partha sarathi
-
400 మంది టీడీపీ కార్యకర్తలు రాజీనామా
-
TS: ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఎస్ఎఫ్సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
చంద్రబాబు కుట్రపై విచారణ జరిపించాలి : పార్థసారథి
-
టీడీపీ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
-
‘గ్రేటర్’ పోరు: స్థానికేతరులు వెళ్లిపోవాలి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసినందున స్థానికేతరులు, జీహెచ్ఎంసీలో ఓటు లేనివారు, నగరం విడిచి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రచారానికి వచ్చినవారిని పార్టీలు, అభ్యర్థులు స్వచ్ఛందంగా నగరం బయటికి పంపించి సహక రించాలని కోరింది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గడువు దాటాక కూడా ప్రచారం నిర్వహించే వారిపై కేసులు పెడతామని, రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా పడుతుందన్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందన్నారు. డిసెంబర్ ఒకటిన జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలతో.. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేసి ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని పార్థసారధి కోరారు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు 19 మందిని నోడల్ ఆఫీసర్లుగా నియమించి, వారి పర్యవేక్షణలో జాగ్రత్తలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటర్లు మాస్క్ ధరించాలని, క్యూలలో సామాజిక దూరం పాటించాలని కోరారు. చదవండి: హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా? -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్గా ఉన్న వి.నాగిరెడ్డి ఏప్రిల్లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిమూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన బుధవారం బాధ్యతలు చేపడుతున్నట్టుగా అధికారవర్గాల సమాచారం. కమిషనర్గా నియమితులైన పార్థసారథి మంగళవారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వెంట సీఎస్ సోమేశ్కుమార్ ఉన్నారు. ఇదీ పార్థసారథి ప్రస్థానం... 1993 సర్వీస్ కేడర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)–ఆగ్రోనమి డిస్టింక్షన్లో పూర్తిచేశారు. 1988 డిసెంబర్ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్గా ఆదిలాబాద్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతల నిర్వహణ మొదలుపెట్టారు. అనంతరం అనంతపురం, వరంగల్ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు. 2004 జూన్ 19న కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్ 6న మార్క్ఫెడ్ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్పీఆర్ కమిషనర్గా, 2011 జూన్ 18న ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 జూన్ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్గా, 2015 ఏప్రిల్ 15న వ్యవసాయశాఖ కమిషనర్గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా బదిలీపై వెళ్లి, ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగిరెడ్డి కమిషనర్గా ఉండగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన మెజారిటీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయినందున, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి, కార్పొరేటర్ల కాలపరిమితి వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. దీంతో పాటు మార్చినెలలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాలపరిమితి కూడా ముగియనుంది. సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, నకిరేకల్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఇప్పటికే మారగా, ఈ పంచాయతీ కాలపరిమితి త్వరలో ముగియగానే ఆ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో దాని కాలపరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా లేక 2,3నెలలు ముందుగానే ఆ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగియడానికి మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాటు ఉండడంతో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
‘అందుకే చంద్రబాబు ఓటమి పాలయ్యాడు’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వంలోని దుర్గగుడి పాలకమండలి అవినీతి అక్రమాలతో భక్తులు విసుగెత్తిపోయారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం దుర్గగుడి నూతన పాలకమండలి, చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రానికి హాజరయ్యారు. దుర్గగుడి ఈఓ సురేష్బాబు 16 మంది సభ్యుల చేత ప్రమాణం చేయించారు. దుర్గగుడి పాలక మండిలి చైర్మన్గా పైలా సోమినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న పాలక మండలి అభివృద్ధిని వదిలేసిందన్నారు. అమ్మవారికి వచ్చే ఆదాయాన్ని సైతం కాజేశారని ఆయన మండిపడ్డారు. చివరికి అమ్మవారికి సమర్పించే చీరలను సైతం వదల్లేదన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఓటమిపాలయ్యాడని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. దేవస్థానం అభివృద్ధిలో సభ్యులు కీలక పాత్ర పోషించాలని వెల్లంపల్లి పాలక మండలికి సూచించారు. సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. చీరలు దోచేసిన చరిత్ర గత పాలకమండలిదని.. అమ్మవారి ఆదాయాన్ని దోచుకోవడానికే గత ప్రభుత్వం, పాలకమండలి పాకులేడేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీని పాలకమండలి చైర్మన్గా చేశారని వెల్లంపల్లి కొనియాడారు. జగన్ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పాలకమండలిలో సగం మంది మహిళలకు అవకాశం కల్పించారన తెలిపారు. నూతన కమిటీ భక్తుల మన్ననలు పొందే విధంగా దుర్గగుడిని అభివృద్ధి చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సజావుగా దర్శనం చేసుకునే విధంగా చొరవ చూసుకోవాలని మండలి సభ్యులకు వెల్లంపల్లి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గానికి చెందిన సోమినాయుడుని దుర్గ గుడి చైర్మన్గా నియమించడం ఆనందించ దగ్గ విషయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పాలకమండలి ఏర్పాటు అయ్యిందని ఆయన తెలిపారు. గత పాలకమండలి అక్రమాలు చేయటానికి మాత్రమే ఉండేదన్నారు. తమ పాలకమండలి సభ్యులు భక్తుల సౌకర్యాలుకి పెద్ద పీట వేస్తారని తెలిపారు. 50 శాతం మహిళలకు పాలకమండలి సభ్యులుగా సీఎం జగన్ అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. -
చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేశారు
-
‘ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరం’
సాక్షి, విజయవాడ : ఎన్నికల నిర్వహిణపై, ఈసీపై చంద్రబాబు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గెలిచిన తరువాత ఎప్పుడూ ఈవీఎంల గురించి మాట్లాడలేదని.. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు అలాగే జరిగాయా అని నిలదీశారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకి ఈవీఎంలపై అనుమానాలు ఉంటే హరిప్రసాద్బదులు వేరే వారిని పంపించవచ్చు కదా అని ప్రశ్నించారు. తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా.. వైఎస్ జగన్ను సీఎం కాకుండా ఆపలేరని హెచ్చరించారు. -
‘ఆదరణ పేరుతో చంద్రబాబు కొత్త నాటకం’
సాక్షి, విజయవాడ : బీసీలను మరోసారి మోసం చేయడానికి ‘ఆదరణ’ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబుకు సరిగ్గా ఎన్నికల ముందే బీసీలు గుర్తుకు వస్తారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే టీడీపీ రాజమండ్రిలో జయహో బీసీ సభ నిర్వహిస్తుందని, ఈ సభకు రాకుంటే నగదు ఇవ్వమని డ్వాక్రా మహిళలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలన పుణ్యమా.. బీసీలు తమ కులవృత్తులు చేసుకోలేక దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని, జన్మభూమి కమిటీల వద్ద బీసీలను బానిసలుగా మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. బీసీ వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని సీఎం చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. బీసీలు టీడీపీకీ కేవలం ఓటు బ్యాంకుగానే కనిపిస్తున్నారని, చంద్రబాబు మాయలో బీసీ సోదరులు పడవద్దని పార్థసారథి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే బీసీ సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. -
కేంద్రం పరిమితులతోనే రైతులకు ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: పంటల ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెటింగ్ ఈ–సర్వీసెస్ను ప్రారంభించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. కేంద్రం మద్దతు ధర పెంచిందని, అయితే కొనుగోళ్ల విషయంలో పరిమితులు విధిస్తోందని.. దీనివల్లే రైతులకు సమస్య ఎదురవుతోందని చెప్పారు. రెండేళ్ల నుంచి రికార్డు స్థాయిలో ప్రభుత్వం తరఫున కొంటున్నామన్నారు. కేంద్రం పరిమితి విధించడానికి ఎగుమతి దిగుమతి విధానాలు తదితర అంతర్జాతీయ కారణాలున్నాయన్నారు. అయితే ఇవి రైతులకు సంబంధం లేనివి అయినప్పటికీ వారిపైనే ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ విషయాలు రైతులకు అధికారులు వివరించాలన్నారు. మార్కెటింగ్శాఖ ఆందుకు సిద్ధంగా ఉండాలని, ధరల విషయంలో ముందుగానే అంచనాలు వేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీసారి సమీక్షించుకోవాలి.. వ్యవసాయ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చేరుతాయని, వాటి ధరలో రైతు వాటా ఏడాదికేడాది ఎంత పెరుగుతుందనేది ముఖ్యమని పార్థసారథి చెప్పారు. ప్రతిసారీ దీన్ని సమీక్షించుకుని రైతులకు గిట్టుబాటు కల్పిస్తున్నామా లేదా చూసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం తరఫున సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లలో గత నాలుగేళ్లలో రూ.370 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సర్వీసెస్ ఉపయోగపడుతోందన్నారు. అన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ–నామ్లో రాజకీయ ఒత్తిడులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా మోడల్ యాక్ట్ విషయంలో జవాబుదారీతనం ఉండాలని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, పద్మహర్ష తదితరులు పాల్గొన్నారు. -
అంచనాలను మించిన వరి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్లో వరి అంచనాలకు మించి సాగైంది. గత నెల విస్తారంగా వర్షాలు పడటంతో వరి విస్తీర్ణం 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంకా వరి నాట్లు పడే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు 17 జిల్లాలకు అది వ్యాపించింది. పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుంది. 12 జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు పురుగు సోకిందని నివేదికలో తెలిపారు. ఇక కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్ పంటలు పూత దశలో ఉన్నాయి. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం.. గత నెల విస్తారంగా వర్షాలు కురిసినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయినట్లు ఆశాఖ తెలిపింది. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తం మీద సాధారణ వర్షపాతం రికార్డవ్వగా, నెలల వారీగా చూస్తే జూన్, ఆగస్టుల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 30%లోటు వర్షపా తం రికార్డయింది. సెప్టెంబర్లో ఇప్పటివరకు 75% లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొందని పేర్కొంది. రబీ ‘రైతుబంధు’కు సన్నద్ధం బ్యాంకులతో వ్యవసాయశాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీలో సరఫరా చేయాల్సి న రైతుబంధు పెట్టుబడి కోసం సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖరీఫ్లో 8 బ్యాంకులు పెట్టుబడి చెక్కులను రైతులకు సరఫరా చేశాయని, ఈసారి మరిన్ని బ్యాంకులు ఇందులో పాల్గొనాలని కోరారు. అందుకు ఇతర బ్యాంకుల జాబితాను పంపాలన్నారు. ఖరీఫ్లో ఇప్పటివరకు పంట రుణాలు ఏమేరకు ఇచ్చారో సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారులతోనూ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలు, పంటల పరిస్థితులు, పంట నష్టం, ఎరువులు, రైతు బంధు, రైతుబీమా పైనా జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సీజన్లో ఎంత మేర పంట నష్టం జరిగిందో నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకంలో పంపిణీ చేసిన, చేయని చెక్కులను, ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేసి, సంబంధిత నమూనా పత్రాలలో నమోదు చేసి చెక్కుల పరిశీలనకు రావల్సిందిగా సూచించారు. ఆయా జిల్లాల్లో పంటల విస్తీర్ణం, దానికి అనుగుణంగా ఎరువులను సమకూర్చుకోవాలని సూచించా రు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, జాయింట్ డైరెక్టర్ విజయగౌరి పాల్గొన్నారు. -
25 వేల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా గతంలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రద్దు కావడంతో ఉత్తర్వు లను బయటకు వెల్లడించకుండా.. అంతర్గతంగా మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో 25 వేల మందికిపైగా రైతులకు రూ.160 కోట్ల మేర రుణమాఫీ కానున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలి పాయి. సర్కారు రద్దుకు ముందే వ్యవసాయ శాఖ సంబంధిత ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎం సంతకం చేసినా ఉత్తర్వులు వెలువడటానికి ఇన్నాళ్లు పట్టిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష రూపాయల్లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 35.33 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం రూ. 16,124 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. రుణమాఫీ అర్హులను గుర్తించే క్రమంలో బ్యాంకులు కొందరు రైతుల వివరాల జాబితాను సర్కారుకు పంపించలేదు. దీంతో 25 వేల మందికి పైగా రైతులు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ క్రమంలో అర్హులైన రైతులు ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీరికి రుణ మాఫీ చేయాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. కానీ వీరికి రుణమాఫీ అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
14 నుంచే ‘రైతుబీమా’ అమలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నాటికే రైతుబీమా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి 14నాటి కి రైతులకు బీమాపత్రాలు ఇస్తామన్నారు. 14 నుంచి సంబంధిత రైతు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 10 రోజుల్లో రూ.5 లక్షలు క్లెయిమ్ అందుతుందన్నారు. దీన్ని ఎల్ఐసీకి తెలియజేశామని పేర్కొన్నారు. రైతుబీమా పత్రాల పంపిణీ కార్యక్రమా న్ని గ్రామసభల్లో అందజేయాలని నిర్ణయించామని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనాల ని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 6న ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా ప్రత్యేకంగా ప్రారంభం అంటూ హడావుడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. బీమా పాలసీకి ప్రారంభ ఉత్సవం చేయడమంటే సెంటిమెంట్గా మంచిది కాదని సర్కారు భావించినట్లు సమాచారం. -
రైతుబంధు’లందరూ బీమాకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కులు తీసుకున్న రైతులందరూ రైతుబీమాకు అర్హులేనని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఈ పథకం కింద రైతుల నమోదు పురోగతి గురించి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. పార్థసారథి మాట్లాడుతూ రైతు జీవితబీమా పథకంలో ఇప్పటివరకు 30 లక్షల మంది రైతులపేర్లు నమోదయ్యాయని తెలిపారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసుబుక్ లేకున్నా రైతుబంధు చెక్కులను అందజేశామని, వారూ రైతుబీమా చేయించుకోవాలని పేర్కొన్నారు. కొంద రు రైతులు రైతుబంధు చెక్కులు తీసుకోకపోవడంతో అవి తహసీల్దార్ వద్దనే ఉన్నాయని, అలాంటి రైతు లు తప్పనిసరిగా ఆ చెక్కులు తీసుకుని, రైతుబీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు కుటుంబాలకు భరోసా కలిగించడానికే రైతుబీమా పథకమని.. ప్రతీ రైతు కూడా రైతుబీమా పథకంలో నమోదు కావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 18 నుంచి 59 సంవత్సరాల (1959 ఆగస్టు 14 నుండి 2000 ఆగస్టు 15 మధ్య పుట్టినవారు) వయసు కలిగిన రైతులు జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జీవితబీమా పథకంలో ప్రతీ పట్టాదారు రైతు నమోదయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జూలై 15, 2018 నాటికి నమోదు వివరాలు అందించాలి కాబట్టి త్వరితగతిన నమోదు, అప్ లోడింగ్ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఒంటరిగా వస్తా.. మీకు దమ్ముందా..!
ఉయ్యూరు: పేదలకు కట్టించి ఇచ్చే జీ+3 ఇళ్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్చించేందుకు తాను ఒక్కడినే వస్తా.. దమ్ముంటే టీడీపీ నేతలు తనతో చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. ఉయ్యూరు పట్టణంలో బుధవారం సాయంత్రం పార్థసారథి అఖిలపక్షంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీ+3 ఇళ్ల పేరిట టీడీపీ చేపట్టిన నిర్మాణంలో పేదలకు లబ్ధి కన్నా కాంట్రాక్టర్ లబ్ధికే పెద్దపీట వేశారన్నారు. పేదలకు పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని చెప్పారు. తన హయాంలో ఉయ్యూరు పట్టణంలో బహిరంగంగా సుమారు వెయ్యి మందికి పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. తాము పంపిణీ చేసిన లబ్ధిదారుల్లో అనర్హులు ఎవ్వరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అది పరిశీలించి వాటిని రద్దు చేస్తామని బహిరంగంగా అందరికీ తెలిపానన్నారు. పేదల నుంచి స్థలాలు లాక్కున్నది మీరుకాదా? పేదలందరికీ సుమారు 72 గజాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చామని, వారికి తాము పట్టాలు అందించామని చెప్పారు. నాడు మేము స్థల సేకరణ జరిపి పేదలకు పట్టాలు పంచిన తరువాత పట్టాలు పొందిన వారి కనీస అనుమతి కూడా తీసుకోకుండా వారికి కేటాయించిన స్థలాలను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉయ్యూరులో ఇళ్ల అవసరం ఉన్న పేదలు తమ ప్రభుత్వం తరువాత పెరిగి ఉండి ఉంటారని, అయితే అప్పటికే కేటాయించిన స్థలాలను లాక్కుని అందరికీ న్యాయం అంటూ చెప్పే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. టీడీపీ నేతలు వారిష్టమొచ్చిన రీతిలో ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టును అవినీతి కంపు కొట్టించారని మండిపడ్డారు. లబ్ధిదారులు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తీసుకువస్తే మీరు ఎందుకు కోర్టుకు వెళ్లి ఆ స్టేటస్ కోని వెకేట్ చేయించకుండా ఎలా నిర్మాణాలు చేపడుతున్నారో వివరించాలన్నారు. ట్యాక్సీ నడుపుకునేవారు పేదలు కాదా ? కుటుంబ పోషణ కోసం ట్యాక్సీకి ఓనర్ అయితే ఇళ్ల స్థలం పొందేందుకు అర్హుడు కాడా అని పార్థసారథి మండిపడ్డారు. పట్టణంలో కొంత మంది ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వాళ్లకు కారు ఉందనే కారణంతో ఇళ్ల స్థలాలు కేటాయించడం కుదరదు అని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. మీరు కట్టమనగానే రూ.25 వేలు, రూ.50 వేలు డబ్బులు కట్టేవాళ్లు మీ దృష్టిలో నిజమైన పేదలు, కుటుంబాన్ని పోషించేందుకు రూ.40 వేలు కూడా విలువ చేయని ట్యాక్సీలు ఉన్న వాళ్లు పేదలు కాదా అని ధ్వజమెత్తారు. రూ.2.50 లక్షలు అయ్యేదానికి రూ.6.50 లక్షలు దేనికి? ప్రభుత్వం ప్రకటించిన కేటగిరీలలో ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం రూ.2.50 లక్షలు అని అన్నారు. ఇళ్ల స్థలాల నిర్మాణంలో ప్రభుత్వం కేటాయించిన కేటగిరీలో 300 చదరపు అడుగుకు రూ.2,166లు, 365కు రూ.2000, 435కి రూ.1900లు ఖర్చుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉయ్యూరు పట్టణంలో అనేకమంది బిల్డర్లు చదరపు అడుగు భూమి విలువతో కలుపుకుని రూ.1,200లకే విక్రయాలు జరుపుతున్నారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం జర్మన్ టెక్నాలజీ అని, షేర్ వాల్ టెక్నాలజీ అని, అధునాత టెక్నాలజీ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ రూ.2 వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి వసూలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక బిల్డర్ ఈ ఇళ్లను కేవలం రూ.1100లకే చదరపు అడుగుకు నిర్మాణం పూర్తి చేయగలడని చెప్పారు. చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. లా అండ్ ఆర్డర్కు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మీకు ఇష్టం వచ్చిన చోట, మీరు ఎంత మంది వచ్చినా సరే పోలీసులు, విలేకరుల ఎదుట తాను ఒక్కడినే వచ్చి మీ అవినీతిని బయటపెడతానని ఛాలెంజ్ చేశారు. తాను చేస్తున్న సవాల్ను దమ్ముంటే స్వీకరించాలని కోరారు.సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షులు జంపాన కొండలరావు, దాసే రవి, మహిళా విభాగం నాయకులు తెనాలి పద్మావతి, దిరిశం ఇందిర ప్రియదర్శిని, నాయకులు నిడుమోలు పూర్ణ, చింతల అప్పారావు, అబ్దుల్ సద్దాం, సీఐటీయూ పెనమలూరు డివిజన్ అధ్యక్షులు కోసూరి శివనాగేంద్రం, నాయకుడు కేవైకే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల ఆంధ్రులను నట్టేట ముంచాయి
-
ఆయనకు ఇంగిత జ్ఞానం లేదు..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పిన టీడీపీ మాట మార్చి తామే అవిశ్వాసాన్ని ప్రవేశపెడతామంటోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేదని చంద్రబాబును నిలదీశారు. అవిశ్వాసంపై జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీకి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మానవహారాలు నిర్వహిస్తాం.. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సోమవారం మానవహారాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభద్రతాభావంతో టీడీపీ వైసీపీపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జగన్పై వ్యక్తిగత విమర్శలకు దిగడం.. ఆయనకు ఇంగిత జ్ఞానం లేదనే విషయం తెలుపుతుందన్నారు. మోదీ సమాధానం చెప్పాలి.. కోర్టులకు హాజరు కాకుండా స్టేలు తెచ్చుకునే రాజకీయ నేరగాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడిని ప్రధాని మోదీ ఎందుకు పక్కన సహించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దళిత మహిళను వివస్త్రను చేసిన నీ పాలనలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయ’ని పార్థసారథి ప్రశ్నించారు. దోపీడీలు, మట్టి, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టుల్లో అవినీతితో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. నాడు కేంద్రం ప్యాకేజీపై పొగడ్తలు గుప్పించి.. ఇప్పుడు అసెంబ్లీలో కేంద్రం సహాయం చేయడం లేదంటూ మొసలికన్నీరు కార్చడం చంద్రబాబుకే సాధ్యం అని అన్నారు. ఎన్టీఆర్ను ముంచాడు..మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని, గుర్తుని, నిధులను లాక్కున్న చంద్రబాబుది దొంగల పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు తరిమికొడతారన్న భయంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చిందని అన్నారు. -
రాజధాని పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు
-
రెండో హరిత విప్లవం లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిలను డైరెక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డైరెక్టర్ల పేరిట కేటాయించింది. అయితే కార్పొరేషన్కు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. చైర్మన్ పోస్టును ప్రస్తుతానికి ఖాళీగా ఉంచింది. చైర్మన్ నియామకంతోపాటు పలువురు జిల్లా సమన్వయ సమితి సభ్యులను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఈ పేర్లను తరువాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు. ఇవీ ప్రధాన మార్గదర్శకాలు.. ♦ రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి. ♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా. ♦ రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం. ♦ సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం. ♦ వ్యవసాయాభివృద్ధిలో సహకారం కోసం జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఐకార్ వంటి సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవడం. ఎప్పటికప్పుడు వారి సలహాలతో ముందుకు సాగడం. ♦ జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం. ♦ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం. ♦ సహకార సంఘాలను, రైతు శిక్షణ సంస్థలను/కేంద్రాలను బలోపేతం చేయడం. ♦ రాష్ట్ర గణాంక శాఖ/వ్యవసాయ, ఉద్యా నవర్సిటీల సహకారంతో ఏటా పంటల ఉత్పత్తిని అంచనా వేసి.. పంటల కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం. ♦ రైతుల ఆదాయం పెంచేందుకు పంట కోతల అనంతర నష్టాలు తగ్గేలా చర్యలు చేపట్టడం. ఇందుకోసం ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపు వంటివి చేపట్టడం. స్థానిక అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడం. ♦ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు. ♦ ప్రైవేటు పరిశ్రమలతో కలసి పీపీపీ పద్ధతిలో పనిచేయడం. వ్యాపారులు, ఇతర సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం. ♦ ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి. 30 జిల్లాలకు సంబంధించి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా జిల్లాల జాబితాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ.. ♦ వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం ♦ వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం ♦ రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం ♦ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం ♦ కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం ♦ మార్కెట్లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం ♦ ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం ♦ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ♦ అవసరమైతే సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయడం ♦ వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం -
రైతు సదస్సులకు ప్రజాప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, కరీంనగర్లలో 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ రైతు సమన్వయ సదస్సులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, డీసీసీబీ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లను పిలువనున్నారు. మంగళవారం ఈ మేరకు సదస్సుల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సదస్సుల సందర్భంగా ఒక ప్రత్యేక కరపత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు. మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. 13 జిల్లాల ప్రాంతీయ రైతు సదస్సు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, మిగతా 17 జిల్లాలకు కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ప్రసంగం..మధ్యాహ్నం సభ్యులతో సంభాషణ రైతులకు గుర్తింపు కార్డులు, ప్రతి బస్సుకు బ్యానర్ ఎక్కడికక్కడ వ్యవసాయ అధికారులే ఏర్పాట్లు చేసుకోవాలని పార్థసారథి సూచించారు. సదస్సు రోజు ఉదయం 9.30 గంటలకు ముందే అధికారులు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రైతులకు ఒక గ్రీన్ ఫోల్డర్ నోట్ బుక్, రెండు పెన్నులు, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో రెండు పేపర్లు అందజేయనున్నట్లు చెప్పారు. రైతులు తమ సలహాలను ఆకుపచ్చ కాగితంపైన, తమ ప్రశ్నలను గులాబీ రంగు కాగితంపైన రాసి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని వ్యవసాయ అధికారులు క్రోడీకరించి అందజేయాలని, వాటిపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తారని తెలిపారు. ఉదయం సమావేశంలో సీఎం ప్రసంగిస్తారని, మధ్యాహ్న సమావేశంలో సీఎం రైతు సమితి సభ్యులతో సంభాషిస్తారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.జగన్మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, అదనపు వ్యవసాయ సంచాలకులు కె.విజయకుమార్, ఆర్టీసీ ముఖ్య మేనేజర్ మునిశేఖర్ పాల్గొన్నారు. -
అధిక ధరలకు ఎరువులమ్మితే లైసెన్సు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. ఎరువుల కొరతేమీలేదని పేర్కొన్నారు. ఎరువులను గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే ఎక్కువ ధరకు ఎక్కడైనా విక్రయించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. డీఏపీ సహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచిన నేపథ్యంలో పాతస్టాక్ను పాత ధరల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత ఎరువులను విక్రయించిన తర్వాతే కొత్తవాటిని రైతులకు విక్రయించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విక్రయాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చినందున పీవోఎస్ యంత్రాల ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎరువుల డీలర్లు పాత, కొత్త స్టాకు ధరలను దుకాణాల ముందు రైతులకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాలను పర్యవేక్షించేలా మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీచేయాలన్నారు. దుకాణాల రికార్డు బుక్కుల్లో పాత, కొత్త స్టాకు వివరాలు సరిగా ఉన్నాయో... లేవో పరిశీలించాలని సూచించారు. -
దీర్ఘకాలిక రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలివ్వడంలో బ్యాంకులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దీర్ఘకాలిక రుణ లక్ష్య సాధన చాలా తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కడ అవకాశం ఉందో కనిపెట్టి దానికి తగినట్టు ప్రణాళికలు వేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. -
సాగు కాని భూములు గుర్తించండి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల వారీగా తనిఖీలు చేసి సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యాన, పట్టు విభాగం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రెవెన్యూ శాఖతో సంప్రదించి భూ ప్రక్షాళన వివరాల ఆధారంగా గ్రామాల వారీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆ వివరాల ఆధారంగానే రాబోయే వ్యవసాయ బడ్జెట్ను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా సాగుకు యోగ్యం కాని భూముల లెక్కలను సరిచూసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు పరస్పర సంప్రదింపులతో ఖచ్చితమైన డేటాను అందుబాటులోకి తేవాలన్నారు. గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు తమ పరిధిలో 2017–18 ఖరీఫ్, యాసంగి పంటల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటలతో కలిపి క్రోడీకరించి వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు. ఆ వివరాలను కేబినెట్ సబ్కమిటీకి అందజేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే బడ్జెట్లో ముఖ్యమంత్రి వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నందున రెవెన్యూ గ్రామం వారీగా వ్యవసాయ పరికరాల లభ్యత వివరాలను క్రోడీకరించి ఈనెల 12 కల్లా పంపించాలని ఆదేశించారు. 15 రోజుల కార్యక్రమం... భూ ప్రక్షాళన రికార్డుల్లో పొందుపరిచిన వ్యవసాయ పట్టా భూముల వివరాలను రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న తర్వాత గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం అవుతుందని పార్థసారధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి రెవెన్యూ శాఖ నుంచి సమాచారం వచ్చే అవకాశముందన్నారు. అక్కడి నుంచి సమాచారం రాగానే గ్రామాల్లో తనిఖీలు చేపడతామన్నారు. సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు 15 రోజులపాటు జరిగే అవకాశముందన్నారు. మూల విత్తనంపై దృష్టిపెట్టాలి సోయాబీన్, శనగ, వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తికి సరిపడా మూలవిత్తనాన్ని సరఫరా చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ, విత్తన ధృవీకరణ సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థల అధికారులతోపాటు రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ దేశీయ విత్తన భాండాగారం నుంచి ప్రపంచ భాండాగారం దిశగా, విత్తనోత్పత్తిలో నూతన విధానాలను అవలంభిస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. విత్తనోత్పత్తిలో ఉన్న లోటుపాట్లను చక్కదిద్ది నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలన్నారు. అందుకే మూల విత్తనంపై దృష్టిపెట్టాలన్నారు. ఆదిలాబాద్, ముథోల్, రుద్రూరు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో వెయ్యి క్వింటాళ్ల సోయాబీన్ మూల విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. గతంలోలా కాకుండా 500 క్వింటాళ్ల శనగ మూల విత్తనోత్పత్తిని రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ చేపట్టాలన్నారు. -
పంట కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: కంది పంటను కొనుగోలు చేసిన తక్షణమే రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కందితో పాటు ఇతర పంటల కనీస మద్దతు ధరకు కొనుగోలుపై మార్కెటింగ్, మార్క్ఫెడ్, హాకా, నాఫెడ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఇప్పటివరకు రైతుల నుంచి సుమారు 9.87 లక్షల క్వింటాళ్ల కందిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి రూ.21 కోట్లు వెంటనే విడుదల చేయాలని నాఫెడ్ను ఆదేశించారు. -
వ్యవసాయ బీమాలకు ఉమ్మడి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటికీ ఉమ్మడి నోటిఫికేషన్ జారీ చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. సోమవారం పంటల బీమాపై జరిగిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఉన్నట్లే వచ్చే ఖరీఫ్లోనూ పలు జిల్లాలకు సంబంధించిన 6 క్లస్టర్లను కొనసాగిస్తామన్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, సోయాబీన్, పసుపు, వేరుశెనగ పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద, పత్తి, మిర్చి, బత్తాయి, పామాయిల్ పంటలు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఉంటాయని తెలిపారు. నష్టపరిహారం కోసం చెల్లించే స్థాయిని 80 శాతంగానే నిర్ణయించామన్నారు. ఈ రెండు బీమాలను ఒకే బీమా కంపెనీ అందజేస్తుందన్నారు. యూనిఫైడ్ ప్యాకేజీ స్కీం కింద గతంలో నిర్ణయించిన విధంగానే జిల్లాల్లో కొనసాగుతాయన్నారు. విధివిధానాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పంటల బీమా గడువు తేదీలు గత ఖరీఫ్ ప్రకారమే ఉంటాయన్నారు. సమావేశంలో వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ విత్తన భాండాగారం వైపు అడుగులు తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ నూతన కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ధ్రువీకరణ, సేంద్రియ ధ్రువీకరణ విభాగాల ద్వారా ఏడాదిలో దాదాపు 17 వేల క్వింటాళ్ల జొన్న, వరి తదితర విత్తనాలను ఈజిప్టు, సూడాన్, వంటి దేశాలకు ఎగుమతి చేశామన్నారు. వివిధ రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. దీన్ని గుర్తించిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ అధికారులను తెలంగాణకు అప్పగించిందన్నారు. ఆన్లైన్ ధ్రువీకరణ పద్ధతితో కల్తీ విత్తనాల సరఫరాను నియంత్రించగలిగామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ విత్తన సదస్సు ఆసియా ఖండంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జరగనుందని పార్థసారథి వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
బీమా సొమ్ము చెల్లించండి: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్, రబీ బీమా క్లెయిమ్స్ సొమ్మును రైతులకు ఈ నెలాఖరులోగా అందజేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. సోమవారం ఆయన బీమా కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. క్లెయిమ్స్ చెల్లింపుల విషయమై బీమా కంపెనీల జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017–18 రబీకి సంబంధించి బీమా కంపెనీల ప్రతినిధుల నియామకాలు, వివరాలు అందజేయాలన్నారు. -
కాగ్ రిపోర్ట్పై ఎందుకు మాట్లాడటం లేదు?
-
నంద్యాలలో టీడీపీ గెలుపు కాదు..బలుపు
-
పత్తి రైతులకు సహకరించండి
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు పత్తి రైతులకు సహకరించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి సూచించారు. త్వరలో పత్తి కొనుగోళ్లు జరపనున్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. వచ్చే నెల నుంచి పత్తి మార్కెట్లోకి తరలిరానున్న నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులతో పార్థసారధి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాలను వారికి వివరించారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితులను పత్తి రైతులకు సహకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించాలని, ఈ మేరకు సభ్యులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. -
అగ్రిగోల్డ్ భూములను బహిరంగ వేలం వేయాలి
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ భూములను బహిరంగంగా వేలం వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. భూ దోపిడీ, మద్యంపై ఉన్న శ్రద్ధ అగ్రిగోల్డ్పై లేదు. చిన్న చిన్న ఫ్లాట్లు చేసి అగ్రిగోల్డ్ భూములను అమ్మాలి. ప్రభుత్వం తమవారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ను కలిస్తే ఆయనకు కూడా ముప్పు ఉంటుందేమో. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు సర్కార్ భయపడుతోంది.’ అని అన్నారు. -
జగన్ పర్యటిస్తే దడెందుకు?
ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు కొలుసు పార్థసారథి ప్రశ్న రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం సాక్షి, హైదరాబాద్: బలవంతపు భూసేకరణను ప్రతిఘటిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతానికి పర్యటనకు వస్తూంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఉలికి పడుతోంది, వారిలో ఎందుకు దడ పుడుతోంది? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. జగన్ వస్తున్నారని తెలిసి రాష్ట్ర మంత్రులు హడావుడిగా ఆ ప్రాంతానికి వెళ్లి రైతులను బెదిరిస్తున్నారని చెప్పారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత సభలకు ఎవరు వెళుతున్నారో తెలుసుకుని తర్వాత వారిని వేధించడానికి గ్రామాల్లో వందలాది సీసీ కెమెరాలు అమర్చారని సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అనేక హామీలిచ్చిందని అయితే ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా.. 3, 4 పంటలు పండే సారవంతమైన 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి తీసుకున్నారని, మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకోవాలని ప్రతిపాదించారన్నారు. ఇంకా 15 నుంచి 20 వేల ఎకరాల పొరంబోకు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయన్నారు. ఇంత భారీగా భూములు అందుబాటులో ఉన్నా ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదన్న కక్షతో ఇపుడు మిగిలిన రైతులపై భూసేకరణ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోందని విమర్శించారు. ప్రజా రాజధానికి మేం అడ్డుకాదు అమరావతి నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ ఎంత మాత్రం అడ్డుకోవడం లేదని, రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు సాగిస్తున్న అవినీతిని తాము గట్టిగా నిలదీస్తున్నామని పార్థసారథి చెప్పారు. చాగంటి వ్యాఖ్యలకు తీవ్ర ఖండన రాష్ట్రంలో పేదలను, అణగారిన వర్గాలను కించ పరిచే విధానం చంద్రబాబు నుంచే మొదలైందని పార్థసారథి అన్నారు. చాగంటి కోటేశ్వరరావును ఉన్నత వ్యక్తిగా తాము భావిస్తామని అయితే ఆయన యాదవ కులాన్ని కించ పరిచే విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్థసారథి అన్నారు. -
ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటు?
-
కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దొంగలెక్కల వల్ల ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోందని, అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ అన్నారు. ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, అందుకే తాను వైఎస్ఆర్ సీపీలో చేరానని చెప్పారు. మోసాలతో బాబు పాలన: పార్థసారథి వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. వేలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, బడా వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తల మెప్పుకోసం తాపత్రయపడుతున్నారని, తమ తప్పులు, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో విజయవాడలో 40 ఆలయాలను కూలగొట్టారని, అయినా బీజేపీ మాట్లాడే పరిస్థితిలో లేదని పార్థసారథి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తన గొప్పేనని చెప్పుకుంటున్న చంద్రబాబు పర్యవసానాల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కడతారు: మేకా వెంకటప్రతాప్ అప్పారావు వచ్చే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి క్యూ కడతారని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు అన్నారు. టీడీపీ సీనియర్లు కూడా వైఎస్ఆర్ సీపీలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను చంద్రబాబు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. -
మోసాలతో బాబు పాలన: పార్థసారథి
-
ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
దివీస్ భూముల విషయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ''ఉమా.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయ వెళ్దాం. అక్కడ ప్రతి అంగుళం వెతుక్కోండి. అక్కడ ఏమీ దొరక్కపోతే మీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తావా'' అని అడిగారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు వైఎసార్సీపీ ఎప్పుడూ అడ్డం రాదని, అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు కప్పం కట్టలేకనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని పార్థసారథి అన్నారు. దివీస్ సంస్థ ఇచ్చే ముడుపులకు ఆశపడే పేదల భూములను వాళ్లకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారని ఆరోపించారు. మంత్రి ఉమా మహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని, అడ్డగోలుగా మాట్లాడకూడదని పార్థసారథి అన్నారు. -
ఆరోపణలు రుజువు చేసే దమ్ముందా!
-
ఎందుకు భయపెడతారు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత వాసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మండిపడ్డారు. ఇప్పుడు రాకెట్ లాంచర్ల ప్రస్తావన ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. వాటి పేరుతో సచివాలయ నిర్మాణ వ్యయ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారన్నారు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని రేపు ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పెట్టుకోడానికి మొట్టమొదటగా ఆయన రాకెట్ లాంచర్లతో ప్రారంభించడం దారుణమని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇదే ముఖ్యమంత్రి, తాను గెలవగానే టీడీపీ కేడర్ను ఉద్దేశిస్తూ.. తాను పదేళ్లు హైదరాబాద్లోనే ఉంటానని చెప్పారని, తెలంగాణలో టీడీపీని గెలిపించి విజయవాడ వెళ్తానన్నారని.. కానీ గట్టిగా రెండేళ్లు కూడా పూర్తిచేయకుండానే హడావుడిగా విజయవాడకు ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజానికి ఆయన రాష్ట్రంలో ఉండే రాష్ట్రాన్ని పాలించడం తమకూ సంతోషకరమేనని.. అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. కానీ.. కుర్చీలు, ఫ్యాన్లకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో అప్పుడే ఎందుకు తాత్కాలిక భవనాలకు వెళ్లారని ప్రజలకు అనుమానంగా ఉందని చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తెలంగాణ పోలీసుల నుంచి ముప్పు ఉంటుందన్న భయంతోనే వచ్చేశారని తెలిపారు. సింగపూర్, టోక్యో, చైనా అన్నీ కడతామన్న సీఎం.. కనీసం తాత్కాలిక భవనాన్ని నిర్మించడం మంచిదేనని.. కానీ ప్రతీదీ అశుభంగా ఎందుకు చేస్తున్నారని పార్థసారథి ప్రశ్నించారు. ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేసిన సంతకాలలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలుకాలేదని పార్థసారథి గుర్తుచేశారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, బెల్టు షాపులనిర్మూలన, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా అందరికీ మినరల్ వాటర్ సరఫరా చేసే సంతకం.. వాటిలో ఏదైనా ప్రజలకు సంతృప్తికరంగా జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అప్రూవ్ చేశామంటున్నారని.. ఇప్పటికైనా ఒక్క మహిళకైనా ఒక్క రూపాయి ఆమె చేతిలో పడిందని నిరూపిస్తే వాళ్లు వేసే శిక్ష అనుభవించడానికి తాను సిద్ధమని సవాలు చేశారు. మరోవైపు నల్లధనం గురించి చంద్రబాబు మాట్లాడటం చూస్తే దేశంలో ప్రజలంతా విస్తుపోతున్నారు. దేశంలోనే అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి కలిగినది ఏపీ అని సర్వే సంస్థలు చెప్పిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన అక్రమ ఆదాయ వెల్లడి పథకం గురించి ఆయన మాట్లాడారని, ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని తాము చెప్పబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే పట్టించుకోవద్దని చెప్పారని అన్నారు. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇంత డబ్బు వచ్చిందని, అది కూడా ఒకే వ్యక్తి, ఒకే సంస్థ పదివేల కోట్లు వెల్లడించిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు. తప్పుడు, దొంగ ప్రచారాలు చేస్తున్నారా.. మీవాళ్ల ద్వారా తెలుసుకుని ప్రచారం చేస్తున్నారా అని అడిగారు. ఇలా ముఖ్యమంత్రి 'ఒక వ్యక్తి' అంటూ ముందురోజు మాట్లాడతారని.. మర్నాడు జగన్ పదివేల కోట్లు వెల్లడించాని కేబినెట్లో మంత్రులు ఆరోపిస్తారని పార్థసారథి అన్నారు. ఇలా పథకం ప్రకారం జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లుకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే.. కనీసం ఒక శాతమైనా నిజాయితీ ఉందని అనుకుంటే.. తమ సవాలు స్వీకరించాలన్నారు. ఈ పదివేల కోట్ల రూపాయలు ఎవరు వెల్లడించారో ఆధారాలతో సహా బయటపెట్టాలని పార్టీ తరఫున సవాలు చేస్తున్నామన్నారు. -
ఎందుకు భయపెడతారు?
-
జగన్తో చర్చకు చంద్రబాబు సిద్ధమా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్సీపీ సవాలు విసిరింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ముఖాముఖి చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా అని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు వస్తానంటే.. తాము విజయవాడలోనైనా, కుప్పంలోనైనా చర్చకు సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమాలతో చంద్రబాబు గూబ గుయ్యిమందని, విద్యార్థులంతా చంద్రబాబును ఛీకొడుతున్నారని పార్థసారథి చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్యాకేజిని స్వాగతించడం, ఉద్యోగావకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ భృతి విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై యువభేరి కార్యక్రమాలలో విద్యార్థులు గట్టిగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబుకు, కాంట్రాక్టర్లకు మధ్య బ్రోకర్లా నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తయారయ్యారని పార్థసారథి అన్నారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?
టీడీపీ తీరు అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కె.పార్థసారథి విమర్శించారు. పుష్కరాలకు ఆహ్వానించే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆహ్వానానికి వచ్చేటపుడు మీడియాను కూడా వెంటబెట్టుకుని వచ్చారని అన్నారు. ఆహ్వానించడానికి వచ్చినవారిని తాము గౌరవంగానే చూసుకున్నామని తెలిపారు. వారికి సాదరంగా స్వాగతం పలికామని, అయినా వాళ్లు మాత్రం వెళ్తూ వెళ్తూ ఈ అంశాన్ని రాజకీయం చేశారని, ఇంతకంటే కుసంస్కారం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పుష్కరాలు ప్రారంభమైన 24 గంటల తర్వాత ఆహ్వానం ఇస్తారా, అయినా అసలు ఆహ్వానం అందించేటపుడు సంబంధిత వ్యక్తి ఉన్నారా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి కదా అని ఆయన అన్నారు. వైఎస్ జగన్ అందుబాటులో లేరని తెలిసి మరీ రాజకీయానికి పాల్పడ్డారని, టీవీల ద్వారా లీకులిచ్చి, నిఘాసిబ్బందిని పెట్టుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారని, అయినా ఆయనను కలుస్తామంటూ మంత్రి రావెల ఓఎస్డీ కాల్ చేశారని పార్థసారథి తెలిపారు. ఈ విషయాన్ని టీవీలకు లీకులు ఇచ్చారని అన్నారు. వచ్చినవాళ్లను రిసీవ్ చేసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ తనకు చెప్పారని, తూర్పుగోదావరి పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా మంత్రి కిశోర్ బాబు, విప్ కూన రవికుమార్ వచ్చారా లేదా అని జగన్ తనను అడిగారని, వాళ్లు రాలేదని చెప్పడంతో రేపు కలుద్దాంలే అని తనతో అన్నారని వివరించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి రావెల, రవికుమార్ వచ్చారని, వారిని తాను రిసీవ్ చేసుకుని రేపు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పానని, ఈ ఘటన అంతా చూస్తే ఎవరిది తప్పో అర్థమవుతుందని అన్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే తీరు ఇదేనా, ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అవమానించడం కాదా అని ప్రశ్నించారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు?
-
'చంద్రబాబుకు ఆ దమ్ము ఉందా?'
హైదరాబాద్: రెండేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిందేమీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ఇచ్చిన హామీలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని ఆరోపించారు. ఎంతసేపటికి ఆయన అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప కార్యచరణ మాత్రం శూన్యం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు నిజాలు చెబితే బాగుండేదని అన్నారు. రుణాలు మాఫీ చేశామని, అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని, డోక్రా మహిళలు రుణాల బారిన లేరని చెబితే బాగుండేదని చెప్పారు. అసలు అలా చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా అని.. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళితే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బలహీన వర్గాల సంక్షేమ అంశం గాలికొదిలేశారని అన్నారు. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణా జలాల అనుసంధానం జరిగిందని చెప్పారని, అలా ఎక్కడ జరిగిందో చూపించాలని నిలదీశారు. కృష్ణా జలాలతో ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని అన్నారు. బుధవారం ప్రభుత్వంపై అన్ని జిల్లా పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ జన్మదినం సందర్బంగా జూలై 8న అన్ని చోట్ల గడపగడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఈ నెల 13న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరిస్తారని తెలిపారు. -
'నీచ ప్రవృత్తి బయటపడింది'
-
'నీచ ప్రవృత్తి బయటపడింది'
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన దీక్షను భగ్నం చేయడంతో టీడీపీ ప్రభుత్వ నీచ ప్రవృత్తి బయటపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి విమర్శించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం విషయంలో నిన్నటి వరకు తమతో పాటు.. రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆందోళన చెందారని ఆయన అన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే దాన్ని ఎలా భగ్నం చేయాలా అని రాజకీయ కోణంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించారని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి టీడీపీ అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వం భగ్నం చేసినా కూడా వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలిపారు. దీని ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని టీడీపీ నేపతలు ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారన్నది స్పష్టంగా అందరికీ తెలిసిందని, జగన్ దీక్షతో ఈ విషయం మొత్తం ప్రజల్లోకి వెళ్లిందని పార్థసారథి అన్నారు. ఇక ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయించేందుకు ఉదయం 11 గంటలకు పార్టీ సీనియర్ నాయకుల సమావేశం ఉందని, అందులో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. -
రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!
-
రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!
రైతులకు రుణమాఫీ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు యాత్రలు ఎలా చేస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా యాత్రలు కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టో అంతా కూడా అమలు చేసేశామని యాత్రలు చేసేట్టున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడి గతంలో కేబినెట్ సమావేశాన్ని విజయవాడలో పెట్టారని, ఇప్పుడు మళ్లీ విజయవాడలో పెడితే రైతులు అడ్డుకుంటారని హైదరాబాద్లో పెట్టారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పగటిపూట నిరంతరం 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే 7 గంటలు ఇస్తామని మాట మార్చారని, కానీ ఇప్పుడు 7 గంటలు ఇచ్చేది కూడా అనుమానమేనని అన్నారు. ఇక రాజధాని నగర నిర్మాణంలో సింగపూర్ పాత్రపై తమకు అనుమానాలున్నాయని పార్థసారథి చెప్పారు. చంద్రబాబు తన ఆస్తులు కాపాడుకోడానికి సింగపూర్ ప్రభుత్వానికి ఇక్కడి రాజధాని పనులు అప్పగించారని ఆరోపించారు. బందరు పోర్టుకు అన్నివేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో వైఎస్ ఎప్పుడూ బహుళ పంటలు పండే భూములు ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బందరు పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకు ఇస్తోందని నిలదీశారు. -
'రాహుల్.. ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్లున్నారు'
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడే నిద్ర లేచి వచ్చినట్లున్నారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారథి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వార్థంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన రాహుల్ గాంధీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు పట్టించుకోడానికి రాహుల్ గాంధీకి 14 నెలల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే, చంద్రబాబు వల్లే, చంద్రబాబు డైరెక్షన్లోనే రాహుల్ పాదయాత్ర సాగుతోందని చెప్పారు. పట్టిసీమపై రాహుల్ ఎందుకు మాట్లాడలేదని పార్థసారథి ప్రశ్నించారు. ఓటుకు కోట్లు, ఎర్రచందనం కూలీల బూటకపు ఎన్కౌంటర్, పుష్కరాల తొక్కిసలాట.. ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడానికి మీకు సమయం లేదా అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీతో పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని పార్థసారథి స్పష్టం చేశారు. -
'రాహుల్..నిద్రలేచి వచ్చినట్లున్నారు'
-
'విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి'
-
'విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో ఆరుసార్లు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని పార్థసారథి విమర్శించారు. ఇప్పుడు ఏడాదిలోపే మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచారని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని పార్థసారథి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అన్నీ ఛార్జీలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై స్పందించండి
ఒంగోలు : బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ (యూఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ వి.పార్థసారధి డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం సమ్మె చేశారు. దానిలో భాగంగా యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక కోర్టు సెంటర్లోని ఆంధ్రాబ్యాంకు వద్ద నుంచి నెల్లూరు బస్టాండులోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచ్ వరకు మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన మహాసభలో పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేసేందుకు రెండేళ్లుగా బ్యాంకుల యాజమాన్యాలు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. వేతన సవరణ ఒప్పందాన్ని కూడా అమలుచేయకపోగా, ఉద్యోగులపై పనిభారం పెంచి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు యాజమాన్యాలతో పీఆర్సీ, వేతన సవరణ ఒప్పందాలు అమలుచేయించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అందుకు నిరసనగా చేపట్టిన సమ్మె కారణంగా జిల్లాలో మంగళవారం వెయ్యి కోట్ల రూపాయల క్లియరెన్స్లు, రూ.5 వేల కోట్ల నగదు లావాదేవీలు నిలిచిపోయినట్లు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సర్దార్ మాట్లాడుతూ గత నెల 12వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెచేసినప్పటికీ యాజమాన్యాలుగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ స్పందించకపోవడాన్ని ప్రతిఒక్కరూ గర్హించాలన్నారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ పేరుతో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. దానిలో సగం వెచ్చించినా బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘ నాయకుడు శరత్, ఐఏబీఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, జానకిరామయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పారా శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, ఎన్సీబీఏ జోనల్ కార్యదర్శి విజయ్మోహన్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఎం.బాలసుబ్రహ్మణ్యం, ఐఏబీఓసీ జిల్లా అధ్యక్షుడు టి.మల్లికార్జునరావు, బెఫీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శోభన్బాబు, ఎ.వేణుగోపాల్, యు.వేణుగోపాల్, ఎం.నరేంద్రబాబు, కె.కృష్ణమోహన్, వెంకటరెడ్డి, నరేంద్ర, పి.బ్రహ్మయ్య, పి.నరసింహం, రాజేశ్వరరావు, సి.సాంబశివరావు పాల్గొన్నారు. -
'చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ప్రజలు మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. విజయవాడలో శనివారం వైఎస్ఆర్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ.. రుణ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ చేసిన మోసాన్ని బట్టబయలు చేసేందుకు వచ్చే నెల 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడుతామని చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లలో కోత, రుణమాఫీ వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను ప్రజల ఎదుటే ఎండగడతామని పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కమిటీలు, అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని పార్థసారథి కోరారు. -
రాజధాని పేరుతో రైతులకు బెదిరింపులా?
రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను సీఎం చంద్రబాబు నాయుడు భయాందోళనలకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థ సారథి మండిపడ్డారు. చంద్రబాబుకు మైండ్ సెట్ ఇప్పటికీ మారలేదని ఆయన అన్నారు. రైతులను చులకన చేసి మాట్లాడటం ఆయనకు తగదని చెప్పారు. రైతులది అత్యాశ అంటూ కించపరచడం ఎంతవరకు సమంజసమని సారథి ప్రశ్నించారు. రాజధాని వస్తుందన్న వార్తల వల్లే భూముల ధరలు బంగారంలా పెరిగిపోయాయని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కావాలో, భూసేకరణ చట్టం ప్రయోగించమంటారో తేల్చుకోవాలని రైతులను ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ కాల్దరి, బషీర్బాగ్ కాల్పులు పునరావృతం అవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారని సారథి అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోందని, భూసేకరణ పేరుతో రైతులను బెదిరించడం సరికాదని ఆయన చెప్పారు. చేతనైతే కేంద్రాన్ని బెదిరించి రాజధానికి అవసరమైనవి సాధించాలని సూచించారు. ప్రభుత్వ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సారథి అన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలుపై తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయూలన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏటా గన్నీ బ్యాగుల సమస్య కారణఃగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. రైతుల నుండి కొనుగోలు ధాన్యాన్ని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేందుకు అవరసమైన వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని, చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 176 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో నవంబర్ రెండవ వారంలో ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా సదుపాయాలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం సేకరణకు 9,75లక్షల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, మరో 9, 75 లక్షల సంచులు అవసరం ఉందన్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకన్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా పౌర స రఫరాల మేనేజర్ ప్రసాద్రావు, డీఎస్ఓ మహమ్మద్ యాసిన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ శాఖ జెడీ భగవత్ స్వరూప్ పాల్గొన్నారు. -
హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం
ఎన్నికల హామీల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. చంద్రబాబు తన అనుభవంతో లక్ష కోట్ల వ్యవసాయ రుణాలను 45 వేల కోట్లకు తగ్గించారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఆర్థికమంత్రి యనమల 45 వేల కోట్లను ఏకంగా 5వేల కోట్లకు కుదించారని మండిపడ్డారు. చంద్రబాబుది రోజుకో మాట..పూటకో కమిటీ అని పార్థసారథి విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ డ్రామా ఆడుతున్నారన్నారు. చంద్రబాబు హైటెక్ పోకడలు ఇంకా వదులుకోలేదని, ప్రతిరోజూ హైటెక్, కంప్యూటర్లు, స్మార్ట్ సిటీలు అనే అంటున్నారని తెలిపారు. వాస్తవానికి ఇప్పుడు కావల్సింది స్మార్ సిటీలు కాదు, స్మార్ట్ విలేజీలని ఆయన అన్నారు. -
ఇంత చేతగాని సర్కారు ఎక్కడా చూడలేదు
అసలు ఇంత చేతకాని ఆంధ్రప్రదేశ్ సర్కారును ఎక్కడా చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. బాబు ఈజ్ బ్యాక్ అంటే ఆయన 9 ఏళ్ల పాలనాకాలంలో వచ్చిన కరువు మళ్లీ మొదలైందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో నినాదాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం బాబు వచ్చాడని తెలిసి రుతుపవనాలు పారిపోతున్నాయని ఆయన అన్నారు. కార్యకర్తలు ఏం చేసినా చూసీచూడనట్లు ఉండాలని కలెక్టర్లకు చెప్పడానికే చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారని పార్థసారథి విమర్శించారు. ఈ రెండు నెలల్లో టీడీపీ నేతల దుబారా ఖర్చుకు కొంత జోడిస్తే క్యాంప్ కార్యాలయం, మంత్రుల ఆఫీసులు ఏర్పాటు చేయొచ్చని ఆయన అన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ చేతగానితనం వల్లే కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు వచ్చాయని పార్థసారధి మండిపడ్డారు. ఇక తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఏపీ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంటుపై భరోసా ఇవ్వాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
జిల్లావాసులకు కీలక బాధ్యతలు
పార్థసారథికి పౌరసరఫరాలు తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన శాఖలలో 39 మంది ఏఎఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. అందులో పార్థసారథికి పౌరసరఫరాల శాఖ కమిషనర్గా నియమించారు. చిన్ననాటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో విద్యను కొనసాగించిన పార్థసారథికి మొదట ఆర్డీఓగా ఉద్యోగం సాధించారు. తన లక్ష్యమైన ఐఏఎస్ను పదోన్నతిపై పొందవచ్చని ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన పనితీరుతో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, డీఆర్వోగా, పీడీగా పని చేశారు. యూపీఎస్సీ ప్రొసిజర్ ఆధారంగా 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. సంయుక్త కలెక్టర్గా, కలెక్టర్గా, మార్క్ఫెడ్ ఎండీగా, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్గా, చలనచిత్ర, టీవీ, నాటక రంగ సంస్థ ఎండీగా పలు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. కలిసి వచ్చిన సాన్నిహిత్యం పార్థసారథి కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజవకర్గం నుంచి కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గం సమస్యల పరిష్కారంలో కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం పార్థసారథికి కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంచాలకులుగా పని చేస్తున్న ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్మూర్ పట్టణంలోని ఆయన బంధువులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్మూర్వాసి కీలకమైన బాధ్యతలు నిర్వహించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్వర్కు విద్యాశాఖ గ్రామీణ నేపథ్యం నుం చి ఐఏఎస్ స్థాయికి ఎదిగిన జగదీశ్వర్కు నూతన రాష్ట్రంలో కీలకమైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా బాధ్యతలతో పాటు అదనంగా రవా ణాశాఖను అప్పగించారు. బీ ర్కూర్కు చెందిన మునిగెల విశ్వనాథం-ప్రేమల దంపతు ల కుమారుడైన జగదీశ్వర్ పదోతరగతి వరకు బీర్కూర్ లో చదివారు. ఇంటర్ బోధన్లోని మధుమలాంచ, డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలల్లో పూర్తిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తిచేసి, గోల్డ్మెడల్ సాధించారు. తొలి ప్రయత్నంలో జగదీశ్వర్ చదువు పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే 1983లో హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. 1987లో గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలను తీసుకున్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ ఐఏఎస్ స్థాయికి ఎదిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జగదీశ్వర్ను మహబూబ్నగర్ కలెక్టర్గా నియమించారు. అనంతరం హైదరాబాద్ జలమండలి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆయనను పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా నియమిస్తూ.. అదనంగా రవాణా శాఖను సైతం అప్పగించా రు. ఉన్నత స్థానాలకు ఎదిగినా జగదీశ్వర్ కన్నఊరిని మరిచిపోకుండా బీర్కూర్కు సేవలందిస్తున్నారు. తనకు జన్మనిచ్చిన ఊరికి మరిన్న సేవలందిస్తానని ‘న్యూస్లైన్’తో జగదీశ్వర్ పేర్కొన్నారు. -
అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ముందే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తక్షణమే తెలంగాణ బిల్లుపై ఓటింగ్ పెట్టాలన్నారు. ఓడిపోతామనే భయంతో ఓటింగ్కు ఒప్పుకోవటం లేదని టీజీ అన్నారు. మరో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఓటింగ్ కోరటం ప్రతి సభ్యుడి హక్కు అన్నారు. ఓటింగ్ పెట్టాలని 159మంది సభ్యులు స్పీకర్కు లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చారన్నారు. మెజార్టీ సభ్యులు సమైక్యాన్నే కోరుకుంటున్నారని, గురువారం అసెంబ్లీకి భద్రత పెంచాలని మంత్రి డిమాండ్ చేశారు. -
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల
ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. కోర్టు ఆదేశించడంతో ఆ పోస్టుల పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం 2,606 మంది రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నెలరోజుల్లోగా వారికి నియామక పత్రాలు అందజేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,56,983 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 97,706 మంది శరీర దారుఢ్య పరీక్షలు అధిగమించి రాత పరీక్షకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. రాత పరీక్షలో 2,606 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో 840 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. 1994 నాటి ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో అర్హత సాధించిన వారి కోసం 265 పోస్టులను రిజర్వ్ చేసి ఉంచామని, కోర్టు తుది తీర్పు అనంతరం వారికి నియామకపత్రాలు జారీ చేస్తామని మంత్రి వివరించారు. కానిస్టేబుళ్ల ఫలితాలను ఛిఞ్ఛ.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ల అనంతరం 1994లో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ, నియామక ప్రక్రియ చివరిదశకు వచ్చిన తరువాత అర్ధంతరంగా నిలిపివేశారు. అప్పటి నుంచి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకాల ఊసేలేదు. వైఎస్సార్ రెండోసారి సీఎం అయిన తరువాత 1,600 పోస్టుల నియామకానికి సన్నద్ధమయ్యారు. కానీ, ఆయన మరణించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చివరకు 2012 నవంబర్లో 2,606 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షల నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించారు. దేహదారుఢ్య పరీక్షలలో అర్హత సాధించిన వారి వివరాలను ఏరోజుకారోజు ఆన్లైన్లో పెట్టారు. అయితే, ఫలితాలు వెలువడే సమయానికి 1994 బ్యాచ్కు చెందిన అభ్యర్థులు తమకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన కోర్టు నియామకాల్లో 1994 బ్యాచ్ అభ్యర్థులకు ఖాళీలు ఉంచాలని చెప్పడంతో.. తాజాగా ఫలితాలు విడుదల చేశారు.