
సాక్షి, భద్రాద్రి : రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. చర్ల మండలం తిప్పాపురం, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 5 న తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం తిప్పాపురం వద్ద భద్రతా సిబ్బందికి మావోలు తారసపడటంతో కాల్పులు జరిపారు. దాదాపు గంట సేపటి నుంచి మావోయిస్టులు, పోలీసులకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Please login to add a commentAdd a comment