అప్పుల బాధతో నిప్పంటించుకున్నాడు | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో నిప్పంటించుకున్నాడు

Published Sat, Oct 3 2015 11:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

అప్పుల బాధతో రైతు వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

అప్పుల బాధతో రైతు వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా థరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మెట్ల కుంట అంజనప్ప(45) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్టుడికి తెచ్చిన అప్పులు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారిలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement