
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలివ్వడంలో బ్యాంకులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దీర్ఘకాలిక రుణ లక్ష్య సాధన చాలా తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కడ అవకాశం ఉందో కనిపెట్టి దానికి తగినట్టు ప్రణాళికలు వేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment