నాగిరెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం
Published Sun, Mar 12 2017 1:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత భూమా నాగిరెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భూమా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ బాధాకర పరిస్థితి నుంచి వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకున్నారు. ఈ సమయంలో భూమా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. భూమా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
Advertisement
Advertisement