
కేటీఆర్ కనుసన్నల్లో నేరెళ్ల విచారణ: జీవన్రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల దళితులపై జరిగిన దాడుల విచారణ అంతా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందని సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి ఆరోపించారు.
దళితులపై దాడుల్లో ఎస్పీ స్వయంగా పాల్గొన్నా.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల స్ఫూర్తియాత్ర నిర్వహిస్తున్న జేఏసీ చైర్మన్ కోదండరాంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని జీవన్రెడ్డి అన్నారు. కామారెడ్డిలో పోలీసులు అనుమతించిన సభను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మెను శాంతియుతంగా నిర్వహించిన కోదండరాం మాత్రం పనికిరాకుండా పోయారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు.