ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు కరంచంద్ ఆద్వర్యంలో చెంచికపల్లి, ఎరంపల్లి, పరుగుపల్లి, లోడుపల్లె, కొండపల్లి, మర్తిడి గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 6,800 లీటర్ల బెల్లం ఊట, 1,800 లీటర్ల గుడుంబా నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా.. స్వాధీనం చేసుకున్న బెల్లం ఊట, గుడుంబా నిల్వలను ధ్వంసం చేశారు.