attapur
-
ఆడపిల్ల పుడుతుందని భార్యను పుట్టింటికి పంపిన భర్త
అత్తాపూర్: ఆడపిల్ల పుడుతుందని గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన అక్బర్ఖాన్కు ఐదేళ్ల క్రితం హుమేరా బేగంతో వివాహం జరిగింది. మొదటి సంవత్సరం ఒక ఆడపిల్లకు జన్మనిచి్చనప్పుడే ఆడపిల్లను కన్నావంటూ ఆమెపై దాడి చేశారు. ఆ సమయంలో బాధితురాలు రెయిన్బజార్ పోలీస్స్టేషన్లో అక్బర్ఖాన్తో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చడంతో ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో హుమేరా బేగంను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీనిపై బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
అత్తాపూర్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
పిస్తా హౌస్లో రౌడీ షీటర్ల వీరంగం.. కస్టమర్లపై దాడి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని ఓ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. హోటల్లో సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో భయంతో బయటకు యువకులు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్స్ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడికి దిగారు. సీసీ టీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. హోటల్లోకి మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చారు. మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. ఒక్కసారిగా కస్టమర్స్ భయబ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గాలిపటం ఎగురవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి
-
HYD: సంక్రాంతి పండుగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ అత్తాపూర్లో విషాదం చోటుచేసుకుంది. కైట్ ఎగరవేస్తూ విద్యుత్ తీగలకు బాలుడు తాకాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్.. పతంగి ఎగరేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందాడు. బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లోని ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మెకానిక్ రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. లిఫ్టులో ఇరుక్కున్న పోలీస్ అధికారిని రక్షించేందుకు వచ్చి మెకానిక్ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరికి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అత్తాపూర్లోని ఎస్వీఎం గ్రాండ్ బాంకెట్ హాల్లో సోమవారం రాత్రి విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం స్నేహితులను బంధువులను ఆహ్వానించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి సత్యనారాయణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విందుకు హాజరయ్యేందుకు వచ్చారు. మొదట కుటుంబ సభ్యులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లిన అనంతరం కిందికి వచ్చింది. పోలీసు అధికారితో పాటు మరో నలుగురు లిఫ్టులో ఎక్కారు. మొదటి అంతస్తుకు వెళ్ళగానే ఆ లెఫ్ట్ కాస్త చెడిపోయింది. దీంతో నిర్వాహకులు ఒరిస్సాకు చెందిన నిరంకర్ అనే లిఫ్ట్ మెకానిక్ను హోటల్ వద్దకు రప్పించి మరమ్మతులు ప్రారంభించారు. పోలీసు అధికారిని బయటకు తీశాడు. అనంతరం మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరికిపోయాడు. దీంతో రెండు కాళ్లు కాస్త అందులో నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్పటికే చేరుకున్న ఇతర ఎలక్ట్రీషియన్లు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: హైదరాబాద్: మియాపూర్లో ప్రేమోన్మాది ఘాతుకం -
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ఇలానే ప్రమాదానికి గురవ్వాల్సిందే!
-
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్గంజ్లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్మన్తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
హైదరాబాద్లో ఎంజీ మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ హైదరాబాద్లో సరికొత్త సర్వీస్ సెంటర్ ప్రారంభించింది. ఈ సర్వీస్ సెంటర్ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. నగరంలో కస్టమర్ల మొబిలిటీ అవసరాలను తీర్చడానికే ఈ సర్వీస్ సెంటర్ను ప్రారంభించినట్లు ఎంజీ మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. ఇక ఎంజీ మోటార్స్ దేశ వ్యాప్తంగా 310 టచ్ పాయింట్ కేంద్రాలు ఉండగా..తెలంగాణలో 13టచ్పాయింట్లను నిర్వహిస్తుంది. 2022 చివరి నాటికి రాష్ట్రంలో 18 టచ్పాయింట్లకు విస్తరించాలని యోచిస్తుంది. ఈ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఉదిత్ మల్హోత్రా మాట్లాడుతూ అత్తాపూర్ లో ఎంజీ మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభంతో తన ఉనికిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలకు అనుగుణంగా ఉందన్నారు. తద్వారా ఈ సదుపాయం సర్వీసు, విడి భాగాలతో పాటు ఇతర అవసరాలను అందిస్తుందని స్పష్టం చేశారు. -
రోడ్డు దాటుతున్న మహిళలపైకి దూసుకెళ్లిన బైకిస్ట్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పిల్లర్ నంబర్ 143 వద్ద రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టడంతో వారికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా అత్తాపూర్ వద్ద ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. (చదవండి: విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్) ప్రమాదానికి కారణమైన బైక్ ఓనర్ రాజు తన ఫ్రెండ్ అయిన శివ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు బైక్ తన లైసెన్స్ ఆర్సీ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’ -
సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్
సాధారణంగా గోల్డ్ ఫాయిల్ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్ను డిజైన్ చేస్తారు. అయితే హైదరాబాద్ అత్తాపూర్లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్ ఫాయిల్ను ఉపయోగించి, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్ బోర్డులను సిల్వర్ ఫాయిల్తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్లు, వాల్ క్లాక్లు, వాల్ ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్.. ప్రతీ డిజైన్ వెండివెన్నెలలా చూపరులను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇద్దరూ దూరపు బంధువులు. వరసకు అక్కాచెలెళ్లు. ఇద్దరూ గృహిణులుగా తమ తమ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకుంటూ, పిల్లల పనులు చూసుకుంటున్నారు. ‘ఎన్ని పనులున్నా మనలోని అభిరుచికి మెరుగులు దిద్దుకోవాల్సింది మనమే. అందుకే, కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం’ అని వివరించారు ఈ కజిన్స్. రోజూ ఎనిమిది గంటలు నిఖిత, అల్కా ఇద్దరూ బి.కామ్ డిగ్రీ పూర్తి చేశారు. ‘ఆసక్తి కొద్దీ ఆభరణాల తయారీ కోర్సు చేశాను’ అని చెప్పిన నిఖిత పదేళ్ల పాటు అందమైన ఆభరణాలను రూపుకట్టారు. ‘దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో నా ఆభరణాలను ప్రదర్శించాను. కరోనా సమయంలో మాత్రం కొత్తగా ఆలోచించాలనుకున్నాను. ఇంటి నుంచే కొత్త వర్క్ తో నా ప్రెజెంటేషన్ ఉండాలనుకున్నాను. అప్పుడే సిల్వర్ ఫాయిల్ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని అల్కాతో చర్చించినప్పుడు మంచి ఆలోచన అంది. తంజావూర్ పెయింటింగ్స్లో గోల్డ్ ఫాయిల్ను ఉపయోగిస్తారు. అది ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మేం సిల్వర్ ఫాయిల్ గురించి ఆలోచించాం. దీంతో ఇద్దరం సిల్వర్ ఫాయిల్తో రకరకాల ఫ్రేమ్స్ తయారు చేశాం. వీటిని మిగతా వేటి వేటికి జత చేయచ్చో ఒక ప్లాన్ వేసుకున్నాం. కలపకు సిల్వర్ ఫాయిల్ను జత చేస్తూ చాలా ప్రయోగాలే చేశాం. జ్యువెలరీ బాక్సులు, వాచీలు, గేమ్ బోర్డులు.. ప్రతీది ప్రత్యేకం అనిపించేలా డిజైన్ చేశాం’ అని వివరించింది నిఖిత. ‘ఈ వర్క్ లో ఇద్దరం గంటల గంటల సమయం కేటాయించాం. అందుకు మా కుటుంబాలు కూడా సపోర్ట్గా ఉన్నాయి. ఫ్రేమ్స్కు నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. కానీ, గేమ్ బోర్డులకు పది నుంచి ఇరవై రోజులైనా సమయం పడుతుంది. దాదాపు రోజూ ఎనిమిది నుంచి పది గంటలైనా వీటి తయారీకి కేటాయిస్తాం’ అని తమ వర్క్ గురించి వివరించింది అల్కా. ప్రత్యేకమైన కానుకలు ‘మేం చేసే డిజైన్స్లో మరోదాన్ని పోలిన డిజైన్ ఉండదు. దేనికది ప్రత్యేకం. పెళ్లి్ల, పుట్టినరోజు, గృహప్రవేశాలు వంటి వేడుకలకు ఏదైనా కానుక తీసుకెళ్లాలనుకుంటారు. అదే సమయంలో కానుక తీసుకున్నవాళ్లు ఇంట్లో తీపి జ్ఞాపకంగా అలంకరించుకోవాలనుకుంటారు. ఎన్నేళ్లయినా ప్రత్యేకంగా ఉండే సిల్వర్ ఫాయిల్తో డిజైన్స్ తీసుకు రావాలనుకున్నాం. మేం ‘నకాషి’ పేరుతో మా బ్రాండ్ను పరిచయం చేస్తున్నాం. ఈ డిజైన్స్లో స్వరోస్కి, జెమ్స్ కూడా ఉపయోగిస్తాం. డిజైన్, సైజును బట్టి ధరలు ఉంటాయి. పెట్టుబడి ఇద్దరిది, రాబడి ఇద్దరిదీ’ అంటూ కలిసి పనిచేస్తే కలిగే లాభం గురించి, పంచుకున్న పని రోజుల గురించి ఆనందంగా తెలిపారు ఈ సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్. – నిర్మలారెడ్డి -
మాయమైపోతున్న మనిషి!
సాక్షి, హైదరాబాద్: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా వంద మందికిపైగా ప్రత్యక్ష్యంగా చూశారు. అయినా ఈ పాశవిక ఘటనను ఒక్కరంటే ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సమాజంలో మానవ విలువలు మృగ్యం అవుతున్నాయనేందుకు నిదర్శనం. పాత కక్షల కారణంగా జరిగిన జంటహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు, నడిరోడ్డు మీద కాపుకాసి, దాడి చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన తీరు చాలా ఆందోళనకరం. మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల నిండా జనం ఉన్నారు. ఆ బస్సులు హత్య జరుగుతున్నంత సేపు హత్యోదంతాన్ని చూసి, నిందితులు పరారయ్యాక అక్కడి నుంచి కదిలారు. అంతేకాకుండా కల్వచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ దారి వెంబడి వెళ్తున్న వారు, బైక్పై వెళ్తున్నవారు దాదాపు 100 మందికిపైగా అక్కడే ఆగిపోయారు. దారుణం జరుగుతున్నంత సేపు తమ జేబుల్లో ఉన్న సెల్ఫోన్లకు పనిచెప్పారే తప్ప.. ఎవరూ కూడా వారిని ఆపేందుకు సాహసించలేదు. నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్ధరించుకున్నాక.. కొన ఊపిరితో ఉన్న వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తూ వీడియోలు తీశారు. పట్టపగలు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు వంద మంది. వీరిలో చాలామంది వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్మీడియాలో పోస్టులు, స్టేటస్లు పెడుతూ సమాజాన్ని, పోలీసులను, రాజకీయ నేతలను నిందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్నప్పుడు హత్యోదంతాన్ని వేడుకలా చూసి, తీరా అక్కడి నుంచి వెళ్లిపోయాక బాధ్యత, సమాజం, అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు అంతమంది ఉన్నా.. వారిలో ఎంతమంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిందే. హేయమైన చర్యలు.. రాజకీయ నేతలే ఇలాంటి హత్యలకు దిగడం అత్యంత హేయమైన చర్చగా చెప్పొచ్చు. అందులోనూ హైకోర్టు లాయర్లయిన గట్టు వామనరావు, పీవీ నాగమణిలను వేటాడి వేట కొడవళ్లతో నరకడం చాలా దారుణం. రాష్ట్రంలో ఇలాంటి ఘటన మొదటిది కాదు. గతంలోనూ పలు ఉదంతాలు జరిగాయి. అయితే, అందులో బాధితులు, నిందితులు సామాన్యులు. కానీ ఈ ఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వ్యక్తుల హస్తం ఉండటం అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్టపగలు జరిగిన దారుణ హత్యలన్నీ కూడా హైదరాబాద్లోనే చోటు చేసుకున్నాయి. ఈ వికృత సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. రాళ్లతో నుజ్జునుజ్జుగా.. (రాజేంద్ర నగర్ హత్య జనవరి11, 2021) రాజేంద్రనగర్లో జనవరి 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఖలీల్ను అత్తాపూర్లో నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తుండగా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేస్తూ, తరుముతూ గాయపరిచారు. కిందపడిన వెంటనే వ్యక్తి చనిపోయాడు. రాళ్లతో శవాన్ని కొడుతూ, నుజ్జునుజ్జుగా చేస్తూ తమ పాశవికతను ప్రదర్శించారు. ఈ హత్యను పలువురు వాహనదారులు వీడియోలు తీసి వైరల్ చేశారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ ముందే.. (జూన్ 26, 2019) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజగుట్ట ఠాణా ముందు జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ అన్వర్ అనే ఆటోడ్రైవర్పై మరో ఆటోడ్రైవర్ రియాసత్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ ప్రాణ భయంతో పంజగుట్ట స్టేషన్లోకి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ కన్నుమూశాడు. ఈ హత్యోదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దగ్గరికి వెళ్లేందుకు జంకిన పోలీసులు.. (నయాపూల్ మర్డర్.. 2018, నవంబర్ 28) ఆటోడ్రైవర్ గొంతుకోసి, పోలీసుల ముందే 2018 నవంబర్లో నయాపూల్ వంతెన పక్కన జరిగిన మరో హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షకీర్ ఖురేïÙ, అబ్దుల్ ఖాజా ఇద్దరూ ఆటోడ్రైవర్లు. ఆటో అద్దెల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో షకీర్ ఖురేïÙని అబ్దుల్ ఖాజా కత్తితో పొడిచి చంపాడు. షకీర్ను చంపాక, ఖాజా అక్కడే కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. ఈ హత్య అనంతరం నిందితుడిని పోలీసులు కనీసం ప్రతిఘటించలేకపోవడం, కనీసం అతడిని సమీపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసుల ముందే హత్య.. అత్తాపూర్ మర్డర్ (సెప్టెంబర్ 26, 2018) 2018 సెపె్టంబర్ 26న అత్తాపూర్ పిల్లర్ నంబర్ 138 వద్ద రమేశ్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మహేశ్ అనే యువకుడి హత్య కేసులో రమేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. మహేశ్ తండ్రి రమేశ్ను అత్తాపూర్ వద్దకు రాగానే మరో వ్యక్తి సాయంతో గొడ్డళ్లతో నరికి చంపాడు. ఈ హత్య జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు, పెట్రో కార్ సిబ్బంది కనీసం స్పందించలేదు. మనకెందుకులే అన్న ధోరణి సమాజంలో తోటి మనిషి పట్ల జాలి చూపే గుణం రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా గతంలో రోడ్డుపై ఎవరైనా దాడి చేస్తుంటే.. దారిన వెళ్లేవాళ్లు నచ్చజెప్పేవారు, వారిని నిలువరించేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న దాడిని ఆపాల్సింది పోయి జేబులోని సెల్ఫోన్ తీసి వీడియోలు తీసే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కనీస బాధ్యతగా రక్షించాల్సిన తోటిపౌరులే ప్రేక్షకులుగా మారడం శోచనీయం. ‘ఎవరిని ఎవరు చంపితే మనకెందుకులే మనం బానే ఉన్నాం కదా’అనే సంకుచిత ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే తాము ఎలాంటి సాయం చేయకపోగా.. వ్యవస్థలను నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. –వీరేందర్, సైకాలజిస్టు చదవండి: న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
హైదరాబాద్: సునామీ వచ్చిందా ఏంటి?
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే వెంబడి మెహదీపట్నం దగ్గర వాటర్ పైప్లైన్ లీకైంది. దీంతో రోడ్డు మొత్తం జలమయమైపోయింది. పిల్లర్ నంబరు 53 దగ్గర పైప్ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్యాలన్ల కొద్దీ నీరు వృథాగా పోయింది. రేతిబౌలి- అత్తాపూర్ మార్గంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న హెచ్ఎమ్డబ్ల్యూఎస్ఎస్బీ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమతులు చేపట్టింది. కాగా పైప్లైన్ లీకేజీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘మొన్నటి దాకా వరదలు.. ఇప్పుడు ఇక్కడ సునామీ కూడా వచ్చిందా ఏంటీ.. నీళ్లు వృథాగా పోనివ్వకండి. అధికారులు కాస్త శ్రద్ధ వహించండి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్) మన అత్తాపూర్ లో.. పిల్లర్ నంబర్ 53 దగ్గర.. వాటర్ పైప్ లైన్ పగిలి ఇలా అన్నమాట.. pic.twitter.com/GDICsF3xmV — Phani Kandukuri (@buduggadu) December 19, 2020 -
రియల్టర్ దారుణ హత్య
సాక్షి, అత్తాపూర్: భూతగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోకచక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన జావిద్(40) రియల్టర్గా ఉన్నాడు. బహదూర్పురా ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు జావిద్కు గత కొంతకాలంగా ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి శివరాంపల్లి ప్రాంతానికి జావిద్ను భూమి విషయమై మాట్లాడుకుందామని రప్పించారు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆవేశంలో సదరు వ్యక్తులు శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద జావిద్ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి పరారైయ్యారు. దీంతో తీవ్రగాయాలైన జావిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండు సెల్ఫోన్లు, ఐ–10 కారు, నంబరు లేని పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. సెల్ఫోన్ల కాల్ డేటాలను సైతం పరిశీలిస్తామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైన్స్కు కన్నం.. నగదు, మద్యం మాయం!
సాక్షి, హైదరాబాద్: వైన్స్ షాపులు నిత్యం రద్దీగా ఉంటాయి. వీటిలో మద్యానికి, కాసులకు కొదువ ఉండదు. అందుకే దొంగలు వినూత్నంగా ఆలోచించారు. ఇళ్లకు కాకుండా ఈసారి ఏకంగా మద్యం దుకాణానికి కన్నం వేశారు. అర్ధరాత్రి ఎవరూలేని వేళ మద్యం దుకాణానికి పైకప్పు నుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిపోయారు. వైన్స్ షాపులోని డబ్బుతోపాటు అందినకాడికి మద్యం బాటిళ్లు ఎత్తుకుపోయారు. రాజేంద్రనగర్ అత్తాపూర్లోని మంజు వైన్స్షాపులో ఈ చోరీ జరిగింది. మంజు వైన్స్కు పైనుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిన దొంగలు.. భారీగా నగదు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
గొడవ చేయొద్దన్నందుకు.. దారుణంగా హత్య
సాక్షి, హైదరాబాద్: ఫంక్షన్ వద్ద తాగి గొడవ చేయొద్దు అనడంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సులేమాన్నగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుమారుడు ఫిరోజ్ (22) శనివారం రాత్రి చింతల్మెట్లోని ఉర్దూ మాధ్యమం పాఠశాల వద్ద ఓ వివాహ విందుకు హాజరయ్యాడు. అయితే విందు సమీపంలో స్థానిక యువకులు సర్వర్, మోసీన్ మద్యం తాగి గొడవ పడుతున్నారు. అక్కడకు వెళ్లిన ఫిరోజ్ గొడవపడొద్దని వారిని వారించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న సర్వర్, మోసీన్ ఫిరోజ్పై దాడి చేయాలని పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్ను ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలవడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్వర్, మోసిన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి చింతల్మెట్లో హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. -
హైదరాబాద్ అత్తాపూర్లో ఘనంగా కుస్తీ పోటీలు
-
అత్తాపూర్ మహిళల హత్య కేసులో పురోగతి
-
పోలీసులు ఉన్నా.. హత్యను ఆపలేకపోయారు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్లో బుధవారం పట్టపగలు జరిగిన రమేష్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులే కాదు.. సామాన్యులనూ ఉలిక్కిపడేలా చేసింది. రమేష్ను ఇద్దరు వ్యక్తులు వెంటాడి మరీ నరుకుతుంటే పోలీసులు సమీపంలో ఉండి కూడా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ కష్టమొచ్చినా, ముప్పు ఎదురైనా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి ఖాకీలే చేష్టలుడిగి చూస్తుంటే తమకు ఇక రక్షణ ఎక్కడన్నది ఇప్పుడు ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ‘ఆధునికత’ అంటూ దూసుకుపోతున్న పోలీసింగ్లో ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీస్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చినా ఉపయోగమేంటి? అత్తాపూర్లో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఛేజింగ్ జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వెంటాడుతూ చంపడానికి ప్రయత్నించారు. ‘డయల్–100’కు ఫోన్ చేసినా.. ఐదు నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉది.. అయితే అలా వచ్చిన పోలీసుల స్పందన ఏంటన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రమేష్ను హత్య చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసు వాహనంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందులోంచి దిగిన ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ప్లాస్టిక్ లాఠీలతో హతుడు, హంతకుల సమీపం నుంచి తిరిగారే తప్ప అడ్డుకోవడానిగాని, హంతకులను బంధించడాని గాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫోన్ వచ్చాక ఎంత తక్కువ సమయంలో స్పందించినా ఉపయోగమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుధం ఉంటే తప్పేంటి? రమేష్ హత్య ఉదంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుళ్లు సరిగ్గా స్పందించక పోవడానికి ప్రధాన కారణం వారు నిరాయుధులై ఉండడం. ఆయుధం అవసరం లేని ట్రాఫిక్ పోలీసులు.. అవసరమైన క్రైమ్ పోలీసులు సైతం ‘ఒట్టి చేతుల తో’ ఉండాల్సి వచ్చింది. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాలు అమల్లోకి వచ్చాక ఆయుధాలు అటకెక్కాయి. ఒకప్పుడు ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రివాల్వర్స్ లేదా పిస్టల్స్, ఆ కింద స్థాయి సిబ్బంది వద్ద 303 లేదా ఎస్ఎల్ఆర్లు ఉండేవి. ఆయుధం పోలీసులకు యూనిఫాంలో భాగమే కాదు.. శరీరంలో భాగం లాంటిదని వారికి శిక్షణ నుంచే చెబుతుంటారు. అలాంటిది ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఈ ఆయుధాలను పక్కన పెట్టేశారు. చంపైనా ప్రాణాలు కాపాడుకునే అవకాశం.. సమాజంలో ప్రతి వ్యక్తికీ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉంటుంది. దాడి చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చంపైనా తనను తాను కాపాడుకునే అవకాశాన్ని చట్టం సామాన్య ప్రజలకే కల్పించింది. పోలీసులకు కూడా కళ్ల ముందు దారుణం జరుగుతుంటే దుండగులను కాల్చడమో, గాల్లోకి కాల్పులు జరిపి నిలువరించి పట్టుకోవడమో చేసే అధికారం ఉంటుంది. అత్తాపూర్ ఉదంతంలో ఆ కానిస్టేబుళ్ల వద్ద తుపాకీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితా? ‘సాఫ్ట్ టార్గెట్’గా పేరున్న హైదరాబాద్ అనునిత్యం ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉంటుంది. స్థానిక ఉగ్రవాదుల నుంచి జాతీయ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల వరకు అదను చూసి గురిపెడుతుంటాయి. నిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రాజధాని నగరంలో నిరాయుధులతో పోలీసింగ్ సురక్షితం కాదని పోలీస్ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు. బృందాలుగా రంగంలోకి దిగడం, బాంబు పేలుళ్ల వంటివి కాకుండా తుపాకులతో జనసమర్థ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఉదంతమే పోలీసులకు ఎదురైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడమో, ‘ఇంటర్సెప్షన్’ వాహనాన్ని పిలవడమో చేయాలి. (ఈ వాహనాల్లోనే ఆయుధాలతో పోలీసులు ఉంటారు. ఇలాంటివి 17 వెహికల్స్ సిటీలో మాత్రమే ఉన్నాయి) ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బ్యాంకుల వద్ద కాపలా కాసే సెక్యూరిటీ గార్డుల వద్దే తుపాకీ ఉండగా పోలీసుల వద్ద ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో కలిపి 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని మినహాయించినా మిగిలిన వాటిలో ప్రతి ఠాణాకు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా 3 చొప్పున పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనంలో డ్రైవర్ సహా నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరికి హెడ్–కానిస్టేబుల్ లేదా ఏఎస్సై నేతృత్వం వహిస్తారు. ఆ వాహనంలో ప్రాథమిక చికిత్స చేసే కిట్లు, రెయిన్కోట్లు, కోన్స్లతో పాటు ప్లాస్టిక్ లాఠీలే ఉంటున్నాయి. అతి తక్కువ వాహనాల్లో మాత్రమే ‘స్టోన్ గార్డ్’ (రాళ్లు తగలకుండా ధరించే కోట్లు) వంటివి ఉంటున్నాయి. ప్రతి ఠాణాకు 2 నుంచి 4 వరకు పెట్రోలింగ్ బైక్లు (బ్లూకోల్ట్స్) ఉన్నాయి. దీనిపై ప్రతి షిఫ్ట్లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున తమ పరిధుల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. వీరి వద్ద వాకీటాకీ, ట్యాబ్, సెల్ఫోన్ మినహా కనీసం లాఠీ కూడా ఉండదు. అవసరమైనప్పుడే లాఠీలు పట్టుకెళతారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డివిజన్కు ఒకటి చొప్పున మొత్తం 17 ‘ఇంటర్సెప్టార్’ వాహనాలు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 3 నుంచి 5 ఠాణాలు ఉండగా.. ఈ వాహనాల్లోని సిబ్బంది వద్ద మాత్రమే తుపాకులు ఉంటున్నాయి. అదుపు తప్పిన సందర్భాల్లేవ్.. చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కుతుందని భావించడం సమంజసం కాదన్నది నిపుణుల మాట. నాలుగేళ్ల కిందటి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దా ఆయుధాలు ఉండేవి. దోపిడీ, బందిపోటు ముఠాల కదలికల నేపథ్యంలో ఉమ్మడి సైబరాబాద్లో కానిస్టేబుళ్లు ఎస్ఎల్ఆర్లతో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పటి వరకు పోలీసులు అదుపు తప్పిన, విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు లేనేలేవు. గడిచిన 15 ఏళ్లలో చూసినా మక్కా మసీదులో పేలుడు జరిగిన 2007 మే 18న మాత్రమే పోలీసు తూటా పేలింది. అది కూడా అల్లరిమూకలు పెట్రోల్ బంక్కు నిప్పు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికే కాల్పులు జరిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల వెంట తుపాకులు ఉంటే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
వీడని భయం
సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్ పీవీఎన్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్–140 పరిసరాలు ఇంకా భయం గుప్పిట్లోనుంచి తేరుకోలేదు. బుధవారం మధ్యాహ్నం ఇక్కడ రమేశ్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటనతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే కిషన్గౌడ్, లక్ష్మణ్గౌడ్లు నడిరోడ్డుపై రమేశ్ను గొడ్డలితో నరికి చంపిన ఉదంతం వారిని కలచివేసింది. ఈ సంఘటనపై స్థానికులు కొందర్ని సాక్షి మాట్లాడించే ప్రయత్నం చేయగా..వారెవరూ ఇష్టపడలేదు. తాము ఏమీ చూడలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఘటనాస్థలిలో రమేశ్ను గొడ్డలితో నరుకుతున్న కిషన్గౌడ్, లక్ష్మణ్గౌడ్లను నిలువరించబోయిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించ లేదు. అయితే వీరి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారి చిరునామా దొరకబుచ్చుకొని నిందితులను నిలువరించే సాహసం చేసినందుకు సత్కారం చేయాలనుకుంటున్నామని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. నిందితులు కిషన్గౌడ్, లక్ష్మణ్గౌడ్ను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామన్నారు. గతేడాది డిసెంబర్ 24న మహేష్గౌడ్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కిషన్గౌడ్, లక్ష్మణ్ గౌడ్లు రమేశ్ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలిలో సాయుధపోలీసుల బృందం... బుధవారం హత్య జరుగుతుండగానే పెట్రోలింగ్ వెహికల్ వెళ్లినా నిందితులను నిలువరించేందుకు పోలీసుల వద్ద ఆయధాలు లేకపోవడంతో ప్రేక్షకపాత్రను పోషించారనే విమర్శలు వచ్చాయి. దీంతో భద్రత పెంపుపై పోలీసులు దృష్టిసారించారు. ఘటనాస్థలిలోనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాయుధ పోలీసుల బృంద ఇంటర్సెప్టర్ వెహికల్ను నిలిపి అక్కడే విధులు నిర్వహించడం కనిపించింది. అక్కడే జీహెచ్ఎంసీ సహకారంతో నిర్వహిస్తున్న రూ.5 భోజన కేంద్రం వద్ద అన్నం తినేవారు కరవయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ కేంద్రం గురువారం బోసిపోయిందని నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఘటనాజరిగిన సమయంలో మా కేంద్రం తెరవలేదని చెప్పారు. పోలీసుల అదుపులో మూడో వ్యక్తి..? రమేశ్ బుధవారం ఉప్పర్పల్లి కోర్టుకు వచ్చి తిరుగు పయనమవుతున్న సమాచారాన్ని నిందితులకు అందించినట్టుగా భావిస్తున్న విక్రమ్సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి ప్రతి కదలికను నిందితులు కిషన్గౌడ్, లక్ష్మణ్గౌడ్లకు చేరవేయడంతో పక్కా ప్లాన్తోనే అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 వద్ద అంతమొందించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్నుఅభినందించిన సైబరాబాద్ సీపీ అత్తాపూర్లో బుధవారం రమేష్ను కాపాడేందుకు ప్రయత్నించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో లింగమూర్తిని రివార్డుతో సత్కరించారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులతో పాటు పౌరులు కూడా ముందుకు వచ్చి దుశ్చర్యలను అడ్డుకుంటే నేరాలు అదుపులోకి వస్తాయని సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై నరికేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: గత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలు... ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ ప్రాంతం... ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్ను విచక్షణా రహితంగా కొబ్బరిబొండాల కత్తితో నరికిన మనోహరాచారి. ఈ బుధవారం ఉదయం 11.30 గంటలు... అత్తాపూర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నం.140... తన కుమారుడిని చంపిన రమేశ్ను వెంటాడి గొడ్డలి, కత్తితో నరికి చంపిన కిషన్గౌడ్, సహకరించిన లక్ష్మణ్గౌడ్. ఈ రెండు ఉదంతాలు వారం వ్యవధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్పై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు చేష్టలుడిగి చూడటమే గాక సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమేశ్ హత్య జరిగిన ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ఉన్నా ఆపలేకపోయారు. ప్లాస్టిక్ లాఠీలతో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లు, కనీసం అదీ లేని ట్రాఫిక్ కానిస్టేబుల్ మారణాయుధాలతో ఉన్న హంతకుల వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. అంతా అయిన తర్వాత క్రైమ్ కానిస్టేబుళ్లు నిందితుల్ని వాహనంలో ఎక్కించుకుని ఠాణాకు తీసుకు వెళ్లగలిగారు. వెంటే వెళుతూ చిత్రీకరించారు... రమేశ్ హత్య జరిగిన హైదర్గూడ ప్రాంతం నిత్యం రద్దీ గా ఉంటుంది. రమేశ్ను పిల్లర్ నం.134 వద్ద అడ్డగించిన నిందితులు దాడి చేయడం ప్రారంభించారు. కిషన్ గొడ్డలితో, లక్ష్మణ్ కత్తితో విచక్షణారహితంగా నరకడం, పొడవటం ప్రారంభించారు. ప్రాణభయంతో రమేశ్ పరుగు తీస్తున్నా ఎవరూ ముందుకు రాకపోగా ఇదంతా సెల్ఫోన్తో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో లు బుధవారం వైరల్గా మారాయి. ఓ షోరూమ్ మేనేజర్ హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డుపై జరుగుతున్నా అడ్డుకునే వారు లేకపోవడంతో కిషన్, లక్ష్మణ్లు విచక్షణారహితంగా రమేశ్ ను నరికి చంపేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మణ్ను ఎగిరి తన్నినా ఫలితం దక్కలేదు. మాధవి ఉదంతంలోనూ ఓ వ్యక్తి మనోహరాచారిని వెనుక నుంచి తన్నిన విషయం తెలిసిందే. ఆయుధం లేక చేష్టలుడిగిన పోలీసులు... హత్య జరుగుతున్నప్పుడు హైదర్గూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి విధుల్లో ఉన్నారు. ఆయన ఓ దశ లో హంతకుల్ని అడ్డుకోవడానికి తన చేతిలో ఉన్న హెల్మెట్ విసిరారు. విజిల్ తప్ప ఏ ఆయుధంలేని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతకుమించి ధైర్యం చేయలేకపోయారు. హత్య పూర్తయిన తర్వాత.. హంతకులు అక్కడే ఉండి అరుస్తున్న సమయంలో ఓ దొంగను పట్టుకోవడానికి పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. వారి వద్దా ప్లాస్టిక్ లాఠీలే ఉండటం... హంతకుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పట్టుకునేందుకు ధైర్యం చేయలేదు. గతంలో పెట్రోలింగ్ వాహనంలో ఒకటైనా తుపాకీ ఉండేది. ఫ్రెండ్లీ పోలీ సింగ్ పుణ్యమాని ఆయుధాలన్నీ బెల్ ఆఫ్ ఆరమ్స్గా పిలిచే ఆయుధాగారాలకే పరిమితమయ్యాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులూ వాటిని పట్టుకుని తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ హత్యనే కాదు.. ఎవరైనా తమను హత్య చేయడానికి వచ్చినా పారిపోవడం మినహా ఎదిరించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా స్పందించినా ఇబ్బందులే... ఈ ఉదంతం ఇలాఉంటే.. ఎవరైనా కింది స్థాయి పోలీసు సిబ్బంది చాకచక్యంగా స్పందించి, తమకు తోచిన సాయం చేసినా అధికారుల నుంచి మద్దతు లభించట్లేదు. కొన్ని రోజుల క్రితం ఫలక్నుమా పరిధిలో జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది చంపడానికి యత్నించాడు. అక్కడే 200 మంది ఉన్నా ఆపలేదు. పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుల్ ధైర్యంతో బండరాయి ఎత్తిన వ్యక్తిని అడ్డుకుని, బాధితుడి ప్రాణం కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ కిందపడి డిస్ప్లే పోయింది. విషయాన్ని తన అధికారికి చెప్తే... అభినందించాల్సిందిపోయి దూషించారని తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన సొంత డబ్బుతో ట్యాబ్ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందేశం కొందరు కానిస్టేబుళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో తొందరెందుకు అనే దోరణిలో కొందరు ఉన్నారు. -
పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుపై.. నరికి చంపారు
సాక్షి, హైదరాబాద్ : కన్న కొడుకును హతమార్చాడని పగబట్టిన ఓ తండ్రి బావమరిదితో కలసి రంగంలోకి దిగాడు. దాదాపు 9 నెలలుగా అదను కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. పరోక్షంగా హతుడి అన్న ఇచ్చిన సమాచారంతో బుధవారం ఉదయం అత్తాపూర్ వద్ద కాపుకాశారు. అందరూ చూస్తుండగానే పోలీసుల కళ్ల ఎదుటే దారుణంగా నడిరోడ్డుపై పరిగెత్తించి నరికి చంపారు. హతుడి ఒంటిపై కత్తి, గొడ్డలికి సంబంధించి 17 బలమైన గాయాలను పోలీసులు గుర్తించారు. పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఎర్రగడ్డలో తండ్రి కత్తివేటుకు తీవ్రంగా గాయపడిన మాధవి ఉదంతం జరిగిన వారానికే రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. నగరంలోని జుమ్మేరాత్బజార్కు చెందిన మహేశ్గౌడ్ ఓ వివాహితకు సంబంధించిన వివాదంలో గత ఏడాది డిసెంబర్ 24న నగర శివార్లలో దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో జుమ్మేరాత్ బజార్కే చెందిన జె.రమేశ్ (24) ప్రధాన నిందితుడు. హతుడు, నిందితుడు పక్కపక్క ఇళ్లవారే. ఆ కేసులో బెయిల్పై వచ్చిన తర్వాత రమేశ్ తన మకాం మార్చేశాడు. తన కదలికల్ని మహేశ్ సంబంధీకులకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మహేశ్ తండ్రి వి.కిషన్గౌడ్ (వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్) తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోయాడు. ఇతనికి బావమరిది ఎ.లక్ష్మణ్ గౌడ్ (టెంట్హౌస్ నిర్వాహకుడు) కూడా తోడయ్యాడు. ఇద్దరూ రమేశ్ను హత్య చేయడానికి అదును కోసం ఎదురు చూశారు. రమేశ్ ఆచూకీ కోసం అతడి అన్న, సోదరి ఇళ్ల వద్ద కాపుకాసినా ఫలితం దక్కలేదు. మాటల్లో పెట్టి వివరాలు ఆరా... ఇటీవల ఓ సందర్భంలో రమేశ్ అన్న ఇంటికి వెళ్లిన కిషన్ మాటల సందర్భంలో అతని వివరాలు ఆరా తీశాడు. అతడు ఎక్కడ ఉంటున్నాడో తనకు తెలియదని చెప్పిన అన్న... 26న కోర్టు వాయిదా ఉండటంతో ఉప్పర్పల్లి న్యాయస్థానానికి వస్తాడని చెప్పాడు. దీంతో బుధవారం హత్య చేసేందుకు కిషన్, లక్ష్మణ్ సిద్ధమయ్యారు. మద్యం సేవించి గొడ్డలి, కత్తి తీసుకుని ద్విచక్ర వాహనంపై వచ్చి అత్తాపూర్ ప్రాంతంలో కాపుకాశారు. ఉప్పర్పల్లి కోర్టులో విచారణకు మిగిలిన నిందితులు నరేశ్, శివతో కలసి రమేశ్ హాజరయ్యాడు. తర్వాత రెండు బైక్లపై ఎస్బీఆర్ గార్డెన్ నుంచి హైదర్గూడ చౌరస్తా మీదుగా వెళుతున్నారు. కిషన్, లక్ష్మణ్ బైక్పై అతడిని అనుసరించారు. అత్తాపూర్లోని హైదర్గూడ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నం.134 వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రమేశ్ వాహనం స్పీడు తగ్గింది. ఇదే అదునుగా భావించిన కిషన్ వాహనం దిగి రమేశ్ను పట్టుకోబోయాడు. ఇది గమనించిన రమేశ్ వాహనం దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. ‘నన్ను చంపేందుకు వస్తున్నారు.. కాపాడండి’అంటూ నడిరోడ్డుపై పరుగు ప్రారంభించాడు. అప్పటికే రమేశ్పై కత్తితో కిషన్, గొడ్డలితో లక్ష్మణ్ దాడి చేయడంతో కొంత వరకు గాయాలయ్యాయి. రమేశ్తో ఉన్న మిగిలిన ముగ్గురూ ప్రాణభయంతో అక్కడ నుంచి ఉడాయించారు. అడ్డుకోవడం మానేసి... చిత్రీకరణ... కాగా అటుగా వచ్చిన ఆటోలో ఎక్కిన రమేశ్ కాస్త ముందుకువెళ్లి అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి వద్దకు చేరుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కిషన్, లక్ష్మణ్ను నిలువరించే ప్రయత్నం చేయబోయి వారి చేతుల్లో గొడ్డలి, కత్తి కనిపించడంతో వెనక్కి తగ్గాడు. ఈలోపు రమేశ్ పిల్లర్ నం.140 వద్దకు పరిగెడుతూ వెళ్లాడు. సమీపంలోని బాంటియా షోరూమ్ మేనేజర్ సురేశ్ అప్రమత్తమై హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేసినా... ఫలితం దక్కలేదు. లక్ష్మణ్ తన చేతిలోని కత్తితో బెదిరిస్తూ వారించాడు. కాస్త ముందుకు వెళ్లిన సురేశ్ ఓ వాహనం అడ్డురావడంతో కింద పడిపోయారు. దీంతో కిషన్, లక్ష్మణ్లు రమేశ్ను చంపడానికి ముందుకు వెళ్లారు. లక్ష్మణ్ అదుపు తప్పి కిందపడగా... కిషన్ గొడ్డలితో రమేశ్ కాలు మీద బలంగా నరికాడు. తర్వాత లేచిన లక్ష్మణ్ అదే గొడ్డలితో కిందపడిన రమేశ్ మెడపై 3 వేట్లు వేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్, మరొకరు కిషన్పై హెల్మెట్ విసిరినా.. మరో వ్యక్తి ఎగిరి కిషన్ తన్నినా.. మళ్లీ తేరుకొని ఇద్దరూ కలసి మరో 7 వేట్లు వేశారు. నిందితులు రమేశ్ను గొడ్డలితో నరుకుతుండటంతో లింగమూర్తి కూడా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఇంత జరుగుతున్నా ఓవైపు వాహనాలు యథావిధిగా వెళ్లగా.. మరోవైపు చుట్టూ ఉన్న వారు సెల్ఫోన్లలో చిత్రీకరించే చేశారే తప్ప ఆపేందుకు ముందుకు రాలేదు. బేటా.. నీతానికి పంపించేసిన... అదే సమయంలో ఓ దొంగ అత్తాపూర్ వైన్స్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పెట్రోలింగ్ వాహనం అటు వచ్చింది. ఈ హత్యను చూసి ఇద్దరు కానిస్టేబుళ్లు అందులోంచి దిగారు. వాహనం రోడ్డుపై పడి ఉన్న రమేశ్ను దాటుకుంటూ ముందుకు వెళ్లిపోగా... ప్లాíస్టిక్ లాఠీలు మాత్రమే ఉన్న ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు.. నిందితులు గొడ్డలితో నరుకుతుండటంతో దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. రమేశ్ చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక కిషన్, లక్ష్మణ్లు ‘బేటా... పంపించేసిన... నీతానికి పంపించేసిన’అంటూ గట్టిగా అరిచారు. కొనఊపిరితో ఉన్న రమేశ్ వద్దకు వెళ్లిన కిషన్ సమీపంలో పడి ఉన్న గొడ్డలిని తీసి అతడికి చూపించాడు. రక్తం మరకలు అంటిన చొక్కాను విప్పిన లక్ష్మణ్... రమేశ్పై పడేశాడు. ఆపై ఇద్దరూ పోలీసుల వాహనంలో రాజేంద్రనగర్ స్టేషన్కు వెళ్లారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆ వెంటనే రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్టీమ్ కూడా శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. కాగా ఫొటోలు, వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తుండగా, నిందితులు మొత్తం నలుగురు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. నన్ను... చంపేందుకు వస్తున్నారు... కాపాడండి అంటూ... యువకుడు వచ్చాడు. వెనకే ఇద్దరు గొడ్డలి పట్టుకొని దాడి చేసేందుకు వచ్చారు. వారిని నిలువరించే ప్రయత్నం చేశా. ఒకరిని పట్టుకొని పక్కకు తప్పించగానే మరొకరు దాడి చేస్తున్నారు. యువకుడు అలా పరిగెత్తి కుప్పకూలాడు. వద్దని వారించినా.. అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే సెట్ ద్వారా సమాచారాన్ని అందించాను. – లింగమూర్తి కాపాడండి అన్న అరుపులు విని బయటికి చూశా. వెంటనే వచ్చి అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా.. ఒకరి తరువాత ఒకరు దాడి చేస్తుండటంతో నివారించలేకపోయా. నా శాయశక్తులా కృషి చేసినా ఫలితం దక్కలేదు. నాతో పాటు ఈ దారుణాన్ని ఆపేందుకు ఒకరిద్దరు వచ్చినా ముందుకు వచ్చినా హంతకుల్ని పట్టుకునేవాళ్లం.. రమేశ్ బతికేవాడు. –సురేశ్ ఇద్దరు దొంగలను తీసుకొని మరో దొంగ అత్తాపూర్ వైన్స్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పట్టుకునేందుకు పెట్రోలింగ్ వాహనంలో బయలుదేరాం. పిల్లర్ నంబర్ 143 వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు ప్రమాదం జరిగిందేమో అనుకుని సైరన్ వేసుకొని ముందుకు వచ్చాం. ఒక యువకుడు కిందపడి ఉండగా మరో వ్యక్తి గొడ్డలితో నరుకుతున్నాడు. వెంటనే కిందకు దిగి ముందుకు వచ్చాం. అప్పటికే గొడ్డలితో నరుకుతున్న వ్యక్తి దాన్ని పడేసి అరుస్తూ మరో వ్యక్తి వద్దకు వచ్చాడు. తర్వాత నిమిషం వ్యవధిలోనే ఇరువురిని పట్టుకుని బంధించాం. – శేఖర్ (క్రైమ్ కానిస్టేబుల్). నా కుమారుడిని దారుణంగా చంపేశాడు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి రమేశ్ కోసం వెతుకుతున్నం. ఇంటి పక్క నుంచి ఖాళీ చేసి ఎక్కడో ఉంటున్నడు. వాళ్ల అన్నా, చెల్లి ఇళ్లకు వెళ్లి చూసినా దొరకలేదు. 26న కోర్టుకు వస్తడని రమేశ్ వాళ్ల అన్న నర్సింహ్మ చెప్పిండు. దీంతో ఉదయమే అతడిని చంపాలని సిద్ధమైనం. రోడ్డుపై దొరికాడు.. చంపేశా. దీంతో లెక్క సమానమైంది. నా కొడుకును చంపాడు... నేను రమేశ్ను చంపా అంతే. ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. –కిషన్గౌడ్, మహేశ్ తండ్రి అల్లుడు చనిపోయినప్పటి నుంచి బావ మనిషిలో మనిషి లేడు. రమేశ్ కోసం అంతా తిరిగాం. ఇవాళ వస్తడని వాళ్ల అన్న చెప్పిండు. ఉదయమే బావ కిషన్గౌడ్ గొడ్డలి తీసుకొని వెళ్తుండటంతో నేనూ వెంట వచ్చా. బావ రమేశ్ను పట్టుకునేందుకు వెళ్లగా.. పరిగెత్తాడు. నేను కూడా పరిగెత్తి పట్టుకొని కొట్టాం. మాపై కత్తితో దాడి చేశాడు. దీంతో గొడ్డలితో నరికేశాం. – లక్ష్మణ్గౌడ్, మహేశ్ మామ ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ హత్య కేసులో నిందితుడి ఉన్న రమేశ్గౌడ్ కోర్టు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో నడిరోడ్డుపై విచక్షణారహితంగా హత్య చేసిన నిందితులపై రౌడీషీట్తో పాటు పీడీ యాక్ట్ నమోదు చేశామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. నిందితులు 3 రోజుల పాటు రెక్కి చేసి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారన్నారు. హత్య చేస్తున్న సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగయ్య కాపాడే ప్రయత్నం చేశారన్నారు. వీడియోల్లో కనిపిస్తున్న రక్షక్ వాహనం.. మఫ్టీలోని ఇద్దరు కానిస్టేబుళ్లు దిగిన తర్వాతే ఆ వాహనం ముందుకు వెళ్లిందన్నారు. వారే నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసు వాహనం పట్టించుకోకుండా పోతున్నట్లుగా చూపిస్తున్నది అవాస్తమన్నారు. హత్య చేసిన కిషన్గౌడ్, లక్ష్మణ్గౌడ్ పోలీసుల అదుపులోనే ఉన్నారన్నారు. ఇందులో కిషన్గౌడ్ మానసిక స్థితి సరిగ్గా లేదని ఆయన చికిత్సపొందుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
అమానుషం..అందరూ చూస్తుండగానే దారుణ హత్య
-
నడిరోడ్డు పై యువకుడిని నరికిన దుండగులు
-
అందరూ చూస్తుండగానే అత్తాపూర్లో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : అత్తాపూర్లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ముందే జుమెరాత్ బజార్కు చెందిన రమేష్ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. అత్యంత రద్దీగా ఉండే పిల్లర్ నంబర్ 138 వద్ద నలుగురు వ్యక్తులు కలిసి రమేష్ని హత్య చేశారు. స్థానికులు, పోలీసులు కలిసి హత్య చేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. కాగా ఈ హత్యతో ప్రమేయమున్న మరో ఇద్దరు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పాత కక్షల నేపథ్యంలో రమేష్ హత్య జరిగినట్టు తెలుస్తోంది. పది నెలల కిందట శంషాబాద్లో జరిగిన మహేష్ గౌడ్ హత్య కేసులో రమేష్ ప్రధాన నిందితుడు. ఈ కేసు విషయమై ఉప్పరపల్లి కోర్టుకు వస్తుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. కాగా, మహేష్ గౌడ్ తండ్రే రమేష్ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. -
బాలుడి వీరంగం
అత్తపూర్: ట్రాఫిక్ పోలీసులపై ఓ బాలుడు దాడిచేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్కు చెందిన పోలీసు అధికారి కేశవులు సిబ్బందితో కలిసి హైదర్గూడ పల్లవిబార్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం 10.30 సమయంలో హైదర్గూడ నుంచి అత్తాపూర్ వైపు బైక్పై వేగంగా వెళుతున్న బాలుడి (17)ని గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా బైక్ ఆపలేదు. దీంతో పోలీసులు అతడిని ఫొటో తీసేందుకు ప్రయత్నించగా బైక్ దిగిన బాలుడు ‘నన్నే ఫొటో తీస్తావా’ అంటు ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. స్తానికులు అతడిని వారించేందుకు యత్నించినా వినకుండా పోలీసులను కాలితో తంతూ దుర్బాషలాడాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని వ్యాన్లోకి ఎక్కించినా శాంతించకుండా వారిపై దాడి చేశాడు. దీనిపై సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్సై వెంకటేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పనిచేసే ఇంటికే కన్నం వేసిన పనిమనిషి
-
టీఆర్ఎస్లో వసూల్ రాజాలు
రంగారెడ్డి/అత్తాపూర్: పార్టీ పేరు చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న కొందరు వసూల్ రా జాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ సీరియస్గా వ్యవహరిస్తుంది. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డదారిన సంపాదిస్తున్న వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారిని పార్టీ నుంచి స స్పెండ్ చేయడంతోపాటు చట్టపరంగా శిక్షించడానికి వెనుకాడటం లేదు. తాజాగా జరుగుతున్న సంఘటనలే దీనికి ఉదాహరణ.... ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారికి అండగా ఉండి రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేస్తానని డబ్బులు వసూలు చేసి సస్పెండ్కు గురైన అత్తాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్రంపల్లి యాదగిరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి... గుర్రంపల్లి యాదగిరి గత కొన్ని రోజులుగా అత్తాపూర్ డివిజన్లో నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి అనుమతులు లేవని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇదేక్రమంలో వారం రోజుల క్రితం అత్తాపూర్ భరత్నగర్ కాలనీలో ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నుంచి రూ. 25వేలు తీసుకున్నాడు. ఇందు కోసం రెవెన్యూ సిబ్బంది రాకుండా చూస్తానని నమ్మబలికాడు. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాలలో రావడంతో అతడిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరుసటి రోజు రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ, వీఆర్వో గుర్రపల్లి యాదగిరిపై తమ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తన పేరును దేవాలయ శాఖ అధికారుల వద్ద వాడి బద్నాం చేశాడని అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్రెడ్డి, డివిజన్కు చెందిన మరో ఇద్దరు తాము ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆధారాలతో సహా గుర్రంపల్లి యాదగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. చేసిన నేరాలను అంగీకరించడంతో రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జున్ తెలిపారు. తాజాగా మరొకరు... గుర్రంపల్లి యాదగిరి కథనం మరువక ముందే అధికార పార్టీకి చెందిన మరో నేత వీడియోకి చిక్కినట్లు సమాచారం. దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో నిర్మాణం చేపడుతున్న ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలకు పైగా డబ్బులు తీసుకున్నాడని అతడి వెన్నంటే ఉండే అనుచరుడు మ రో రూ. 10 వేలు తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ వీడియో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కూడా చేరినట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ఆ నాయకుడిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధినాయకత్వం సిద్ధమవుతుంది. అతడే మరో రెండు చోట్ల కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలిసిందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. రేపో మాపో అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వస్తుందని నాయకులు పేర్కొంటున్నారు. -
వ్యభిచార ముఠా అరెస్ట్
అత్తాపూర్: బాలికతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి హ్యాపీహోమ్స్ ప్రాంతానికి చెందిన నిషాఖాన్(45) గృహిణి. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. నెల రోజుల క్రితం నిషాఖాన్ సులేమాన్నగర్కు చెందిన తషీన్ ఫాతిమా(32), పహాడీఫరీష్కు చెందిన సదా(21)లను కలిసి ఓ అమ్మాయి కావాలని కోరింది. అందుకు గాను డబ్బులు ఇస్తానని చెప్పింది. ఎందుకని వారు ప్రశ్నించగా వ్యభిచారం కోసమని సమాధానమిచ్చింది. వచ్చిన దాంట్లో సగం వారికిస్తానని ఆశచూపింది. ఫాతిమా, సదాలు పహాడీషరీఫ్లో కుమార్తె(16)తో సహా నివాసం ఉంటున్న ఓ గృహిణి వద్దకు వెళ్లారు. తమకు తెలిసిన వారింట్లో పనిచేసేందుకు అమ్మాయి కావాలని ప్రతినెలా రూ.15 వేలు చెల్లిస్తారని చెప్పారు. వీరి మాటలు నమ్మిన గృహిణి తన కుమార్తె(16)ను వాళ్లతో పంపింది. వాళ్లిద్దరూ బాలికను తీసుకెళ్లి నిషాఖాన్కు రూ.5వేలకు అమ్మేశారు. నిషాఖాన్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించింది. నెలరోజులుగా ఉప్పర్పల్లి, చింతల్మెట్ లాల్దాబా, బండ్లగూడ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉంచి వ్యభిచారం చేయిస్తోంది. మూడు రోజుల క్రితం ఉప్పర్పల్లి నుంచి తప్పించుకున్న బాలిక రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాఖాన్ ఇంటిపై దాడిచేసి నిషా, ఫాతిమా, సదాలతో పాటు ముగ్గురు విటులు మహ్మద్అలీ(21), మహ్మద్ మజీర్(20), మహ్మద్ షకీలుద్దీన్(24)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలికను రెస్క్యూ హోంలో చేర్చారు. నిషాఖాన్ గతంలో ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం కేసులో జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై నెల రోజుల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్న అందరినీ కాల్లిస్ట్ ఆధారంగా అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్, ఎస్సైలు వెంకట్రెడ్డి, శివప్రసాద్, మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
బ్లాంక్ చెక్లు చోరీ
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ చౌరస్తా సమీపంలోని ఎస్ఆర్ స్టీల్షాపులో చోరీ జరిగింది. బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు షాపు తాళాలు పగలగొట్టి.. కౌంటర్లో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు 50 బ్లాంక్ చెక్లను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్: అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు పంజా విసిరారు. రాజేంద్ర నగర్ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు హుక్కా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యజమాని ప్రమోద్పై కఠిన చర్యలు : మంత్రి
-
అత్తాపూర్లో సెల్టవర్కు మంటలు!
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గృహసముదాయాల్లో ఓ అపార్ట్మెంట్పై ఉన్న సెల్టవర్ జనరేటర్లో ఒక్కసారిగా మంటలు ఎగజిమ్మాయి. సెల్టవర్కు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున ఎగిశాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
భార్య, కుమారుడే హంతకులు
♦ వేధింపులు భరించలేకే.... ♦ హత్య కేసులో వీడిన మిస్టరీ అత్తాపూర్: హత్య కేసు మిస్టరీని రాజేంద్రనగర్ పోలీసులు చేధించారు. ఈ నెల 4న అత్తాపూర్ సమీపంలోని మూసినదిలో రవీందర్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య, కుమారుడే అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. బుధవారం ఇన్స్పెక్టర్ కేసు వివరాలను వెల్లడించారు.వికారాబాద్ జిల్లా కులచర్ల ప్రాంతానికి చెందిన కోట్ల రవీందర్(44), కోట్ల సత్యవతి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పంజాగుట్టలోని ద్వారాకపూరి కాలనీలో నివాసం ఉంటున్నారు. తాగుడికి బానిసైన రవీందర్ ప్రతి రోజూ భార్యను కొట్టడమేగాక, మానసికంగా వేధించేవాడు. ఈ నెల 3న అతను ఇంట్లో రూ.3వేలు తీసుకెళ్లి తాగి రావడంతో సత్యవతి అతడిని నిలదీసింది. దీంతో అతను భార్యను కొట్టడమేగాక కుమారుడితోనే వివాహేతర సంబంధం అంటగట్టడంతో ఆగ్రహించిన సత్యవతి కిందపడేసి పక్కనే ఉన్న రుబ్బురోలుతో తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని కుమారుడు సాయికుమార్కు ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి వచ్చిన అతను కూడా రవీందర్పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాయికుమార్ తన స్నేహితుడు మియాపూర్ ప్రాంతానికి చెందిన వడ్ల నరేష్చారిని పిలిపించుకుని అతని సహకారంతో నీళ్ల డ్రమ్ములో రవీందర్ మృతదేహాన్ని అందులో ఉంచారు. అనంతరం ఒక ట్రాలీ ఆటోను షాద్నగర్ వెళ్ళాలని కిరాయి మాట్లాడుకున్నారు. దారిలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న సాయి భయంతో వణుకుతుండటాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ ఆటోను పక్కకు ఆటో నిలిపి డ్రమ్ములో ఏమున్నాయని నిలదీయడంతో వారు అసలు విషయం చెప్పారు. దీంతో అతను వారిని పిల్లర్ నెంబర్ 118 వద్ద వదిలి వెళ్ళిపోయాడు. అనంతరం ముగ్గురు కలిసి మృతదేహాన్ని మూసిలో పడవేసి అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి జేబులో లభ్యమైన ఆధారాల ద్వారా కేసు మిస్టరీని చేధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసును చేధించిన ఎస్సై వెంకట్రెడ్డి, నారాయణరెడ్డిలను ఇన్స్పెక్టర్ తఅభినందించారు. -
ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహం
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ మూసీ కాలువ సమీపంలో ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదివారం ఉదయం మూసీ కాలువ వైపు వెళ్లిన స్థానికులకు డ్రమ్ములో మృతదేహం కనిపించింది. భయాందోళనలకు గురైన వారు ఎవరో హత్యచేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి తెచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అత్తాపూర్లో డబ్బు మూటల కలకలం
హైదరాబాద్: అత్తాపూర్ బ్రిడ్జి కింద పెద్ద నోట్ల మూటలు పడి ఉన్నాయని వదంతులు వ్యాపించడంతో.. స్ధానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. అటు నుంచి వెళ్తున్న వాహనదారులకు కూడా ఈ విషయం పాకడంతో.. తమ వాహనాలను వదిలి వారు కూడా డబ్బు కోసం పరుగులు తీశారు. దీంతో అత్తాపూర్ ఫ్లై ఓవర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా, గత మూడు రోజులుగా నగరంలో డబ్బు మూటలు రోడ్లపై పడేశారనే పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఉప్పు కొరత ఉందనే వదంతులతో అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చొని అధిక రేట్లకు ఉప్పు కొనుగోలు చేసిన నగర వాసులు ఇప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ నల్లడబ్బు మూటలు పడి ఉన్నాయని పరుగులు తీస్తున్నారు. -
ముషక్మహల్లో మహిళపై దారుణం!
అత్తాపూర్: మహిళపై లైంగికదాడికి పాల్పడి, ఆపై కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్లో ముషక్మహల్ అనే పురాతన భవనం ఉంది. శిథిలావస్థకు చేరిన ఈ భవనం నుంచి ఆదివారం దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పరిశీలించగా.. వివస్త్ర అయిన ఓ మహిళ శవం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. కుడి చేయి సగం నరికేసి, మెడ, దవడ భాగం అతుక్కొని ఉన్నాయి. ఎడమ కాలిపై గాయం ఉంది. మృతురాలి పక్కనే ఒక బండరాయి పడి ఉంది. దుండగులు బండరాయితో ఆమె తల, కాలిపై కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. చుట్టు పక్కల గాలించగా మృతురాలి దుస్తులు లభించాయి. ముషక్మహల్ పైకి ఎక్కే మెట్లపై మద్యం సీసాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం కుళ్లిపోయి, ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో నాలుగైదు రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందంటున్నారు. డాగ్స్కా్వడ్ను రప్పించగా... పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగింది. మృతురాలిని స్థానికులు గుర్తు పట్టలేకపోవడంతో.. ఆమె ఎవరనేది తెలుసుకొనేందుకు అన్ని పోలీసుస్టేషన్లకు ఫొటోలను పంపారు. మృతురాలు ఎవరనేది తెలిస్తే .. హత్య మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రేమికులను బెదిరించి కానిస్టేబుళ్ల డబ్బు వసూలు
అత్తాపూర్: ప్రేమికులను బెదిరించి డబ్బు వసూలు చేసి అడ్డంగా బుక్కైపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన రాజేంద్రనగర్ పోలీసులు సదరు కానిస్టుబుళ్లతో పాటు హోంగార్డును కటకటాల వెనక్కి నెట్టారు. ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం.... నగరంలోని టోలిచౌకీకి చెందిన అతిక్ తన ప్రేయసితో కలిసి మంగళవార సాయంత్రం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని జనచైతన్య వెచర్లో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా గమనించిన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్కు చెందిన కానిస్టేబుళ్లు రవి, పరిపూర్ణాచారి, హోంగార్డు ఆనంద్ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని బెదిరించి రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రేమికులు వారి వద్ద ఉన్న రూ. 29 వేలు ఇచ్చి.. మిగతావి తర్వాత ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. అతిక్ సెల్ఫోన్ నెంబర్ తీసుకున్న పోలీసులు అదే రోజు రాత్రి అతడికి ఫోన్ చేసి మిగతా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతిక్ తనకు తెలిసిన వారి ద్వారా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా కానిస్టేబుళ్లు రవి, పరిపూర్ణాచారి, హోంగార్డు ఆనంద్లపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. దీంతో ముగ్గురినీ బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఎయిర్హోస్టస్ కేసులో నిందితుడి అరెస్టు
అత్తాపూర్: ఎయిర్హోస్టస్పై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం... ఉప్పర్పల్లి హ్యాపిహోమ్స్ ప్రాంతానికి చెందిన యువతి (24) ఓ ఎయిర్లైన్ సంస్థలో ఎయిర్హోస్టస్. సోమవారం అర్దరాత్రి మందులు కొనుగోలు చేయడానికి డెయిరీ ఫామ్ సమీపంలోని పీవీ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెంబర్ 216 వద్దకు వచ్చింది. షాపులు మూసి వేయడంతో రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఉన్న ఆమె వద్దకు క్యాబ్ (క్వాలీస్ కారు) వచ్చి ఆగింది. డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. ఔటర్రింగ్రోడ్డు... కిషన్గూడ మీదుగా శంషాబాద్ హిమాయత్సాగర్కు తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి అరవడంతో సెన్ఫోన్ను లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వాడిన క్యాబ్ ( నెం. ఏపీ 09ఎక్స్ 2865)ను గుర్తించారు. నిందితుడు కిస్మత్పూర్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మీర్జా అహ్మద్బేగ్ అలియాస్ ఇమ్రాన్ను గండిపేటలో బుధవారం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. -
అత్తాపూర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ :రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఆదివారం తెల్లవారుజామున ఓ వర్క్షాపులో ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఇదే ప్రాంతంలో రెండో అగ్నిప్రమాదం సంభవించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పేకాట స్ధావరాలపై దాడి: 19 మంది అరెస్టు
అత్తాపూర్: నగరంలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇంద్రానగర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ నారాయణరెడ్డి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10, 500 స్వాధీనం చేసుకున్నారు. అదే ఇంటి నుంచి మాంసం కత్తులను కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
హైదరాబాద్లో రూ.77 లక్షలు పట్టివేత
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అత్తాపూర్ వద్ద మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ. 77 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని... పోలీసులకు అప్పగించారు. అనంతరం కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారి సంగీత ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు మమ్మురం చేశారు. అదికాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు బరిలో దిగారు. వారిని బుజ్జగించి... నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రంగంలోకి దిగారు. అందులోభాగంగా రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. -
అత్తాపూర్లో రూ.1.9 లక్షలు స్వాధీనం
అత్తాపూర్ (హైదరాబాద్) : రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ 123వ నెంబర్ పిల్లర్ దగ్గర సోమవారం సాయంత్రం ఓ వాహనంలో తరలిస్తున్న నగదును ఎన్నికల సంఘం బృందం స్వాధీనం చేసుకుంది. జీహెచ్ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నగదు పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అత్తాపూర్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఓ ఆటోలో తరలిస్తున్న సుమారు 1.90 లక్షలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
అత్తాపూర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్ రాంబాగ్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల విలువైన వస్తు సామగ్రి కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థుల ధర్నా
అత్తాపూర్ (హైదరాబాద్) : మధ్యాహ్న భోజన పథకం కింద తమకు పెట్టాల్సిన భోజనం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని రాజేంద్రనగర శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
రెచ్చిపోతున్న ప్రైవేటు ఫైనాన్షియర్స్
హైదరాబాద్ లో రోజు రోజుకూ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దురాగతాలు పెరిగి పోతున్నాయి. తాజాగా.. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో వెంకటేశ్ అనే వ్యక్తిపై ఫైనాన్షియర్ దాడికి దిగాడు. తీసుకున్న అప్పు తీర్చేసినా.. తీర్చ లేదంటూ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న మహిళలతో అసభ్యంగా మాట్లాడి.. ఇంటి బయట ఉన్న కారుతో చెక్కేశారని బాధితుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాను తీసుకున్న లోన్ కట్టే శానని.. అయినా.. ఫైనాన్స్ వారు నిత్యం వేధిస్తున్నారని వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
పని మనిషిపై ప్రొఫెసర్ వేధింపులు
అత్తాపూర్: ఇంట్లో పనిచేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులకు గురి చేశాడో ప్రొఫెసర్. ఈ సంఘటన నార్సింగ్ పరిధిలో పప్పులగూడలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ఓ ప్రొఫెసర్ తన ఇంట్లో పని చేస్తున్న యువతితో మసాజ్ సెంటర్ పెట్టిస్తానని, ఆర్థికంగా లోటు ఉండదని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలడంతో.. భారీగా మంటలు ఎగిసిపడ్డ సంఘటన బుధవారం సాయంత్రం నగరంలోని అత్తాపూర్లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సర్కిల్ సమీపంలోని ఇందిరాగాంధీ బొమ్మ పక్కన టీ దుకాణంలో సిలిండర్ ఆకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. -
సొంత తమ్ముడే హతమార్చాడు
అత్తాపూర్ (రంగారెడ్డి) : అన్న పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక అతడిని.. సొంత తమ్ముడే తన స్నేహితుడితో కలిసి హతమార్చాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరినీ రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం... అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన రానుకుమార్ పెద్ద కుమారుడు గిరీష్(25) ఈ నెల 11వ తేదీ సాయంత్రం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్ద గల ఓ హౌస్(నీటి సంపు)లో శవమై కనిపించాడు. ఈ కేసులో పోలీసులు తొలుత రాజును, ఆ తర్వాత గిరీష్ సోదరుడు మధుసూదన్ను అదుపులోకి తీసుకుని విచారించగా... వారే హత్య చేసినట్టు వెల్లడైంది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండడంతో సోదరుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు మధుసూదన్ వెల్లడించాడు. ఈ క్రమంలో 11వ తేదీన గిరీష్ను అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్దకు తీసుకెళ్లి స్నేహితుడు రాజు సాయంతో నీటి సంపులోకి తోసి తలపై బండరాళ్లను వేశాడు. దీంతో గిరీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు పరారుకాగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరించినట్లు పోలీసులు తెలిపారు. -
నగరంలో భారీ బందోబస్తు
చార్మినార్/అత్తాపూర్ : నగరంలోని పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శుక్రవారం ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తీవ్రవాదుల అంత్యక్రియల నేపథ్యంలో చిన్నచిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకొని చార్మినార్, మక్కామసీద్ ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి పాతబస్తీలో పరిస్థితులను పర్యవేక్షించారు. ఆయనతో పాటు అడిషినల్ సీపీ అంజన్కుమార్, సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఉన్నారు. అదేవిధంగా అత్తాపూర్ లో పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ పోలీసులు అత్తాపూర్లోని గురుద్వారా జండా వద్ద భారీ బలగాలు మోహరించాయి. -
దొంగతనం బయటపడకూడదని పూజలు
హైదరాబాద్ : హైదరాబాద్ అత్తాపూర్ గ్యాస్ గోదాములో చోరీకి పాల్పడిన వ్యక్తులు తమ ఘనకార్యం బయటపడకూడదని ఓ బాబాను ఆశ్రయించి పూజలు చేశారు. కానీ రాజేంద్రనగర్ పోలీసుల ముందు వారి ఎత్తులు ఫలించలేదు. పోలీసులు దొంగతనం కేసును ఛేదించి దొంగలను, దొంగ సొత్తును పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... గత నెల 25వ తేదీన అత్తాపూర్ చింతల్మెట్ గ్యాస్ గోదాములో మేనేజర్ నాగేశ్వర్రావు తన గదిలోని కప్బోర్డ్లో ఏజెన్సీకి చెందిన రూ.4 లక్షల 66 వేలను ఉంచి తాళం వేసి రాత్రి ఇంటికి వెళ్లాడు. మరునాడు ఉదయం వచ్చి చూడగా కప్బోర్డు విరగగొట్టి కనిపించగా అందులో డబ్బు కనిపించలేదు. దీంతో ఆయన రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ గోదాములో దొంగతనం ఘటనకు నాలుగు రోజుల ముందు షేక్ నిజాముద్దీన్(26) అనే వ్యక్తి గోదాములో పెయింటింగ్ పనిచేశాడు. ఆ సమయంలో డబ్బును కప్పోర్డులో పెట్టడాన్ని గమనించాడు. ఎలాగైనా ఆ డబ్బును దొంగిలించాలని పథకం వేసిన నిజాముద్దీన్ సమీపంలోని బస్తీకి చెందిన సురేష్(25), విష్ణు(22)ల సాయం తీసుకున్నాడు. అంతా కలసి గత నెల 25వ తేదీన రాత్రి గ్యాస్ గోదాములో ప్రవేశించి నగదును దొంగిలించారు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు మహబూబ్నగర్కు వెళ్లి ఓ బాబాను కలసి రూ.10వేలతో పూజలు చేయించారు. వాటిని పంచుకుని, తమ అప్పులు తీర్చుకున్నారు. పూజలేవీ ఫలితం చూపించక చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. -
అత్తాపూర్లో దొంగల బీభత్సం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి మూడు చోట్ల దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఒక గ్యాస్ గోదాముతోపాటు రెండిళ్లలో చోరికి పాల్పడి రూ.8 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. చింతల్మెట్లో ఇండేన్గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ నాగేశ్వరరావు గదిలోని లాకర్ తెరిచి రూ.4 లక్షలు ఎత్తుకుపోయారు. అలాగే, హైదర్గూడ ప్రాంతం న్యూఫ్రెండ్స్ కాలనీలోని శివసాయి రెసిడెన్సీలో వెంకటనర్సింహారెడ్డి ప్లాట్లో దొంగలు ఆరు తులాల బంగారు నగలు, రూ.50 వేలు అపహరించుకుపోయారు. అక్కడే మూడో ఫ్లోర్లో ఉండే శ్రీనివాస్ ఇంట్లో 5 తులాల బంగారం, రూ.38 వేల నగదుతోపాటు రూ.50 వేల విలువైన రెండు వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (అత్తాపూర్) -
అగ్నిప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధం
హైదరాబాద్ : నగరంలోని అత్తాపూర్, నలందానగర్ కాలనీలో శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల నలందానగర్ కాలనీలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రమాదంతో 30కి పైగా గుడిసెలు మంటల్లో చిక్కుకున్నాయి. అంతేకాకుండా గుడిసెల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. (అత్తాపూర్) -
ఇంటి సొమ్ము.. దొంగలపాలు
హైదరాబాద్(అత్తాపూర్): బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఊడ్చుకెళ్లిన సంఘటన అత్తాపూర్లోని తేజస్వీనగర్లో జరిగింది. కాలనీకి చెందిన బసవప్ప ఇంట్లో ఆదివారం రాత్రి దోంగలు పడి ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, రెండు కిలోల వెండి,టీవీ, లాప్టాప్తో పాటు రెండు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. బసవప్ప బీదర్ వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు దిగ్బంధం...
హసన్నగర్లో ‘కార్డన్ సర్చ్’ * సోదాల్లో పాల్గొన్న 400 మంది పోలీసులు * ప్రతి ఇల్లూ తనిఖీ * పాతనేరస్తుల అరెస్టు * అదుపులో అనుమానితులు అత్తాపూర్: తెల్లవారుజాము 3 గంటలు... హసన్నగర్... బూట్లచప్పుళ్లు.... ఆయుధాలతో వందల సంఖ్యలో పోలీసులు... అసలు ఏం జరుగుతుందో తెలియక బస్తీవాసుల్లో భయాందోళన ... చివరకు ‘కార్డన్ సర్చ్’లో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. డీసీపీ రమేష్నాయుడు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి హసన్నగర్లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు హసన్నగర్ చేరుకున్నారు. బస్తీ మొత్తాన్ని చుట్టుముట్టారు. ఎవ్వరినీ బస్తీలోకి, బయటకు వెళ్లకుండా రహదారులను మూసివేశారు. \ప్రతీ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వారి గురించి ఆరా తీశారు. పాతనేరస్తులు మహ్మద్ మునీర్(22), మహ్మద్ మోసిన్(19)లను పట్టుకున్నారు. రౌడీషీటర్ ఎస్కె. మస్తాన్(49), మహ్మద్ యూనిస్లతో పాటు మరో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఓఎస్డీ అడిషనల్ డీసీపి ఈ. రాంచంద్ర రెడ్డి, రాజేంద్రనగర్, శంషాబాద్, క్రైం ఏసీపీలు ముత్యంరెడ్డి, సుదర్శన్, మహేష్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఇతర సిబ్బంది ‘కార్డన్ సర్చ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ రమేష్ నాయుడు విలేకరులతో మాట్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరస్తులు ఎక్కువగా ఉండే హసన్నగర్లో సోదాలు నిర్వహించామన్నారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం చేస్తున్న కృషిలో తాము కూడా భాగస్వాములమన్నారు. శాంతిభద్రతల పరంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ధైర్యం చెప్పడానికి నేరస్తులపై కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు సోదాలు నిర్వహించి, ఇన్నాళ్లూ తమ మధ్య ఉంటున్న నేరస్తులను అరెస్టు చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. -
ఏషియన్ సినిమాస్ ని లాంచ్ చేసిన రామ్ చరణ్,సమంత
-
ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన చెర్రీ, సమంత
హైదరాబాద్ : హీరో రాంచరణ్, హీరోయిన్ సమంత గురువారం అత్తాపూర్లోని ఏషియన్ సినిమాస్ థియేటర్ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్ అధినేతలు నారాయణదాస్ నరేన్, సునీల్ నారాయణ్, భరత్ నారాయణ్, డి.సురేష్బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఐమాక్స్, ఐనాక్స్ తరహాలో ఏషియన్ సినిమాస్ కూడా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది. నగర శివారులో కూడా సౌకర్యవంతమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ఏషియన్ సినిమాస్ థియేటర్ను అత్తాపూర్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా రాంచరణ్, డి సురేష్ బాబు తదితరులు థియేటర్లో కొద్దిసేపు సినిమాను తిలకించారు. -
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అగ్నిప్రమాదం
-
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. -
బైక్ నడిపి చూస్తానని ఎత్తుకెళ్లాడు!
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ కోసమంటూ వచ్చిన ఓ దుండగుడు.. మెకానిక్పై కత్తితో దాడి చేసి బైక్తో పరారయ్యాడు. అత్తాపూర్లోని ద్వారకా హోండా షోరూమ్లో ఆసిఫ్నగర్కు చెందిన అఖ్తర్ (27) మెకానిక్. సోమవారం సాయంత్రం ఓ యువకుడు షోరూమ్కు వచ్చాడు. తాను సీబీఆర్ 250 సీసీ బైక్ కొనేందుకు వచ్చానని, చూపించమని అడిగాడు. అఖ్తర్ అతనికి బైక్ను చూపించగా... ఆ యువకుడు టెస్ట్డ్రైవ్ చేస్తానని కోరాడు. దీంతో షోరూమ్ అధికారుల అనుమతితో టెస్ట్డ్రైవ్కు దుండగుడు అఖ్తర్ను వెంటపెట్టుకొని వెళ్లాడు. పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెం. 170 వద్దకు వెళ్లగానే.. బండిని ఆపి అఖ్తర్ను కిందకు దిగాలని కోరాడు. ఎందుకని ప్రశ్నించగా దిగమని గద్దించాడు. దిగగానే తల్వార్ను బయటకు తీసి అఖ్తర్పై విచక్షణారహితంగా దాడి చేసి.. బైక్ తీసుకొని రాజేంద్రనగర్ వైపు పరారయ్యాడు. అఖ్తర్ కుడిచేతితో పాటు చాతిపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న షోరూమ్ నిర్వాహకులు బాధితుడిని హైదర్గూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూసీలో దూకిన మహిళ.. రక్షించిన పోలీసులు
మూసీనదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం ఉదయం అత్తాపూర్ సమీపంలో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ మహిళ దిగువన ఉన్న మూసీ నదిలోకి దూకింది. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెను కాపాడగలిగారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాప్రయత్నం చేసిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సమయానికి పోలీసులు స్పందించడం వల్ల ఆమె ప్రాణాలు దక్కించుకోగలిగిందని స్థానికులు అంటున్నరు. -
పెళ్లింట విషాదం...
అత్తాపూర్, న్యూస్లైన్: మరో 24 గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావుబాజాలు మోగాయి. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కూతురు అక్క చనిపోగా.. ఇంటి పెద్దతో పాటు మరో 8 మంది బంధువులు తీవ్రగాయాలకు గురయ్యారు. ఈ విషాద సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని డెయిరీఫాం ప్రాంతానికి చెందిన సాజిద్హుస్సేన్ కుమారుడు అజీజ్అహ్మద్కు రామంతాపూర్కు చెందిన సిమ్రాన్ఫిర్దోస్తో పెళ్లి కుదిరింది. మంగళవారం సాయంత్రం పెళ్లి ఉండడంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పెళ్లికూతురు అక్క నౌసిన్ఫిర్దోస్ మరో 8 మందితో కలిసి మెహందీ పెట్టేందుకు పెళ్లికుమారుడి ఇంటికి తవేరా వాహనం (ఏపీ13జె6594)లో బయలుదేరింది. మార్గం మధ్యలో అత్తాపూర్ పీవీఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్నెంబర్.136 వద్దకు రాగానే వీరి వాహనం డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరికీ తీవ్రగాయాలు కాగా నౌసిన్ఫిర్దోస్ అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను రాజేంద్రనగర్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్దోస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో అదిన్, జీబా, నజీమా, ఆజ్మా, అఫ్రీన్, షాహిన్, రిజ్వాన్, అరగ్ ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.