
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్కు ‘క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఆదివారం ఉదయం 10గంటలకు అమీర్పేట్లోని సితార ఆడిటోరియంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీ వీసీ శోభన్బాబు ప్రకటన విడుదల చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సహా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని డాక్టరేట్ను ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment