్నాయి. మరో బస్సు వచ్చేలోపు సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో ఆగిన బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నా విద్యార్థులు అందులోనే ఎక్కుతుంటారు. నిత్యం బస్సు టాప్పైనా విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. కాగా డ్రైవర్ వేగంగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెప్పారు. మృతుల వివరాలు మురళి (11), నరేంద్ర (15), అనిల్ (16), లక్ష్మీనారాయణ (16), నరసింహమూర్తి (16), అశోక్కుమార్ (17), అనిత (17), దాసరి గంగాధర్ (17) (తండ్రి రామన్న, మావటూరు), శేఖర్ (17), హనుమంతరాయుడు (20), అశోక్కుమార్ (17), గంగాధర్ (17) (తండ్రి సజ్జప్ప, మావటూరు). వీరంతా విద్యార్థులు కాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ (47), డీఎస్సీ అభ్యర్థి శ్రీనివాసులు (35), గంగాధర్ (16) (తండ్రి ప్రభాకర్, బండపల్లి) రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్కు పంపిన సందేశంలో రాష్ట్రపతి సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సందేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ పెనుకొండ: అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ రహదారిలో రోడ్డు నిర్మాణ పనుల వద్ద ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. అరుునా కాంట్రాక్టర్, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రోడ్డు పనుల వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదని దాదాపు నెలన్నర కిందట (2014 నవంబర్ 26న అనంతపురం టాబ్లారుుడ్ పెనుకొండ జోన్లో) ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని బుధవారం ఘటనా స్థలిలో పలువురు పేర్కొన్నారు. ‘సాక్షి’ కథనాన్ని గుర్తు చేసుకున్నారు. కన్ను మూసి తెరిచేలోగా..: ప్రత్యక్ష సాక్షులు హిందూపురం అర్బన్: రెప్పపాటు కాలంలోనే బస్సు ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఈ మార్గంలో ఇటీవల రెండు సర్వీసులు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు, పెనుకొండకు వెళ్లే ప్రయాణికులు, కూలీలు ఈ బస్సులోనే ఎక్కారు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. కుదుపులు రాగానే దూకేశా సత్తారుపల్లి నుంచి బస్సు బయలుదేరిన కొంతసేపటికే ఆటోను ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి కుడివైపునకు ఒరిగిపోతుండడంతో ఎడమవైపు డోరు వద్దనే ఉన్న నేను ఒక్కసారిగా బయటికి దూకేశా. చూస్తుండగానే బస్సు పల్టీలుకొడుతూ గోతిలో పడిపోయింది. - నందీశ్వర్రెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి ఓవర్ టేక్ చేయబోతూ.. బస్సు వేగంగా వెళుతోంది. ఎక్కువ మందితో కిక్కిరిసివుంది. ముందుపోతున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయే ప్రమాదానికి గురైంది. ఓవర్ టేక్ చేయకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రమాదంలో నా చేయి విరిగింది. చిన్న గాయాలయ్యాయి. - రామిరెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి వేగం వల్లే పడిపోయింది బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ వెనుకనే నిలబడివున్నా. బస్సు వేగంగా పోతోంది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు గోతులపై నుంచి వెళ్లడంతో అదుర్లతో ఊగిపోయింది. అందరం కేకలు వేశాం. ఆటో పక్కనుంచి బస్సును రోడ్డుపైకి తీసుకొస్తాడని అనుకునేలోపే గోతిలోకి పడిపోయింది. తర్వాతేం జరిగిందో తెలీదు. - లలిత, సుద్దపట్లపల్లి -
ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు..కుడివైపుకు!
-
ప్రమాద మృతుల వివరాలు
-
ఘటనాస్ధలికి చేరుకున్న పరిటాల సునీత
-
ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: 15 మందికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నవగామ్ వద్ద ఆర్టీసీ బస్సు , లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది పాఠశాల విద్యార్థులతో సహా 80 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతోపాటు డ్రైవర్ అతి వేగం ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
బస్సు బోల్తా,6మందికి గాయాలు
-
చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం చెరువులోని దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. దాంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు తీసువచ్చారు. గాయపడిన ప్రయాణీకులను హిందూపురంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపు తప్పడం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. స్థానికుల సహాయంతో చెరువులోకి దూసుకెళ్లిన బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు