హైదరాబాద్ : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్ రాంబాగ్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల విలువైన వస్తు సామగ్రి కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.