bhadradri district
-
రెడ్ కారిడార్కు చెక్ పడినట్టే?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో మరోసారి పాగా వేయాలనే మావోయిస్టుల ప్రయ త్నాలు ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి కనిపించ డం లేదు. ఓ వైపు పోలీసు నిఘా పెరిగిపోగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మావోల వ్యూహాలకు అడ్డు క ట్టలు వేస్తున్నాయి.పలుచోట్ల పోలీసు క్యాంపుల ఏ ర్పాటుతో పహారా పెరిగింది. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో మావోలు మృతి చెందడంతో వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసు కోవాలన్న వ్యూహానికి చెక్ పడినట్టు తెలుస్తోంది.ఆ రెండు జిల్లాల పరిధిలోనే...బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన జనతన సర్కార్ ప్రభావం క్రమంగా సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. మావోయిస్టుల అడ్డాగా బీజాపూర్, సుక్మా జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్న ములుగు జిల్లాలోని వెంకటాపురం, భద్రాద్రి జిల్లాలోని చర్ల, దుమ్మగూడెం మండలాలు మావోలకు సరికొత్త అడ్డాగా మారాయి. తెలంగాణ వచ్చిన తర్వాత దళాల సంచారం, వాల్ పోస్టర్లు, బ్యానర్లు కట్టడం, బాంబులు పేల్చడం తదితర ఘటనలన్నీ ఈ రెండు జిల్లాల పరిధిలోనే జరిగాయి. చర్ల మండలం మావోయిస్టుల ప్రభావంతో ఎరుపెక్కింది. చర్లతో సరిహద్దు పంచుకుంటున్న పామేడు–కంచాల–కొండపల్లి ఏరియాల పరిధిలో గడిచిన పదేళ్లలో అనేకసార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా..మావోల కంచుకోటలోకి చొచ్చుకుపోయే లక్ష్యంతో చర్ల కు సమీపంలో ఉన్న పామేడు దగ్గర మావోల అడ్డాకు సరి హద్దుగా ఉన్న చింతవాగు దగ్గర ఏడాది క్రితం కేంద్ర భద్రతా దళాలు క్యాంపు ఏర్పాటు చేశాయి. కానీ ఇక్కడ ఉన్న దట్టమైన అడవు లు, ఉధృతంగా ప్రవహించే వాగుల కారణంగా ప్రభుత్వ భద్రతా దళాలు పామేడును దాటి అడవుల్లోకి చొచ్చుకుపోవడం కష్టమైంది. మరోవైపు ఈ వాగుకు ఆవల ప్రాంతమంతా మావోయిస్టుల్లోనే శక్తివంతంగా భావించే దక్షిణ బస్తర్ జోన్ కమిటీ ఆధీనంలో ఉంది. దీంతో కేంద్ర భద్రతా దళాలకు చెందిన జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే లక్ష్యంతో అదే పనిగా పామేడు సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడులు జరిపారు. జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ దాడులను తిప్పికొట్టగలిగారు. లేదంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది.చుట్టుముట్టేస్తున్నారు..మావోలకు పట్టున్న ప్రాంతంలోకి చొచ్చుకుపోయేందుకు వీలుగా ఇటీవల పామేడు దగ్గరున్న చింతవాగుపై నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత నెల వ్యవధిలోనే పామేడు అవతల ఉన్న ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, తుమ్మలపాడు గ్రామాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. వారం వ్యవధిలోనే మొబైల్ టవర్లు వచ్చేశాయి. ఈ వేసవి నాటికి పామేడు నుంచి కొండపల్లి మీదుగా పూవర్తి వరకు యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పామేడు మీదుగా తెలంగాణలోకి మావోల రాక కష్టం కానుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలే మావోలకు అడ్డాగా మారాయి.ఈ కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని తరచు వెంకటాపురం, చర్ల మండలాల్లోకి మావోలు వచ్చిపోయేవారు. అయితే కర్రెగుట్టల సమీపంలో ఉన్న పూసుగుప్పతోపాటు చెలిమెల, వద్దిపేట, చెన్నాపురంలో కూడా క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ మార్గం కూడా మూసుకుపోయినట్టుగానే భావిస్తున్నారు. -
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయిల సరిహద్దు అడవుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్న కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలో ని నీలాద్రిగుట్టను గుర్తించారు. వెంటనే అదనపు బలగాలను అడవుల్లోకి రప్పించారు. మొత్తంగా 150 మంది వర కు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏరియా డామినేషన్ మొదలెట్టారు. ఈ క్రమంలో ఉదయం 6:45 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవుల్లోంచి వస్తున్న భారీ శబ్దాలు, కాల్పుల మోతలు విని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మృతులంతా బీకే–ఏఎస్ఆర్కే డివిజన్ వారే ఈ కాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామ రాజు (బీకే–ఏఎస్ఆర్) డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. మృతుల్లో నలుగురు పురుషు లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47, ఒక్కో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్తోపా టు తూటాలు, కిట్బ్యాగులు లభించినట్టు ఎస్పీ తెలిపా రు. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్టు తమకు సమాచారముందని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఎల్జీఎస్గా పనిచేస్తూ.. కరకగూడెం ఎన్కౌంటర్లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టులు మణుగూరు–పాల్వంచ ఏరియాలో లోకల్ గెరిల్లా స్క్వాడ్గా (ఎల్జీఎస్) పనిచేస్తున్నారు. వీరిలో బీకే–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్న లచ్చన్న అలియాస్ కుంజా వీరన్న (42) స్వస్థలం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా గొల్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ కాల్పుల్లో చనిపోయిన పూనెం లక్కే (29) అలియాస్ తులసి (సీజీ, బీజాపూర్ జిల్లా, గంగ్లూర్ గ్రామం‡) లచ్చన్న భార్యగా ప్రచారం జరుగుతోంది. ఈమె 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సంగంపాడుకు చెందిన కొవ్వాసి రాము(25) 2015లో పార్టీలో చేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన పొడియం కోసయ్య (21) అలియాస్ శుక్రు 2019లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కోసి, దుర్గేశ్ ఇటీవలే మావోయిస్టు పార్టీ సభ్యులుగా చేరారు. వారిద్దరూ సేఫ్ కరకగూడెం ఎన్కౌంటర్లో కానిస్టేబుళ్లు వంశీ, సందీప్లలో ఒకరికి పొట్టలో తూటా దూసుకుపోగా, మరొకరి కాలుకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని భద్రాచలం ఆస్ప త్రికి తరలించారు. ఆపై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. సాయంత్రానికి బయటకొచ్చిన మృతదేహాలు ఉదయం 6:45 గంటలకు ఎన్కౌంటర్ జరగ్గా, ఎనిమిది గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. 10:30 గంటలకు మృతుల ఫొటోలు, పేర్లు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహసీల్దార్, ఎస్పీ రోహిత్రాజ్ ఘటనాస్థలికి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు వచ్చే వరకు మృతదేహాలను మణుగూరు/భద్రాచలం ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇది విప్లవద్రోహుల పనే: ఆజాద్ విప్లవ ద్రోహుల కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మా వోయిస్టు పార్టీ బీకే –ఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్కు నిరసన గా ఈనెల 9న జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.జనజీవన స్రవంతిలో కలవండి: డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ స్పష్టం చేశారు. అనాలోచిత హింసను మావోయిస్టులు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా పునరావాసం కలి్పస్తామని, ఇందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయక చర్యలు పొందవచ్చని డీజీపీ హామీ ఇచ్చారు మావోలపై ‘టోర్నడో’ ఎఫెక్ట్» రెండునెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం » తాడ్వాయిలో సుడిగాలులకు కూలిన చెట్లు » ఆశ్రయం కోసం కరకగూడెం వనాల్లోకి వచ్చిన మావోయిస్టులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి టోర్నడో (సుడిగాలులు) కీలకంగా మారాయి. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు ములుగు–భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని రెండు నెలలుగా తిరుగుతున్నారు. అయితే భారీ సుడిగాలుల ధాటికి తాడ్వాయి మండలంలో ఒకేచోట రెండు వందల హెక్టార్లలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. దీంతో మావోయిస్టుల కదలికలకు బ్రేక్ పడింది. అనివార్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులకే దళాలు పరిమితం కావాల్సి వచ్చి0ది. చివరకు మావోల ఉనికి పోలీసులకు తెలియడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చి... తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో జూన్లో చిన్నచిన్న జట్లుగా మావోయిస్టులు గోదావరి దాటినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భద్రు, లచ్చన్నతో పాటు దాదాపు పదిహేను మంది సభ్యులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత జూలై 25న ములుగు –భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్ (34) అలియాస్ విజేందర్ చనిపోయాడు. మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. పెరిగిన నిర్బంధం.. దామెరతోగు ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిఘా విస్తృతం చేశారు. లచ్చన్న దళానికి చెందిన సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు వారి తలలపై ఉన్న రివార్డులను సైతం వివరిస్తూ పోలీసులు వాల్పోస్టర్లు అంటించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయుధాలతో గోదావరి నది దాటడం మావోయిస్టులకు కష్టంగా మారినట్టు తెలుస్తోంది. నలభై రోజులుగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా..అడవులు, కొండల్లో రోజుకో చోటుకు మకాం మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు సంచారం సాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అతి భారీ సుడిగాలులు సృష్టించిన బీభత్సంతో తాడ్వాయి మండలాన్ని వదిలేసి పూర్తిగా భద్రాద్రి జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చి0ది. దీంతో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేస్తూ ఎన్కౌంటర్లో ఆరుగురిని మట్టుబెట్టారు. -
అసాధారణ పరిస్థితుల్లోనే నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఇక్కడ నెలకొన్న అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నట్టు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం వెనుక ఉన్న అంశాలను వివరించారు.ఆ అంశాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణలో అన్ని రంగాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరిగి.. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక ప్రగతి సాధించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సుమారు 5వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా.. మా ప్రభుత్వ కఠోర శ్రమతో విద్యుత్ రంగంలో స్వయంవృద్ధి సాధించింది. 2014 నాటికి దేశంలో 90శాతం సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఆ తరహాలో భద్రాద్రి ప్లాంట్ చేపట్టినట్టు చెప్పడం సరికాదు.బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు జరిపి పెట్టుబడి వ్యయం రూ.400 కోట్లు తగ్గించినందునే భద్రాద్రి ప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వకంగా హామీ ఇచి్చనందునే.. అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించాం. ఆర్థికాభివృద్ధి కోసమే యాదాద్రి ప్లాంట్ తెలంగాణలో ప్రభుత్వం నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది తీరంలోనే ఉన్నాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్కేంద్రం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యత సాధించడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది.దామరచర్లకు సమీపంలో ఉన్న కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దామరచర్లకు జాతీయ రహదారి, రైల్వే లైన్ సమీపంలో ఉన్నందున రవాణా సమస్యలు ఉండవు. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి ప్లాంటుకు అవసరమయ్యే నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాంటు నుంచి వెలువడే ఫ్లైయాష్ను స్థానిక సిమెంటు పరిశ్రమలు వినియోగించుకుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ మేలును కోరే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును పనులను నామినేషన్ పద్ధతిపై అప్పగించాం.తీవ్ర సంక్షోభం ఉన్నందునే ఛత్తీస్గఢ్ విద్యుత్ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఎదుర్కొన్న కరెంటు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నాటి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడం, వాటిని సమరి్పంచి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వద్ద 2 వేల మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు మరో మార్గం లేదు.ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత వెయ్యి మెగావాట్ల కారిడార్ ఉపయోగించుకుని, మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. ఈ రద్దు ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అధికారిక ప్రక్రియను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిర్వహించాయి.అయినప్పటికీ రెండు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)లు పారదర్శకంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆమోదించిన తర్వాతే కొనుగోలు జరిగింది. న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు ఆమోదించినా ఎంక్వైరీ జరపాలనే ఆలోచన దురదృష్టకరం. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి ఈఆర్సీకి అభ్యంతరాలు తెలిపారు. ఆ అభ్యంతరాలు, ఆక్షేపణలపై అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా రేవంత్రెడ్డి ఆ ప్రయత్నం చేసిన దాఖలా లేదు’’అని కేసీఆర్ లేఖలో వివరించారు. -
భద్రాద్రి జిల్లాలో మందుపాతర నిర్వీర్యం
చర్ల: పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను గుర్తించిన పోలీసులు శుక్రవారం దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో పోలీసు బలగాలకు పెనుప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు–పెదమిడిసిలేరు ప్రధాన రహదారిపై బీ కొత్తూరు వద్ద వంతెనకు సమీపాన మావోయిస్టులు 30 కిలోల మందుపాతర ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా సరిహద్దు అటవీప్రాంతానికి నిత్యం బలగాలు కూంబింగ్కు వెళ్లివస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెళ్లే పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చగా, తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం గుర్తించారు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నందున దాన్ని నిర్వీర్యం చేస్తే వచ్చే శబ్దంతో ఓటర్లు భయబ్రాంతులవుతారని భావించిన పోలీసులు మందుపాతరకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు. శుక్రవారం ఉదయం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యాన నిర్వీర్యం చేశారు. కాగా, ఈ మందుపాతరను మావోలు పేల్చినట్లయితే బస్సు లేదా లారీ వంటి భారీ వాహనం కనీసం 20 నుంచి 30 అడుగుల మేర ఎత్తు ఎగిరిపడి తునాతునకలయ్యేదని చెబుతున్నారు. మరోపక్క ఈ మార్గంలో ఇంకా మందుపాతరలు ఉండొచ్చనే భావించిన పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు. -
సింగరేణి మనుగడ కేసీఆర్తోనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్ ఉండాలి..కేసీఆర్ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో ఆదివారం ఆయన రోడ్షో, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ సింగరేణి ప్రైవేటీకరణకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంటికి అందకుండా సింగరేణిని మింగేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎంపీలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా పార్లమెంట్లో నోరుమెదపలేదని విమర్శించారు. త్వరలోనే ‘సీతారామ’పూర్తి చేస్తాం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బీఆర్ఎస్కు సరైన ఆదరణ లేదని, కానీ ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు, అలకలు ఉంటే అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. దరిద్రానికి నేస్తం ‘హస్తం’ కాంగ్రెస్ వారు ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సార్లు అవకాశం ఇచ్చారని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని కేటీఆర్ ఎద్దేశా చేశారు. రేవంత్రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో ఎంత మంది రైతులకు 10 హెచ్పీ మోటార్లు ఉన్నాయని ప్రశ్నించారు. దరిద్రానికి నేస్తంగా హస్తం మారిందని ఆయన ఆరోపించారు. నా పేరే తారక రామారావు: మూడోసారి అధికా రం చేపట్టగానే యాదాద్రి కంటే మిన్నగా భద్రా చలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా మని హామీ ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం భద్రా చలం చేరుకునేసరికి అప్పటికే ఆలయం తలుపులు మూసేయగా దర్శనం సాధ్యం కాలేదు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ ‘నా పేరే తారక రామారా వు’నాకు రాముడిపై భక్తి లేకుండా ఎలా ఉంటుంది’అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థులు బానోత్ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం: ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. జూలూరుపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో లారీ డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక, ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం -
ములుగు: ముగిసిన రాష్ట్రపతి ముర్ము పర్యటన
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రప్రథమ పౌరురాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయా జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారామె. ఇక పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఉన్నారు. సాక్షి, ములుగు జిల్లా: యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించారు . కాకతీయుల కళానైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట ఆమె కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్లు ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి రామప్ప స్టోన్ గేట్ వరకు కాన్వాయ్ వాహనంలో వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆపై స్టోన్ గేట్ నుంచి రామప్ప ఆలయానికి కాలినడకన చేరుకున్నారు. అనంతరం.. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.రామప్ప ఆలయ ఆవరణలో ‘ప్రసాద్’ స్కీమ్ కింద రూ. 62 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యునెస్కో గుర్తింపు లో భాగంగా కామేశ్వరాలయం పునర్నిర్మాణంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. యునెస్కో గుర్తింపులో.. ఈ కామేశ్వరాలయం పునర్నిర్మాణమే కీలకంగా మారింది. వేయి స్థంభాల మండపం తరహాలో 33 మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో మహామండపం నిర్మాణం జరనుంది. 2023 జూన్ వరకు ప్రదక్షిణ పథం వరకు, 2026 మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్దరణ చేస్తారు. అలాగే.. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదుల నిర్మాణం జరగనుంది. 8 శతాబ్దాల కిందట ఆలయం నిర్మించినప్పుడు వాడిన ఇసుకనే ఇప్పుడు వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలం చేరుకున్నారు. రాజమండ్రి నుంచి వాయుమార్గం ద్వారా ఉదయం భద్రాచలం చేరుకున్నారు. ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర రాష్ట్రపతికి మంత్రులు పువ్వాడ అజయ్కుమార్,సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. సుమారు 3:45 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం హెలికాప్టర్లో ములుగు జిల్లాలోని రామప్పకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా 350 మంది అధికారులు విధుల్లో ఉండగా, రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే భద్రాచలంలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. భారీ కాన్వాయ్ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మునుపెన్నడూ చూడనంత భారీ కాన్వాయ్ గోదావరి వంతెనపై కనిపించనుంది. మంగళవారం నిర్వహించిన మాక్డ్రిల్లోనే ఏకంగా 70కి పైగా వాహనాలతో కూడిన కాన్వాయ్ ఐటీసీ క్యాంపస్ నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఇక బుధవారం రాష్ట్రపతితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిస్తే వందకు పైగా వాహనాలతో కూడిన అతి భారీ కాన్వాయ్ భద్రాచలంలో సైరన్ మోగిస్తూ పరుగులు పెట్టనుంది. అయితే, ఆలయ తూర్పు ముఖద్వారం వరకు రాష్ట్రపతి, ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన వీఐపీల వాహనాలను మిథిలా స్టేడియం వరకే అనుమతించనున్నారు. 15 రకాల వంటకాలు భద్రాచలం పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ గెస్ట్హౌస్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కోసం 15 రకాల శాకాహార వంటలను సిద్ధం చేస్తున్నారు. ఉల్లిపాయ, చామగడ్డ, చింతపండు, అనపకాయలు ఉపయోగించకుండా వంటలు చేయాలని చెఫ్లకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. రాష్ట్రపతి పర్యటన ఇలా.. ►ఉదయం 9 గంటలకు రాజమండ్రి నుంచి హెలీకాప్టర్లో బయలుదేరనున్న రాష్ట్రపతి సారపాక ఐటీసీలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు 9.50గంటలకు చేరుకుంటారు. రాజమండ్రి నుంచి సారపాక వరకు నడుమ 186 కి.మీ. మేర వాయుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాలు పడుతుందని షెడ్యూల్లో పొందుపర్చారు. ►10 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం రామాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ►ఆలయ ప్రాంగణంలో ఉదయం 10:10 గంటల నుంచి 10:15 గంటల వరకు ఐదు నిమిషాలు రిజర్వ్ టైంగా కేటాయించారు. ► ఉదయం 10:15 గంటలకు లక్ష్మణ సమేత సీతారాముల దర్శనానికి రాష్ట్రపతి వెళ్తారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ‘ప్రసాద్’ పనులకు శంకుస్థాపన చేస్తారు. ►10:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 2 కి.మీ. దూరంలో ఉన్న శాంతినగర్లోని వీరభద్ర ఫంక్షన్ హాల్కు చేరుకుంటారు. అక్కడ ఐదు నిమిషాల పాటు రిజర్వ్ టైం కేటాయించారు. ►10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమ్మక్క – సారలమ్మ జన్జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనం తర్వాత అక్కడి నుంచే కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్గా ప్రారంభిస్తారు. ►1:30 గంటలకు వీరభద్ర ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి 11:40 గంటలకు ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. ►ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు భోజనానికి కేటాయించారు. ►మధ్యాహ్నం 1:15 గంటలకు గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి 1:25 గంటలకు హెలిప్యాడ్కు చేరుకున్నాక మంత్రి పువ్వాడతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వీడ్కోలు పలుకుతారు ►మధ్యాహ్నం 1:35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న రాష్ట్రపతి 160 కి.మీ. దూరంలో ఉన్న ములుగు జిల్లా రామప్పకు మధ్యాహ్నం 2:20 గంటలకు చేరుకుంటారు. -
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
-
కీచక టీచర్ వికృతక్రీడ.. పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పెదగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. ఓ టీచర్.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆందోళన చెందిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన పేరెంట్స్కు చెప్పింది. వివరాల ప్రకారం.. పెదగొల్లగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్యా అనే గణితం టీచర్.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, చాలా రోజులుగా పిచ్చయ్య.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సదరు కీచక టీచర్పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్’ సీరియస్ వార్నింగ్
-
కుర్చీ నాది.. కాదు నాది
మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో అటు ఉద్యోగులు, ఇటు పనుల కోసం వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కమిషనర్ కుర్చీ నాదంటే నాదేనని ఇద్దరు అధికారులు వాదించు కోవడంతో గందరగోళంలో పడిపోయారు. గతంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన వెంకటస్వామిని వైరా కమిషనర్గా బదిలీ చేశారు. మణుగూరు కమిషనర్గా నాగప్రసాద్ను నియమించారు. అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు మణుగూరు మున్సిపల్ కమిషనర్గా తిరిగి వెం కటస్వామిని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటస్వామి సోమవారం కార్యాలయానికి వచ్చి కమిషనర్ సీటులో కూర్చు న్నారు. కాసేపటికి వచ్చిన నాగప్రసాద్ తనను రిలీవ్ చేస్తూ ఆదేశాలు రానందున తానే కమిషన ర్నని వాదించారు. సీటులో తననే కూర్చోనివ్వా లని సూచించారు. తనకు సీడీఎంఏ నుంచి ఉత్త ర్వులు వచ్చినందున తానే కమిషనర్నని, కలెక్టర్ ను కలిసి రిలీవ్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని వెంక టస్వామి అన్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. -
టీకా వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
సాక్షి, ఖమ్మం: అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని(27) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తుంది. గడిచిన పది రోజుల క్రితం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాలు వేశారు. నాలుగు రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ చిన్ని కరోనా టీకా వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేసి పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందింది. టీకా వికటించడం వల్లే చిన్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అటవీ అధికారులతో లొల్లి: బావిలో దూకిన మహిళ కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ వద్దు -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్గఢ్ నుంచి యాక్షన్ టీమ్లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్కౌంటర్లో తమ యాక్షన్ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్ గన్మన్ దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. దేవళ్లగూడెం ఎన్కౌంటర్ బూటకం అంటూ మావోయిస్టు పార్టీ ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ తదితరుల పేర్లతో బంద్పై ప్రకటనలు విడుదల చేశారు. దీంతో గోదావరి పరీవాహక జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీలు చేసింది. చివరకు బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు తమ అధీనంలో ఉన్న 16 మందిని వదిలిపెట్టారు. మొత్తం 26 మందిని అపహరించగా, అందులో శనివారం ఆరుగురిని విడిచిపెట్టి నలుగురిని హతమార్చిన విషయం విదితమే. -
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ నీటి జలాశయాలపై తేలియాడే (ఫ్లోటింగ్) సో లార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలోని ఇతర భారీ జలాశయాల్లో కనీసం 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలా ర్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (టీఎ స్ఆర్ఈడీ) శాఖ సహాయంతో అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇందుకు సం బంధించిన నివేదికను టీఎస్ఆర్ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో శ్రీధర్కు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిబంధనలకు లోబడి నిర్మిం చేలా ప్రతిపాదలను సమర్పించాలని టీఎస్ఆర్ఈడీ అధికారులను సీఎండీ కోరారు. బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కో సం యోచిస్తున్నామని, ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి, విద్యుత్ కొనుగోలు అనుమతు లు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. -
రాతి గుహల్లో రంగుల కాన్వాస్
సాక్షి, హైదరాబాద్: ఎద్దులు, ఉడుములు, పాములు, మనుషులు, మొక్కలు, పూలు, మధ్యమధ్యలో అంతుపట్టని ఆకృతులు... ఇలా ఆ గుహలోకి వెళితే అదో అందమైన కాన్వాస్. కళ్లకు కనిపించినవి, మదిలో మెదిలినవి ఆకృతులుగా ఎరుపు రంగులో పొందికగా ఆ రాతిపై చిత్రీకరించారు. అయితే ఇవన్నీ రూపుదిద్దుకున్నవి దాదాపు మూడున్నర వేల ఏళ్ల క్రితం. తెలంగాణలో మరో రాతి చిత్రాల జాడ వెలుగుచూసింది. చాలా ప్రాంతాల్లో ఆదిమానవులు గీసిన రాతి చిత్రాలు అడపాదడపా వెలుగు చూస్తున్నా... వాటి సంఖ్య ఎక్కువగా ఉన్న తావుల సంఖ్య అరుదు. ఇప్పుడు ఒకే చోట ఎక్కువ సంఖ్యలో చిత్రాలున్న గుహ వెలుగు చూసింది. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని నల్లముడి గ్రామ చేరువలోని అడవిలో ఒంటిగుండుగా పిలుచుకునే గుహలోపల ఇవి కనిపించాయి. దీన్ని స్థానికులు ఆరాధన ప్రాంతంగా వినియోగిస్తున్నారు. ‘పంచపాండవులు’గా పేర్కొనే ఐదు నిలువురాళ్లు, పెద్ద మీసాలతో ఓ తల రూపుతో ఉన్న రాయిని పూజిస్తున్నారు. ఆ గుహలో పైభాగంలో రకరకాల ఆకృతుల్లో ఈ చిత్రాలున్నాయి. పాతరాతియుగం–మధ్యరాతియుగంలో ఇవి చిత్రించారని భావిస్తున్నారు. పాములు, ఉడుములు, మానవాకృతులు, పూల డిజైన్లు, సూర్యుడు, దీర్ఘచతురస్రాకారపు ఘనాలతో బొమ్మలు అక్కడ కనిపిస్తున్నాయి. గతంలో నీలాద్రి (రామచంద్రాపురం), రాచకొండ ప్రాంతాలలో వెలుగు చూసిన చిత్రాల తరహాలో ఇవి ఉండటం విశేషం. ఈ చిత్రాలను తాజాగా ఖమ్మం, భద్రాచలంకు చెందిన ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, జగన్మోహనరావు, కట్టా శ్రీనివాస్, రాక్ ఆర్ట్ నిపుణులు బండి మురళీధర్రెడ్డి, తెలంగాణ జాగృతి చరిత్ర విభాగానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, రామన్ స్పెక్ట్రాస్పెషలిస్టు కట్టా జ్ఞానేశ్వర్, కనిగిరికి చెందిన కొండ్రేటి భాస్కర్లు రాక్ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆ చిత్రాల వయసు, వాటికి వాడిన ముడిపదార్థాలు, అంచులకు వినియోగించిన గీతలు పాతవా, తర్వాత చిత్రించినవా.. అన్న వివరాలను వారు ఆరా తీస్తున్నారు. ఇందుకు శాస్త్రీయ పరిశోధన జరుపుతున్నారు. ఇక్కడే ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు, కొన్ని వృక్ష శిలాజాలు కూడా లభించాయి. క్రమంగా శిథిలమవుతూ... ఎంతో విలువైన ఈ చిత్రాలు క్రమంగా దెబ్బతింటున్నాయి. స్థానికులు ఆరాధనలో భాగంగా గుహలో గండ దీపాలు వెలిగిస్తుండటంతో మసిపట్టి రంగు మారిపోతున్నాయి. మరికొందరు గుహ గోడలకు సున్నం పూస్తున్నారు. స్థానికులకు అవగాహన కలిగించటంతోపాటు వాటి సంరక్షణకు హెరిటేజ్ తెలంగాణ చర్యలు చేపట్టాలని పరిశోధన బృందం సభ్యులు కోరుతున్నారు. -
పురిటి కోసం అష్టకష్టాలు
ఇల్లెందు: పురుడు పోసుకోవడానికి ఓ మహిళ అష్టకష్టాలు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 21 ఏరియాకు చెందిన పూనెం శిరీష పురిటి నొప్పులతో గురువారం తెల్లారుజామున ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే కడుపులోని పాప కాళ్లు బయటకొచ్చాయి. వైద్యులు డెలివరీ కోసం ప్రయత్నించకుండా ఖమ్మం రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో శిరీషను ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. కానీ సకాలంలో వైద్యం అందక పాప మృతి చెందింది. దీంతో తిరిగి ఇల్లెందు వైద్యశాలకు తీసుకురాగానే మరో పాపకు జన్మనిచ్చింది. రెండో అమ్మాయి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏడు నెలలకే డెలివరీ కావడంతో ఇన్క్యుబేటర్ బాక్స్లో పెట్టాలని వైద్యులు సూచించారు. -
బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు
సాక్షి, పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) నుంచి వెలువడే వృథా బూడిద నిల్వలు ఉండే..యాష్పాండ్ చుట్టు పక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. ఈ బూడిద కాలుష్యంతో యాష్పాండ్కు సమీపంలో పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాల ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూడిద గాలిలోకి లేవకుండా కేటీపీఎస్ యాజమాన్యం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటెటర్ (ఈఎస్పీ)లను ఉపయోగిస్తున్నా..పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాలుష్యం వెదజల్లుతోంది. నీటిద్వారా యాష్పాండ్కు తరలిస్తున్నారు. సమీపంలోని కాల్వలు, కిన్నెరసాని ప్రాంతం బూడిదతో నిండి కాలుష్యభరితంగా మారుతున్నాయి. పీల్చుతున్న కార్మికులు, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జెన్కో టన్ను రూ.10చొప్పున విక్రయిస్తుండగా.. ప్లైయాష్ను సిమెంట్, ఇటుకల కంపెనీలు ప్రతిరోజూ వెయ్యి టన్నుల బూడిదను తీసుకెళ్తుంటాయి. మిలిగిన నిల్వలు అలా పేరుకుపోతుంటాయి. నిత్యం వందలాది లారీల లోడ్లను హైదరాబాద్, మిర్యాలయగూడెం, జగ్గయ్యపేట, కట్టగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక లోడ్తో ఊరి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గాలికి బూడిద రోడ్లపై, నివాసాలపైకి చేరి ఇబ్బంది పడుతున్నారు. బూడిదతో కూడిన గాలి పీల్చడం వల్ల స్థానికులు ఆయాసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దురదలు వస్తున్నాయి. ఇటీవల కేటీపీఏస్ యాజమాన్యం కిన్నెరసాని ప్రధాన రహదారినుంచి యాష్పాండ్ వరకు తారురోడ్డు నిర్మించగా..25టన్నుల లోడుకు బదులు 30 నుంచి 40 టన్నుల బూడిద లోడు ఒక్కో లారీలో తరలిస్తుండడంతో అది కూడా అధ్వానంగా మారింది. యాష్పాండ్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మేతకు వెళ్లి పశువులు, మేకలు, గొర్రెలు బూడిద గుంతల్లో ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి. అనేకమార్లు నోటీసులు.. యాష్పాండ్లో పడి మృతి చెందిన పశువులు కేటీపీఎస్ కర్మాగారం ద్వారా బూడిద చెరువులోకి పంపిస్తున్న బూడిద సమీపంలోని కిన్నెరసాని వాగులో కలవడం ద్వారా పశువులు, పంటల దెబ్బతింటున్నాయి. బూడిద కాలుష్యాన్ని కిన్నెరసానివాగులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. కర్మగారంలో సెడ్మెంటేషన్ ట్యాంక్ను నిర్మించాలని, బూడిద నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ఆచరణకు నోచట్లేదు. పొలం, జలం.. బూడిదమయం యాష్పాండ్ పరిసరాలన్నీ బూడిదతో నిండి కనిపిస్తుంటాయి. సమీపంలోని కిన్నెరసాని వాగు జలం రంగు మారి ప్రవహిస్తుంటుంది. పొలాలన్నీ సారం కోల్పోతున్నాయి. ఈ నీళ్లను తాగిన పశువులు చనిపోతున్నాయి. జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. -
కేటీపీఎస్లో ఇనుము దొంగలు..
సాక్షి, కొత్తగూడెం: కేటీపీఎస్ కర్మాగారంలో ఇంజనీర్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే భారీగా జీతభత్యాలు అందుకుంటున్నా అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ గతంలో అనేక స్క్రాప్, ఆయిల్ చోరీలు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఏడీఈ స్థాయి అధికారే ఇనుమును అక్రమంగా స్టోర్స్ నుంచి తరలించి, సస్పెన్షన్కు గురవడం చర్చనీయాంశంగా మారింది. యాష్ పాండ్లో పైపులైన్లకు సపోర్టింగ్ కోసం వినియోగించే స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను(రూ. 3.50 లక్షల విలువ) అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం, ఇందుకు బాధ్యుడైన ఓఅండ్ఎం ప్లాంట్లోని ‘బి ’స్టేషన్లో యాష్ పాండ్, వాటర్ ట్రీట్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఏడీఈ బి.ఎర్నా సస్పెన్షన్కు గురికావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎందరి పాత్ర ఉందనే విషయంపై విచారణ సాగుతోంది. ఇనుప ప్లేట్లను గతంలోనూ అనేక మార్లు బయటకు తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టోర్స్లో ఇప్పటి వరకు ఇలా 40 ప్లేట్లు మాయమైనట్లు సమాచారం. సుమారు రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే తాజాగా బయటకు తరలిస్తూ పట్టుబడిన ప్లేట్లు కొత్తవి. కొత్త ఇనుప పరికరాల విషయంలోనే ఇంతలా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాత ఇనుము విషయం లో గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయోననే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పట్టుబడిన ఒక్కో ప్లేట్ విలువ సుమారు రూ.1.80లక్షలు. ఈ నేపథ్యంలో పాత ఇనుము రూ. వందల కోట్లలో ఉంటుంది. దీన్ని గుట్టుగా బయటకు అక్రమ మార్గంలో తరలించేందుకు మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ అండ్ ఎం ప్లాంట్లో పోస్టింగ్ల కోసం పలువురు ఇంజినీర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు అంతంతే.. కేటీపీఎస్లో అక్రమాలపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ తనిఖీలు, విచారణలు చేసినా చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణ లో తేలితే థర్మల్ ప్లాంట్ల నుంచి హైడల్ విద్యుత్ ప్లాంట్లకు సైతం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అలా చేస్తుండకపోతుండడంతో ఇష్టారాజ్యంగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతం లో కేటీపీఎస్ ఓ అండ్ ఎం, 5, 6 దశల ప్లాంట్లలో అనేక సార్లు స్క్రాప్, ఫ్యూయల్ ఆయిల్ చోరీ చేస్తు పట్టుబడిన కేసుల్లో ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సంస్థకు సంబంధం లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతో మూడు నెలలకే దెబ్బతింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం నుంచి టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్కు పనులు అప్పగించారనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. యాష్ను ఉచితంగా అందించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శ లు వచ్చాయి. 7వ దశ నిర్మాణంలోనూ భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి బయటకు తరలిపోయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి కూడా సరైన చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా తాజాగా ఇనుము పక్కదోవ పట్టిన విషయంపై టీఎస్ జెన్ కో విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ విచారణకు పూనుకున్నారు. శుక్రవారం కర్మాగారాన్ని సందర్శించి సీఈ జె.సమ్మయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అక్రమాలపై ఏడీఈ ఎర్నాను సైతం విచారించారు. స్టోర్స్ను పరిశీలించారు. ఏడీఈ ఎర్నా, మరో నలుగురు ఆర్టిజన్ కార్మికులతో కలసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సీఈ జె.సమ్మయ్యను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ను వివరణ కోరగా.. విచారణలో ఉన్న కేసుల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కొందరు స్వప్రయోజనాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. విజిలెన్స్ నివేదికలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు న్యాయం చేయాలి. –ఎస్కె.సాబీర్పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి చర్యలు తీసుకోవాలి కేటీపీఎస్ అవకతవకలపై విజిలెన్స్ తనిఖీల్లో పారదర్శకత ఉండాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలోను అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిపై విచారణ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. –బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపినా సేవలు అంతంతే..
సాక్షి, చుంచుపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. కార్మి కులు డిపోల పరిధిలో భారీ ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరగలేదు. అయితే సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. జిల్లాలో మూడో రోజు 193 బస్సులను నడిపారు. శని, ఆదివారాల్లో 167 బస్సులు మాత్రమే తిరగగా, సోమవారం మరో 26 బస్సులను పెంచారు. అయినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోయాయి. ఎక్కువ మంది ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా 50 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలో ఆర్టీసీకి ఈ మూడు రోజుల్లో సుమారు రూ.90 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వ పతనం ఆరంభం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతోనే పతనం ప్రారంభం అవుతుందని ఆర్టీసీ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అన్నారు. సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు వివిధ రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ..సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై వేటు వేయమనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కార్మికులను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్మికులకు మద్దతు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్ల కృష్ణ, యెర్రా కామేష్, బీజేపీ జిల్లా నాయకులు కోనేరు చిన్ని, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగాకిరణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్పాషా, వై. శ్రీనివాస్రెడ్డి, గుత్తుల సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, నాగ సీతారాములు, ఇప్టూ నాయకులు సంజీవ్, సతీష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీవీ.రాజు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, జాకబ్, వైఎన్ రావు, సంధోని పాష, చిట్టిబాబు ఉన్నారు. -
అసెంబ్లీలో కేసీఆర్ హామీ ఇచ్చినా ఫలితం శూన్యం
సాక్షి, కొత్తగూడెం: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 3 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి యాజమాన్యం నిర్వాకంతో దయనీయ స్థితిలో బతుకులీడ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయా కుటుంబాల కన్నీటి గోసను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 21 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. ‘ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం’ అనే స్ఫూర్తిని యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తే.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టిందని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 1997లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పథకాన్ని ఎత్తేసింది. అయితే అప్పటికే వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) పెట్టుకున్న సుమారు 3 వేల మంది కార్మికులు తమ పరిస్థితి ఏంటని సింగరేణి యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో సదరు కార్మికులు 15 ఏళ్ల సర్వీసు, వేతనం వదులుకుని న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా.. ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం తీరును డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇన్నేళ్లుగా వీరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించగా సింగరేణి యాజమాన్యం వద్ద సమాధానం లేదు. 1997లో ఈ పథకాన్ని రద్దు చేసినప్పుడు.. కొత్త గనులు ఏర్పాటు చేసినా, సంస్థలో ఉద్యోగాలు ఖాళీ అయినా అప్పటికే వీఆర్ఎస్ పెట్టుకున్న కార్మికుల వారసులను నియమిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో కొందరికి మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కూడా ఇచ్చింది. వారికీ ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాగా, మూడు నెలల్లో ఉద్యోగాలు ఇప్పించి కార్మికుల భవిష్యత్తును మారుస్తామని 2016లో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సీఎం కేసీఆర్ సైతం శాసనసభలో హామీ ఇచ్చారు. అయితే నేటికీ వారికి న్యాయం జరుగలేదు. దీంతో కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం హామీలను నెరవేర్చాలి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి. టీబీజీకెఎస్ నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికల ముందు వీఆర్ఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు జరిగి రెండేళ్లయినా అతీగతీ లేదు. నేడు ఆయా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగావÔకాశాలు కల్పించాలి. – చింతల సూర్యనారాయణ, బీఎంఎస్ అధ్యక్షుడు ప్రభుత్వానివి మోసపూరిత వాగ్దానాలే వీఆర్ఎస్ ఉద్యోగులు సుమారు 21 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై అనేక హామీలు గుప్పించి ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం సరైంది కాదు. సింగరేణి యాజమాన్యం ఆర్ఎస్సీ వద్ద వీఆర్ఎస్ విషయంలో నోరుమెదపకపోవడం దారుణం. ప్రభుత్వ వైఖరితో 3000 మంది కార్మికులు అర్ధాకలితో అలమటిçస్తున్నారు. – పి.మాధవనాయక్, బీఎంఎస్ కార్యదర్శి 48 రోజులు ఎంవీటీసీ చేయించుకున్నారు 1997లో మా నాన్న అన్ఫిట్ అయి నాకు 48 రోజులు మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. మా బ్యాచ్లో 16 మందిలో 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వారికి నేటికీ ఇవ్వలేదు. సింగరేణి అధికారులు 2002లో పిలిచి రూ. రెండు లక్షలు ఇస్తాం.. ఉద్యోగం లేదన్నారు. అయితే నాకు ఉద్యోగమే కావాలన్నాను. సింగరేణి భవన్, హెడాఫీస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. – మబ్బు శంకర్, వీఆర్ఎస్ కార్మికుడి కుమారుడు -
బొగ్గుగని కార్మికుల టోకెన్ సమ్మె విజయవంతం
సాక్షి, భూపాలపల్లి: బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని బొగ్గుగని కార్మికులు మంగళవారం చేపట్టిన టోకెన్ సమ్మె విజయవంతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగ్గుగని కార్మికులు స్వచ్ఛందంగా టోకెన్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెతో భూపాలపల్లి ఏరియాలోని 6700 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో సుమారు 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి, సంస్థకు 2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో టీజీజీకేఎస్, ఏఐటీసీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీసీ, సీఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, బీఎమ్ఎస్ వంటి పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 600 మంది బొగ్గుగని కార్మికులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బొగ్గు పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులపై తమ నిరసనను తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టోకెన్ సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎమ్ఎస్, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూతో పాటు కోల్ ఇండియా సంఘాలు.. సింగరేణిలో ఒక్క రోజు టోకెన్ సమ్మెకు పిలుపు నిచ్చాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీజీజీకేఎస్ కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. మణుగూరు ఏరియాలో అత్యవసర విధులకు సంబంధించిన కార్మికులు తప్ప, మిగతా 90 శాతం మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో మణుగూరు ఏరియాలో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
నిన్న కొమురంభీంలో.. నేడు భద్రాద్రిలో
సాక్షి, భద్రాద్రి : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఘటన మరవకముందే.. కొత్తగూడెంలో సైతం అటవీ అధికారులపై దాడి జరిగింది. జిల్లాలోని ముల్కలపల్లి మండలం గుండాలపాడులో పోడు సాగుదారులు అటవీ అధికారులపై సోమవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్కు గాయాలయ్యాయి. వివరాలు.. పోడు సాగుదారలు అటవీ భూములను చదును చేసేందుకు ట్రాక్టర్లతో వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని వారిని అడ్డుకునేందుకు బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో పోడు సాగుదారులు అధికారులపై దాడి చేయగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
అందని ‘అభయం’
పాల్వంచరూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోప్రవేశపెట్టిన అభయహస్తం పథకం ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు గత 11 నెలలుగా నిలిచిపోయాయి. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారులు 8 వేల మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జిల్లాలో నెలకు రూ.40 లక్షల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. 2017 నవంబర్ వరకు తర్వాత ఇంతవరకు తమకు రూపాయి కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభయహస్తంతో ఎంతో ప్రయోజనం.. అభయహస్తం పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేంది. స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు నెలకు రూ.500 వస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. 18 నుంచి 59 సంవత్సరాల మహిళలు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. వారు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం ద్వారా మరో రూ. 365 జమ చేసి జనశ్రీ బీమా పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. ఆ తర్వాత 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పింఛన్ చెల్లిస్తారు. అంతేకాక గ్రూపులోని మహిళలకు 9 నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఉంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపకార వేతనాలు అందిస్తారు. సభ్యులు అకాల మరణం పొందితే కుటుంబసభ్యులకు బీమా కంపెనీ ద్వారా రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం కలిగితే రూ.37, 500 చొప్పున పరిహారం చెల్లిస్తారు. అయితే ఇటీవల ఈ పరిహారాన్ని రెండు లక్షలకు పెంచారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన అభయహస్తం పింఛన్ డబ్బును వెంటనే ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 11 నెలలుగా ఇబ్బంది పడుతున్నాం అభయహస్తం పింఛన్ గత 11 నెలలుగా రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.500 అయినా నెలనెలా సక్రమంగా ఇవ్వాలి.లేకుంటే తమ జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. అసరా పింఛన్లోనైనా చేర్చి ప్రతినెలా పింఛన్ ఇస్తే బాగుటుంది. – నూనావత్ చాందిని, లబ్ధిదారురాలు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైనే ఆధారపడి వృద్ధాప్యాన్ని గడుపుతున్నాం. గత 11 నెలలుగా పింఛన్లు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ల కోసం సంబంధిత అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నెలనెలా విధిగా పింఛన్ ఇవ్వాలి. – ధర్మసోతు మారు, లబ్ధిదారురాలు నిధులు విడుదల కాగానే పంపిణీ చేస్తాం అభయహస్తం పించన్లు గత 11 నెలలుగా పెండింగ్లో ఉన్న మాట నిజమే. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. – ప్రదీప్, అభయహస్తం పింఛన్ల జిల్లా ఇన్చార్జి -
ఉపాధ్యాయ రత్నా
సుజాతనగర్ : సమయపాలన.. అంకిత భావం, సామాజిక సేవ.. పరమావధిగా ఓ గిరిజన ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. 29 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్గా విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు బాణోత్ రత్నా. 2011 నుంచి 2018 వరకు సుజాతనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేసిన రత్నా ఇటీవల జరిగిన ఉపాధాయ బదిలీల్లో సర్వారం ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయన పాఠశాలకు వచ్చే నాటికి బడిలో 26 మందే విద్యార్థులు ఉన్నారు. వీరిలో 20 మంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రత్నా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడిలోకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పుడు 26 మందీ పాఠశాలకు రావడంతోపాటు మరో 14 మందిని అదనంగా పాఠశాలలో చేర్చారు. ప్రస్తుతం సర్వారం పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతన్నారు. వీరందరూ గిరిజన పిల్లలే. ఆంగ్లంపై పట్టులేకపోవడంతో ప్రత్యేక తరగతులు నిర్వహించి.. పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. ఏకాగ్రత పెంపొందించేందుకు విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ బడి.. అవకాశం దొరికితే చాలు..విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులున్న నేటి రోజుల్లో సెలవు రోజున కూడా పాఠశాల నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెలలో 24న వరలక్ష్మీ వ్రతం, రెండో శనివారం, ఆదివారం, జెండా వందనం, వాజ్పేయి మృతి తదితర 12 రోజులు సెలవులు వచ్చాయి. కానీ రత్నా విద్యార్థుల అభ్యున్నతి కోసం సెలవు రోజుల్లో కూడా పాఠశాల నిర్వహించారు. సెలవు కావడంతో మధ్యాహ్నం ప్రతీ రోజు మధ్యాహ్నం వడ్డించే అక్షయపాత్ర సంస్థ భోజనం ఏర్పాటు చేయకపోవడంతో ఈ నెల 24న వరలక్ష్మీ వ్రతం రోజు సొంత ఖర్చులతో భోజనం తయారు చేయించి పెట్టారు. గతంలో పనిచేసిన పాఠశాలలోనూ.. రత్నా సుజాతనగర్ మండల పరిషత్ పాఠశాలలో 2011 నుంచి ఇటీవల బదిలీల వరకు పనిచేశారు. ఆయన రాకముందు పాఠశాలలో విద్యార్థులు కేవలం 45 మందే ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 200కు పెరిగింది. సొంత ఖర్చులతో విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్ నిర్మించారు. గోడలూ పాఠాలు చెబుతాయి గతంలో ఆయన పనిచేసిన సుజాతనగర్ పాఠశాలలో గోడలను అందంగా ముస్తాబు చేసి చక్కని రంగులతో వివిధ కళాకృతులను వాటిపై తీర్చిదిద్దారు. జాతీయ నాయకులు చిత్రపటాలు, వివేకానందుని సూక్తులు, తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్, సరçస్వతి చిత్రపటాలతో పాటు, స్వచ్ఛ భారత్ లోగో, భారతదేశం, తెలంగాణ రాష్ట్ర చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రాష్ట్ర పుష్పం, రాష్ట్ర పిట్ట, రాష్ట్ర చెట్టు, రాష్ట్ర జంతువుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అవార్డులు 1998లో జూలూరుపాడు మండలం కరివారిగూడెం పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. 2004లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(క్యూఐటీ) జిల్లా స్థాయిలో ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్నారు. -
వక్రదారుల్లో ‘త్రివేణి’ కళాశాల
ఇప్పటి వరకు ఆ కళాశాలకు డోకా లేదు. వారు చెప్పిందే అక్కడ వేదం. అయితే అక్కడున్న కళాశాలల మధ్య పోటీతత్వం, ఈర్షాధ్వేషాలు పెరిగాయి. ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు. కోర్టులను కూడా ఆశ్రయించారు. అపుడే మన ఇంటర్ బోర్డు అధికారులు కళ్లుతెరిచారు. నిసితంగా పరిశీలించారు. అక్రమంగా కళాశాలను నడిపిస్తున్నారనే నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న రికార్డులను సీజ్ చేసి స్వాధీన పర్చుకున్నారు. ఫలితంగా అక్కడ చేరిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. భద్రాచలం : భద్రాచలం బస్టాండ్ వెనుక త్రివేణి జూనియర్ కళాశాలను అనధికారికంగా నడుపుతున్నారు. ఈ కళాశాలకు చెందిన రికార్డులను ఇం టర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి జహీరుద్దీన్ శుక్రవారం సీజ్ చేశారు. భద్రాచలం వచ్చిన ఆయన కళాశాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది సమక్షంలోనే రికార్డులు, అక్కడున్న ఇతర ధ్రువీకరణ పత్రాలను నిసితంగా పరిశీలించారు. ఆ సమయంలో విద్యార్థులు కళాశాలలో లేరు. దీనికి అనుబంధంగా వసతి గృహాన్ని కూడా నడుపుతున్నారు. ఆ సమయంలో ఒక విద్యార్థిని మాత్రమే అక్కడ ఉంది. ఆ విద్యార్థిని నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. అనుమతిలేని కళాశాలలో ఎందుకు చేరావని, వీరిచ్చిన సర్టిఫికెట్కు గుర్తింపు ఉండదని వివరించారు. అంతేకాక కళాశాలలో విద్యార్థులను చేర్చుకున్నట్లుగా అక్కడ ఉన్న అడ్మిషన్ దరఖాస్తులను, విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న పదో తరగతి సర్టిఫికెట్లు, వారికి సంబంధించిన ఇతర ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఇంటర్బోర్డు నోడల్ అధికారి జహీరుద్దీన్ మాట్లాడారు. త్రివేణి కళాశాల పేరు తో భద్రాచలంలోని బస్టాండ్ వెనుక ఉన్న భవనంలో తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు. అందుకే ఉన్నతాధికారుల సూచనల మేరకు కళాశాలకు సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేశామని వెల్లడించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మీషన్లు తీసుకున్నట్లుగా తమ పరిశీలన లో తేలిందన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టి లో పెట్టుకొని వారికి నచ్చిన కళాశాలలో చేర్పించేందుకు ఇంటర్ బోర్డు నుంచి తగిన సహకారం అందిస్తామన్నారు. పర్యవేక్షణ లేకనే.. జిల్లాలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సవ్యం గా లేకపోవటంతో కొంతమంది ప్రైవేట్ పాఠశాల లు, కళాశాలల యాజమన్యాలు విద్యావ్యాపారా న్ని కొనసాగిస్తున్నారు. భద్రాచలంలోని త్రివేణి కళాశాల పేరుతో బస్టాండ్ వెనుక బోర్డులు పెట్టుకొని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి తరగతులను నిర్వహిస్తున్నప్పటికీ, దీనికి అనుమతుల్లేవనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటి వరకూ గుర్తించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలంలోని రెండు కళా శాలల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరే ఈ సంఘటనకు ప్రధాన కారణంగా పలువురు చెబుతున్నారు. ఈ విషయం న్యాయస్థానం వరకూ వెళ్లింది. అప్పుడే ఇంటర్బోర్డు అధికారులు అసలు విషయాన్ని గ్రహించారు. బస్టాండ్ వెనుక ఉన్న త్రివేణి కళాశాలకు అనుమతల్లేవని అర్ధం చేసుకున్నారు. కళాశాలను సీజ్ చేయటంతో ఇక్క డ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మా రింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు పూర్తికాగా, ఇక్కడ చదివే వారిలో పలువురు విద్యార్థులు మెరిట్ సాధించిన వారు కూడా ఉన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఆ విద్యార్థులకు ప్రస్తుత పరిణామాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. స్థానిక విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకూ ఈ వ్యవహారం పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏజెన్సీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాల వారు విద్యా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. విద్యాశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించకపోవటంతో సమస్య మరింతజఠిలంగా మారు తోంది. ఏదిఏమైనప్పటికీ సంఘటన జరిగిన తరువాత స్పందించి,హడావిడి చేసేకంటే ప్రైవేట్ పాఠ శాలలకు సంబంధించిన అనుమతులు, వసతు లు, ఇతర అనుమతులపై సమగ్ర పరిశీలన ముందుగానే చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు
ములకలపల్లి : భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో బుధవారం ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మండలంలోని చింతపేట గ్రామానికి చెందిన మడివి పద్మ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీలో ఉన్న స్టాఫ్నర్స్ విమల పద్మ రిపోర్టులను పరిశీలించి ముగ్గరు బిడ్డలు ఉన్నట్లు గుర్తించి, చాకచక్యంగా కాన్పు చేశారు. పద్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడ శిశువు జన్మించారు. ఆమెకు ఇది రెండో కాన్పు కాగా, తొలి కాన్పులోనూ కవల పిల్లలకు జన్మనివ్వడం విశేషం. తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే శిశువులు బరువు తక్కువగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించామని వైద్యులు తెలిపారు. స్టాఫ్ నర్స్ విమలతో పాటు వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఫోన్లో అభినందించారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్తో నేరాల నియంత్రణ
కొత్తగూడెం అర్బన్ : ఫ్రెండీ పోలీసింగ్తో నేరాలను సులభంగా నియంత్రించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఓఎస్డీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ఐటీ సెల్, డీసీఆర్బీ సిబ్బందితో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని, వారి మనసులను చూరగొనేలా సేవలందించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులకు అక్కడి సమస్యలను తెలిపిన వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా నేరాలను సులభంగా నియంత్రించవచ్చన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయడంలో కోర్టు అధికారులతో సమన్వయం పాటించాలని, కేసుల పురోగతిని ఎప్పటికప్పడు తెలుసుకోవాలని చెప్పారు. గుట్కా, మట్కా, పేకాట, గ్యాంబ్లింగ్ స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేయాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. లైసెన్స్లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న పిల్లలపై, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగేవారిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేర నియంత్రణకు సాంకేతికపరమైన అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి సమాచారాన్ని వాటిలో నిక్షిప్తం చేసేలా అధికారులు, సిబ్బంది అంతా నైపుణ్యం సాధించాలన్నారు. అసాంఘిక శక్తులపై ఎప్పటికప్పడు సమాచారం సేకరించి ముందుగానే వాటిని అదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సస్పెక్ట్ షీట్స్, రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఆర్ డీఎస్పీ కుమారస్వామి, కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం.అలీ, పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు, మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా, ఎస్పీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, నాగరాజు, ఐటీ సెల్, డీసీఆర్బీ సీఐ రమాకాంత్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సీఐలు రవీందర్, షుకూర్, సిహెచ్.శ్రీనివాస్, టి.గోపి, కుమారస్వామి, కొండ్రు శ్రీను, సత్యనారాయణరెడ్డి, అల్లం నరేందర్, వెంకటేశ్వర్లు, అశోక్, దోమల రమేష్, అబ్బయ్య, ఆర్ఐలు కృష్ణ, సోములు, కామరాజు, ప్రసాద్, దామోదర్, స్టేషన్ రైటర్లు, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కంటి వెలుగు కార్యక్రమంలో అపశ్రుతి
పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్ డ్రింక్ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్డ్రింక్ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్ డ్రింక్ సీసా కనిపించింది. దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్లోని డ్రింక్ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి విచారణ చేపట్టారు. -
మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..
చర్ల: మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. చర్ల -పూసుగుప్ప మార్గంలోని లెనిన్ కాలనీ శివారులో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో అదే మార్గంలో ఈ ఇద్దరూ వస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. -
కందకంలో పడి బాలుని మృతి
సుజాతనగర్ : అటవీ ప్రాంతంలోని కందకంలో ప్రమాదవశాత్తు పడిపోయిన బాలుడు ప్రాణాలొదిలాడు. సుజాతనగర్ మండలం గరీబ్పేట పంచాయతీ లక్ష్మీపురంతండాకు చెందిన లక్ష్మణ్, శాంత దంపతుల పెద్ద కుమారుడు భానుప్రసాద్(12), రుద్రంపూర్ జిల్లాపరిషత్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. కటింగ్ సరిగ్గా చేయంచుకోకపోవడంతో ఈ నెల 30న అతడిని హెచ్ఎం హెచ్చరించారు. మరుసటి రోజున తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పారు. ఆ బాలుడు, మంగళవారం తన తల్లిని తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. కటింగ్ బాగా లేదని, సరిచేసి పంపించాలని బాలుడి తల్లితో ఉపాధ్యాయులు చెప్పారు. కుమారుడిని ఆ తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అతడిని ఇంటి వద్దనే ఉంచి పొలం పనులకు వెళ్లింది. తన స్నేహితులతో కలిసి అటవీ ప్రాంతం మీదుగా పొలానికి బయల్దేరిన భానుప్రసాద్, మార్గమధ్యలోగల కందకంలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్నేహితులు పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి చెప్పారు. గ్రామస్తులు వెళ్లేసరికి భానుప్రసాద్ మృతిచెందాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు భోరున విలపించారు. -
కామాంధుడి నుంచి తప్పించుకున్న యువతి
గుండాల : ఓ కామాంధుడి నుంచి గిరిజన యువతి తప్పించుకుంది. ఆమె ఫిర్యాదుతో ఆ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాలు... మండలానికి చెందిన ఓ గిరిజన యువతి, ఇల్లందు నుంచి గుండాలకు వచ్చేందుకు మంగళవారం రాత్రి 7.00 గంటల సమయంలో ఇల్లందు ఆర్టీసీ బస్టాండుకు చేరింది. ఆ సమయంలో బస్సు లేవు. మామకన్ను గ్రామస్తుడైన సున్నం బాబూరావుకు చెందిన టాటా మ్యాజిక్ ఎక్కింది. తన గ్రామ సమీపంలో దింపాలని కోరింది డ్రైవర్ సరేనన్నాడు. ‘‘సాయనపల్లిలో దిగాల్సిన వారున్నారు వారిని అక్కడ దింపేసి, నిన్ను నీ ఊరి దగ్గర దింపుతా’’నన్నాడు. ఆమె సరేనంది. తన ఊరికి వెళ్లేందుకుగల మరో మార్గం మీదుగా వాహనం వెళుతుండడాన్ని గమనించి, తాను అక్కడ దిగుతాననంది. ‘‘వీరందరినీ దింపేసి, నిన్ను మీ ఊళ్లో వదిలేస్తా’’నని డ్రైవర్ మరోసారి నమ్మించాడు తిరుగు ప్రయాణంలో సాయనపల్లి–గుండాల మార్గం మధ్యలోని కిన్నెరసాని వద్ద వాహనాన్ని అతడు ఆపాడు. లైంగిక దాడి చేయబోయాడు. ఆమె గట్టిగా అరుస్తూ తప్పించుకుని రోడ్డు వైపు పరుగెత్తింది. తమ ఊరి పక్కనున్న గ్రామానికి చెందిన ముగ్గురు కనిపించారు. వారికి విషయం చెప్పింది. వారి సాయంతో ఇంటికి క్షేమంగా చేరుకుంది. జరిగినదంతా తన కుటుంబీకులకు, బంధువులకు తెలిపింది. అందరూ కలిసి అదే రో జు రాత్రి కిన్నెరసాని వెంట ఆ టాటా మ్యాజిక్ కోసం వెతుకుతూ గుండాలకు చేరుకున్నారు. గుం డాల గ్రామ శివారులో ఆగిన ఆ టాటా మ్యా జిక్ను ధ్వంసం చేశారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. -
వారికిది ‘డబ్బుల్’ పథకం!
సాక్షి, కొత్తగూడెం : పేదల కోసం ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం పథకాన్ని కొందరు అధికారులు, సిబ్బంది ‘డబ్బులు’ కక్కే పథకంగా మలుచుకుంటున్నారు. అందిన కాడికి లంచాలు పుచ్చుకునేలా అవకాశాలను మార్చుకుంటున్నారు. సర్కారు కేటాయిస్తున్న నిధులతో డబుల్ బెడ్రూం ఇళ్లు కడితే..తమకు మిగిలేది నామమాత్రమేనని, ఇందులో పర్సంటేజీలు ఇచ్చుకుంటూ పోతే..ఇక తాము నష్టపోవాల్సిందేనని కాంట్రాక్టర్లు వాపోతూ..అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తుండడంతో జిల్లాలో ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుబడడంతో..ఈ పథకం వెనకాల నడుస్తున్న అవినీతి బాగోతం వెలుగుజూసింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గిట్టుబాటు కావట్లేదనే ఆలోచనతో కాంట్రాక్టర్లు మొదట్లో ముందుకు రాలేదు. అయినప్పటికీ ఉన్నతాధికారుల కృషి ఫలితంగా కొందరు నిర్మాణాలు చేపట్టారు. చివరకు ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలోనూ ఇంజినీరింగ్ అధికారులు భారీగా ముడుపులు అడుగుతున్నారని అనేక ఆరోపణలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐటీడీఏలో ఇద్దరు.. భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద రూ.50వేలు లంచం తీసుకుని ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బిల్లులు ఇవ్వకుండా తిప్పుతుండడంతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి విసుగు చెందారు. తనకు రూ.55లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండగా..పర్సంటేజీ రూ.లక్ష ఇవ్వాలని ఏటీడీఏ విభాగం నుంచి డిమాండ్ చేయడంతో..విసుగుచెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి వారి సూచన మేరకు..ముందుగా రూ.50వేలు ఇస్తానని అంగీకరించి ఓ చోట ఇస్తుండగా..ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఐటీడీఏ ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణను అరెస్ట్ చేశారు. గతంలో బూర్గంపాడు డీటీ.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రతీది తమకు కాసులు కురిపించేలా చేసుకుంటున్నారు కొందరు అధికారులు అనడానికి..బూర్గంపాడులో గతంలో జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. గత అక్టోబరులో బూర్గంపాడు మండలంలో డబుల్ ఇళ్లకు ఇసుక కూపన్లు ఇచ్చేందుకు అప్పటి ఉప తహసీల్దార్ భరణిబాబు కాంట్రాక్టర్ వద్ద రూ.20వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో..రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. డబుల్ బెడ్రూం లాంటి పథకాల విషయంలోనూ అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తుండడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విద్యాశాఖలో ఒకరు.. గత జనవరి 29వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కారు. పాల్వంచకు చెందిన శ్రీలక్ష్మి చిల్డ్రన్స్ స్కూల్కు రిజిస్ట్రేషన్ గడువు పూర్తి కావడంతో మరో రెండు సంవత్సరాలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా..డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కట్టంగూరు సైదులు రూ.25వేలు డిమాండ్ చేశాడు. 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న తాము అంత ఇవ్వలేమని చెప్పినప్పటికీ వినకపోవడంతో పాఠశాల యజమాని ఏసీబీని ఆశ్రయించారు. జనవరి 29న సదరు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.25వేలు తీసుకుంటూ సైదులు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ విషయానికి వస్తే మెడికల్ రీయింబర్స్మెంట్, కస్తూర్బా పాఠశాలల బిల్లులు, ప్రైవేట్ పాఠశాలల విషయంలో ముడుపులు ఇవ్వనిదే పనులు అయ్యే పరిస్థితి లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. -
బీజేపీ గిరిజన గర్జన సభను అడ్డుకున్న నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో బీజేపీ తలపెట్టిన గిరిజన గర్జన సభ రసాభాసగా మారింది. బీజేపీ సభ జరుగుతుండగా గిరిజన సంఘం నాయకులు మధ్యలో అడ్డుకోవడంతో ఆందోళన నెలకొంది. చర్ల మండల కేంద్రంలో భద్రాద్రినియోజక వర్గ పరిధిలో బీజేపీ గిరిజన గర్జన బహిరంగ సభను నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గిరిజన సంఘం నాయకులు వేదిక వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. -
ఎండి'నది'
భద్రాచలం: నిండు గోదావరి నది ఎండిపోయింది. నీళ్లు లేక పూర్తిగా అడుగంటింది. భద్రాచలం వద్ద గురువారం 4.8 అడుగుల నీటిమట్టం ఉంది. గోదావరి వద్ద నూతన బ్రిడ్జి పనుల కోసమని అడ్డుకట్ట వేయడం వల్లనే ఆమాత్రం నీటిమట్టం ఉంది. మిగతా చోట్ల గోదావరి పిల్లకాల్వలా కనిపిస్తోంది. గోదావరిలో ప్రస్తుతం నీళ్లు లేక ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే, వేసవి కాలం పూర్తయ్యే నాటికి గోదావరిలో నీళ్లు ఉండడం కష్టమేనని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. గతేడాది మార్చి 1న, భద్రాచలం వద్ద 6.6 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మే నెలలో 5 అడుగుల నీటిమట్టం ఉంది. 2016 మే 31న అతి తక్కువగా 3.4అడుగుల కనిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే నీటిమట్టం పూర్తిగా అడుగంటింది. ఈ ఏడాది పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడంతో గోదావరి నదికి వరదలు కూడా రాలేదు. మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా చేరువ కాలేదు. ఇలాంటి పరిణామాలు గోదావరి నీటిమట్టంపై ప్రభావం చూపాయి. ఈ సంవత్సరం ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే గోదావరిలో నీళ్లు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది. ఈ ప్రభావంతో పరివాహక ప్రాంతంలో తాగునీటి ఎద్దడి నెలకొననుంది. ఇప్పటికే బోరుబావుల్లో నీళ్లు పూర్తి స్థాయిలో రావట్లేదు. అడవులు అంతరించుకుపోతుండడం, ఏజెన్సీ ప్రాంతంలో జామాయిల్ సాగు విపరీతంగా పెరుగుతుండడం, ఇసుక తోడేస్తుండడం వల్ల ఏడాదికేడాదికి నీళ్లు అడుగంటిపోతున్నాయి. -
ఏసీబీ దాడులు.. కోట్లలో అక్రమాస్తులు గుర్తింపు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆదిలాబాద్ మున్సిపల్ డీఈ కొండల్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెంలలో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 6 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా రామానుజ కాలనీలోని మున్సిపల్ డీఈ మామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం వరంగల్లో మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
సరిహద్దులో ఉద్రిక్తత..
సాక్షి, భద్రాద్రి : రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. చర్ల మండలం తిప్పాపురం, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 5 న తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తిప్పాపురం వద్ద భద్రతా సిబ్బందికి మావోలు తారసపడటంతో కాల్పులు జరిపారు. దాదాపు గంట సేపటి నుంచి మావోయిస్టులు, పోలీసులకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
మేడారం జాతరకు వెళ్తుండగా..
సాక్షి, తాడ్వాయి: జయశంకర్ జిల్లా తాడ్వాయి సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళుతున్న తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చెవిటిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ పి.అంజయ్య(50) తన కుమారుడు నవీన్(23)తో కలిసి ఆటోలో జాతరకు వెళ్తున్నాడు. తాడ్వాయి-పస్రా మధ్యలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్సై కరుణాకర్రావు తెలిపారు. -
కేజీబీవి నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
సాక్షి, చర్ల: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవి) నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లక్ష్మి కాలనీలో జరిగింది. స్థానికంగా ఉన్న కేజీబీవీలో చదువుతున్న కొయ్యూరుకు చెందిన గౌరి, సాయినగర్ కాలనీకి చెందిన సౌజన్యలు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. వీరిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు
సాక్షి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఓ కారు స్వైరవిహారం చేసింది. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. పిల్లలు గాయపడడంతో ఆ కారుని ఆపడానికి ప్రయత్నించిన రెండు వాహనాలను కూడా ఢీకొట్టి కారును నడుపుతున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు. పారిపోతున్న వాహనదారుడిని అశ్వారావుపేటలో స్థానికులు అడ్డగించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గా గుర్తించారు. -
ఆటోను ఢీకొన్న లారీ: నలుగురు దుర్మరణం
సాక్షి, టేకులపల్లి: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి(తంగెళ్ల తండా వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్నఆటో ఆగి ఉండగా భారీ లారీ ఢీకొని దాని మీద నుంచి వెళ్లడంతో అది నుజ్జునుజ్జు అయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో మరొకరు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. -
విహార యాత్రలో విషాదం
సాక్షి, పాల్వంచ: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కిన్నెరసాని కాల్వ వద్ద జరిగింది. ములకలపల్లి మండలం నాగారం యూపీఎస్కు చెందిన నలుగురు టీచర్లు 70మంది విద్యార్థులను కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు తీసుకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ముత్యాలు, నాగమణిల కుమారుడు వారం రాజేష్(11), వల్లవరపు వెంకటకృష్ణ, సౌజన్య దంపతుల కుమారుడు విజన్(10)గా గుర్తించారు. -
భద్రాద్రిలో భారీ ఎన్కౌంటర్
-
రాజమ్మ ఆందోళన అనూహ్య మలుపు
సాక్షి, కొత్తగూడెం: ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోడ రాజమ్మ అనే యువతి వారం రోజులుగా దీక్ష చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆమె డిమాండ్ మేరకు పోలీసులు రెండు రోజుల క్రితం వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రాజమ్మను వివాహం చేసుకోవాలని పెద్దలు కూడా అతడికి నచ్చజెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తాగాడు. ఇది తెలుసుకున్న రాజమ్మ కూడా విషం తాగిందని సమాచారం. ఆమెకు మద్దతు తెలుపుతున్న వారు కూడా ఆందోళనకు దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27)కు ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదని.. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతో పాటు తీసుకెళ్లారని రాజమ్మ ఆరోపణలు చేసింది. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గత గురువారం నుంచి సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. -
ప్రేమికుడి కోసం ఐదో రోజు రాజమ్మ దీక్ష!
సుజాతనగర్ (భద్రాద్రికొత్తగూడెం): ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోడ రాజమ్మ అనే యువతి చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఆమెను కలిసి.. దీక్షకు సంఘీభావం ప్రకటించారు. రాజమ్మకు న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు బత్తుల వీరయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధీర్కుమార్, ఎస్టీ సెల్ నాయకులు పాల్గొని ఆమెకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. జిల్లాలోని ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27)కు ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదు. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతోపాటు ఎటో తీసుకెళ్లారు. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గురువారం నుంచి సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అయితే, ఆ ఇంట్లో ఎవరూ లేరు. తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. అయినా తనకు న్యాయం చేయలంటూ ఆ ఇంటి ముందే ఆమె బైఠాయించి.. ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ప్రేమికుడి కోసం ఆమె ఆందోళన..!
సుజాతనగర్ (భద్రాద్రికొత్తగూడెం): ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27) ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదు. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతో ఎటో తీసుకెళ్లారు. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గురువారం సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అయితే, ఆ ఇంట్లో ఎవరూ లేరు. తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయలంటూ ఆ ఇంటి ముందే ఆమె బైఠాయించారు. -
భద్రాద్రి జిల్లా అడవిలో అగ్ని ప్రమాదం
-
బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం సీతారామపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఎస్వీఎస్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. మణుగూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని 25మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కౌలురైతు బలవన్మరణం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అప్పుల బాధ తాళలేక ఒక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మండలంలోని నాగారం పంచాయతీ రేపల్లెవాడకు చెందిన అన్నంగి కృష్ణ(44) అనే కౌలురైతు మూడున్నర ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. పంటకు చీడ సోకడంతో అంతా పాడైంది. తీసుకున్న అప్పు తీర్చే మార్గంలేక మనస్తాపం చెందిన కౌలురైతు ఆదివారం ఉదయం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రమణ, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
పీఠంపై కన్ను
నామినేట్ చేయాల్సిన పదవులివే.. భద్రాద్రి ఆలయ ధర్మకర్తల మండలి అన్నపురెడ్డిపల్లి, పెద్దమ్మతల్లి ఆలయాల పాలకవర్గం భద్రాచలం, చర్ల, దమ్మపేట మార్కెట్ కమిటీలు సాక్షి, కొత్తగూడెం : సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల పందేరంపై జిల్లాలోని టీఆర్ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతనంగా ఆవిర్భవించడంతో పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతంలో కార్యకలాపాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో ఉన్న పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయా ప్రాంతాల నేతలు నామినేటెడ్ పదవులు ఈసారి తమనే వరిస్తాయన్న ఆశతో ఉన్నారు. పలువురు జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలు.. పలు ప్రధాన పదవులను సాధించే దిశగా ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీకి తాము అందించిన సేవలతోపాటు కష్టకాలంలో, ఉద్యమ సమయంలో చేసిన కృషిని వారికి వివరిస్తున్నారు. ఆయా పదవుల నియామకం విషయంలో తమ పేరు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు టీఆర్ఎస్ పార్టీతో ఉద్యమకాలం నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. అప్పుడు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించిన ఈ ప్రాంత నాయకులు.. ఈసారి తమకు గుర్తింపు లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. జిల్లాలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలను ప్రభుత్వం ఇప్పటికే నియమించగా, మరో మూడు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. కొత్తగూడెం, ఇల్లందు, బూర్గంపాడు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం, చర్ల, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవులను సైతం త్వరలో భర్తీ చేస్తారని పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు. ఇవి కాకుండా దక్షిణ అయోధ్యగా పేరొంది, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సైతం త్వరలో నియమిస్తారన్న సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు మండలి చైర్మన్ పదవి కోసం, ధర్మకర్తలుగా నియమితులు కావడానికి మరి కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో చైర్మన్ తో పాటు 9 మందిని సభ్యులుగా నియమించగా, ఈసారి ఆ సంఖ్యను 15కు పెంచే అవకాశం ఉండడంతో అనేకమంది వీటిపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈ పదవులను పొందేందుకు రాష్ట్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు అన్నపురెడ్డిపల్లి దేవస్థానం, పాల్వంచలోని శ్రీపెద్దమ్మతల్లి దేవాలయానికి సైతం పాలకవర్గాలను నియమించాల్సి ఉండడంతో పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. జిల్లా ఆవిర్భావం అనంతరం రాష్ట్రస్థాయి ప్రభుత్వ పదవుల్లో ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తారన్న ఆశతో ఉన్న పలువురు టీఆర్ఎస్ సీనియర్లు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా తమ పేర్లు పరిశీలించాల్సిందిగా తమకు సాన్నిహిత్యం ఉన్న రాష్ట్రస్థాయి నేతలను కలిసి విన్నవించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన విద్యార్థినేత పిడమర్తి రవిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నేతలెవరినీ కీలక పదవులు వరించలేదు. ఇక జిల్లాలోని నేతలకు రాష్ట్ర , జిల్లా స్థాయి పదవులేవీ ఇప్పటివరకు రాకపోవడంతో ఈ దఫా పదవుల పందేరంలో జిల్లాకు అగ్రస్థానం లభిస్తుందన్న ఆశతో ఈ ప్రాంత పార్టీ నేతలు ఉన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా రవాణా శాఖ (ఆర్టీఏ), పౌరసరఫరాల శాఖ ఆహార సలహా కమిటీ వంటివి కొత్తగా నియమించాల్సి ఉండటంతో వీటిపై సైతం పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు(అధికారంలోరి రాకముందు) కీలకంగా వ్యవహరించిన వారితో పాటు, అధికారంలోకి వచ్చాక వివిధ పార్టీల్లో కీలక నేతలుగా ఉండి, గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు ప్రముఖులు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అదిగో భద్రాద్రి..
రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రణాళిక - భక్తుల మదిని దోచేలా ఆధునీకరణ పనులు - రెండు వేల మందికి సరిపడా వసతి ఏర్పాట్లు భద్రాచలం భారతా వనిలో పౌరాణికంగా, చారిత్రకంగాను అతి ప్రసిద్ధమైనది భద్రాచల క్షేత్రం. గోదావరి నదీ తీరాన శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేతంగా వెలిసిన ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఓ వైపు గోదావరి గలగలలు మరో వైపు చారిత్రిక నేపథ్యం గల పర్ణశాల కుటీరం... ఇంకో వైపు పాపికొండల సోయగాలు ఇలా ప్రకృతి రమణీయతతో కూడిన భద్రాచలం ప్రాంతాన్ని ఒక్క సారైనా చూడాల్సిందే...గోదావరి స్నానం ఆచరించి రామయ్య పాదాల చెంత సేదతీరాల్సిందే.. త్రేతాయుగమున దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేయుచున్న సీతారాములకు, ఒకనాటి విహార సమయాన విశ్రాంతి స్థానమైన ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి, వారి అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల, బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరు దేవి ,మేరు పర్వత రాజదంపతులకు భద్రుడు అను పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యంలో ఘోరతపస్సు నాచరించెను. ఆ తప ప్రభావంతో శ్రీమన్నారాయునుడు మరలా శ్రీ రామ రూపమును దాల్చి చతుర్భుజ రామునిగా శంక చక్ర దనుర్భాణములను దరించి, వామాంకమున(ఎడమ తొడపై) సీతతో, వామ పార్శమున(ఎడమ ప్రక్కన) లక్ష్మణునితో కూడి పద్మాసనమున ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. పిమ్మట భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముల నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆభద్రుని హృదయ స్థానమున వెలిసెను. భద్రుని కొండ అయినందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు. స్వామికి భద్రాద్రి రాముడని, వైకుంఠము నుంచి సాక్షాత్తుగా అవతరించుట చేత వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు ‘అ’కార ‘ఉ’కార ‘మ’కార స్వరూపములు అయినందున ఓంకార రాముడని, శంఖ చక్ర దనుర్భాణములు ధరించుటచే రామ నారాయణుడు అని కూడా పేర్లు కలవు. దశాబ్దాల కోవెలకు ఎన్నో మార్పులు... 16వ శతాబ్ధంలో భద్రాద్రిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆ నాటి నుంచి నేటి వరకు ఎన్నో మార్పులను సంతరించుకుంది. భద్రుని ఘోర తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుడు శంకు, చక్ర, ధనుర్బాణాలతో చదుర్భుజ రామునిగా కొండపై సాక్షాత్కరించారు. పోకల దమ్మక్క అనే భక్తురాలు పుట్టలో ఉన్న శ్రీరామున్ని చూసి తాటాకు పందిరి వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో పాల్వంచ పరగణా తహశీల్దార్గా ఉన్న కంచర్ల గోపన్న ఆరు లక్షల రామమాడలు వెచ్చించి రామాలయాన్ని నిర్మించారు. 1958లో భద్రాద్రి రామాలయం ధర్మాదాయ శాఖ పరిధిలోనికి వచ్చింది. దీంతో 1960లో తొలిసిరిగా రామాలయాన్ని పునరుద్దరించే కార్యక్రమాన్ని అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి కల్లూరి చంద్రమౌళి చేపట్టారు. ఈ క్రమంలోనే రాజగోపురం, కల్యాణ మండపం, చిత్రకూట మండపం నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వీటిని సంప్రదాయోక్తంగా ప్రారంభించారు. అనంతర కాలంలో ఆలయాభివృద్ధి పేరిట పరిసర ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ప్రధానంగా చెప్పదగ్గ భద్రాచలం తాజాగా కొత్తగూడెం జిల్లాలో కొంగెత్తుగా రూపాంతరం చెందుబోతోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్లు మంజూరైతే ఆలయం మరింతగా అభివృద్ధి చెందనుంది. భక్తుల మది దోచేలా ఆధునీకరణ.. రాములోరి క్షేత్రమున్న కొత్తగూడెం జిల్లా దేశవ్యాప్తంగా కీర్తిగడించనుంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన రూ.100 కోట్లతో భక్తుల మదిని దోచేలా ఆలయాన్ని ఆధునీకరించేందుకు దేవాదాయశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. రెండో ప్రాకార మండపం.. రామాలయంలో ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపానికి బయట మరో ప్రాకార మండపం నిర్మించేందుకు దేవస్థానం అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా పోర్టికో మాదిరిగా సుమారు 30 అడుగులకు పైగా బయటకు జరిపి ప్రాకారాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. స్వామి వారి వెండిరథ సేవ, ఇతర పూజాది కార్యక్రమాలన్నీ దీనిలో జరిగేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రాకారం ముందుకు జరుగుతున్నందున మాడవీధులు కూడా విస్తరించాల్సి ఉంటుంది. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాభివృద్ధి.. రామాలయానికి ఎదురుగా ఉన్న పురాతన లక్ష్మీ నర్సింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రామాలయం నుంచి నేరుగా లక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి వెళ్లేలా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో అటుగా వెళ్లే వారికి గోదావరి అందాలు కనువిందు చేయనున్నాయి. భక్తుల వసతికి పెద్ద పీట.. భద్రాచలం వచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా వసతి కల్పించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్నీ కలుపుకొని 200 గదులు అందుబాటులో ఉన్నాయి. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల సమయంలో ఇవి సరిపోక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్లలో వసతి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించేలా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 15 వేల నుంచి 20 వేల మంది వేచి ఉండేలా గదులు, సత్రాలు, కల్యాణ మండపాలను నిర్మించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులు యోచిస్తున్నారు. -
కొత్త వెలుగు
ఇక ‘కొత్త’జిల్లాలో ‘భద్రాద్రి’ వెలుగులు - త్వరలోనే బీటీపీఎస్ పనులు పినపాక ఆటంకాలు..అభ్యంతరాల నడుమ నెలల తరబడి నిలిచిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) పనులు ఇక ముందుకు సాగనున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వేలకోట్ల రూపాయల విలువైన ప్లాంట్కు అనుకూలంగా ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఉండడంతో నవంబర్లో పనులు శ్రీకారం చుట్టే∙అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న లక్ష్యం నెరవేరితే పదివేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ‘కొత్త’జిల్లాకు మరో వెలుగుల కలికితురాయి దక్కనుంది. – ‘కొత్త’ కదలిక మొదలైంది. వేల కోట్ల బడ్జెట్తో నిర్మించతలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) పనులకు లైన్ క్లియరైంది. ఉన్నతాధికారుల కమిటీ సందర్శన, నివేదిక సమర్పణతో ప్లాంట్ ఆశలు చిగురించాయి. నిలిచిన పనులు..భూ నిర్వాసితుల గగ్గోలు..గ్రీన్ ట్రిబ్యునల్, ప్రజా ప్రయోజన వాజ్యాల నమోదు..ఇలా వరుసబెట్టి ఎదురైన ఆటంకాలతో పది నెలల పాటు స్తంభించిన ప్రక్రియతో నెలకొన్న సందిగ్ధం వీడబోతోంది. ఇక మెగా ప్రాజెక్ట్ పనులు చకచకా సాగబోతున్నాయి. వీలైనంత త్వరగా ‘భద్రాద్రి’ వెలుగులు నింపేదిశగా బీటీపీఎస్ కార్యరూపం దాల్చబోతోంది. ఇవీ ప్లాంట్ విశేషాలు.. l2015 మార్చి28 శ్రీరామనవమి పండుగ రోజున భద్రాద్రి థర్మల్ పవర్స్టేషన్ (బీటీపీఎస్)కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. lప్లాంటుకు కేటాయించిన నిధులు రూ.7250 కోట్లు lపినపాక, మణుగూరు మండలాల్లో గల సీతారాంపురం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెం గ్రామాల్లో ప్లాంట్ విస్తరించనుంది. lనిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ బీహెచ్ఈఎల్ చేపట్టింది. lపూర్తికావాల్సిన గడువు 2018 మార్చి 28 (36 నెలలు) l1080 మోగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు నిర్మించాల్సి ఉంది. lప్లాంట్ నిర్మాణానికి 1140 ఎకరాలు సాగుభూమి కేటాయించారు. lఅధికారులు గుర్తించిన భూ నిర్వాసితులు పినపాకలో 340 మంది, మణుగూరులో 800 మంది. lపరిహారానికి బదులు ఉద్యోగం కోరుకున్న భూ నిర్వాసితులు 346 మంది. తొలుత సవ్యం.. ఆ తర్వాత ఆటంకం.. ఉమ్మండి ఖమ్మం జిల్లాలో ఉండగా..పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ (బీటీపీఎస్) నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 28న శంకుస్థాపన చేశారు. మొదట సీతారాంపురం గ్రామం వద్ద విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. అక్కడే పైలాన్ శంకుస్థాపన, నిర్మాణ పనుల ప్రారంభం జరిగాయి. ఆ తర్వాత ప్లాంట్కు అనుమతులు లేవనే కారణంతో విడతల వారీగా ప్లాంట్నిర్మాణ పనులు నిలిచాయి. పర్యావరణ అనుమతుల కోసం గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, ప్రజా ప్రయోజన వాజ్యాలు నమోదు వరుసగా జరిగాయి. దీంతో ఈ పనులపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం ఆశలు చిగురించాయి. తాజాగా గత నెలలో పవర్ ప్లాంట్ నిర్మాణంపై కమిటీ సందర్శించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో అనుకూలంగా నిర్ణయం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్లో శ్రీకారం.. వేలమందికి ఉపాధి అవకాశం.. ప్లాంట్ నిర్మాణ పనులు నవబంర్లో ప్రారంభం కానున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ..పర్యావరణ ముప్పు శాతం తక్కువగా ఉందని, సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ నెల చివరిలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు భారీ యంత్రాలు, కూలీలను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్లాంట్ పూర్తయితే..పినపాక, మణుగూరు మండలాలకు చెందిన సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.వెయ్యి మందికి ప్రత్యక్ష్యంగా, 9 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. నిర్మాణ పనుల్లోనే కాంట్రాక్టర్లు సూపర్వైర్లుగా, డ్రైవర్లుగా, కూలీలుగా రెండు వేలమందిని వినియోగిస్తున్నారు. పలు గ్రామాల్లో హోటళ్లు, కిరాణా దుకాణాలు, రవాణా వ్యవస్థ వ్యాపారాలు ఊపందుకోనున్నాయి. lకేవలం 8 కిలోమీటర్ల దూరంలో బొగ్గు నిల్వలు ఉండటం, రైలు మార్గం కూడా ఉండటం కలిసొచ్చింది. lభద్రాద్రి పవర్ప్లాంట్ నిర్మాణానికి సమీపంలోనే గోదావరి నది ఉండటం చాలా అనుకూలం. lభద్రాద్రి పవర్ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయితే భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లాకు భద్రాద్రి వెలుగులు అందనున్నాయి. lఈ జిల్లాలో పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు కావాల్సిన విద్యుత్ సరఫరాకు ఇక్కడి నుంచే సరఫరా జరగనుంది. l270 మోగావాట్ల సామర్థ్య ఉన్న నాలుగు యూనిట్లను నిర్మిస్తున్నారు. lవాస్తవానికి 2016 డిసెంబర్లో ప్రారంభం కావాల్సి ఉండగా..2018 మార్చి నాటికి సిద్ధం చేయాలని ప్రణాళిక రూపొందించారు. -
కలెక్టర్కు తహసీల్దార్ల శుభాకాంక్షలు
భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతును జిల్లాలోని తహసీల్దార్లు గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం తహసీల్దార్ అశోక్చక్రవర్తి, పాల్వంచ తహసీల్దార్ గన్యా, మణుగూరు తహసీల్దార్ తిరుమలచారి, భద్రాచలం తహసీల్దార్ రామకృష్ణ, పినపాక తహసీల్దార్ కోటేశ్వరరావు, జూలురుపాడు తహసీల్దార్ రవికుమార్, టేకులపల్లి తహసీల్దార్ నాగేశ్వరరావు, గుండాల తహసీల్దార్ హరిచంద్ తదితరులు కలెక్టరును కలిశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, ఎస్పీ అంబర్ కిశోర్ ఝాను మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గురువారం కలిసి, శుభాంకాంక్షలు తెలిపారు. జిల్లాలను అన్ని విధాలుగా అబివృద్ధి చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేందర్, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, మాజీ చైర్పర్స కాసుల ఉమారాణి, కరాటే రామస్వామి, కాసుల వెంకట్, చందా మల్లేశం, బత్తుల వీరయ్య, జక్కుల సుందర్, జగన్, తదితరులు పాల్గొన్నారు. ఎల్హెచ్పీఎస్ ఆధ్వర్యంలో.. భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్ కిషోర్ ఝాలను గురువారం ఎల్హెచ్పీఎస్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ను కోరారు. శ్రీనివాస్ నాయక్, భూక్య పంతుల్య నాయక్, భూక్య దేవిలాల్ నాయక్, భూక్య బాలునాయక్, బదావత్ సీతారాం నాయక్, దారావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఆదివాసీ హక్కులను కాపాడాలి తెలంగాణాలో నూతనంగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలోని గిరిజనుల హక్కులను కాపాడాలని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధక్షుడు వాసం రామకృష్ణ కోరారు. గురువారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు వినతిప్రతం ఇచ్చారు. కోరం బుచ్చయ్య, భట్టు కనకరాజు, తాటి పుల్లయ్య, రాందాస్ శివ తదితరులు పాల్గొన్నారు. -
చర్లలో గుట్కా విక్రయాలు
చర్ల మండల కేంద్రంలో మళ్లీ గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత రెండు నెలల క్రింత గుట్కా విక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు పలువురు విక్రేతలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. సరిగ్గా నెల తిరగక ముందే మళ్లీ చర్లలో గుట్కాల విక్రయాలు ఆరంభ కాగా ప్రస్తుత ముమ్మరంగా ఈ విక్రయాలు సాగుతున్నాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, గాందీ సెంటర్, తహశీల్దార్ కార్యాలయం సెంటర్లలో గల పా¯ŒSషాపులలో వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చర్ల మండలంలో వీటి బారిన పడి పలువురు మృత్యువాత పడగా... మళ్లీ విచ్చల విడిగా సాగుతున్న ఈ గుట్కాల విక్రయాల వల్ల మళ్లీ ఎందరి ప్రాణాలు పోతాయోనని గుట్కా ప్రియులతో పాటు వాటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చర్ల మండల కేంద్రంలో సాగుతున్న గుట్కాల విక్రయాలపై మళ్లీ పోలీసులు దృష్టి సారించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువరు కోరుతున్నారు. -
విద్యుత్షాక్తో యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని నకిరేకల్ గ్రామానికి చెందిన గిరి(20) మంగళవారం రైసుపేట గ్రామానికి వచ్చాడు. రాత్రి గ్రామంలో జరిగిన దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్దీపాల తీగలు ప్రమాదవశాత్తు తగలటంతో షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తండ్రి చర్లలో జీసీసీ సేల్స్మన్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.