KT Rama Rao
-
ఎవరికీ తలవంచేది లేదు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పడినా లేచినా తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని.. ఎన్నటికీ, ఎవరికీ తలవంచేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విలీనం, పొత్తులు అంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్పై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు పోస్టులు చేశారు. ‘‘24 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది. ఇవన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఎప్పటిలాగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పారీ్టపై అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. దగాపడ్డ చేనేత రంగాన్ని బాగుచేశాం దశాబ్దాల పాటు దగాపడిన చేనేత రంగాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించేలా తీర్చిదిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరేళ్లలో చేనేత రంగానికి రూ.600 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే.. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రూ.1,200 కోట్లు వెచ్చించామని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే నేత కార్మీకులకు గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. ‘‘చేనేత మిత్ర, నేతన్నకు బీమా, 36 వేల నేత కుటుంబాలకు సాయం, 10,150 మంది నేత కార్మికులకు రూ.29 కోట్ల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. బతుకమ్మ చీరలతో సంక్షోభంలో ఉన్న నేత రంగాన్ని గట్టెక్కించాం. సిరిసిల్లలో అపెరల్ పార్క్, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశాం..’’ అని కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలనలో నేత కార్మీకుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆరోపించారు. నేత వ్రస్తాలపై జీఎస్టీ విధింపుతో పాటు ఆలిండియా హ్యాండ్లూమ్, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్సŠ, ఆలిండియా పవర్ లూమ్ బోర్డులు, చేనేత కార్మీకుల త్రిఫ్ట్ పథకం, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలు, మహాత్మాగాంధీ బనకర్ బీమా పథకాలను కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
రాహుల్ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీని.. అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బూతులు తిట్టినా, అవమానించినా కాంగ్రెస్ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూనే ఉంటామని, తమకు పోరాటం కొత్తకాదని కేటీ రామారావు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్నగర్కు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను కేటీఆర్ గుర్తు చేశారు. ‘మీరు ఇచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల ప్రకటనను నమ్మి యువత కాంగ్రెస్కు ఓటు వేసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఉద్యోగాలు లేని కేలండర్ను జారీ చేశారు. మళ్లీ హైదరాబాద్ అశోక్నగర్కు వచ్చి మీ హామీని ఎలా నెరవేరుస్తారో యువతకు చెప్పండి’.. అని కేటీఆర్ పోస్టు చేశారు. జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ అరెస్టయి బండ్లగూడ పోలీసు స్టేషన్లో ఉన్న 70 మంది యువతతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాట స్ఫూ ర్తిని చూపుతున్నారు. కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతాం’.. అని భరోసానిచ్చారు. -
ఏకపక్ష నిర్ణయాలు ఉండవు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కేవలం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలుండవు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. లోక్ సభ సన్నాహక సమావేశాల తొలిరోజు బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేగులు తెగేదాకా పోరాడేది బీఆరెస్సే ‘బీఆర్ఎస్ దళం, గళం పార్లమెంటులో ఉండాలి. బీఆర్ఎస్ వల్లే పార్లమెంటులో తెలంగాణ మాట ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బెంగాల్కు మమతా బెనర్జీ, తమిళనాడుకు డీఎంకే స్టాలిన్, ఏపీకి జగన్, చంద్రబాబు, ఒడిశాకు నవీన్ పట్నాయక్, బీహార్కు నితీశ్కుమార్, మహారాష్ట్రకు శరద్ పవార్ తరహాలో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక, పర్యాయపదం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తర్వాత విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కొట్లాడింది కూడా కేసీఆర్ మాత్రమే. మోదీ, రాహుల్ ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడరు. తెలంగాణ గళానికి బలం లేకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం వినపడకుండాపోయే చాన్స్ ఉంది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు కార్యాచరణ ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటాం. చిన్న చిన్న లోటు పాట్లను సరిదిద్దుకునే దిశగా అంతర్గతంగా కార్యాచరణ ప్రారంభించాం. కేసీఆర్ కోలుకునేందుకు మరో ఐదారు వారాలు పడుతుంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు వచ్చి అందరితోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదిలాబాద్ లోక్సభ సమీక్ష సందర్భంగా సుమారు 26 మంది నేతలు మాట్లాడిన అంశాలను క్రోడీకరించి కేసీఆర్కు వివరిస్తాం. స్థానిక వ్యతిరేకతతో కొందరు ఎమ్మెల్యేలు ఓడినా సీఎంగా కేసీఆర్ ఉంటారని ప్రజలు భావించినట్లు మా నేతలు చెప్తున్నారు. అభివృద్ధి విషయాల్లో ఎక్కడా బీఆర్ఎస్ పనితీరుపై ఫిర్యాదులు లేవు. కాంగ్రెస్ ఫేక్ ప్రాపగాండాతో యువత, ఉద్యోగులు కొంత దూరమయ్యారు. పార్టీ, పాలనలో కొన్ని లోటుపాట్లు సవరించక పోవడం వల్ల ఓటమి పాలయ్యామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దానికనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తాం..’ అని చెప్పారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడతాం ‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యా లుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్ని స్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్ను సన్నద్ధం చేస్తాం. కేడర్కు అండగా ఉంటూ కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం..’ అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్, ఆయనకు తోడుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు, పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రతిపాదనను బలపరిచారు. పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రతిపాదనను బలపరుస్తూ చప్పట్లు కొట్టడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ నియామకం ఎంపిక బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశాన్ని హరీశ్రావు సమన్వయం చేశారు. సమావేశం ముగిశాక ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులో తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. -
ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్ పోల్స్లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తను అందజేస్తాయి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రగతిభవన్లోనే ఉన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న మంత్రి హరీశ్రావు కూడా మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వంద రోజుల పాటు శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. -
నాడు కేసీఆర్ను కాపాడింది మీరే
సాక్షి, హైదరాబాద్: దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు. 11 రోజులపాటు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. -
బీఆర్ఎస్లోకి రాకేశ్రెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కష్టపడి సాధించుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకం అందని ఇల్లు లేదని, ముఖ్యమంత్రిని తమ ఇంటి పెద్దగా యువత భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఏనుగు రాకేశ్రెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, వెంకటేశ్ తదితరులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, నీళ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వరంగల్లో మెట్రోను పరుగులు పెట్టిస్తామని కేటీఆర్ హామీఇచ్చారు. రాకేశ్రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అయితే, భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు. -
రేవంత్కు అధికారమిస్తే కోఠిలో అమ్మేస్తాడు
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ. అమరుల స్తూపం వద్దకు వచ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడు. నోట్లకట్టలతో పచ్చిగా దొరికిన దొంగ నీతులు చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్రెడ్డిని రేటెంత రెడ్డి అంటున్నారు. ఆయన చేతికి అధికారమిస్తే రాష్ట్రాన్ని కోఠిలో చారాణాకు అమ్మేస్తాడు. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు బతిమాలుతున్నారని.. ఎందుకు చాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డబ్బు సంచులతో వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో ఐదు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని డీకే చెప్పడంపై నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యమ సమయంలో యువత, విద్యార్థుల చావులకు కారణమైందని, ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం ‘‘గతంలో ప్రశ్నపత్రాలు లీక్ చేసింది బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెంచా గాడు కాదా? గ్రూప్–2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేసిందే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్. ఆ తర్వాత పరీక్ష రద్దు చేస్తే గొడవ చేసిందీ వీళ్లే. కోర్టులో కేసు వేసి గ్రూప్–2 పరీక్షను రద్దు చేయించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర మెంట్ పెడతారు వాళ్లు. పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకుంటున్నా. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటా..’’అని కేటీఆర్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే వేదికల ద్వారా తిప్పికొట్టి వాస్తవాలు ప్రచారం చేయాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా దీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదేళ్ల వయసున్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. 2014 ముందు నాటి పరిస్థితులను వారికి తెలియచేయాలని.. ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే వారి డొల్లతనాన్ని బయట పెట్టాలని సూచించారు. రాబోయే నెల రోజులపాటు 33 జిల్లాల్లో విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ అభివృద్దిపై చర్చ పెట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల, నారాయణపేటల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తితోనే తాను బీఆర్ఎస్లో చేరినట్టు ఎర్ర శేఖర్ అన్నారు. ముదిరాజ్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్లోకి మోహన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు బి.మోహన్రెడ్డి గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీఆర్ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్రావుతో బిత్తిరి సత్తి గురువా రం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్ కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి ‘సాక్షి’కి వెల్లడించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
నేడు ‘లులు’ మాల్ ప్రారంభం
కూకట్పల్లి: ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షాపింగ్ మాల్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు ‘లులు’ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అ్రషఫ్ అలీ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ లులు మాల్ను మొదటి విడతలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. మరో రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో లులు మాల్ను తీర్చిదిద్దుతామని అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వివరించారు. భారతదేశంలో కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో కోయంబత్తూరులలో ఇప్పటికే లులు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మాల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన షాపింగ్ ఔట్లెట్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్స్తో సినిమా హాళ్లు, ఫుడ్ కోర్టు, పిల్లల వినోద కేంద్రం ఉంటాయని తెలిపారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆనంద్ ఏవీ. నిషద్ ఎంఎ, వి.నందకుమార్, షిబు ఫిలిప్స్, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రెజిత్ రాధాకృష్ణన్, అబ్దుల్ సలీం, ఇ.అష్రన్, నౌషద్ కిజక్కుప్పరల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్లోకి గాయకుడు ఏపూరి సోమన్న
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్ఎస్ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సాయిచంద్ లేని లోటు పూడ్చేందుకే? బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్ ఈ ఏడాది జూన్లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి. బీఆర్ఎస్లోకి బీజేపీ హైదరాబాద్ నేతలు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్గా పనిచేసిన వెంకట్రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ శుక్రవారం ప్రగతిభవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
అభివృద్ధిని ఓర్వలేకే అడ్డగోలు మాటలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ అభివృద్ధిని చూస్తూ ఓర్వలేకే ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ను జైల్లో పెడతామంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా.. అడ్డమైన మాటలు మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. అడ్డం పొడుగు లేని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని చెప్పారు. ఉప్పల్ రింగురోడ్డు వద్ద సుమారు రూ.25 కోట్లతో నిర్మించిన స్కైవాక్ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అంతకుముందు ఉప్పల్ మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ను ప్రారంభించారు. అనంతరం ఉప్పల్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మీరంతా సొంత అస్తిత్వం లేని గులాములు ‘కేసీఆర్ను ఎందుకు జైల్లో వేస్తారు? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో లక్షలాది మంది ఆడ్డబిడ్డల పెళ్లిళ్లు చేసినందుకా? సర్కార్ దవాఖానాల్లో వైద్య సేవలను మెరుగుపర్చినందుకా? ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు కేసీఆర్ కిట్లను అందజేసిందుకా? డబుల్ బెడ్రూమ్ వంటి పథకాలను ప్రవేశపెట్టినందుకా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్లో మా ప్రభుత్వం 35 ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించింది. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు సదుపాయాలను అభివృద్ధి చేసింది. కేంద్రం నారపల్లి నుంచి ఉప్పల్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ ఆరేళ్లు అయినా పూర్తి కాలేదు. అంబర్పేట్ ఫ్లైఓవర్ అలాగే ఉండిపోయింది. ఇదీ కేసీఆర్ పనితీరుకు, మోదీ పనితీరుకు మధ్య వ్యత్యాసం. కాంగ్రెస్, బీజేపీ నాయకులంతా సొంత అస్తిత్వం లేని ఢిల్లీ గులాములు. కానీ కేసీఆర్ స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని దరిద్రాన్ని, పేదరికాన్ని కేవలం తొమ్మిదేళ్లలో పోగొట్టారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ ఒక అన్నగా, ఇంటి పెద్దగా అండగా ఉండి వాళ్ల కష్టాలను తీరుస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ప్రగతి రథ చక్రాలు పరుగులు తీస్తాయి..’ అని మంత్రి చెప్పారు. అమర వీరులను చంపింది సోనియా గాందీయే.. ‘అమర వీరులను చంపింది సోనియా గాందీయే. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో జాప్యం వల్లనే వాళ్లు చనిపోయారు. అయితే రేవంత్రెడ్డి అమరుల గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. కేసీఆర్ను తిడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. పులి శాకాహారిగా మారినట్లు ఆయన అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రూ.50 లక్షల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగోడు, జైల్లో చిప్పకూడు తిన్నోడు అవినీతి గురించి మాట్లాడుతున్నాడు..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాదచారుల భద్రతకు భరోసా ‘నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఉప్పల్ రింగ్రోడ్డు వద్ద గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్కైవాక్ వల్ల రింగురోడ్డుకు 5 మార్గాల్లో పాదచారులు నిర్భయంగా రాకపోకలు సాగించవచ్చు. ఉప్పల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేసింది. రూ.453 కోట్లతో మంచినీళ్ల ట్యాంకులు, పైపులైన్లు కొత్తగా ఏర్పాటు చేశాం. త్వరలో ఎయిర్పోర్టు మెట్రో కూడా అందుబాటులోకి వస్తుంది. ఉప్పల్–ఘటకేసర్ మార్గంలో నాణ్యమైన రోడ్లు వేస్తాం..’ అని మంత్రి తెలిపారు.స్కైవాక్ను ప్రారంభించిన అనంతరం ఆయన దానిపై కొద్దిసేపు నడిచారు. హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను, స్కైవాక్ మోడల్ను తిలకించారు. హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి ప్రాజెక్టు ప్రత్యేకతలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేయూతనివ్వండి: కేంద్ర మంత్రులకు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్ధిక చేయూతనిచ్చి తనవంతు అండగా నిలవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రహదారులు, మెట్రో రైలు విస్తరణ వంటి రంగాల్లో కేంద్రం సహకారం ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రగతికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి కేటీఆర్.. శనివారం కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదనపు ధాన్యం సేకరణ, హైదరాబాద్లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్లు, పారిశుధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలపై వారితో చర్చించారు. అయితే శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో కేటీఆర్ భేటీ జరగాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఆదివారం ఉదయం కేటీఆర్ హైదరాబాద్కు తిరుగుపయనం కానున్నట్టు తెలిసింది. రోడ్లు, రైల్వే విస్తరణ, పారిశుధ్యానికి నిధులపై హర్దీప్పూరీకి విజ్ఞప్తి ► హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతోపాటు ఆర్థిక సాయం చేయాలి. ► రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేయగా.. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే రీతిలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు రూ.2,400 కోట్ల మేర ఖర్చవుతుంది. కేంద్రం రూ.800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలి. ► హైదరాబాద్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సాయం అందించాలి. ► రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 15శాతం నిధులు అంటే రూ.450 కోట్లను ఆర్థిక సాయంగా అందించాలి. ► హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ.3,722 కోట్లలో.. కేంద్రం కనీసం రూ.744 కోట్లు భరించాలి. ► రాష్ట్రంలో కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రీఫారŠమ్స్ కింద చేపట్టిన బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.750 కోట్లను సాయంగా ఇవ్వాలి. ► గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలి. ► కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన హర్దీప్ సింగ్ పూరీ.. ఈ అంశంపై త్వరలో తమ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్ను కోరారు. అదనపు బియ్యం సేకరణపై పీయూష్ గోయల్కు.. ► ఇటీవలికాలంలో çఅధిక ఉష్ణోగ్రతల కారణంగా ముడిబియ్యాన్ని అందించే పరిస్థితులు లేవు. మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైతం గత రబీ సీజన్లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి.. ఈ సీజన్లో అధికంగా పండించే ఎంటీయూ 1010 రకంలో 48.20శాతం విరుగుడు ఉందని నివేదిక ఇచ్చింది. ► ప్రస్తుత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 66.11 లక్షల టన్నుల వరిని సేకరించింది. కానీ కేంద్రం 10.20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకుంటామన్నది. అంటే 15 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతించింది. మిగతా 51.11 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి ముడి బియ్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా ఇచ్చేందుకు ప్రతి లక్ష టన్నులకు రూ.42.08 కోట్లు చొప్పున.. 34.24 లక్షల టన్నుల బియ్యానికి రాష్ట్రంపై రూ.1,441 కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అందువల్ల ఈ రబీ సీజన్కు సంబంధించి అదనంగా 20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవాలని కోరుతున్నాం. -
మనసున్న కేసీఆర్ను మూడోసారి సీఎం చేద్దాం
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తొమ్మిదేళ్ల పాలనలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు చెప్పారు. కరోనాతో రూ.లక్ష కోట్ల నష్టం వచ్చినా కల్యాణలక్ష్మి ఆగలేదని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, దేశంలో ఆసరా పెన్షన్లు అధికంగా ఇచ్చే ప్రభుత్వం మనదేనని అన్నారు. ఇలాంటి మనసున్న కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింట్యాలలో అదనపు తరగతి గదులు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్, సిరిసిల్లలో వాలీబాల్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే.. ‘మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. దివ్యాంగులకు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో రూ.200, కర్ణాటక లో రూ.1,100, మహారాష్ట్రలో రూ.300, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే..మన రాష్ట్రంలో మాత్రం రూ.3,0 16 చొప్పున చెల్లిస్తున్నాం. వచ్చే నెలనుంచి రూ.4,0 16 ఇస్తాం. గుజరాత్లో 47 వేల మంది దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. అదే మన రాష్ట్రంలో 5.15 లక్షల మందికి ఇస్తున్నాం. వారి సంక్షేమానికి రూ.1,800 కోట్లు వెచ్చించాం. ఉద్యోగాల్లో 4%, డబుల్ బెడ్రూం ఇళ్లలో 5% రిజర్వేషన్లు కల్పించాం. ఇలా ఆసరా కల్పించడం తప్పని, ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ప్రధాని మోదీ చెబుతున్నారు. బడా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం మాత్రం మంచిదట. ఎవరేం అన్నా..ఇంకా సదరం సర్టిఫికెట్ రాని వారికి, అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్లను గుర్తించి వారికి కూడా పింఛన్లు ఇస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ అరపైసా సాయం చేయలే.. ‘ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా అరపైసా సాయం చేయలేదు. ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ అయినా, సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్, కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ అయినా తేలేదు. కానీ కాళ్లళ్ల కట్టెలు పెడుతు న్నారు..’ అని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పలు సంస్థల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి ‘గంభీరావుపేటలో కేజీ టూ పీజీ స్కూల్ రాష్ట్రానికి ఆదర్శమైంది. అక్కడ ప్రభుత్వ హాస్టళ్లను కూడా ప్రారంభిస్తాం. విద్యతోనే వికాసం..విజ్ఞానం. ఒకతరం చదువుకుంటే ఇక వెనక్కి చూడాల్సిన పని ఉండదు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలి. జిల్లాలోని 60 స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నాం. ఈ నైపుణ్య శిక్షణ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో అమలు చేస్తాం. బాలి కలకు ఆత్మరక్షణ కార్యక్రమాలు అన్ని పాఠశా లల్లో నిర్వహిస్తాం..’ అని మంత్రి చెప్పారు. -
సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ‘నల్సార్’న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా సైబర్ క్రైమ్ చట్టాన్ని తెస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. తెలంగాణ చేయబోయే సైబర్క్రైమ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. సోమవారం టీ–హబ్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం 2022–23’వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగ వృద్ధికి సంబంధించిన అన్ని సూచీల్లో రాష్ట్రం జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. బెంగళూరుకు దీటుగా హైదరాబాద్ను నిలబెడతామని రాష్ట్ర అవతరణ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా.. కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక అనుమానాలు ఎదురైనా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగినా తెలంగాణ తన సొంత ప్రణాళికలతో ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ వస్తోందని కేటీఆర్ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే 9 ఏళ్లుగా ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని వివరించారు. అమెరికా, యూకే పర్యటనలో తాను సాధించిన పెట్టుబడి ప్రకటనలను, గత ఏడాది కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన వివరాలను కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటామని.. ప్రాథమిక మౌలిక వసతుల నుంచి అంతరిక్షం దాకా తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టి పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీలోనూ అద్భుత ప్రగతి ఫార్మా, బయో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2032 నాటికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతాయని ప్రకటించిందని.. ఐటీఐఆర్ అమలు చేయకున్నా ఆ గడువుకు 9 ఏళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ రంగం మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్రావు, వీ హబ్ సీఈఓ దీప్తిరావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మెరుగైన విధానాలే మా నినాదం
సాక్షి, హైదరాబాద్: ఎవరినో గద్దె దించి, వేరెవరినో ఎక్కించాలనేది తమ విధానం కాదని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. కాంగ్రెస్తోనో మరొకరితోనో జట్టు కట్టడం, థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ కూడా తమ విధానం కాదన్నారు. రాజకీయ ప్రక్రియలో గెలుపోటములు కాకుండా ప్రజలకు ఏం చేస్తామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మోదీని గద్దె దించడమనేది కాకుండా ప్రభుత్వ పాలనలో మెరుగైన విధానాలే తమ నినాదమని స్పష్టం చేశారు దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విపక్ష భేటీకి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. దేశమంతటా బీఆర్ఎస్ సంచలనం ‘భారత్లో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. కాంగ్రెస్ లేదా బీజేపీ నాయకత్వం వహించాలనే ఆలోచనకు మేం వ్యతిరేకం. మోదీ, రాహుల్ ఏం చేస్తారన్నది మాకు అనవసరం. 2024లో మేము మాకు వీలున్న చోట పోటీ చేస్తాం. మెరుగైన పాలన ఎక్కడ ఉంటే అటువైపు ప్రజ లు ఆకర్షితులవుతారు. బీఆర్ఎస్ సంచలనం దేశమంతటా విస్తరిస్తుంది. ఎన్నికలకు 6నెలల ముందే ఎవరికి టికెట్లు వస్తాయో రావో చెప్పలేము. పనితీరు ఆధారంగా పాత వారికి టికెట్లు ఇస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. మాపై వ్యతిరేకత లేదు ‘కర్ణాటకలో అసమర్థ బీజేపీని ప్రజలు తిరస్కరించారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధాని, కేంద్రం హోం మంత్రి, 8 మంది సీఎంలు కర్ణాటకలో మకాం వేయడాన్ని ప్రజలు అర్దం చేసుకున్నారు. కర్ణాటక ఓటర్లు బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే తిరస్కరించారు. తెలంగాణలో మా ప్రభుత్వ వ్యతిరేకతకు ఎలాంటి కారణాలు లేవు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో 109 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీని ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వారికున్న మూడు సీట్లు కూడా మళ్లీ రావు..’అని స్పష్టం చేశారు. తెలంగాణను దేశం అనురిస్తోంది.. ‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ మోడల్కు పునాది. నాయకులు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలంగాణ తొమ్మిదేళ్లలో రుజువు చేసింది. సంపదను సృష్టించి అన్ని వర్గాల సంక్షేమానికి అందిస్తున్నాం. విద్య, ఆరోగ్యం, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్దితో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నడుమ అభివృద్ధిలో సమతూకం పాటిస్తూ విధానాల రూపకల్పనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నాం. గుడిసెల నుంచి గూగుల్ దాకా.. పాతాళంలో బొగ్గు నుంచి అంతరిక్షంలో రాకెట్ దాకా.. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. సమర్ధ ప్రభుత్వం– సుస్థిర నాయకత్వం నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణను ఈ రోజు దేశం అనుసరిస్తోంది. తెలంగాణ ఏర్పడి దశాబ్ది అవుతున్న సందర్భంలో జేబులో ఉన్న రూపాయిని కింద పారేసి చిల్లర నాణేలు ఏరుకోవద్దు. కేసీఆర్ లాంటి అద్భుత నాయకుడు ఉండగా వీధుల్లో కారుకూతలు, పెడబొబ్బలు పెట్టే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధాని మోదీ, నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సవాలు చేస్తున్నా. దేశంలో తెలంగాణ మోడల్కంటే మెరుగైన నమూనా ఉన్న రాష్ట్రాన్ని చూపండి. 55 ఏళ్లలో జాతీయ పార్టీలు చేయలేని పనిని తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారు. దశాబ్దం నిండుతున్న సందర్భంగా ఎన్నికల సంవత్సరంలో కేసీఆర్, బీఆర్ఎస్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నా..’అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలి ► ‘రాజకీయాల్లో పోరాటాలు, కొట్లాటలు సమ ఉజ్జీలతో ఉంటాయి కానీ మరుగుజ్జులతో ఉండవు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయ మరుగుజ్జులు. ఇక్కడ మరో ప్రత్యామ్నాయం ఉందని రాష్ట్ర ప్రజలు అనుకోవడం లేదు. మేము చేసింది చెప్పుకునేందుకు ఎంతో ఉంది. 90 నుంచి 100 సీట్లతో మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. తెలంగాణ సీఎంగా వరుసగా తొమ్మిదేళ్లు పనిచేసి రికార్డు సృష్టించిన కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాలి..’అని డిమాండ్ చేశారు. డీ లిమిటేషన్లో హేతుబద్ధత ఉండాలి ► ‘2026లో జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో శాస్త్రీయత, హేతుబద్ధత ఉండాలి. కేంద్రం సూచన మేరకు జనాభా నియంత్రణ చేసిన ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిస్తామనడం దారుణం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రగతిశీల రాష్ట్రాలకు నష్టం జరగకుండా లోతైన చర్చ జరిపి సరైన పరిష్కారం చూపాలి. జనాభాను అధికంగా పెంచి దేశానికి గుదిబండగా మారిన రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచి, బాగా పనిచేసిన రాష్ట్రాల గొంతు నులమడం సరికాదు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించడంలో తప్పులేదు..’అని పేర్కొన్నారు. ఏది నిజమో ఒవైసీనే అడగండి ► ‘తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదంటూ అసదుద్దిన్ ఒవైసీ గతంలో ఉత్తరప్రదేశ్లో ప్రసంగించారు. ఇక్కడ మైనారిటీలకు ఏమీ జరగడం లేదని అంటున్నారు. మరి ఆయన చేసిన ప్రకటనల్లో ఏది కరెక్టోఆయన్నే చెప్పమనండి..’అని తెలిపారు. అత్యంత సమర్ధ ప్రధాని పీవీ ► ‘దేశ ప్రధానుల్లో ఇప్పటివరకు అత్యంత సమర్ధుడు పీవీ నర్సింహారావు, ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే నేడు భారత్ అభివృద్ధి చెందుతోంది. సొంత పార్టీలో అవమానంతో పాటు గుర్తింపునకు నోచుకోని వ్యక్తి పీవీ. కాంగ్రెస్ విధానాలే భారత్ దుస్థితికి కారణం. రాహుల్ గాంధీ పార్టీకి బదులుగా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే బెటర్. నోట్ల రద్దుతో సాధించిందేమిటో మోదీ నేటికీ దేశ ప్రజలకు చెప్పలేదు. గతంలో తుగ్లక్ గురించి విని ఉన్నాం.. మిగతాది మీరే పూరించుకోండి. ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, రేవంత్కు దేశానికి ప్రధాని కాగలిగే సత్తా ఉంది (వ్యంగ్యంగా)..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ
రాయదుర్గం: దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ (టీఆర్ఐసీ)ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోబోటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలుస్తామని, రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చే జూలైలో ‘గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్’ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్లో ‘తెలంగాణ రోబోటిక్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లా డారు. ఇది ఫ్రేమ్వర్క్ కింద అన్ని కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి నోడల్ బాడీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని కేంద్రంగా చేయడం వంటి లక్ష్యాలతో ‘స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్’ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమేషన్, కన్సూ్యమర్ రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించడానికి ఈ ఫ్రేమ్వర్క్ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని స్టార్టప్లకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆథరైజేషన్ సపోర్ట్, మార్కెట్ ఇన్సైట్లు, ఇన్వెస్టర్ కనెక్షన్లు తదితరాల కోసం ప్రపంచస్థాయి రోబోటిక్స్ యాక్సిలరేటర్ను ఏర్పాటు చేస్తుందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ వినియోగంలో చైనా, జపాన్, అమెరికా తర్వాత పదో దేశంగా భారత్ గుర్తింపు పొందుతోందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి, వివిధరంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్ పార్కు ఐఐఎస్సీ, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఏజీహబ్, ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవిలంకా, పలుసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నా కొడుక్కి 17 ఏళ్లు, ఓ రోజు సడన్గా నా దగ్గరకు వచ్చి: కేటీఆర్
'మ్యూజిక్ స్కూల్ సినిమా డైరెక్టర్, నిర్మాత పాపారావు బియ్యాల నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పని చేశారు. పాపారావు సినిమా తీశారనగానే చాలా ఆశ్చర్యపోయా. పేరెంట్స్ తమ పిల్లలు ఇంజనీర్, లేదంటే డాక్టర్ కావాలనుకుంటున్న ధోరణిని సినిమాలో చూపించారు. మనకు కావాల్సింది ఇంజనీర్లు మాత్రమే కాదు ఆర్టిస్టులు కూడా' అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. శర్మన్ జోషి, ప్రకాశ్ రాజ్, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. శనివారంనాడు హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'నా కొడుక్కి 17 సంవత్సరాలు. మూడు నెలల కిందట సడన్గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. చాలామందిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్ ఇండస్ట్రీ పెట్టాలి' అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ.. 'మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫామెన్స్ ఇస్తారు' అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రియ, దిల్ రాజు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా.. తెలంగాణకు దక్కింది శూన్యమే
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా తెలంగాణతోపాటు టెక్స్టైల్ రంగానికి దక్కింది శూన్యమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ చివరిదని, అందులో నేత కార్మికులు, టెక్స్టైల్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదన్నారు. ఈమేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాధాన్యతను కేంద్రం గుర్తించడం లేదని, రూ.1600 కోట్లతో చేపట్టిన ఈ పార్క్లో మౌలిక వసతుల కల్పనకు రూ.900 కోట్లు కేటాయించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి ప్రోత్సాహం లేనందునే బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాల విధానం లేనందునే మేకిన్ ఇండియా నినాదంగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సహకరించాలని కోరారు. మెగా క్లస్టర్కు రూ.100 కోట్లు ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో 25 వేల మరమగ్గాలు ఉన్నందున మెగా క్లస్టర్గా గుర్తించి రూ.100 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూచైన్ బలోపేతం, మార్కెట్, నైపుణ్యాభివృద్ధి తదితరాల కోసం రూ.990 కోట్లు కేటాయించాలన్నారు. పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరమగ్గాల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ‘ఇన్–సిటు పవర్లూమ్ అప్గ్రెడేషన్’కింద 13వేల మరమగ్గాల ఆధునికీరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్రంలో 40వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నందున ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలి. చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమలో 80శాతం చిన్న, సూక్ష్మ యూనిట్లు ఉన్నందున పన్నుల భారం తగ్గించాలి. ప్రస్తుతమున్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలి’అని కోరారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ టెక్స్టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. టెక్స్టైల్ రంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్ ఇండియా హ్యాండూŠల్మ్, పవర్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ మండళ్లను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగం సాధించండి.. ఉన్నతస్థాయికి ఎదగండి
మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్నిఅందిపుచ్చుకుంది. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మనసు పెట్టి చదివి తల్లిదండ్రుల స్వప్నాన్ని సాకారం చేయాలి. - కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, యువత ప్రాణం పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నడుస్తున్న ఉద్యోగపర్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశలు, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ‘మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది..’ అని చెప్పారు. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మనసు పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తెలంగాణ యువతకు ఆదివారం మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. కేసీఆర్ నేతృత్వంలో మారిన రాష్ట్ర పరిస్థితిని, తెలంగాణ ఆకాంక్షల సాధనకు జరుగుతున్న కృషిని వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు. కేటీఆర్ ఏమన్నారంటే.. తొమ్మిదేళ్లలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ ► వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాం. తొమ్మిదేళ్ల పాలనలో సుమారు 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా నిలవబోతున్నాం. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టాం. ఇప్పటికే సుమారు 32 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిష¯న్తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. మొత్తంగా అతితక్కువ సమయంలో 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది. 95 శాతం స్థానికులకే.. ► ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యత లభించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారు. అడ్డంకిగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిన తరువాత ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది. విద్యార్థులు, యువకుల కోరిక మేరకు ప్రభుత్వం ఉద్యోగ వమోపరిమితిని కూడా సడలించింది. తద్వారా మరింత మందికి అవకాశం దక్కింది. క్రమబద్ధీకరణ..పారద్శకత ► ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించబోతున్నాం. తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగ నియామక ప్రక్రియపై ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగాన్నీ అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు–1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం మెరుగుపరిచింది. ఇప్పటిదాకా సుమారు 17 లక్షల మందికిపైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణాదే. దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టంను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టీఎస్ఐసీ వంటి వేదికలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యువత కోసం కోచింగ్ సెంటర్లతో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి దాకా ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు ► ఇప్పటిదాకా ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. సీఎం ఆశయానికి అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రాణం పెట్టి చదవండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోవద్దు. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలి. సానుకూల ధృక్పథంతో సాధన చేసి, స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి. -
రాజకీయాల్లోకీ సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలను అమలు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. చట్టాల రూపకల్పనలో నల్సార్ విశ్వవిద్యాలయం నిమగ్నమైందని, ఈమేరకు వర్సిటీతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రత్యేక సైబర్ చట్టాలతో కేసుల విచారణ, దర్యాప్తు వేగవంతమవడంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టంచేశారు. సైబర్ చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సైయంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలతోపాటు రాజకీయాల్లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు గూగుల్ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులు, న్యాయ విభాగాలు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయాల్లో సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి రిజిస్టర్లోకి ఎక్కితే... అమెరికా తరహాలో లైంగిక నేరస్తుల జాబితా తెలంగాణలోనూ అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితాతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని సూచించారు. నిందితుల పేరు, ఇతరత్రా వివరాలను రిజిస్టర్లో ఎక్కించాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఒకసారి రిజిస్టర్లో ఎక్కితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలకూ అనర్హులుగా ఉంటారని హెచ్చరించారు. డ్రోన్ పోలీసింగ్.. అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం విచారకరమని కేటీఆర్ చెప్పారు. సైబర్ మోసాల బారిన పడిన వారు 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ‘మారుమూల ప్రాంతంలోని బాధితుడు డయల్ 100కు కాల్ చేస్తే పోలీసు వెళ్లాలంటే సమయం పడుతుంది. పోలీసు కంటే ముందే కెమెరా, సైరన్, లైట్తో డ్రోన్ వెళ్లి అక్కడి పరిస్థితిని పోలీసులకు చేర్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలి. ఈ మేరకు డీజీపీ, హోంమంత్రి కార్యాచరణ రూపొందించాలి’ అని కేటీఆర్ చెప్పారు. నెక్ట్స్జెన్ పోలీసింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి సాధారణ పోలీసులు, సిబ్బంది స్థానంలో టెక్ పోలీస్, నెక్ట్స్జెన్ పోలీసుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ ఎకో సిస్టమ్ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని, సైబర్ సేఫ్టీ కేంద్రం ఏర్పాటుకు కారణమిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్రావు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఏసీబీ డీజీ అంజనీకుమార్ యాదవ్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, సైయంట్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Munugode By Election: గడువు ముగిసే వరకు కదలొద్దు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార గడువు ముగిసేంత వరకు పార్టీ ఇన్చార్జిలు తమకు కేటాయించిన చోట ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ ఇన్చార్జిలతో గురువారం ఉదయం ప్రగతిభవన్ నుంచి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30న చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరవుతున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 30న బహిరంగ సభ, 31న నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నందున ఈ రెండు రోజులను మినహాయిస్తే ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రచారం ముగిసినా పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఫోన్ ద్వారా పార్టీ స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 30న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణను సవాల్గా తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు: కేటీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ‘అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏ మాత్రం పట్టించుకోవద్దు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
రాష్ట్రపతి ఎన్నికలు.. తొలి ఓటు కేటీఆర్ది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 118 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు ఓటు వేయలేదు. కరోనా, డెంగీతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో ఓటు వేయలేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు విదేశాల్లో ఉండటంతో ఓటు వేయలేకపోయారు. దీనితో తెలంగాణకు సంబంధించి 117 ఓట్లు పోలవగా.. ఏపీకి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ఎన్నికల సంఘం అనుమతితో ఇక్కడే ఓటు వేశారు. దీనితో మొత్తం 118 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) ఓటు విషయంగా కొంత గందరగోళం నెలకొంది. తొలిఓటు వేసిన కేటీఆర్ సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తొలిఓటు వేయగా.. ఏపీ ఎమ్మెల్యే మహీధర్రెడ్డి రెండో ఓటు వేశారు. ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేరుగా అసెంబ్లీకి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, సీతక్క, పోదెం వీరయ్య కలిసి వచ్చి ఓటేయగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి విడివిడిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్లి ఓటేశారు. బీజేపీ ముగ్గురు సభ్యుల్లో రఘునందన్రావు, రాజాసింగ్ ఉదయం, ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఓటు వేశారు. కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా తరఫున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, హన్మంత్ షిండే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పోలింగ్ ఏజెంట్లుగా.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తరఫున బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్ను అసెంబ్లీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మంగళవారం తెల్లవారుజామున వాటిని ఢిల్లీకి తరలించనున్నారు. సీతక్క ఓటుపై అయోమయం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బ్యాలెట్ పేపర్పై ఓటేసే సమయంలో ఎక్కువ సమయం ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్దే ఉండిపోయారు. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మహేశ్వర్రెడ్డి.. బ్యాలెట్ విషయంగా ఏదైనా అనుమానం ఉంటే మరో బ్యాలెట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సీతక్క మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారులను కోరారు. ఓ అభ్యర్థి పేరు పక్కన బాక్స్లో ఒకటి అని ప్రాధాన్యత ఓటు వేసి.. పైన అభ్యర్థుల పేర్లు అని ఉన్న చోట పొరపాటున ‘రైట్ మార్క్’ వేశానని.. మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ఆమె కోరడం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల అధికారులు దీనిపై ఈసీ ఉన్నతాధికారులను సంప్రదించి, మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో సీతక్క అదే బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేసి వెనుదిరిగారు. బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బ్యాలెట్పై పెన్ను గుర్తు పడడం వల్ల మరో బ్యాలెట్ ఇవ్వాలని కోరానని, అధికారులు ఇవ్వలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సీతక్క.. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టుగా ప్రసార సాధనాల్లో ప్రచారం జరిగింది. దీనిపై సీతక్క ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. తాను ఓటేసేప్పుడు ఎలాంటి తప్పు దొర్లలేదని, ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని.. మరో పేపర్ ఇవ్వనందున ఇంకు పడిన బ్యాలెట్నే బాక్సులో వేశానని తెలిపారు. -
అన్ని చోట్లా పరిశ్రమలు
పటాన్చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఆల్ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆల్ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. -
అలకల కారుకు.. కేటీఆర్ రిపేరు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. సంస్థాగత లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు సూచనల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. కేటీఆర్తో పాటు ఆర్థిక మంత్రి హరీశ్రావు ఇటీవలి కాలంలో జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, కేడర్తో సమన్వయం ఎంత మేర ఉంది వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ఆయా అంశాలపై కేసీఆర్కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్లు సమాచారం. కాగా కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం.. పార్టీలో బహుళ నాయకత్వమున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు కీలక నేతల్లో అసంతృప్తి ఉంది. దీంతో ఈ అసంతృప్తి మరింత ముదరక ముందే సయోధ్య కుదర్చాలని నిర్ణయించి ఆ మేరకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పొంగులేటి ఇంట్లో భోజనం ► ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో కొనసాగుతుండటంతో నేతల నడుమ విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు తమ సొంత రాజకీయ అస్తిత్వం కోల్పోకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి ఖమ్మం పర్యటన సందర్భంగా పొంగులేటి నివాసంలో భోజనం చేసిన కేటీఆర్, పార్టీ జిల్లా కార్యాలయంలో కీలక నేతలందరితోనూ భేటీ అయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలని, సమర్ధత ఆధారంగానే టికెట్ కేటాయింపులు ఉంటాయని ప్రకటించడంతో సిట్టింగులు, మాజీల్లో కొత్త ఆశలు చిగురించాయి. జూపల్లి ఇంటికెళ్లి మంతనాలు ► నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి నడుమ తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొల్లాపూర్ పర్యటనకు ముందే ప్రగతిభవన్లో కేటీఆర్ ఆ నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే కొల్లాపూర్లో జరిగిన సభకు జూపల్లి దూరంగా ఉండటంతో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. ఈ భేటీ తర్వాత జూపల్లి వర్గంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని వీడకుండా జాగ్రత్తలు ► ఇటీవలి కాలంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ విప్ నల్లాలు ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరోవైపు దివంగత మాజీ మంత్రి పి.జనార్ధన్రెడ్డి కుమార్తె, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ నెల 23న కాంగ్రెస్లో చేరుతున్నారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బహుళ నాయకత్వమున్న నియోజకవర్గాల్లో మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ను వీడి ఎన్నికల నాటికి ఇతర పార్టీల్లో చేరతారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందనే భరోసా ఇచ్చేందుకే కేసీఆర్ ఆదేశాలకు మేరకు కేటీఆర్ దిద్దుబాటుకు దిగినట్లు సమాచారం. -
‘111’ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. అలాగే నగర అభివృద్ధి ఫలాలు 111 జీవో పరిధిలోని గ్రామస్తులూ కోరుకోవటం న్యాయమైన హక్కే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేక మాస్టర్ను రూపొందిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి? ఏ తరహా నిర్మాణాలు ఉండాలనే అంశంపై తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ∙ 217 చదరపు కిలో మీటర్ల హైదరాబాద్ విస్తీర్ణానికి రెండున్నర రెట్లు అధికంగా 538 చ.కి.మీ మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. సుమారు 1.32 లక్షల ఎకరాల భూమి అదనంగా అందుబాటులోకి రానుంది. భవిష్యత్తు తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్ ప్లాన్ను రూపొందించాలి. ఆ తర్వాతే పర్యావరణానికి హానీ కలిగించని నిర్మాణాలకు చోటు కల్పించాలి. తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండాలి. వర్షపు నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్లో ఆయా అధ్యయన ఫలితాలకు కూడా అవకాశం కల్పిం చాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్లో నెట్ జీరో సీవరేజ్ పాలసీని అవలంభించాలి. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉండాల్సిందే. తద్వారా మురుగు నీరు బయటికి వెళ్లదు. జంట జలాశయాలు కలుషితం కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్లను అధ్యయనం చేయాలి. అక్కడ స్టీల్, సిమెంట్ వంటి భవన సామగ్రి స్థానంలో ప్రత్యామ్నాయం వినియోగిస్తారు. కలప ఇళ్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటాయి. ఈ తరహా జోన్లను సందర్శించి ఆ ప్రకారం చేయాలి. కాంప్లిమెంటరీ డెవలప్మెంట్.. హైదరాబాద్ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలి. ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు పోటీగా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీగా ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశాలున్నాయి. ఆయా గ్రామాలలో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్హౌస్లను నిర్మించడం వల్ల హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుంది. ఒకవేళ 111 జీవో పరిధిలో హైరైజ్ భవనాలకు అనుమతి ఇస్తే గనక.. హైదరాబాద్ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటూ కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్సాగర్ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుధ్యం, రోడ్లను మెరుగుపరచాలి. లేకపోతే అవి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లాగా తయారవుతాయి. నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని కల్పించవచ్చు. దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. హెచ్ఎండీఏ ఏరియాలో విలీనం కావటానికి ఇప్పటికే ఉన్న భవనాలను ఒకేసారి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఐదు జోన్లతో అద్భుతం.. ► జంట జలాశయాల నుంచి కొన్ని కి.మీ మేర బఫర్ జోన్. ఇక్కడ రిసార్ట్లకు అనుమతి ఉండాలి. ► రెండోది స్పోర్ట్స్ జోన్. ఇక్కడ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► స్టీల్, సిమెంట్ వంటి వాటితో కాకుండా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో కూడిన నిర్మాణాలు మూడో జోన్. ఉదాహరణ: విద్యా సంస్థలు. ► ఫోర్త్ జోన్లో తక్కువ సాంద్రత కలిగిన గృహ నిర్మాణాలు, వినోద కేంద్రాలు. ఇవి కూడా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో నిర్మితమైనవై ఉండాలి. ► ఐదో జోన్లో మాత్రమే ఐటీ, బహుళ అంతస్తులకు అనుమతి ఉండాలి. దీంతో అన్ని జోన్లలో కార్యకలాపాలు జరుగుతాయి. ఆయా గ్రామస్తులు పెరిగిన భూముల రేట్ల ప్రయోజనాన్ని పొందుతారు. -
తెలంగాణలో బయోఫార్మా దిగ్గజం భారీ పెట్టుబడులు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోఫార్మా దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ (బీఎస్వీ) తాజాగా హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్, టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావుతో మంగళవారం సమావేశమైన సందర్భంగా బీఎస్వీ ఎండీ సంజీవ్ నావన్గుల్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ కేంద్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, రేబిస్ టీకాలు, హార్మోన్లు మొదలైనవి ఉత్పత్తి చేయనున్నట్లు సంజీవ్ వివరించారు. ప్రపంచ టీకాల రాజధానిగా తెలంగాణ పేరొందిన నేపథ్యంలో.. జీనోమ్ వ్యాలీలో భారత్ సీరమ్స్ రాకను స్వాగతిస్తున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం పటిష్టతకు ఇది నిదర్శనమని, సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు. -
పెట్టుబడిదారుల కోసం ‘పింక్ బుక్’
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో వచ్చే వారికి మార్గద ర్శకంగా ఉండేలా తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించిన ‘పింక్ బుక్’ను మంగళవారం ప్రగతిభవన్లో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వసతులు, మౌలిక సౌకర్యాలపై సంపూర్ణ అవగాహన కలిగేందుకు పింక్బుక్ దోహదం చేస్తుందని, వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, శాఖల కాంటాక్టు వివరాలతో రూపొందించిన పింక్బుక్ ద్వారా పెట్టుబడి దారులు తమ భవిష్యత్ పెట్టుబడులపై నిర్ణ యం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. నిరంతర విద్యుత్, మానవ వనరులు తదితర వివరాలను ఈ బుక్లో పొందుపరిచినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ వింగ్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లక్ష్యాన్ని చేరు కుంటున్న నేపథ్యంలో కార్యకర్తల వివరాల డిజిటలైజేషన్లో వేగం పెంచాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. సభ్యత్వ నమోదు, జిల్లా కేంద్రా ల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అం శాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 31తో కార్యకర్తల జీవిత బీమా ప్రీమి యం గడువు ముగుస్తున్నందున సభ్యత్వ నమోదు వివరాలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 1న బీమా సంస్థకు ప్రీమి యం చెల్లింపు చెక్కుతో పాటు కార్యకర్తల వివరాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి కారణాలను ఆరా తీశారు. సభ్యత్వ నమోదు సమయంలో కరోనా లాక్డౌన్తో లక్ష్యం చేరుకోలేదని ఇన్చార్జిలు వివరించారు. లక్ష్యాన్ని చేరని పార్టీ శాసన సభ్యులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి త్వరగా వివరాలు ఇవ్వాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ద్వారా వసూలైన మొత్తాన్ని పార్టీ కార్యాలయంలో జమయ్యేలా చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్ ఆదేశించారు. -
కరోనా కష్టాలు తీరేలా కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగానికి భారత్ను మరింత ఆకర్షవంతమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు కొత్త ఫార్మాస్యూటికల్ విధానం తీసుకురావాలని రాష్ట్ర, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఫార్మా ఎగుమతులను పెంచేందుకు కొత్త ఎగుమతుల విధానం ప్రవేశపెట్టాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు కేటీఆర్ బుధ వారం లేఖ రాశారు. దేశంలో ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన చర్యలను లేఖలో ప్రస్తావించారు. అవి ఇలా.. ► భారతదేశ ఫార్మా రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) అత్యంత కీలకం. రూ.10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమను ప్రస్తుతం ఎంఎస్ఎంఈగా గుర్తిస్తున్నారు. దీనికి బదులుగా ఇకపై రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలను ఎంఎస్ఎంఈలుగా గుర్తించి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తయార య్యే ఫార్మా ఉత్పత్తుల్లో నాణ్యత తక్కువగా ఉంటుందనే ప్రచారంతో దేశీయ ఫార్మా రంగం కొన్ని అవకాశాలను కోల్పోతోంది. దీనిని అధిగమించేందుకు లక్షిత దేశాలతో చర్చించడంతో పాటు, భారతీయ ఫార్మా రంగ ఉత్పత్తుల నాణ్యత పెంచేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. ఫార్మా రంగం అభివృద్ధికి అవసరమైన వాతావరణం, అభివృద్ధి, అనుమతులకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవసరం. ► కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచానికి అవసరమైన మందులను దేశీయ ఫార్మా రంగం సరఫరా చేస్తుండగా, తెలంగాణ భారతదేశంలో ఫార్మా హబ్గా కొనసాగుతోంది. తెలంగాణలో సుమారు 800 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉండగా, జీడీపీలో 35 శాతం వాటాను కలిగి ఉంది. లైఫ్సైన్సెస్ రంగం తెలంగాణలో 1.20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ► లాక్డౌన్తో ఉత్పాదన సామర్థ్యం తగ్గడం, కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఫార్మాస్యూటికల్ రంగం లో 80% పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కావడంతో ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడం, ఇతర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటికి ఆదాయ పన్ను, జీఎస్టీ రిఫండ్ను వెంటనే ఇవ్వడంతో పాటు పన్నుల వసూలుపై ఆరు నెలలు మారటోరియం విధించాలి. ► కేంద్రం పరిధిలోని ఎగుమతుల ప్రోత్సా హక పథకాల నిబంధనలు సరళతరం చేయడంతో పాటు, పెండింగులో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయాలి. చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయ ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తక్కువ వడ్డీ రేట్లపై ఫార్మా కంపెనీలకు రుణాలు, అత్యవసరం కాని ఔషధాల రేట్లను నిర్ధారించడంలో పది శాతం ఉదారంగా వ్యవహరించడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఇతర దేశాల నుంచి ముడి సరుకులు దిగుమతులు చేసుకునే కంపెనీలకు నౌకాశ్రయాల్లో సత్వర అనుమతులు, ఫార్మా రంగంలో సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) పెంచేందుకు ఆర్థిక రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు వంటి విషయాలను కేటీఆర్ సూచించారు. ► ఫార్మా రంగానికి అవసరమైన ముడి పదార్థాలు (ఏపీఐ)కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు భారత్లో ఉత్పాదన ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ ఫార్మా సిటీకి పెట్టుబడులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. -
కేటీఆర్ రోడ్ షో
-
కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతా
సాక్షి, వికారాబాద్: కొడంగల్లో టీఆర్ఎస్ను గెలి పిస్తే ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి రైతు ల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్షో నిర్వహించారు. అనంతరం భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబందుల ప్రభుత్వం కావాలో.. ‘రైతు బంధు’ప్రభుత్వం కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. నాణ్యమైన కరెంటు పగటి పూట ఇవ్వాలని అడిగిన రైతులను కాల్చి చంపిన కాంగ్రెస్ను గెలిపించి మోసపోవద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమమని, మహాకూటమి గెలిస్తే సంక్షోభమని అన్నారు. కాంగ్రెస్లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని, వారంతా కలిసి 60 నెలలు పాలిస్తారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అని, కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగల రా అంటూ ప్రశ్నించారు. జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వీరిలో రేవంత్రెడ్డి, డీకే.అరుణ, చిన్నారెడ్డిలున్నారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే టికెట్ల కోసం, బీ ఫాంలకోసం, చివరకు బాత్రూంకు వెళ్లాలన్నా అనుమతికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుం దని తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, పింఛన్కు అర్హత వయసు 57 ఏళ్లు, నిరుద్యోగ భృతి, రూ.లక్షలోపు రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన వేగవంతం, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలోని సీఎంలు నేర్చుకునేలా కేసీఆర్ పాలన ఉందని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి ‘మహా కూటమి’ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి రేవంత్ సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేతలమనిషైతే సవాల్ను స్వీకరించాలన్నారు. టీవీల ముందు కూర్చుని మాటలు చెప్పి, పోజులు కొడితే పనులు కావని, అభివృద్ధి కావాలంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. మహాకూటమి గెలిస్తే మన జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి పాలమూరు నీరు రాకుండా 30 ఉత్తరాలు రాసిన బాబును మనం గెలిపిద్దామా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని తిడితే పెద్దవాళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే నరేందర్రెడ్డిపై గెలిచి చూపించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, హైదరాబాద్ మేయర్ దొంతు రామ్మోహన్, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ పాల్గొన్నారు. బుధవారం కొడంగల్ రోడ్షోకు భారీగా హాజరైన జనం -
జాతీయ సగటును మించిన అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధిలో జాతీయ సగటును తెలంగాణ దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ 10.4% వృద్ధిరేటును సాధించిందన్నారు. సోమవారం సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్)లో ‘సమీకృత అభివృద్ధి – సమస్యలు, సవాళ్లు’అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఐపీఈ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) సమన్వయంతో జరిగిన ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. 43% నిధులు సామాజిక సేవకే.. 2018–19 వార్షిక బడ్జెట్లో సామాజిక సేవా పథకాలకు 43% నిధులు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.16,400 కోట్లు, గిరిజన ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.9,600 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2వేల కోట్లు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి రూ.1800 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేపల విత్తనాల పంపిణీతో పాటు నాయీ బ్రాహ్మణ వర్గానికి ప్రత్యేక పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులే కీలక భూమిక పోషిస్తారన్నారు. కోల్కతా ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ అమియా కుమార్ బాగ్చి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఈ సదస్సులో సెస్ చైర్మన్ ఆర్ రాధాకృష్ణ, డైరెక్టర్ గాలాబ్, ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావుతో పాటు వివిధ రంగాల నిపుణులు, మేధావులు పాల్గొన్నారు. ‘రైతు బంధు’ విప్లవాత్మకం.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతు బంధు’పథకం విప్లవాత్మకమని, ఈ పథకం కింద రైతుకు ఒక్కో ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 2 సార్లు అమలు చేసే ఈ పథకంకింద ఇప్పటివరకు 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా, పాలనా పరమైన నిర్ణయాల్లోనూ ప్రజాసంక్షేమానికే పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పథకాలు అందరికీ చేరేలా సమీకృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మళ్లీ వలసలు షురూ!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైన మరుసటి రోజే నేతల పార్టీ మార్పులు షురూ అయ్యాయి. ఆశావహులు, టికెట్లు రాని నేతలు, పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్రెడ్డి.. టీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉన్నట్టుండి ఆయన నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లడం, గంటపాటు చర్చలు జరిపిన అనంతరం పార్టీ మారుతున్నట్టు సురేశ్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సురేశ్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ షాక్కు గురైంది. అయితే ఆ పార్టీలోకి కూడా వలసలు ప్రారంభమవడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. శుక్రవారం గాంధీభవన్లో కాంగ్రెస్లోకి మాజీ మంత్రి డి.కె.సమరసింహారెడ్డి చేరారు. అనూహ్యంగా.. పకడ్బందీగా.. సురేశ్రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పకడ్బందీగా వ్యవహరించారు. నాలుగైదు రో జులుగా ఆయనతో సంప్రదింపులు జరుగుతు న్నా.. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే కాంగ్రెస్కు షాక్ ఇస్తూ ఆయనను పార్టీలో చేర్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, మంచి వక్తగా, అసెంబ్లీ నియమావళి, చట్టసభల అంశాలపై పూర్తి అవగాహన ఉన్న నేతగా గుర్తింపు ఉన్న సురేశ్రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది. కాంగ్రెస్లోని ముఖ్యుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. దీంతో ఆయనను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో పెద్ద వికెట్లే పడిపోతున్నాయనే భావన కలిగించడమే ఈ ఆపరేషన్ వెనుక టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. సురేశ్రెడ్డితోపాటు మరికొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ గాలం వేసి ఉంచినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా తమతో 10 మంది వరకు కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని, సమయానుకూలంగా ఈ జాబితాలోని ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటామని టీఆర్ఎస్ నేత ఒకరు వెల్లడించడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ ఆ పార్టీ ముమ్మరం చేసిందని తెలుస్తోంది. కాంగ్రెస్లోకీ.. క్యూ టీఆర్ఎస్ వ్యూహం అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా పకడ్బందీగానే ముందుకెళుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు, నలుగురు నేతలను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ నేతలు మరికొందరిపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న వారిని, పార్టీలో ఎన్నాళ్లు పనిచేసినా గుర్తింపు దక్కలేదనే భావనలో ఉన్న వారిని సంప్రదిస్తూ ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం గాంధీభవన్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి త్వరలోనే పార్టీలోకి వస్తారని చెప్పడం గమనార్హం. మరోవైపు బీజేపీ నేత, మాజీ మంత్రి డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నేత చారులతా రాథోడ్, టీఆర్ఎస్ నేత శ్రీరంగం సత్యం, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తంరావు కుమారుడు హరీశ్రావు కూడా కాంగ్రెస్లో చేరారు. 12న కాంగ్రెస్లోకి డీఎస్? టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈనెల 12న రాహుల్గాంధీ సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతారని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్లే కాకుండా ఇతర రాజకీయ పార్టీల్లోకి కూడా వలస పక్షుల ప్రయాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, టీజేఎస్లు కొందరిని పార్టీల్లో చేర్చుకోవడంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పొత్తులు కుదిరి, టికెట్లు ఖరారయ్యేంత వరకు నేతల పార్టీ మార్పులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు దివ్యాంగురాలు, యువ పెయింటర్ నఫీస్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మల్కాజ్గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ గత నెలలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న నఫీస్ అద్భుతమైన చిత్రకళను చూసి మంత్రి అభినందించారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని, జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పెన్షన్తోపాటు ఆమెకు అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ నఫీస్ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రూ.10 లక్షలను జాయింట్ అకౌంట్లో జమ చేసింది. దీని ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసింది. నఫీస్కు ఈ పెన్షన్ సౌకర్యం జీవితాంతం ఉం టుందని సాంస్కృతిక శాఖ అధికారులు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్కు కృతజ్ఞతలు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణను కేటీఆర్ అభినందించారు. -
పదేళ్లలో స్వర్గ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ఇంకో ఐదేళ్లు ఈ ప్రభుత్వాన్ని నడుపుకొంటే బంగారు తెలంగాణ పూర్తి చేసుకుంటామని, మరో పదేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటే నిజమైన స్వర్గ తెలంగాణ చేసి ఇస్తారనే నమ్మకం తనకు ఉందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజల మద్దతు, ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. మరో ఐదేళ్ల కోసం కేసీఆర్ను దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో మాట్లాడుతూ.. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని నిజాయతీ, పారదర్శకతతో ప్రజలకు నివేదించడానికే ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని, ప్రజలతో మాట్లాడుకున్న తర్వాతే ఏదైనా పని చేయాలనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. పుట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు ప్రజలందరి అవసరాలు తీర్చేందుకు 500 పథకాలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉందని, జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే ఆ నిధులను ఖర్చు పెట్టాలని సీఎం పదేపదే అంటుంటారని గుర్తు చేశారు. ఎస్సీ, బీసీ కులాలను గుర్తించి వారి కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం పేరుకు మాత్రమేనని, ఈ సభ ద్వారా వారి అభివృద్ధి, సంక్షేమానికి పునరంకితం కావడం అసలు లక్ష్యమన్నారు. అల్లా కేసీఆర్ను ఇవ్వడం అదృష్టం: మహమూద్ అలీ ‘‘అల్లా మనకు కేసీఆర్ లాంటి గొప్ప సీఎంను ఇవ్వడం మన అదృష్టం. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాల ప్రజలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా గంగా జమున తెహజీబ్ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి బడ్జెట్లో సీఎం రూ.2 వేల కోట్లు కేటాయించారు. దేశంలో మైనారిటీలకు ఇదే అత్య ధిక బడ్జెట్. 24.22 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో ముస్లింలకు రూ.4,700 కోట్లే ఇచ్చారు.’’ – ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇవ్వని హామీలు కూడా అమలు: కడియం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 100 శాతం అమలు చేశామని, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, హెల్త్ అండ్ హైజీన్ కిట్, కంటి వెలుగు పథకాలు, వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు వంటి వాటిని అమలు చేశామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. నిండు మనసుతో సీఎం కేసీఆర్ను మరోసారి దీవించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాల గురించి ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రుణాల మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, సమస్యల్లేకుండా ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కడియం కొనియాడారు. రైతులకు అండగా ఉన్న కేసీఆర్కు అండగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. యావత్ దేశాన్ని ఆకర్షించిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత పరిపాలనా దక్షత కలిగిన కేసీఆర్కే దక్కుతుందన్నారు. నీతి నిజాయతీతో పరిపాలన చేశామని, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న పథకాలు: మహేందర్రెడ్డి రాష్ట్రంలో ఊహించని రీతిలో అభివృద్ధి, పేదలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభలో మహేందర్రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పట్ల ఆకర్షితులైన ఇతర రాష్ట్రాల అధికారులు, ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి వాటి గురించి తెలుసుకుంటున్నారని గుర్తుచేశారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభను తన సొంత జిల్లా రంగారెడ్డిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి యువకులు పాదయాత్రగా, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల మీద సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. సీఎం మీద ప్రేమతో ట్రాక్టర్లపై ఒక రోజు ముందే భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు సభాస్థలి వద్దే శనివారం రాత్రి బస చేశారన్నారు. గన్మన్లు లేకుండా కేటీఆర్ సభకు వచ్చే వారు ఎలా వస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయా, సక్రమంగా సభాస్థలికి చేరుకుంటున్నారా.. అంటూ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సభా పరిసర ప్రాంతాలు, ఓఆర్ఆర్ను పరిశీలించారు. ట్రాఫిక్ స్తంభించకుండా అధికారులకు ఎప్పటికప్పుడు అదేశాలు జారీ చేశారు. గన్మన్లు లేకుండా రహదారుల వెంట తిరుగుతూ కార్యకర్తల యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. చంకన బిడ్డతో విధులకు.. ప్రగతి నివేదన సభలో ఓ మహిళా కానిస్టేబుల్ చంకలో బిడ్డను ఎత్తుకొని బందోబస్తు నిర్వహించారు. ఓవైపు పెద్దఎత్తున వస్తున్న జనాలను నియంత్రిస్తూనే మరోవైపు తన బిడ్డను చూసుకున్నారు. ఇటు విధి నిర్వహణ.. అటు బిడ్డను చూసుకోవడాన్ని జనాలు ఆసక్తిగా గమనించారు. మాట్లాడింది నలుగురే! సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో నలుగురి ప్రసంగాలతోనే సరిపెట్టే సంప్రదాయం ఈసారీ కొనసాగింది. ప్రగతి నివేదన సభలో ఆనవాయితీ ప్రకారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తోపాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి మాత్రమే ప్రసంగించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015, 2017లో హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా ఈ నలుగురే ప్రసంగించారు. ప్రగతి నివేదన సభ పేరుతోనే 2017లో వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్తోపాటు కె.కేశవరావు, కడియం, మహమూద్ అలీ మాత్రమే ప్రసంగించారు. -
దుమ్ము రేపిన ధూంధాం
ప్రగతి నివేదన సభలో కళాకారులతో కలసి మంత్రి కేటీఆర్ డోలు వాయించారు.రసమయి బాలకిషన్తో డోలు కొడుతూ స్టెప్పులేశారు. దీంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. అక్కడి టీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ను ఎత్తుకొని అభినందించారు. అనంతరం కేటీఆర్ సభా ప్రాంగణంలో తిరుగుతూ కార్యకర్తలను పలకరించారు. సాక్షి, హైదరాబాద్: హోరెత్తించే పాటలు.. డప్పుల దరువులు.. గజ్జెల మోత.. గుస్సాడీ వేషాలు.. లంబాడీ నృత్యాలతో కొంగరకలాన్ సభ హోరెత్తింది. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ బృందం ఆలపించిన పాటలతో సభ ధూంధాంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, యువకులు, నేతలు.. 2,000 మందికి పైగా కళాకారులతో పాదం కలపడంతో 5 గంటల పాటు సభంతా సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదికపైకి వచ్చేవరకూ గులాబీ దండు ధూంధాం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జనాలను హుషారెత్తించాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పాటలు పాడి సభికులను ఉత్సాహపరిచారు. గాయని మంగ్లీ ఆడుతూ పాడిన బతుకమ్మపాటలకు సభా వేదిక ముందున్న 1,000 మందికి పైగా మహిళలు బతుకమ్మ ఆడుతూ, కోలాటాలు వేస్తూ నృత్యాలు చేయడం సభకు కొత్త వన్నె తెచ్చింది. ఉరకలెత్తిన ఉత్సాహం: శివనాగులు పాడిన రంగస్థలంలోని ‘ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా’పాటకు సభా ప్రాంగణం ఊగిపోయింది. యువకులు డ్యాన్సులతో అదరగొట్టారు. పాటను మళ్లీ పాడించాలని వేదికపై ఉన్న మంత్రులు కోరడంతో శివనాగులు మరోమారు పాట పాడి హుషారు తెచ్చారు. ‘సారా సారమ్మ సారా’, ‘రామా రామా ఎల్లమ్మరో’, ‘వీర తెలంగాణమా.. నాలుగు కోట్ల ప్రాణమా’, ‘లాయిల లల్లాయి.. లల్లాయిలే.. లల్లాయిలే’పాటలూ సభికుల్లో ఉత్సాహం నింపాయి. ఇక తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని చాటుతూ సుమారు 20 నిమిషాల పాటు ప్రదర్శించిన కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పాటల్లో వినిపించారు. కళాకారుల ఆట–పాటలకు ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు మరికొంత మంది కూడా పాదం కలుపుతూ నృత్యాలు చేశారు. ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఇతర మంత్రులు కళాకారుల పాటలకు చప్పట్లు కొడుతూ కనిపించారు. చంకన బిడ్డ.. చేతిలో జెండా చంకన చంటి బిడ్డ.. చేతిలో గులాబీ జెండాలతో వేలాదిగా మహిళలు కొంగరకలాన్కు కదం తొక్కారు. పెద్ద సంఖ్యలో ఆడ బిడ్డలు తరలిరావడంతో సభ కళకళలాడింది. టీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ రంగు చీరలు ధరించి రావడంతో సభా ప్రాంగణం గులాబీమయమైంది. కొంత మంది మహిళలు కేసీఆర్ ఫొటోలున్న చెవి కమ్మలు, బొట్టు బిళ్లలు పెట్టుకొచ్చి అభిమానం చాటుకున్నారు. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాల కింద లబ్ధిపొందిన తల్లులు తమ చంటి బిడ్డలతో తరలిరాగా.. ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్లు అందుకుంటున్న మహిళలు ఎంతో శ్రమపడి సుదూర ప్రాంతాల నుంచి సభకు వచ్చి కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో లంబాడీలు, ఆదివాసీ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. మహిళలకు ఇబ్బందులు రాకుండా సభా వేదిక ముందు వరుసలో రెండు ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. మహిళా పోలీసులు భద్రత కల్పించారు. వీరికి వలంటీర్లతో నీరందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, కార్యకర్తలు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. సభా మైదానంలో ఎక్కడికక్కడే మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన బోనాలు, బతుకమ్మ, కోలాటం ఆడారు. పారాచూట్తో పూల వర్షం ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో కార్యకర్తలు, నాయకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కార్యకర్తలు, నాయకులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారాచూట్తో పూలవర్షం కురిపించారు. పైనుంచి పూలవాన కురవడంతో అందరూ ఆకాశం వైపు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తనయకు తండ్రి సెల్యూట్ ఒకే వేదిక వద్ద తండ్రి నాన్కేడర్ ఎస్పీగా.. కూతురు ఐపీఎస్గా బందోబస్తు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఉమామహేశ్వర శర్మ మల్కాజ్గిరి డీసీపీగా పనిచేస్తున్నారు. ఈయన కూతురు సింధూ శర్మ జగిత్యాల ఎస్పీ(ఐపీఎస్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరిద్దరూ కొంగరకలాన్లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో విధులు నిర్వహిస్తూ ఒకరికొకరు తారసపడ్డారు. తండ్రికి 33 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కూతురు ఐపీఎస్ అధికారిణి కావడంతో సెల్యూట్ కొట్టక తప్పలేదు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసు అధికారులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యం, ఆనందానికి గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటివాటితో పాటు పింఛన్లు, ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చింది. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. - అంజమ్మ, హైదర్నగర్,కూకట్పల్లి తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందాయి. – రాధిక,రాజీవ్ గృహకల్ప,నిజాంపేట కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.అన్ని కుల సంఘాలకు భవనాలతో పాటు ప్రత్యేక నిధులను కూడా విడుదల చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని సమపాళ్లలో చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు కేసీఆర్. - వెంకటలక్ష్మీ,మూసాపేట గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నంబర్వన్ సీఎంగా ఉండేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలకంటే రెట్టింపు పథకాలు అమలు చేస్తున్నారు. -కీర్తి రెడి,్డటీఆర్ఎస్ నేత ప్రగతి నివేదిన సభను స్వయంగా వీక్షించాలని భావించా. కేవలం దీని కోసమే కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చా. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్పై ఉన్న అభిమానమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. -అభిలాష, కువైట్ సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడుతుంది. -శ్రీకాంత్గౌడ్, కాప్రా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు షాదీ ముబారక్ లాంటి పథకాలు ఎంతో మేలు చేశాయి. -ఇలియాజ్ ఖురేషి, టీఆర్ఎస్, చార్మినార్ నియోజకవర్గం కన్వీనర్ సౌకర్యాలు సూపర్ ప్రగతి నివేదన సభకు హాజరయ్యే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు. తాగునీటిని సభా ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. స్వయంగా కార్యకర్తలే వాటర్ బాటిళ్లను మోసుకొచ్చారు. సభ ప్రాంగణంలో జొన్న రొట్టెల పంపిణీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బంజారా మహిళలు జొన్నరొట్టెలు, కూరలు తయారు చేసి వచ్చే వాళ్లకు అందిస్తున్నారు. నాయకుల ప్రసంగాలు కార్యకర్తలకు స్పష్టంగా వినిపించేందుకు వేదిక వద్ద ఎనిమిది వైర్లెస్ మైక్రో కెమెరాలు, ఫోన్లు ఏర్పాటు చేశారు. 3,000 వాట్ల శక్తి గల 88 స్పీకర్లు ఏర్పాటు చేశారు. వేదికపై ఉన్న నేతలను చూసేందుకు 50కిపైగా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. 800 కేవీఏ విద్యుత్ అవసరం ఉంటుందని భావించిన డిస్కం ఆ మేరకు 60పైగా అదనపు ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అనారోగ్యానికి గురైన కార్యకర్తలకు యశోద, స్టార్, మల్లారెడ్డి, నారాయణ హృదయాలయ ఆస్పత్రులకు చెందిన సుమారు 300 మంది వైద్య సిబ్బంది సభాస్థలి వద్ద సేవలు అందించారు. హరిత టాయ్లెట్లను భారీగానే ఏర్పాటు చేసినా.. అవి కార్యకర్తల అవసరాలు తీర్చలేకపోయాయి. కార్యకర్తలు టాయ్లెట్ల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. పార్కింగ్ వద్ద ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. అయితే ఓఆర్ఆర్ నుంచి సభాస్థలికి వెళ్లే మార్గాలన్నీ ద్విచక్రవాహనాలు, జనంతో జామ్ అయ్యాయి. దీంతో బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాల్లో సభకు వచ్చిన వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది. – సాక్షి, హైదరాబాద్ పోటెత్తిన వాహనాలు..జంక్షన్లు జామ్ రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు సభకు చేరకుండానే సగం వెనక్కి డ్రైవర్లకు అవగాహన లేకపోవడమే కారణం సభకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో తిరిగి వెళ్లిపోతున్న బస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన’సభకు వాహనాలు పోటెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్ బాట పట్టిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో సగం సభాస్థలికి చేరకుండానే వెనుదిరిగాయి. కొన్ని మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. కార్యకర్తల అత్యుత్సాహం కూడా ట్రాఫిక్కు అంతరాయం కలిగించింది. ఏ రోడ్డు గుండా సభా ప్రాంతానికి వెళ్లాలనే అంశంపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడం, రింగ్ రోడ్డు జంక్షన్లలో పోలీసులను నియమించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఉత్తర తెలంగాణ, వికారాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను ఎక్కడ మళ్లించాలన్న అంశంపై పోలీసులు తికమకపడ్డారు. ఈ ప్రాంతాల గుండా వచ్చిన వాహనాలు ఔటర్ జంక్షన్లలో దిగి సర్వీసు రోడ్డు గుండా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వికారాబాద్, బెంగళూరు జాతీయ రహదారి, ముంబై మార్గాల నుంచి వచ్చిన వాహనాలు తుక్కుగూడ దగ్గర దిగాల్సి ఉండగా బొంగ్లూరు జంక్షన్లో దిగాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత వాహనాల తాకిడి మరింత పెరగడం.. ఊరేగింపులు, రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సూచించేవారు లేక... పోలీసులు, వాహనాల డ్రైవర్లు స్థానికేతరులు కావడంతో ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాల రద్దీ ఊపందుకుంది. దీనికితోడు ఇబ్రహీంపట్నం నుంచి సాధారణ వాహనాల రాకపోకలు తోడయ్యాయి. వాహనాలు పోటెత్తడంతో రాత్రి ఏడు గంటల వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. దీంతో కార్యకర్తలు అలసటకు గురయ్యారు. కార్యకర్తలు మాత్రం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సభాప్రాంగణానికి కాలినడకన చేరుకున్నారు. ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. వంద మీటర్ల దూరం పోవడానికి కనీసం అరగంట సమయం పట్టింది. రావిర్యాల, వండర్ లా, ఆదిబట్లకు వెళ్లే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ తిప్పలు అధికంగా కనిపించాయి. వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువైంది. -
దారులన్నీ ‘ప్రగతి’ వైపే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్: ప్రగతే నినాదంగా.. ఎన్నికల గెలుపే లక్ష్యంగా.. నగారా మోగించేందుకు గులాబీ దండు కదులుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాజకీయ పార్టీ నిర్వహించని విధంగా 25 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్న గులాబీ శ్రేణులు రాష్ట్ర నలుమూలల నుంచి కొంగరకలాన్ బాట పట్టాయి. జోడేఘాట్ మొదలు జోగులాంబ... యాదాద్రి నరసింహుడి మొదలు సిరిసిల్ల రాజన్న... ఇలా దారులన్నీప్రగతి నివేదన వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, పాదయాత్రల ద్వారా సభాస్థలికి జనం చేరుకుంటున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బస్సులన్నీ ఇటే.. రాజకీయ యవనికపై కొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించిన టీఆర్ఎస్ పార్టీ... జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నింటినీ ప్రగతి నివేదన సభ కోసమే అద్దెకు తీసుకుంది. సుమారు 7,600 బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటోంది. దీంతో ఆదివారం ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. కేవలం ఆర్టీసీయే కాకుండా 50వేల ప్రైవేటు వాహనా లను ఉపయోగించుకుంటోంది. శుక్రవారం సాయం త్రం నుంచే వివిధ జిల్లాల నుంచి వాహనాలు బయల్దేరిన సంగతి తెలిసిందే. అన్నీ కలిపి సుమారు లక్ష వాహనాలు ప్రగతి సభకు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్టుగా 18 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, శనివారం రాత్రి వరకు 2వేల వాహనాలు సభకు చేరుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ తెలిపారు. గులాబీ రెపరెపలు ఎటు చూసినా గులాబీ రెపరెపలు.. ఏ కూడలి చూసినా నేతల ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇటు నాగార్జునసాగర్ హైవే మొదలు అటు బెంగళూరు జాతీయ రహదారి వరకు పార్టీ పతాకాలతో నిండిపోయాయి. పోటాపోటీగా స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా గులాబీతో ముస్తాబైంది. ఆఖరికి ఔటర్ రింగ్రోడ్డు కూడా గులాబీ వర్ణశోభితమైంది. పోటెత్తనున్న ప్రైవేటు వాహనాలు.. ఆర్టీసీ బస్సులు మెజారిటీ సభకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలు రోడ్లపైకి పోటెత్తనున్నాయి. ముఖ్యంగా ఆ రోజు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉండటంతో ఆటోలు, కార్లు, సొంత వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముంది. టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరే అవకాశం ఉండటంతో అదనపు సిబ్బందిని నియమించారు. సభ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు.. కొంగరకలాన్లో సభ నేపథ్యంలో ఓఆర్ఆర్పై ప్రయాణాలను ప్రజలు ఆదివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు తాత్కాలికంగా రద్దు చేసుకోవడం శ్రేయస్కరమని పోలీసు శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓఆర్ఆర్ మీదుగా కూకట్పల్లి, గచ్చిబౌలి, పటాన్చెరు, ఎల్బీ నగర్, సాగర్ రోడ్లను మినహాయించి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. ‘ట్రాక్టర్లు, స్కూటర్లు, ఇతర ద్విచక్ర వాహనాల రాకపోకలు ఓఆర్ఆర్పై నిషేధం. ఈ సభకు వచ్చే ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు 3న తిరిగి వెళ్లాలి. లారీలు, డీసీఎంలు, బస్సుల ద్వారా సభా ప్రాంగణానికి వచ్చేవారు ఆదివారం మధ్యాహ్నం 12లోపు చేరుకోవాలి. కేటాయించిన స్థలంలో వాహనాలను నిలిపి సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లాల’ని సూచించింది. ఏదైనా సాయంతో పాటు సందేహాల నివృత్తి కోసం ఆదిభట్ల ట్రాఫిక్ కంట్రోల్ రూం నంబర్లు 9493549410 సంప్రదించవచ్చని వివరించింది. తడిసి ముద్దయిన సభాస్థలి... మహేశ్వరం: ప్రగతి నివేదన సభాప్రాంగణంలో శనివారం రాత్రి వర్షం కురిసింది. చిరు జల్లులతో ప్రారంభమై ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం కురవడంతో సభా ప్రాంగణం తడిసి ముద్దయింది. ప్రాంగణంలో పరిచిన కార్పెట్లు, సౌండ్ సిస్టమ్స్ వర్షం నీటితో తడిసిపోయాయి. సభలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ భారీ కటౌట్ గాలివానకు నేలకొరిగింది. వర్షానికి సభా మైదానం బురదమయంగా మారి వాహనాల రాకపోకలు, నడవడానికి ఇబ్బందిగా మారింది. ఆదివారం ఎండ ఉంటేనే ప్రాంగణం ఆరుతుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. -
‘రియల్’ మోసాలకు రేరాతో చెక్!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారులు ఇకపై మోసపోవడం ఉండదని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. స్థిరాస్తి వ్యాపారులు, కొనుగోలుదారుల మధ్య వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (రేరా) కృషి చేస్తుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో రేరా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం తీసుకొచ్చిన రేరా చట్టం 2017 జనవరి 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. నాటి నుంచి 500 చదరపు మీటర్లకు మించిన విస్తీర్ణంలో నిర్మాణం ప్రారంభించిన స్థిరాస్తి ప్రాజెక్టులన్నింటినీ బిల్డర్లు తప్పనిసరిగా రేరా ఆథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2017 జనవరి 1 నుంచి నిర్మాణ అనుమతి పొందిన ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు 3 నెలల ప్రత్యేక సమయం ఇస్తున్నాం. రేరా వెబ్సైట్ (www.rera.telan gana.gov.in)లో స్థిరాస్తి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం కొనుగోలుదారులకు అం దుబాటులో ఉంటుంది’’అని తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతులు, నిర్మిత, అమ్మకానికి పెట్టిన వైశాల్యం వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. రేరా అథారిటీకి ఫిర్యాదు చేయండి.. ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందే ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న సమాచారాన్ని ప్రతి బిల్డర్ తెలియజేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బిల్డర్లు ప్రతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక ఎస్క్రో బ్యాంకు ఖాతాను తెరిచి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యయ లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కొనుగోలుదారులకు ఏ సమస్య వచ్చినా రేరా ఆథారిటీకి ఫిర్యాదు చేయాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు కోర్టుల్లో వాదనలు విని నిపుణులు తీర్పునిస్తారని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ప్రతి మూడు నెలలకోసారి రేరాకు బిల్డర్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2017 జనవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాజెక్టులే రేరా పరిధిలోకి వచ్చినా, అంతకు ముందు ప్రార ంభించిన ప్రాజెక్టుల విషయం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్, రేరా ఆథారిటీ చైర్మన్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ దూకుడు హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగం మంచి దూకుడు మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో స్థిరాస్తి రంగం ఏమవుతుందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, కాని అనుమానాలను తలకిందులు చేస్తూ స్థిరాస్తి రంగం గణనీయ వృద్ధి సాధించిందన్నారు. మరో రెండేళ్లలో హైదరాబాద్.. బెంగళూరును వెనక్కి నెట్టనుందని తెలిపారు. -
హరికృష్ణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్
-
భారీ వేదిక.. 300 మందికి చోటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. దూరంలోనున్న సభికులకు కనిపించే విధంగా భారీ వేదికను నిర్మిస్తున్నారు. దీనికిగాను సభాప్రాంగణ విస్తీర్ణం పెద్దగా ఉండేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, పట్టా భూములను చదును చేస్తున్నారు. వేదికను 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై 300 మంది ఆసీనులయ్యే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వేదికపై చోటు కల్పించనున్నారు. సుమారు 500 ఎకరాల మైదానంలో భారీ ఎల్సీడీ స్క్రీన్లు, సరైన వెలుతురు కోసం ఫ్లడ్లైట్లు, భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 15 ఫైరింజన్లు తీసుకుంటున్నారు. వీటి కోసం పార్టీ నిధి నుంచి చెల్లించారు. దీనికి భారీగా కరెంటు అవసరం కావడంతో రూ.30 లక్షలను విద్యుత్ శాఖకు చెల్లించనున్నారు. సభాస్థలికి రోడ్లు... అద్దె వాహనాలు... సభకు సుమారు 25 లక్షల మందిని తరలిస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనికోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్లు, ప్రైవేటు స్కూల్ బస్సులు వంటి 24 వేల వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వేదికకు ఎదురుగా 50 వేల కుర్చీలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లలో వేగం పెంచండి...: కేటీఆర్ సభాస్థలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో వేగం పెంచాలని పార్టీ ముఖ్యనేతలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా పనులను పరిశీలించారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పని విభజన చేసుకుని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణాలు వద్దు: ప్రగతి నివేదన సభ కోసం దాదాపు అన్ని వాహనాలను కిరాయికి తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే ఈ సభ నిర్వహిస్తున్నామని, సామాన్యులెవరూ ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. -
నైతిక విలువలేమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ రెండు పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలిచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే బట్టలూడదీసి కొడతారని టీడీపీకి చెందిన ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అయ్యన్నపాత్రుడు వంటివారే హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదని, బిహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఆర్జేడీ అంతర్థానమైపోయిందని, టీడీపీ కూడా అలాగే నామరూపాల్లేకుండా పోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్తో ఎన్ని పార్టీలు కలిసినా టీఆర్ఎస్కు ఒంటరిగానే 100 సీట్లు ఖాయమన్నారు. రాష్ట్రంలోని 16 లోక్సభ సీట్లు టీఆర్ఎస్కు వస్తాయన్నారు. ప్రతిపక్షాలన్నీ గుంపుగా వచ్చినా టీఆర్ఎస్ సింహంలాగా ఒంటరిగానే పోరాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీతో పొరపాటున కూడా ఎలాంటి అంటూసొంటూ టీఆర్ఎస్కు లేదన్నారు. బీజేపీతో ఎలాంటి రాజకీయ భావసారూప్యత లేదన్నారు. ప్రధాని మోదీతో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హైదరాబాద్లో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో ఒక్క సీటూ గెలవలేదన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో భవిష్యత్తులో చాలా మంది చేరుతారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లు కూడా అధికారంలో టీఆర్ఎస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్తే వద్దంటామా..? ప్రగతి నివేదన సభలో అధికార దుర్వినియోగం గురించి కోర్టుకు పోతామని కోదండరాం చేసిన హెచ్చరికపై మాట్లాడుతూ కోర్టుకు పోయే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందన్నారు. కోర్టుకు వెళ్తే వద్దంటామా అని ప్రశ్నించారు. ఎన్నికల వాతావరణంలోకి వచ్చిన సమయంలో జరుగుతున్న సభ కాబట్టి, ఎన్నికలకు సన్నద్ధంగానే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు ఏనాడో మరిచిపోయారని, మీడియా మాత్రమే ప్రతిపక్షాలను గుర్తు పెట్టుకుందన్నారు. ఎన్నికలెప్పుడో కేసీఆర్దే నిర్ణయం ముందస్తు ఎన్నికలని మీడియాలోనే చూస్తున్నామని, దీనిపై ఎక్కడా తాము చెప్పలేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయనేది కాకుండా, ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం, కేబినెట్ మంత్రుల నిర్ణయం ప్రకారం అసెంబ్లీని రద్దు చేస్తారని, ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఉండదన్నారు. ముందస్తు ఎన్నికలొస్తాయని ఎంపీ సీతారాంనాయక్ అంటే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ ఏడాది చివరలోగా సభను నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్లీనరీలోనే కేసీఆర్ చెప్పా రని గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 51 నెలల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు వచ్చే ఐదేళ్లలో అధికారమిస్తే ఏం చేస్తామో ప్రగతి నివేదన సభలో చెబుతామని కేటీఆర్ వెల్లడించారు. -
‘ఉన్నత విద్యలో బెస్ట్ ప్రాక్టీసెస్ అంశంపై సదస్సు’
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా రంగంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అంశంపై ఆగస్టు 31న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మంగళవా రం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ...తాజ్ వివంతాలోని ఇంపీరియల్ హాల్లో నిర్వహించబోయే సదస్సులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కవిత, యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బి హడ్డా, బిజినెస్ వరల్డ్ చైర్మన్ అనురాగ్ బాత్రా, ఐఐఎం లక్నో మాజీ డైరెక్టర్ పద్మశ్రీ ప్రీతం సింగ్లతోపాటు విద్యావేత్తలు పాల్గొంటారని చెప్పారు. ఉన్నత విద్యా రంగంలో ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనే అంశంపై సెమినార్ జరుగుతుందని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే పరిశ్రమలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తెస్తున్నామని, ఇంజినీరింగ్లో ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశామని చెప్పారు. అన్ని కాలేజీలు, విశ్వ విద్యాలయాలకు వెళ్లి స్టార్టప్లపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సెప్టెంబర్ 15న స్టార్టప్ యాత్రను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
విపక్షాలకు గూబ గుయ్యిమనే తీర్పే..
సాక్షి, హైదరాబాద్: ‘పేపర్లు, టీవీలు చూస్తుంటే రేపే ఎన్నికలనే హడావుడి కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో పెద్దాయన చూసుకుంటారు. కానీ ఎప్పుడొచ్చినా ప్రతిపక్షాల గూబ గుయ్యిమనే తీర్పొస్తుంది. ఎన్నికలు 3 నెలల్లో వచ్చినా, 6 నెలల్లో వచ్చినా శబ్ద విప్లవంతో టీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుంది’అని ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నో సార్లు అవకాశమిచ్చారని, కానీ టీఆర్ఎస్ను మాత్రం ఒక్కసారికే దించేయాలని వాళ్లు అంటున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు కాంగ్రెస్సోళ్లు పట్టించిన 60 ఏళ్ల గబ్బుని, దరిద్రాన్ని నాలుగేళ్లలో పోగొట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్ల మీద ఆందోళనలు చేసే పార్టీలా తాము అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తాను సీఎం కొడుకునే అయినా ప్రజలు ఆశీర్వదిస్తేనే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. బచ్చా రాహులా.. నేనా? ‘నన్ను బచ్చాగాడు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్కు 45 ఏళ్లు. ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎవరు బచ్చా’అని కేటీఆర్ ప్రశ్నించారు. తాను 2006 నుంచి ఉద్యమంలో ఉండి జైలుకెళ్లి లీడర్ అయ్యానని.. రాహుల్ ఏ ఉద్యమంలో పాల్గొని, ఏ జైలుకెళ్లి లీడర్ అయ్యారో చెప్పాలని నిలదీశారు. రాహుల్ ముత్తాతల నుంచి అమ్మ సోనియా వరకు రాజకీయాల్లో ఉన్నారని, అలాంటప్పుడు ఎవరిది కుటుంబ పాలన అని ప్రశ్నించారు. తాము ఎమ్మెల్యేలకు రూ.కోటి డబ్బాల్లో పెట్టి పంపామని కొందరు ఆరోపిస్తున్నారని.. సంచుల్లో, డబ్బాల్లో డబ్బులు తీసుకెళ్లే అలవాటు తమకు లేదన్నారు. రోజూ తిట్టుకోవడం ఎందుకు.. ఎన్నికలకెల్దాం అంటే దానికీ భయపడతారని, ఓ వైపు భయపడుతూనే మరోవైపు డైలాగులు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలిగానీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముందు అక్కడ అమలు చేయండి కాంగ్రెస్ అంటేనే దగుల్బాజీ పార్టీ అని, 2009 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీ అమలు చేయకుండా 2019 ఎన్నికల కోసం ఉత్తమ్కుమార్రెడ్డి కొత్త హామీలిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారిచ్చే హామీలను ముందు వా రు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చి నా టీఆర్ఎస్ 100 సీట్లలో విజయం సా ధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశా రు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నేళ్లు మోసిన జెండాలతో పాటే మన భూములు కూడా బీడులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశా రు. మళ్లీ తుంగతుర్తిలో గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. తుంగతుర్తి ఎమ్మె ల్యే గ్యాదరి కిశోర్తో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
-
ముందస్తు ఎన్నికలంటే భయం ఎందుకు?
-
ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కామెంట్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/మహేశ్వరం: ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై వారం పది రోజుల్లో స్పష్టత రానుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో సెప్టెంబర్ 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనసు దోచుకునే సభ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ప్రగతి నివేదన సభ.. ప్రజల మనసు దోచుకునే సభ అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా కచ్చితంగా మాది దోపిడీ సభే.. కాకపోతే ప్రజల మనసు దోచుకునే సభ. ఇంకా దోచుకుంటాం. కాంగ్రెస్ పార్టీలా ప్రజల సొమ్ము దోచుకునే సభ కాదు’అని స్పష్టం చేశారు. జిల్లాకో పార్కింగ్ ఏరియా.. ప్రగతి నివేదన సభను 2 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇందులో 500 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని, మరో 1,500 ఎకరాల్లో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒక్కో జిల్లాకు ఒక పార్కింగ్ ఏరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నమస్కరించి చెబుతున్నా.. ‘సెప్టెంబర్ 2న ఆదివారం కాబట్టి స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉంటుందని ప్రగతి నివేదన సభను పెట్టుకున్నాం. ప్రజలను సభకు తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకున్నాం. ప్రజలకు నమస్కరించి చెబుతున్నా.. సెప్టెంబర్ 2న దయచేసి ప్రయాణాలు పెట్టుకోకండి.. ఆసౌకర్యాన్ని మన్నించి సహకరించండి. పార్టీ సొమ్మునే సభకు ఖర్చు చేస్తున్నాం’అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా కేటీఆర్ ప్రసంగంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను కొంగర కలాన్లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పగా.. సభ మొత్తం రావిర్యాల రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్నారని, రావిర్యాల గ్రామానికి గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావిర్యాల గ్రామం పేరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. జేసీబీ, ఇటాచీలతో తవ్వి సీతాఫలం, వేపచెట్లను తొలగించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పెట్టెల్లో డబ్బు పంచుకోవడం ఆయనకే బాగా తెలుసు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి దగుల్భాజీ ప్రేలాపనలను తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ తర్వాత సూట్ కేసుల్లో డబ్బులు పంచుకున్నారని వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. పెట్టెల్లో డబ్బులు పంచుకోవడం ఆయనకే బాగా తెలుసునని రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. జైలుకెళ్లి చిప్పకూడు తిన్నోళ్లు చాలా మాట్లాడుతారని.. వాటన్నింటిని పట్టించుకోవాల్సిన తమకు లేదన్నారు. కొంత మంది చిల్లరగాళ్లు ప్రతి పనిని పైసల కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల ప్రేలాపనలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు మాత్రమే జవాబుదారీలమని పేర్కొన్నారు. ఆ పార్టీ బాస్లు ఢిల్లీలో ఉన్నారని, లఘుశంక తీర్చుకోవాలన్నా అధిష్టానం పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి వారిదని ఎద్దేవా చేశారు. -
కేటీఆర్కు రాఖీ కట్టిన చిన్నారి దివ్య
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాఖీ బహుమతిగా ఆపన్నహస్తం అందించారు. గత ఏప్రిల్లో కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్కు చెందిన 9 ఏళ్ల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయి ఆటోని నడుపుకుని జీవనోపాధి పొందుతున్న ఆమె తండ్రి చికిత్సకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడని స్థానిక టీఆర్ఎస్ యువజన నాయకుడు జగన్మోహన్రావు ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి దివ్యకు చికిత్స అందించాలని నిమ్స్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో దివ్య ఎడమకాలిని పోగొట్టుకోవడం విషాదంగా మారింది. ఆపదలో అన్నలా ఆదుకున్న కేటీఆర్కు రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షని దివ్య వెలిబుచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆమెను ఆదివారం తన ఇంటికి పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు. ఆమెకు కృత్రిమ అవయవాన్ని అందించారు. అవసరమైతే మరింత సహాయం దివ్యకు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అన్న దివ్య, ఇంకేం వద్దంటూ మంత్రికి తెలిపింది. దివ్య తండ్రి కిరాయి ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, త్వరలోనే అయనకు ఒక కొత్త ఆటోను రాఖీ బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యను అన్నలా ఆదుకున్న మంత్రి తారక రామారావుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు తమ ఆనందన్ని వ్యక్తం పరిచారు. కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత మంత్రి కేటీఆర్కు ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టారు. కేటీఆర్ సతీమణి శైలిమ కూడా కవిత భర్త అనిల్ కుమార్కు రాఖీ కట్టారు. -
రాష్ట్రమంతటా బస్తీ దవాఖానాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రులకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పూర్వ జిల్లాకేంద్రాల్లో వీటిని ప్రారంభించాల ని అధికారులను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఆదేశించారు. బస్తీ దవాఖానాల విస్తరణపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. నిజామాబాద్లో 5, కరీంనగర్లో 5, వరంగల్లో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టామని తెలిపారు. ‘అందరికీ అందుబాటులో ఆరోగ్యం’స్ఫూర్తితో ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని.. ఇందులో భాగంగా సర్కారు ఆస్పత్రుల బలోపేతం, కొత్త దవాఖానాల ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నామని వివరించారు. డిసెంబర్లో 175 ప్రారంభం గత నెలలో బేగంపేటలోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఆస్పత్రికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రాథమిక వైద్యం కోసం ప్రైవేటు క్లినిక్లలో డబ్బులు ఖర్చు చేసేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని చెప్పారన్నారు. మరిన్ని బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అందుకే వాటి విస్తరణకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్లో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబర్ చివరి నాటికి సుమారు 175 దవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో మ్యాపింగ్ బస్తీ దవాఖానాలన్నింటినీ ఆన్లైన్లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే ఐటీ శాఖ సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో నెలకొల్పే 500 బస్తీ దవాఖానాలకు భవనాలు గుర్తించాలని, అందుబాటులో లేకుంటే కొత్తగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న 28 బస్తీ దవాఖానాలను వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు ప్రారంభించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్స్ తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల సేవలను కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెం టర్లకు మంచి స్పందన వస్తోందని మంత్రులకు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తోందని చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీ సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
కేరళ ప్రజలకు అండగా రాష్ట్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చారు. తమ వంతు సహాయంగా నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె.తారక రామారావు, టి.హరీశ్రావు, మహేందర్రెడ్డి ప్రకటించారు. నెల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా పంపనున్నట్లు మంత్రులు తెలిపారు. పెన్షనర్లు సైతం... కేరళ బాధితులకు తమ వంతు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల సంయుక్త కార్యచరణ సమితి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని 2.56 లక్షల మంది పెన్షర్లు ప్రతి ఒక్కరు రూ.100 చోప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల సంయుక్త కార్యచరణ సమితి అధ్యక్షుడు రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. -
‘నాయిని’ తూటాలు లేని తుపాకీ: పొన్నం
సిరిసిల్ల: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తూటాలు లేని తుపాకీ లాంటివాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అభివృద్ధి కనిపిస్తలేదా.. అయితే కంటి పరీక్షలు చేయించుకో? అనే నాయిని వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. ‘మా కళ్లు బాగానే ఉన్నాయి.. మీరే మెదడు పరీక్ష చేయించుకోవాలి’అని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలకే కాదు.. దేవుడికి ఇచ్చిన హామీని కూడా విస్మరించడంలో కేసీఆర్కు మించినోడు లేడని ధ్వజమెత్తారు. -
అమెరికాలో చిప్పలు కడుక్కునే వాడివి!
కరీంనగర్: రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురువారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. అధికార మదంతో ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని పేర్కొన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్ వచ్చాడని, పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకొని అమెరికాలో చదివిన విజ్ఞత ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ‘అసలు నీ అయ్య కేసీఆర్కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని హెచ్చరించారు., కాంగ్రెస్ను విమర్శించే వాళ్లే బిచ్చగాళ్లు, లోఫర్లు అని ప్రభాకర్ మండిపడ్డారు. కేటీఆర్ చరిత్ర బయటపెడితే గ్రామాల్లో తిరగలేడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ చేయించిన ఆరు సర్వేల్లో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ పర్యటనతో టీఆర్ఎస్ నేతలకు వణుకు పుట్టిందన్నారు. వాస్తవాలను వక్రీకరించి చెబితే టీఆర్ఎస్ నేతలను గ్రామాల్లోకి రాకుండా రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలంటున్న మంత్రులు.. ముందుగా మీరు ఆ పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. -
‘ఎమర్జెన్సీ’ని గుర్తు చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ గురించి మీరా మాట్లాడేది? వాహ్.. రాహుల్ జీ!. స్వతంత్ర భారతావనిలో విధించిన ఏకైకఅత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని మీకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజాస్వామికవాదుల గొంతులను నొక్కింది ఎవరు? ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది ఎవరు? మీ స్కాంగ్రెస్ పార్టీ కాదా?’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్లో ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు మంగళవారం కేటీఆర్ వరుస ట్వీట్లతో బదులిచ్చారు. తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నువ్వు ఎవరికి నివాళులు అర్పించావో నీకు తెలుసా? అని రాహుల్ను ప్రశ్నించారు. ‘‘తొలి దశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 1969లో ఇందిరా గాంధీ నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన 369 మంది యువకులతోపాటు తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించడంతో 2009–14 మధ్యలో ఆత్మబలిదానం చేసుకున్న యువకులు వారు’’అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మరణాలకు క్షమాపణ చెప్పరా? అని రాహుల్ను నిలదీశారు. ‘‘అవినీతి గురించి మాట్లాది నువ్వా? నీతో వేదిక పంచుకున్న సగం మంది కాం గ్రెస్ నేతలు సీబీఐ, ఇతర అవినీతి కేసుల్లో బెయిల్పై బయటకు వచ్చిన వారే. ఓహ్.. నేను మర్చిపోయా.. ఇది స్కాంగ్రెస్ పార్టీ కదా. ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్..’’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ నేతలు వేసిన, వేయించిన వందలాది కేసులు ఉపసంహరించేలా వారిని ఆదేశించాలని రాహుల్కు సూచించారు. లేకుంటే అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనే ముద్రపడుతుందన్నారు. -
రాష్ట్రంలో ఫార్మా కంపెనీల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం హవా కొనసాగుతోంది. ఔషధ పరిశోధనలు, తయారీ రంగాల్లో ఆసియా ఖండంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం... గత నాలుగేళ్లలో అనేక కొత్త కంపెనీలను అకర్షించింది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలూ విస్తరణ ప్రణాళికలు అమలు చేయడంతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫెర్రింగ్ ఫార్మా, కెమో ఫార్మా, జీఎస్కే, సినర్జీ, స్లే బ్యాక్ ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.స్థానికంగా ఉన్న నొవార్టిస్, బయోలాజికల్ ఈ, లారుస్ ల్యాబ్స్, పల్స్ ఫార్మా కంపెనీలు విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. టీఎస్ ఐపాస్ ప్రకటించిన 2015 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 700 కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు వంద వరకు పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగ కంపెనీలున్నాయి. ఇందులో 80 శాతం ఇప్పటికే తమ ఉత్పత్తులు ప్రారంభించాయి. రూ. కోట్లలో పెట్టుబడులు.. కొత్త ఫార్మా సంస్థల ఏర్పాటు, విస్తరణ ద్వారా 20 వేల ఉన్నతస్థాయి పరిశోధన ఉద్యోగాలతోపాటు 50 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ రంగంలో గత నాలుగేళ్లలో రాష్ట్రం రూ. 10,222 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగింది. ఇందులో రూ. 3 వేల కోట్లు అర్ అండ్ డీ రంగంలో వచ్చాయి. ఫార్మా ఎగుమతుల్లోనూ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. కేవలం లైఫ్ సైన్సెస్ రంగం ఒక్కటే మొత్తం 36 శాతంతో సింహభాగాన్ని ఆక్రమించింది. జాతీయ సగటు 1.18 శాతమే ఉండగా తెలంగాణ మాత్రం గత నాలుగేళ్లలో ఎగుమతులను 2.41 శాతానికి పెంచుకుంది. అంటే దేశ సగటుకు రెట్టింపు పెరుగుదలతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఫార్మా సంబంధ శిక్షణ కార్యక్రమాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే యూఎస్ ఫార్మకోపియా (US Pharmacopeia) తో కలసి ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వర్సిటీ గ్రాడ్యుయేట్లకు ఫార్మా రంగంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ఫలితమిది: కేటీఆర్ ఔషధ రంగంలో సాధించిన అభివృద్ధిపట్ల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రతిఫలంగా అభివర్ణించారు. రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న ఫార్మా రంగ పెరుగుదలతోపాటు ఇక్కడి పరిశ్రమ విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే దీర్ఘకాల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
125 ఎకరాల్లో 15,660 ‘డబుల్’ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల కార్యక్రమం దేశంలోనే చరిత్ర సృష్టించనుందని పురపాలకశాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో సుమారు 125 ఎకరాల్లో చేపట్టిన 15,660 డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డిలతో కలసి కేటీఆర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతున్నాయన్నారు. 9.65 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో సకల సౌకర్యాలతో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వరంగంలో దేశంలోనే ఇప్పటివరకు ఇంత పెద్ద గృహ సముదాయాన్ని ఒకేచోట నిర్మించలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ నిధులతో కొల్లూరులో నిర్మాణం చేపడుతున్నట్లు కేటీఆర్ వివరించారు. ఈ సముదాయం ద్వారా కొల్లూరు ప్రాంతం ఒక పట్టణంగా మారుతుందని, 70 వేలకుపైగా జనాభా అక్కడ నివాసం ఉంటుందని చెప్పారు. గృహ సముదాయంలో వాణిజ్య సముదాయం నిర్మించి దాని నుంచి వచ్చే ఆదాయంతో లిఫ్ట్లులు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. మురుగునీటి జలాల శుద్ధి కోసం ప్రత్యేకంగా ప్లాంటు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొల్లూరులో భారీగా ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో పనుల పర్యవేక్షణ కోసం అక్కడే ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నిర్మాణ స్థలంలో జరుగుతున్న పనుల తీరుపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రోజూ మూడు షిఫ్టుల్లో దాదాపు 3,500 మంది కార్మికులు, 400 మంది సిబ్బంది పని చేస్తున్నారని అధికారులు మంత్రికి వివరించారు. పనులను నిరంతరం పర్యవేక్షించడానికి నిర్మాణ సముదాయం వద్ద సీసీ కెమెరాలు అమర్చామన్నారు. -
మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన మెగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఆకస్మికంగా తనీఖీ చేశారు. మంత్రి కేటీఆర్తోపాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి పనులను పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో పెద్ద ఎత్తున ఒకేచోట 15,600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. రామచంద్రాపురంలోని కొల్లూరు గ్రామంలో చిన్నపాటి సిటీని తలపించేరీతిలో ఈ మెగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ఇళ్లను నిరుపేద లబ్ధిదారులకు ఉచితంగా అందజేయనున్నారు. కొల్లూరులో 124 ఎకరాల స్థలంలో రూ. 1354.59 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, మరెక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో ఈ కాలనీని మోడల్ సిటీగా నిర్మిస్తున్నారు. -
ప్రజా రవాణాతోనే ‘ట్రాఫిక్’కు చెక్
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా బహుముఖ ప్రణాళికలు, వ్యూహాలతో నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని మునిసిపల్, ఐటీ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. ప్రజా రవాణా, పట్టణ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించినట్లు తెలిపారు. ఎల్బీనగర్లో కామినేని ఆస్పత్రి వద్ద రూ.49 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... 2030 నాటికి హైదరాబాద్ మెగా సిటీగా అవతరిస్తుందని, దానికనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ప్రజారవాణా మెరుగుపడి, ప్రైవేట్ వాహనాలు తగ్గితేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో మెట్రో రైలు.. అమీర్పేట–ఎల్బీనగర్ మెట్రో రైలు ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, సీఎంఆర్ఎస్ అనుమతి జాప్యంతో మరో 15 రోజులు ఆలస్యం కానుందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మార్గం ప్రారంభం అవనుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నాగోలు నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ టూ ఫలక్నుమా, శంషాబాద్ వరకు మెట్రో ప్రయాణానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. వేగంగా ఎస్సార్డీపీ పనులు.. నగరంలో ఎస్సార్డీపీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.23 వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.3 వేల కోట్లకు పైగా పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. మరో రూ.4 వేల కోట్ల పనులు పరిపాలన అనుమతి దశలో ఉన్నాయన్నారు. కేంద్రంతో కలసి సంయుక్తంగా రూ.1,500 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడా ఖర్చుపెట్టని విధంగా ఎల్బీనగర్లో రూ.450 కోట్లు రోడ్ల విస్తరణకు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. పాదచారుల హక్కులను పరిరక్షించేందుకు ఫుట్ఫాత్లపై 8వేలకు పైగా ఆక్రమణలను తొలగించడంతో పాటు, రూ.100 కోట్లను నిర్మాణ పనులకు కేటాయించినట్లు చెప్పారు. ‘మన నగరం’లో భాగంగా మంజూరైన రూ.42 కోట్లతో ఎల్బీనగర్కు పలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రికార్డు స్థాయిలో వేగంగా కామినేని ఫ్లైఓవర్ను నిర్మించిన నిర్మాణ సంస్థను అభినందించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ.46 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి.. రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.46 వేల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో రూ.1,900 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందించామన్నారు. ఔటర్ రింగ్రోడ్డు ప్రాంతంలోని గ్రామాలకు రూ.600 కోట్లతో మంచినీటిని అందిస్తున్నట్లు వివరించారు. కేటీఆర్కు కితాబు..: విశ్వనగరంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,600 కోట్లను వెచ్చించడం జరిగిందని ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఎల్బీనగర్ అభివృద్ధి పథంలో ముందుందని కితాబిచ్చారు. సీఎం వినూత్న విధానాలకు ప్రజల మద్దతుతో పాటు తమ మద్దతు ఉంటుందన్నారు. శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. కామినేని వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని అతని తల్లి శంకరమ్మ డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి మద్దతుదారులతో వచ్చిన ఆమె ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరిపారు. కేటీఆర్ తిరిగి వెళ్లిన అనంతరం ఆందోళన చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతినిధుల నిరసన.. కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగులకు గుర్తింపు కార్డులివ్వాలని కోరుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా ఉద్యోగులు మంత్రి కేటీఆర్ సభ వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరడానికొస్తే పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏటా సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలోని 3.60 కోట్ల జనాభాకు ఏటా సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి యోచిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లమద్ది గ్రామంలో బుధవారం ఆయన రైతుబీమా బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తాము చేసిన అభివృద్ధి విపక్ష పార్టీల నేతలకు కనబడటం లేదని, అందుకే వారు సైతం కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు భవిష్యత్తుపై నమ్మకం, జీవితానికి ధీమా కల్పించడానికే రైతుబీమా పథకం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. పైసలిచ్చినా పనులెందుకు కావట్లేదని స్థానిక ప్రజాప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని, పనిచేయడం స్థానిక నాయకుల బాధ్యతని చెప్పారు. మొదటిసారిగా తెర్లమద్ది నుంచే తాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై బిత్తిరి వేషాలు.. వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రాంక్ వీడియోల పేరిట నడిరోడ్లపై హల్ చల్ చేస్తున్న ఇద్దరు యువకులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ‘డేర్ సిరీస్’ పేరిట వినయ్ కుయ్యా, డేర్స్టార్ గోపాల్ అనే ఇద్దరు యువకులు గత కొంత కాలంగా వీడియోలు చేస్తుస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ల చేష్టలపై ఫిర్యాదులు అందటంతో చర్యలు తీసుకునేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. బిజీ సమయాల్లో ట్రాఫిక్లోకి చేరి నడిరోడ్లపై పడుకోవటం.. తినటం, కార్లపైకి ఎక్కి హల్ చల్ చేయటం.. వీటితోపాటు పలు సరదా వీడియోలను షూట్ చేసి వినయ్ తన యూట్యూబ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తున్నాడు. అయితే వాళ్ల బిత్తిరి చర్యలతో ప్రయాణికులకు విఘాతం కలిగించటమే కాకుండా.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని కొందరు వాహనదారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అంతేకాదు వీళ్ల వ్యవహారాన్ని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈ విషయంపై ఫిర్యాదు అందిన మాట వాస్తవం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని ట్రాఫిక్ సెల్ అధికారి రాజా వెంకట్రెడ్డి తెలిపారు. సినిమాల్లో చేస్తే తప్పులేదా?... ‘నేనో క్రియేటివ్ డైరెక్టర్ని. ఇలాంటి వీడియోలు షూట్ చేయటమే నా పని. ఎవరికీ ఇబ్బందులు కలగకుండానే వీడియోలు చేస్తున్నాం. ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. తాగుబోతులు, బిచ్చగాళ్లు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్లను పట్టించుకోకుండా.. మమల్ని అడ్డుకుంటామనటం సరైంది కాదు. సినిమాల్లో హీరోలు చొక్కాలు విప్పటం, పరుష పదజాలం వాడినప్పుడు.. మేం చేసే వీడియోలకు అభ్యంతరం ఏంటి? పైగా అవెర్నెస్కు సంబంధించిన వీడియోలే మేం ఎక్కువగా షూట్ చేశాం. వాటికి మంచి స్పందన కూడా లభించింది’ అని వినయ్ చెబుతున్నాడు. -
ఫ్లైఓవర్ల కోసం ఆ భూములు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రెండు ముఖ్యమైన ఫ్లైఓవర్ల నిర్మాణానికి 160 ఎకరాల రక్షణ భూములను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 210 ఎకరాల రక్షణ భూములను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సోమవారం ఆయన ట్విట్టర్లో షేర్ చేసి, నిర్మలా సీతారామన్కు ట్యాగ్ చేశారు. రెండేళ్లుగా రక్షణ భూముల కేటాయింపులకు ఎదురుచూస్తున్నామన్నారు. బెంగళూరులో కేటాయించిన ప్రాతిపదికనే హైదరాబాద్లో సైతం రక్షణ భూములు కేటాయిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుంది
హైదరాబాద్: ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుందని, సాఫ్ట్డ్రింక్గా తయారు చేసి మార్కెటింగ్కు అవకాశం కల్పిస్తుందని ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో 3.70 కోట్ల ఈత, తాటి, గిరిక, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్సాగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈత మొక్కలు నాటే కార్యక్రమం, గౌడ ఆత్మీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందని, రూ.43 వేల కోట్ల సంక్షేమ పథకాలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కడియం నర్సరీ నుంచి 12 వేల గిరిక, తాటి చెట్లను సిరిసిల్లకు తెప్పించామని, వీటిని పైలట్ ప్రాజెక్టుగా నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. తాటి, ఈత చెట్టును నరికితే జరిమానాను రూ.150 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు. గౌడ కులస్తుల కోసం ఐదు ఎకరాల స్థలం, రూ.5 కోట్లు అందించామని, సొసైటీల బకాయిలను రద్దు చేశామని తెలిపారు. వైన్షాపు టెండర్లలో రిజర్వేషన్, ఇతర వృత్తుల్లోకి వెళ్లేవారికి రుణాలు అందించే విషయాలను సీఎంకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వం జంట నగరాల్లో బంద్ చేయించిన 103 సొసైటీలను తిరిగి ప్రారంభించి 50 వేల కుటుంబాలకు ఉపాధి చూపామని కేటీఆర్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిన సర్దార్ కేసీఆర్: స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఒక గీత కార్మికుడు బాగుపడితే అనుబంధంగా 16 కులాలకు చెందిన వారు అభివృద్ధి చెందుతారన్నారు. తాటి చెట్టుపై పూర్తి హక్కును గౌడ సోదరులకు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పట్టా భూముల్లో ఉన్న చెట్లపై యజమానులు రూ.1,000 వరకు అద్దె, కల్లు తీసుకోవడంతో గీత కార్మికుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 350 ఏళ్ల క్రితం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చెట్టుపై పన్ను రద్దు చేయాలని ఉద్యమం చేపట్టారని, ఇప్పుడు సర్దార్ కేసీఆర్ పన్నును రద్దు చేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు. చిచ్చా... రచ్చ చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ తన మనసులోని మాటలను చెప్పలేక పోతున్నానని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తనకు ఎక్సైజ్ శాఖను అప్పగించి కులసోదరులకు ఏదైనా చేయమని సలహా ఇచ్చారని, కానీ, వారికి ఏమి చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న గీతకార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని, వీరికి న్యాయం చేయాలన్నారు. ఈ విషయాలను విన్న కేటీఆర్ ‘చిచ్చా... రచ్చ చేసిండ్రు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభిం చారు. గౌడ కులస్తులపట్ల ఆవేదనతో మాట్లాడా రని, దీనిని అర్థం చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, గాంధీ, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, నిజామాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వేదికగా చేసుకొని.. కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇటీవల కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగి.. బీజేపీతో ఘర్షణాత్మక వైఖరిని చంద్రబాబు అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీతో, అటు పవన్ కల్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకొని గట్టెక్కిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో చేసిన కాపురాన్ని వదులుకొని.. కొత్త ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. పాతమిత్రులు బీజేపీ, పవన్ దూరం కావడంతో.. కొత్త మిత్రుల కోసం ఆయన లోపాయికారిగా పావులు కదుపుతున్నారని, ఇందులోభాగంగానే టీడీపీకి బద్ధవిరోధి అయిన కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు-కాంగ్రెస్ పొత్తుపై కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీకే పరిమితం కాదు
-
కేటీఆర్ ఛాలెంజ్ను స్వీకరించిన సచిన్,లక్ష్మణ్
-
టీ-శాట్ అన్ని రంగాలకు విస్తరించాలి
-
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు 42వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. తెలంగాణభవన్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరి సుధా కర్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, రాములు నాయక్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, అటవీ అభి వృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తది తరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్వీ నాయకు డు పల్లా ప్రవీణ్రెడ్డి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జీహెచ్ఎంసీ హరితహారానికి పిలుపునిచ్చింది. కేటీఆర్ జన్మరాశి ప్రకారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మేయర్ రామ్మోహన్ బంజారాహిల్స్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాలలో 42 జిట్రేగు మొక్కలను నాటారు. జూబ్లీహిల్స్ స్టేట్ హోమ్లో టీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు మొక్కలు నాటారు. వెల్లువెత్తిన అభిమానం..: మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, అధికార, సినీ, పారిశ్రామిక తదితర రంగాల ప్రముఖులు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కేటీఆర్ అభిమానులు సైతం జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిషన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, భారత్లోని ఇజ్రాయిల్ దౌత్య వేత్త డేనియల్ కార్మన్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దు ల్లా, గోవా ఐటీ మంత్రి రోహన్ ఖాంటే, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, లక్ష్మారెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, బీబీ పాటిల్, విపక్ష నేత ఉత్తమ్కుమార్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మా అన్నయ్య సూపర్ హీరో: కవిత ‘హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. సూపర్ హీరోలుండరని ఎవరైనా అనుకుంటే, వారికి నీ గురించి తెలుసుకోమని చెబుతాను’అని కేటీఆర్ సోదరి, ఎంపీ కవిత ట్వీట్ చేశారు. అలాగే సినీనటులు మహేశ్బాబు, రామ్చరణ్, నాని, మంచు విష్ణు, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహెర్ రమేశ్, కోన వెంకట్, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని సైతం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు గోదావరిఖని: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్న తరహాలో నిర్వహించి వండర్ బుక్ఆఫ్ రికార్డులో టీఆర్ఎస్ రాష్ట్ర నేత కోరుకంటి చందర్ చోటు సాధించారు. కేటీఆర్ 42వ జన్మదినం సందర్భంగా గోదావరిఖని ఆర్కే గార్డెన్లో మంగళవారం 42 కిలోల కేక్తో 42 మంది కళాకారులు, 42 మంది తెలంగాణ ఉద్యమ కారులు, 42 మంది కేటీఆర్ వేషధారణ, 42 మహిళా సంఘాలు, 42 మొక్కలు నాటి, 42 నిమిషాలపాటు కార్యక్రమాన్ని నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు నరేందర్గౌడ్, వేణుగోపాల్ కోరుకంటి చందర్కు రికార్డు పత్రాలను అందజేశారు. -
కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: మేయర్ రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హక్కులకోసం మాట్లాడలేని కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సోమవారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు వస్తాయన్నారు. ఏపీకి హోదా, పరిశ్రమలకు రాయితీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నిం చారు. మంత్రి కేటీఆర్పై రూపొందించిన పాటల సీడీని వారు ఆవిష్కరించారు. -
పుట్టినరోజున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయొద్దని మంత్రి కె.తారకరామారావు అభిమానులను కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే నగరంలో అక్కడక్కడ పెట్టిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్లను కోరారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికలు, టీవీలకు ఇచ్చే ప్రకటనల ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. పూల బొకేలు, ఫ్లెక్సీలకు అయ్యే చిన్న మొత్తాలను సైతం సీఎం సహాయ నిధికి పంపించాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని కోరారు. -
‘నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ కృత్రిమ రాజకీయం’
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఏడాది క్రితం జరిగిన నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని, కృత్రిమ రాజకీయం చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. అబద్ధాల పునాదుల మీద ఆందోళనలు చేయాలనుకుని, మంత్రి కేటీఆర్పై బట్టకాల్చి మీదేసే విధంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేస్తున్న రాజకీయాలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్టుగా ఉందన్నారు. కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేని నేరెళ్ల ఘటనను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ, ఓటుబ్యాంకు స్వార్థ రాజకీయాలకు తమను వాడుకుంటున్నదని దళితులు, నేరెళ్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇసుక మాఫియాను కేటీఆర్కు అంటగట్టడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుకమాఫియాను పెంచి పోషించారని, 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలోనే రూ.10 కోట్లు ఖజానాకు రాలేదన్నారు. తెలంగాణ ఇసుక పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. -
చిన్న వయసులో పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లలకు ఏవి సంబరంగా ఉంటాయి? మంచి బొమ్మలు కొనుక్కోవడం, వాటితో ఆడుకోవడం అంటే ఇష్టం. అదే స్నేహితులందరిని పిలిచి బర్త్డే పార్టీ జరిపితే మరీ ఇష్టం. అయితే పదేళ్ల వరుణిక మాత్రం వేడుకలా జరిపే తన బర్త్డే పార్టీకయ్యే డబ్బును పది మందికి ఉపయోగపడేలా చేద్దామనుకుంది. తన తండ్రి రవీందర్రెడ్డి బర్త్డే పార్టీకి ఖర్చు చేయాలనుకున్న లక్ష రూపాయలను మంత్రి కేటీఆర్కు అందించాలని కోరింది. కేటీఆర్ చేస్తున్న మంచి పనులను మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్గా చూస్తూ తాను కూడా చేతనైన సహాయం చేయాలనుకుంది. చిన్నవయసులోనే తన కూతురు పెద్ద మనసు అర్థం చేసుకున్న రవీందర్రెడ్డి, వరుణికను మనస్ఫూర్తిగా అభినందించారు. బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వరుణిక, రవీందర్రెడ్డి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వరుణిక లక్ష రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్(సీఎంఆర్ఎఫ్)కు అందించింది. ఇక నుంచి తన ప్రతీ పుట్టినరోజు నాడు పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తానని కేటీఆర్కు చెప్పింది. చిన్న వయసులోనే వరుణిక అలవరుచుకున్న సామాజిక స్పృహను కేటీఆర్ ప్రశంసించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఒక చిన్న మొక్కను తనకు బహుమతిగా అందించారు. -
ఎన్నికలకు టీఆర్ఎస్ సై!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా అని ట్విట్టర్లో ఓ అభిమాని ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నెటిజన్లతో సంభాషించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు తదితర అంశాలపై సూటిగా, చతురతతో సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలిలా ఉన్నాయి. నచ్చిన నాయకుడు కేసీఆర్ నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని ఒకరు ప్రశ్నించగా సీఎం కేసీఆర్ అంటూ కేటీఆర్ బదులిచ్చారు. ప్రపంచ స్థాయిలో బరాక్ ఒబామా ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణకు తదుపరి సీఎం కేసీఆరేనని చెప్పారు. ‘ 2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీ చేయాలని నాలాంటి చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమం టారు?’అని ఒకరు ప్రశ్నించగా.. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తా యని అని ఓ నెటిజన్ ప్రశ్నించగా... ‘ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ ఏం కావాలి? ఎన్నిక ల్లో అద్భుత విజయమే మా లక్ష్యం’ అని అన్నారు. ప్రజలు వామపక్ష పార్టీలను ఎప్పుడో వదిలేశారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తా మన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, దేశానికి మీ లాంటి వారి సేవలు అవసర మని ఓ అభిమాని కోరగా ప్రణాళికలు వేసుకుని వెళ్లడం కుదరదన్నారు. కేసీఆర్, వైఎస్సార్లలో ఎవరు ఉత్తమ సీఎం అని ప్రశ్నించగా ప్రశ్నలోనే సమాధానముందన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ తాజాగా పోలీసులు చేసిన నగర బహిష్కరణలను కేటీఆర్ సమర్థించారు. త్వరలో నిజామాబాద్, కరీంనగర్లో ఐటీ టవర్లు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన వెంటనే బుద్వేల్లో ఐటీ క్లస్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుపుతా మని కేటీఆర్ చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్ల లో ఐటీ టవర్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు బడుల్లో ఫీజుల వసూళ్లపై కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో తెలంగాణ కేవలం 0.09 శాతం స్కోరుతో వెనుకబడి తొలి ర్యాంకును కోల్పోయిందంటూ తొలి ర్యాంకు సాధించిన ఏపీకి అభినందనలు తెలిపారు. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలన విధానాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా మారాయని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని ఎన్నడూ అమలు చేయలేదన్నారు. హైదరాబాద్లోని రోడ్ల పరిస్థితిపై తనకూ ఆందోళనగా ఉందని, ఇంతకంటే మెరుగ్గా రోడ్లను తీర్చిదిద్దగలిగితే బాగుండేదని అనిపిస్తోందని పేర్కొన్నారు. నగర రోడ్లను బాగు చేయడం అంతులేని ప్రయత్నంగా మారిందని వ్యాఖ్యానించారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కదా.. ఎలా అనిపిస్తోందని ఒకరు అడగ్గా.. అది అద్భుతమైన కాలేజీ అని కొనియాడారు. దేశానికి బలమంతా యువతేనని తెలిపారు. జూలై 24న తన పుట్టిన రోజు సందర్భంగా కేకులు, పోస్టర్లు కాకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇష్టమైన బీరా.. చెప్పను! ఇష్టమైన క్రికెటర్ ఎవరు.. ధోనీనా, కోహ్లీనా.. అని ఓ నెటిజన్ ప్రశ్నించగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్ అని కేటీఆర్ బదులిచ్చారు. తాను వారి తరానికి చెందిన వాడినని పేర్కొన్నారు. ఇష్టమైన ఫుట్బాల్ క్రీడాకారుడు లయోనెల్ మెస్సీ, ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ అని చెప్పారు. ఏ బీరు అంటే ఇష్టమని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘చెప్పను..’ అని కేటీఆర్ చమత్కరించారు. రోడ్ సైడ్ లభించే ఆహారంలో చైనీస్ ఫుడ్ ఇష్టమన్నారు. అదివారం ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ను ప్రస్తావిస్తూ.. క్రొయేషియాకే ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని కేటీఆర్ అన్నారు. -
కేటీఆర్గారు మీకు నచ్చిన బీర్ ఏది?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్లో నెటిజన్లతో ముచ్చటించారు. ఆస్క్ కేటీఆర్ యాష్ట్యాగ్తో (#AskKTR) ఆయనకు ట్యాగ్ చేస్తూ.. అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కొన్ని సరదా ప్రశ్నలు.. కొన్ని సీరియస్ ప్రశ్నలు.. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ పనితీరుపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లేదా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కొందరు నెటిజన్లు కోరగా.. వచ్చే ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశముందా అని గుంటూరు వ్యక్తి ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ పేర్కొన్నారు. డిసెంబర్లో సాధారణ ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటారని అడగ్గా.. ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా.. వచ్చే ఏడాది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రోజు జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరూ గెలుస్తారని కేటీఆర్ను ప్రశ్నించగా.. ఎవరు గెలిచినా ఆనందమేనంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు కేటీఆర్ కూడా సరదా సరదాగా సమాధానం ఇచ్చారు. మీకు నచ్చిన బీర్ ఏది అని ఓ నెటిజన్ అడుగగా.. ఆ విషయం చెప్పను అంటూ కేటీఆర్ బదులిచ్చారు. అమ్మాయిల ప్రశ్నలకు మీరు రిప్లై ఇవ్వడం లేదంటూ ఓ యువతి ప్రశ్నించగా.. ఎంత ధైర్యం నాకు అంటూ కేటీఆర్ బదులిచ్చారు. మీ ఫేవరేట్ ఫుట్బాలర్ ఎవరు అని అడిగితే.. మెస్సీ అని బదులిచ్చిన కేటీఆర్.. మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు అని ప్రశ్నిస్తే.. రాజకీయల్లో అడుతున్నావు కదా అని దాటవేశారు. తదుపరి ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేసిన కేటీఆర్.. మోదీ, రాహుల్గాంధీలో ఎవరిని ఎంచుకుంటారంటే.. ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో కేటీఆర్.. మరీ ఆంధ్రలో ఎవరు? అని ప్రశ్నిస్తే.. కాలేజీని వీడగానే ఖాళీలు పూరించడం ఆపేశానంటూ బదులిచ్చారు. Not answering that 😀 https://t.co/PESon0OKj4 — KTR (@KTRTRS) 15 July 2018 How dare I 😀 https://t.co/IPeTztt6YU — KTR (@KTRTRS) 15 July 2018 Messi https://t.co/RNggwJNW5I — KTR (@KTRTRS) 15 July 2018 In politics you mean 😀 https://t.co/xmerBoKyrf — KTR (@KTRTRS) 15 July 2018 -
హైదరాబాద్లో డిఫెన్స్ ఇంక్యుబేటర్!
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ ఇంక్యుబేటర్ను హైదరాబాద్లో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలో ఉన్న రక్షణ ఎకో సిస్టమ్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ గతంలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. నగరంలోని టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసేందుకు సానుకూలత తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) పథకంలో భాగంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నామని కేంద్ర మంత్రి కేటీఆర్కు తెలిపారు. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకంలో రక్షణ, ఏరోస్పేస్ రంగంలోని పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్, ఆయా రంగాల్లో వ్యక్తిగత పరిశోధన చేసే వారికి, పరిశోధన సంస్థలకు, విద్యార్థులకు కేం ద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంటుందని నిర్మలాసీతారామన్ తెలిపారు. టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి సానుకూల స్పం దనపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ, ఏరోస్పేస్ రంగాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించిందని, ఈ రంగంలో హైదరాబాద్కు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమయ్యిందన్నారు. నగరంలో డిఫెన్స్ ఇంక్యు బేటర్ను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎకో సిస్టం మరిం త బలోపేతమవుతుందని అన్నారు. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తా మని కేటీఆర్ తెలిపారు. టీహబ్ రెండో దశ భవనంలో డిఫెన్స్ ఇంక్యుబేటర్కు స్థలాన్ని కేటాయించనున్నట్లు వివరించారు. దీంతో రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రోటోటైపింగ్, నైపుణ్య శిక్షణ సేవలను అందించేందుకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. -
ఆన్లైన్లో గనుల లీజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గనుల లీజుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పూర్తిగా అన్లైన్ చేశామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గనుల లీజులు, అనుమతుల దరఖాస్తులను ఇకపై ఆన్లైన్లో చేసుకోవచ్చన్నారు. లీజుల పునరుద్ధరణ దరఖాస్తులను సైతం ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. గనుల శాఖ ఇప్పటికే అందిస్తున్న ఆన్లైన్ సేవలకు అనుబంధంగా కొత్త సేవలను బుధవారం మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్లైన్లో దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవచ్చన్నారు. ఆన్లైన్ విధానంతో లైసెన్సుల పునరుద్ధరణ ద్వారా రాయల్టీలు సకాలంలో అంది ఖజానాకు అదాయం పెరుగుతుందని చెప్పారు. ఏ అధికారినీ నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా అనుమతులు పొందవచ్చని, దీంతో పారదర్శకత, వేగం పెరుగుతుందని అన్నారు. ఖనిజాల డీలర్లకు సైతం లైసెన్సుల కోసం దరఖాస్తుల సమర్పణ, అమ్మకాలు, నిల్వ వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు డిజిటల్ సంతకాలతో కూడిన లైసెన్సులు జారీ చేస్తామని గనుల శాఖ డైరెక్టర్ సుశీల్కుమార్ మంత్రికి తెలిపారు. లీజు విస్తీర్ణం డిజిటైజ్.. గనుల శాఖ ఇప్పటికే టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటోందని, రాష్ట్రంలో గనులు, వివిధ రకాల ఖనిజాలు లభించే ప్రాంతాలు, వాటి నిల్వలు, ఖనిజాల ఆధారిత పరిశ్రమలు, వాటి అభివృద్ధికి ఉన్న అవకాశాల వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో పొందుపరి చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. లీజుకు ఇచ్చిన విస్తీర్ణాన్ని డిజిటైజ్ చేసి దాన్ని జియో మ్యాపింగ్ చేయడం, మైనింగ్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలను పర్యవేక్షించడం, డ్రోన్ల వినియోగం లాంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని గనుల శాఖను మంత్రి ఆదేశించారు. -
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. కేసీఆర్ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటానని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో తాను లేనని చెప్పారు. రామగుండం మేయర్పై అవిశ్వాసం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో మంత్రి కె. తారక రామారావుతో భేటీ అయ్యారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని, సమస్యలను పరిష్కరించుకుందామని కేటీఆర్ సూచించడంతో సోమారపు అంగీకరించారు. ఈ సందర్భంగా మేయర్పై అవిశ్వాసం విషయంలో తలెత్తిన వివాదానికి తెరదించారు. నియోజకవర్గంలోని ఫాంహౌస్లో ఉన్న సీఎం కేసీఆర్తో సత్యనారాయణ చేత కేటీఆర్ ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. అలాగే అవిశ్వాసం విషయంలో సోమారపు నిర్ణయానికి కేటీఆర్ అంగీకరించినట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎంపీ జి. వివేక్ పాల్గొన్నారు. అనంతరం సోమారపు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో కేసీఆర్కు బాగా తెలుసునన్నారు. 20 ఏళ్లలో కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రెండేళ్లలో కేసీఆర్ పూర్తి చేస్తున్నారన్నారు. ఇంత మంచి టీం నుంచి ఎంత పిచ్చోడైనా పోవాలని అనుకోడన్నారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా పూర్తయ్యేదాకా తపస్సులా పనిచేస్తారన్నారు. తరచూ సీఎం కేసీఆర్ను కలసి ఇబ్బంది పెట్టొద్దని ఒకసారి ఆయన్ను కలిశాకే తెలుసుకున్నట్లు సోమారపు చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్లో ఉన్నా ఖాళీగా కూర్చోరని, ఏదైనా విషయం ఫైనల్ అయ్యేదాకా ఆలోచిస్తూనే ఉంటారని వివరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే తన అభిమానులు కంటతడి పెట్టారంటూ సోమారపు భావోద్వేగానికి లోనయ్యారు. -
నిండా నీతిమాలిన నేతలే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది గలీజ్ చరిత్ర అని, ఆ పార్టీ నిండా నీతిమాలిన నేతలే ఉన్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇంటింటికీ ప్లోరోసిస్ను చేర్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతల ఆకారాలు, ఆస్తులు, అహంకారాలు పెరగడం తప్ప సామాన్యుల జీవితాల్లో మార్పేమీ రాలేదన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చిట్యాల వద్ద డ్రై పోర్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. పవర్లూమ్, హ్యాండ్ లూమ్ రుణాలు మాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఇంకా ఏమన్నా మిగిలితే అవి కూడా మాఫీ చేసే బాధ్యత తమదేనన్నారు. నల్లగొండకు మెడికల్ కాలేజీ కావాలన్నది ప్రజల చిరకాల కోరిక అని, ఇప్పుడు రెండు కాలేజీలు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలతో పాటు ఎయిమ్స్ కూడా నల్లగొండకే వస్తోందన్నారు. జాతీయస్థాయిలో విధానాలుండవా? గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లే యాదగిరిగుట్ట అభివృద్ధి చెందలేదని మంత్రి విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఇప్పుడు ఎట్లున్నదో జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు. 15 ఏళ్ళు మంత్రిగా పని చేసిన జానారెడ్డి రికార్డు దేనికి పనికొస్తదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు కారులో రూ.2 కోట్లు కాలబెట్టిన ఉత్తమ్ కూడా నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇక్కడి తెలంగాణ రైతులను మోసం చేయడానికే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. నీతిమాలిన కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో విధివిధానాలుండవా అని ప్రశ్నించారు. అదే వేదికపై ఉన్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రజల విశ్వాసాలు దెబ్బ తినకుండా అందరం కలసి పనిచేయాలి. ఈ సమయంలో అస్త్ర సన్యాసం మంచిది కాదు. మీ సేవలు పార్టీకి, ప్రభుత్వానికి అవసరం. అన్ని అస్త్రాలను ఉపయోగించి పనిచేద్దాం’అని కోరారు. అందుకే రిటైర్ అవుతానన్నా: సోమారపు టీఆర్ఎస్కు ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదని సోమారపు సత్యనారాయణ అన్నారు. టీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ‘15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ప్రజల కోసమే పని చేస్తున్నా. రాజకీయాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని. రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లు అందరూ మేయర్ను దింపడానికి సిద్ధమయ్యారు. అందరు వచ్చారు కాబట్టి నేను వ్యతిరేకించలేదు. అవిశ్వాసం ఉపసంహరింపజేయాలని సంకేతాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాను’ అని వివరించారు. అవిశ్వాసంపై వెనకడుగు వేసేది లేదని కార్పొరేటర్లు చెప్పారని, స్వంత కార్పొరేటర్లు కూడా తన మాట వినకపోవడంతో ఆ రాత్రంతా నిద్రపోలేదని చెప్పారు. కార్పొరేటర్లను ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి, రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించినట్లు వివరించారు. రిటైర్మెంట్ ప్రకటన సింగరేణి కార్మికుల ముందే చేశానన్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయ సన్యాసానికి సిద్ధమా?: డీకే అరుణ
స్టేషన్ మహబూబ్నగర్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, మంత్రి కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ సవాల్ విసిరారు. ఆదివారం మహబూబ్నగర్ డీసీసీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జిల్లాలో నాలుగు సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభమై 90 శాతం పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం శిలాఫలాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు డీకే అరుణ హారతి ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారని, ఆ ప్రాజెక్టు కడుతున్న సమయంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా, హరీశ్రావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
కర్ణాటకలో అట్ల.. ఇక్కడ ఇట్లనా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తే కాంగ్రెస్ నిత్యం రకరకాల విమర్శలు చేస్తోంది. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మీ సంకీర్ణ ప్రభుత్వం చేసిందేంటి? తెలంగాణలో మాదిరే రూ.34 వేల కోట్ల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేస్తామని ప్రకటించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలేమో ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కర్ణాటకలో చేతకానిది తెలంగాణలో ఎట్లా చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’అని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ను నిలదీశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ అండ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్కు శంకుస్థాపన చేసి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తున్న పెద్దచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్పై మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో ఆ పార్టీ కర్ణాటకలో ఒకలా తెలంగాణలో మరోలా వ్యవహరిస్తూ, మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో ‘కర్ణాటకలో మా సంకీర్ణ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల రుణాలను విజయవంతంగా మాఫీ చేసింది’అని చేసిన ట్వీట్ను చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. కుటుంబ పాలనెవరిదో దేశమంతా తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అంటూ విమర్శించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2014 వరకు ఎవరిది కుటుంబ పాలనో దేశమంతా తెలుసునన్నారు. ‘‘జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా నాలుగు తరాలు పాలించి దేశానికి మొండిచేయి చూపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వరుసలో ఉన్నారు. కుటుంబ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటు’’అని అన్నారు. గతంలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రామాలకు రోడ్లు, విద్యుత్, ఆఖరికి తాగునీళ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్కు, పాలమూరులో వలసలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. వాళ్ల కంటికి అలాగే కనిపిస్తది.. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తదన్నట్లు.. స్కామ్లు చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్ నేతలకు ప్రతీ పనిలో స్కాంలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయను కమీషన్ల కాకతీయ అని, మిషన్ భగీరథతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని.. ఇలా ప్రతీది వారి కోణంలోనే ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దరిద్రపు ఆలోచనలు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని తెలంగాణ ప్రజానీకం చూస్తోందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్కు గుణపాఠం చెబుతారన్నారు. ఐటీ టవర్కు నిధులు కేటాయింపు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పాలమూరు ప్రాంతానికి కొత్త వైభవం తీసుకొస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 400 ఎకరాల్లో చేపట్టిన ఐటీ, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ పార్కు వల్ల ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పాలమూరు ఐటీ పార్కు త్వరగా అభివృద్ధి చేసేందుకు పెద్ద టవర్ నిర్మిస్తామని, అందుకు రూ.50 కోట్లు నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 6 నుంచి 9 నెలల కాలంలో పనులన్నీ పూర్తి చేసుకుని కంపెనీలు నెలకొల్పేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. -
పవర్బోట్లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
-
పవర్బోట్లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
సాక్షి, మహబూబ్నగర్ : మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్నగర్లో పర్యటించారు. పట్టణంలోని మినీట్యాంక్ ను సందర్శించిన ఆయన.. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి పవర్ బోట్లో ప్రయాణించారు. అంతకుముందు ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటి పరిధిలో రూ. 60 కోట్లుతో చేపట్టిన అబివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు. రూ. 30 కోట్లతో పట్టణంలోని 41 వార్డుల్లో చేపట్టనున్న 215 పనులకు కూడా కేటీఆర్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. పట్టణంలోని దివిటిపల్లి వద్ద చేపట్టనున్న ఐటీ పార్క్ పైలాన్ ఆయన ఆవిష్కరించారు. -
మహిళా పారిశ్రామికవేత్తలకు స్థలాల్లో 10% కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 140కు పైగా పెద్ద పారిశ్రామికవాడలున్నాయని, అందులో 10 శాతం స్థలాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సుల్తాన్ పూర్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ పారిశ్రామికవాడలో 18 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో స్థల కేటాయింపుల పత్రాలను మంత్రి అందజేశారు. ఈ పారిశ్రామిక వాడను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీ, సదుపాయాల అవసరం లేకుండానే సమర్థవంతంగా పనిచేయగలమనే సందేశాన్ని మహిళా పారిశ్రామికవేత్తలు సమాజానికి పంపాలని సూచించారు. వీరి కోసం 200 ఎకరాల్లో మూడు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశామన్నారు. సుల్తాన్పూర్లో 50 ఎకరాలు, 30 ఎకరాల్లో కొవే, 120 ఎకరాల్లో ఎలీప్ పారిశ్రామికవాడలను నెలకొల్పగా, అన్ని చోట్లా స్థలాలు పూర్తిగా అమ్ముడుపోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైతే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి మరో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిక్కి మహిళా పారిశ్రామికవేత్తల పార్కులో ప్రభుత్వ ఖర్చులతోనే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, సాధారణంగా ఈ వ్యయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి టీఎస్ఐఐసీ వసూలు చేస్తుందన్నారు. 1,500 మందికి ఉద్యోగాలు.. సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడలో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పురుషులకు సైతం ఉద్యోగాలివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ను రెండో ఇంటిగా ఏర్పాటు చేసుకుని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రాశేష్ షాను కోరారు. ఫిక్కి లేడిస్ ఆర్గనేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డిపై ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంశలు కురిపించారు. ఆమె శక్తి సామర్థ్యాలు, ఉత్సాహాన్ని చూస్తుంటే భారత దేశానికి సైతం అధ్యక్షురాలు కాగలదు అని చమత్కరించారు. ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రశేష్ షా మాట్లాడుతూ, బ్యాంకు కుంభకోణాలు, ఎన్పీఏలకు సంబంధించిన ఉదంతాలు బయటపడిన ప్రతిసారి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డి, జ్యోత్స అంగార, యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, బిట్రిష్ హైకమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల గుంతలైనా పూడ్చారా..?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో కనీసం హైదరాబాద్లోని రోడ్లపై ఉన్న గుంతలైనా పూడ్చగలిగారా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు ఏం చేసిందని అడిగారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన పీవీ అశోక్కుమార్ తన అనుచరులతో కలసి ఆదివారం కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్తో పాటు మాజీ ఎంపీ వీహెచ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ హయాంలో కించిత్ అభివృద్ధి కూడా జరగలేదని ఉత్తమ్ ఆరోపించారు. రాజధాని ప్రజలకు కృష్ణాజలాల ద్వారా తాగునీరు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే, ఔటర్ రింగురోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రారంభించిన పనులకు నిధులు కేటాయించి అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడమే టీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గత నాలుగేళ్లుగా అడ్డగోలుగా కమీషన్లు తిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ హైదరాబాద్లో తుడిచిపెట్టుకు పోతుందని, ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. పార్టీలో అశోక్ చేరడం వల్ల రాజధానిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని, ముందస్తు ఎన్నికల అంచనా నేపథ్యంలో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఖనిజాన్వేషణపై దృష్టి పెట్టండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్ఎండీసీ)మరింత విస్తృతపరుచుకోవడంతో పాటు, కార్యకలాపాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్రెడ్డితో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్ఎండీసీ ఇసుక తవ్వకాలు, సరఫరాపైనే కాకుండా ఇతర గనుల తవ్వకాలు, అన్వేషణ, వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మాంగనీస్, మార్బుల్, సున్నపురాయి నిల్వలు ఇతర ఖనిజాల వాటి పైనా దృష్టి సారించాలన్నారు. గ్రానైట్ వ్యాపారంలో టీఎస్ఎండీసీ సమగ్ర కార్యాచరణను నెలలో రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గ్రానైట్ లీజులను టీఎస్ఎండీసీ ఇవ్వడానికి ప్రాధాన్యమివ్వాలని గనుల శాఖ డైరెక్టర్కు సూచించారు. రాష్ట్రంలో సున్నపురాయి నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తవ్వకాలు జరపాలని, ఇందుకు కావాల్సిన సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇసుక లభ్యత, సరఫరా, పంపిణీపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇసుక డిపోలు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలు అన్వేషించి కేటాయించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. -
టీ హబ్ పనితీరు భేష్: యూఏఈ మంత్రి
హైదరాబాద్: నగరంలోని టీ హబ్ పనితీరు బేషుగ్గా ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని టీహబ్ను ఆయన శుక్రవారం సందర్శించారు. టీ హబ్ వద్ద రాష్ట్ర ఐటీ మంత్రి కె తారకరామారావు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ యూఏఈ మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం టీ హబ్లో అన్నిప్రధాన ప్రాంతాలను, స్టార్టప్లను, సమావేశ గదిని, నిర్మాణాన్ని షేక్ అబ్దుల్లా పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యాపార అవకాశాలను మరింత మెరుగుపర్చేందుకు యూఏఈని సందర్శించాలని కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. యూఏఈ మద్దతుతో మార్కెటును దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తులు, సమస్యల పరిష్కారం దిశగా స్టార్టప్ల రూపకల్పనకు చొరవ చూపేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించారు. సహజసిద్ధ వనరులు, నీరు వంటి అంశాలపై సంయుక్తంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఆయనకు కేటీఆర్ వివరించారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్గా టీ హబ్ను రూపొందించామని, ఇంతకన్నా మరింత పెద్దగా టీ హబ్–2 తుది మెరుగులు దిద్దుకుంటోందన్నారు. ఆగస్టులో బ్లాక్ చైన్ కాంగ్రెస్ బ్లాక్చైన్ టెక్నాలజీపై పూర్తిస్థాయి దృష్టి పెడుతున్నామని, ఇది సమస్యల పరిష్కారంలో ఎంతో ఉపయుక్తంగా ఉందని యూఏఈ మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు మొదటివారంలో హైదరాబాద్లో అంతర్జాతీ య స్థాయి బ్లాక్చైన్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నామని, ఇందులో పాల్గొనాలని యూఏఈ మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. యూఎస్పీ శిక్షణ కేంద్రం భారతదేశంలో నాణ్యమైన ఔషధాలు తయారీ లక్ష్యంగా ఫార్మారంగంలోని వారికి, ఇతర గ్రాడ్యుయేట్లకు మార్గదర్శిగా నిలిచే ప్రతిష్టాత్మక యూఎస్పీ శిక్షణ సంస్థ హైదరాబాద్లో శుక్రవారం కొత్తగా ప్రారంభమైంది. ఒక మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ప్రతిష్టాత్మక యూఎస్పీ శిక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, యూఎస్పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.వి.సురేంద్రనాథ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. -
రాయితీలపై బండరాయి!
‘కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాయితీలు ఇచ్చే ప్రశ్నే లేదు. స్టీలు ప్లాంటు కోసం రాయితీలు కేంద్రానికి ఎందుకివ్వాలి? – మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి లోకేష్ ‘బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే సగం ఖర్చు భరిస్తాం. అక్కడ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ప్రైవేట్ సంస్థలకే అనేక రాయితీలిస్తున్నాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటే అవసరమైనవన్నీ సమకూరుస్తాం’ – ప్రధానితో భేటీ అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్ చూశారుగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను రప్పించేందుకు పొరుగు రాష్ట్రం ఎంత సన్నద్ధంగా ఉందో! ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు తీసే అవకాశాన్ని ఎవరు మాత్రం కాలదన్నుకుంటారు?.. ఒక్క టీడీపీ సర్కారు మినహా! తాజాగా స్టీల్ ప్లాంట్ నెలకొల్పే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రాయితీలు కల్పించబోమంటూ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం పట్ల పారిశ్రామికవర్గాల్లో, ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీకి రావాల్సిన కేంద్ర సంస్థలను పట్టించుకోకుండా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామంటూ దావోస్ తదితర చోట్లకు విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై అధికార టీడీపీ అసలు బండారం బయటపడింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకుని కూడా ఉక్కు కర్మాగారాన్ని సాధించకుండా ఇప్పుడు నిరాహార దీక్షల పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకాలు కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో తేటతెల్లమయ్యాయి. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్థంగా ఉందని, కానీ ఈ ప్రాజెక్టుకు ఇచ్చే రాయితీల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడమే జాప్యానికి అసలు కారణమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ బుధవారం ఢిల్లీలో తనను కలసిన టీడీపీ ఎంపీలకు స్పష్టం చేయడం గమనార్హం. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చే రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చకపోవడమే కడప ఉక్కు కర్మాగారంపై ఆలస్యానికి కారణమని తేలిపోతోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళవారం చేసిన ప్రకటన కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. కడప ఉక్కు యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వదని, మొత్తం ఖర్చంతా కేంద్రమే భరించాల్సి ఉంటుందని లోకేష్ ప్రకటించారు. దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం భరించడానికి ముందుకు రావడం గమనార్హం. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా 15,000 మంది గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించే బయ్యారం ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చులో అవసరమైతే సగం భరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విలేకరులకు వెల్లడించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా... 2009లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా బీహెచ్ఈఎల్– ఎన్టీపీసీ యూనిట్ను రాష్ట్రంలో నెలకొల్పేందుకు భారీగా రాయితీలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్ ఏర్పాటుకు ఎకరం రూ.100 నామమాత్రపు ధరతో 750 ఎకరాలతో పాటు అనేక రాయితీలను వైఎస్ కల్పించారు. నాడు ప్రధాని మన్మోహన్సింగ్తో శంకుస్థాపన చేయించడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వేరే రాష్ట్రానికి తరలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనుకబడిన రాయలసీమ ప్రజల జీవితాన్ని మార్చే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. కనీసం యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఎక్కడ కేటాయిస్తుంది? కరెంట్, నీటి సరఫరా లాంటి కీలక అంశాలను కూడా వెల్లడించకుంటే ఫీజిబిలిటీ నివేదిక ఎలా ఇస్తామని మెకాన్ సంస్థ ప్రశ్నిస్తోంది. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్ధమైనా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు రంగ సంస్థలు పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. కానీ ప్రాజెక్టులు ఏర్పాటు కావడానికి అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని చమురు రంగ సంస్థల ప్రతినిధులు అనేకసార్లు స్పష్టం చేశారు. ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్ వంటి సంస్థలు ఏకంగా రాష్ట్రంలో రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. వైజాగ్–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు అయితే సుమారు రూ.3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఒక్క హెచ్పీసీఎల్ రూ.55,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. హెచ్పీసీఎల్, గెయిల్తో కలిసి కాకినాడలో మరో రూ.40,000 కోట్లతో క్రాకర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైవేట్కు పెద్దపీట.. పూర్తిగా వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేసే ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండటం గమనార్హం. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్కు ఉచితంగా భూములు కేటాయించడమే కాకుండా పలు రాయితీలను ప్రకటించింది. రాజధానిలోని మల్లవరం వద్ద అశోక్ లేలాండ్కు, ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు ఎంవీవీఎస్ మూర్తి కుటుంబానికి చెందిన వీబీసీ పెట్రో కెమికల్స్కు జగ్గయ్యపేటలో, నాచు కార్పొరేషన్కు కర్నూలు జిల్లాలో ప్రభుత్వం భూములు కేటాయించింది. విశాఖ నడిబొడ్డున దుబాయ్కి చెందిన లూలూ గ్రూపు వాణిజ్య భవన సముదాయం నిర్మాణానికి తక్కువ ధరకు భూములు కేటాయించడమే కాకుండా రూ.వేల కోట్లలో ప్రయోజనం కల్పించింది. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తే కమీషన్లు దండుకోవచ్చని, అదే కేంద్ర సంస్థలకు రాయితీలు ఇస్తే కమీషన్లు ఉండవనే ఉద్దేశంతోనే వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్కు కారుచౌకగా భూములు రాజధాని అమరావతిలో కూడా కేంద్ర సంస్థలకు భూములను రూ.కోట్ల ధరకు కేటాయిస్తూ ప్రైవేట్ సంస్థలకు మాత్రం చౌకగా రూ.లక్షల ధరకు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, ఎల్ఐసీ వంటి సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.4 కోట్ల ధరతో కేటాయిస్తే ఆర్బీఐ, నేవీ సంస్థలకు ఎకరం కోటి రూపాయలకు కేటాయించారు. మరోవైపు ప్రైవేట్ విద్య, వైద్య సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.10 లక్షలకే ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయితీలపై స్పష్టత ఇవ్వాల్సింది ఏపీనే సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన రాయితీల విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు కొణకళ్ల నారాయణ, మాగంటి బాబు, దివాకర్రెడ్డి, రవీంద్రబాబు, మాల్యాద్రి శ్రీరామ్, మురళీమోహన్ తదితరులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి, ముడిసరుకు సరఫరా (లింకేజ్)పై కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వగానే మెకాన్ సంస్థ అధ్యయనం అనంతరం ప్లాంట్ ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించగలుగుతామని స్పష్టం చేశారు. గడువు చెప్పమంటే ఎలా! కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు మధ్యలో కలుగజేసుకొని అసలు ఎప్పట్లోగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారో నిర్దిష్ట గడువును చెప్పాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అసలు రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకుండానే ప్లాంట్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువు చెప్పమంటే ఎలా! అంటూ అసహనం వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పార్టీ ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రి జూలియా క్లోవిక్నర్ హామీ ఇచ్చారు. ప్రపంచ ఆహార సదస్సు–2018లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎమ్మె ల్యే సీహెచ్ రమేశ్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు జర్మనీ వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం జర్మనీ విత్తన ప్రముఖులతో అక్కడ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్లోవిక్నర్ తెలంగాణ రాష్ట్రం విత్తన ధ్రువీకరణ కింద పలు దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయడాన్ని అభినందించారు. తెలంగాణను గ్లోబల్ సీడ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో గ్లోబల్ సీడ్ అడ్వయిజరీ బాడీ, ఇండో–జర్మన్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్కు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలను దిగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎద్దుమైలారంలో 100 ఎకరాల్లో సీడ్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్మనీ–తెలంగాణ మధ్య ఉన్న ఇండో–జర్మన్ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగిస్తున్నామన్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం.. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పంపిన లేఖను క్లోవిక్నర్కు ఎమ్మెల్యే రమేశ్, డాక్టర్ కేశవులు అందజేశారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ ఇస్టా కాంగ్రెస్కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్ ఆ లేఖలో ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆసియాలోనే మొదటిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, పలు దేశాల నుంచి విత్తన నిపుణులు, విత్తన శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ప్రపంచ ఆహార సదస్సుకు కొన్ని కారణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారం దిశగా తెలంగాణ పయనిస్తున్న సమయంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్, విత్తన ఎగుమతికి సహకరిస్తున్న ఇండో–జర్మన్ ప్రాజెక్టు నిర్వహకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ దేశానికే మార్గదర్శకం
శంషాబాద్: ‘ఒకప్పుడు బెంగాల్లో ఏది జరుగుతుందో దేశంలో అదే జరుగుతుందనే మాట ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో దేశంలో అదే జరగబోతుందనేలా మన రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా మారింది’అని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం శంషాబాద్ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజలు అడగని డిమాండ్లు, ప్రతిపక్షాల ఆలోచనకురాని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ పేద ఆడపడుచులకు మేనమామలా మారారన్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ మనవలు, మనుమరాళ్లు తినే సన్నబియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకూ పెడుతున్న మనసున్న ప్రభుత్వం తమదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 700 గురుకుల పాఠశాలలు ప్రారంభించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. దేశచరిత్రలోనే రైతులకు పంట పెట్టుబడి అందజేసి తమ ప్రభుత్వం రైతుబంధుగా మారిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. కాంగ్రెసోళ్లకు ఆస్కార్ ఇవ్వాలి.. ‘గతంలో వాళ్లు పరిపాలనే చెయ్యలేదట.. గిప్పుడే కొత్తగా పార్టీ పెట్టినట్లు బీద అరుపులు అరుస్తున్నరు. వాళ్లు చందమామలా ఇచ్చిన రాష్ట్రాన్ని మనమేదో పాడు చేసినట్లు అరుపులు, బొబ్బలు పెడుతున్నరు. కాంగ్రెసోళ్లకు ఆస్కార్ అవార్డు ఇయ్యాల్సిందే’ అని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ఒకసారి స్పీకర్ మైక్ ఇస్తే ఇంకా ప్రిపేర్ కాలేదన్న ఉత్తమ్ ఇప్పుడు ఎన్నికలకు రెడీ అంటున్నారని, తీరా ఎన్నికల తేదీ ప్రకటిస్తే తామింకా ప్రిపేర్ కాలేదంటారేమోనని ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ ఓ పిట్ట కథ చెప్పారు. ‘చిన్నప్పటి నుంచీ చెడు అలవాట్లతో పెరిగిన ఓ యువకుడు తల్లిదండ్రులను హతమారుస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు నిలబెట్టినప్పుడు.. నీకేం శిక్ష వేయాలని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు.. ‘నేను తల్లి, తండ్రి లేని అనాథను సార్’ అని అమాయకంగా చెప్పినట్లుగా ఉంది కాంగ్రెసోళ్ల తీరు’ అని అన్నారు. ఐటీ హబ్గా రాజేంద్రనగర్.. రాజేంద్రనగర్ నియోజకవర్గం మరో మూడేళ్లలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మించిపోతుందని కేటీఆర్ అన్నారు. బుద్వేల్, కిస్మత్పూర్ మధ్య 28 ఐటీ కంపెనీలు రానున్నాయని, దీంతో కిస్మత్పూర్ ఏరియా ‘కిస్మత్’మారిపోతుందని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సిటీతో పాటు ఇక్కడే లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులను పురపాలక శాఖ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో రవాణా మంత్రి పి.మహేందర్రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్రెడ్డి, శంభీపూర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
పోస్టింగ్లలో మాకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లపై అసంతృప్తులు మొదలయ్యాయి. పోస్టింగ్ల కేటాయింపులో ప్రభుత్వ ప్రస్తుత విధానంపై ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రాధాన్యత పోస్టుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన వర్గాల ఐఏఎస్లు మండిపడుతున్నారు. ఈ మేరకు పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లు హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆదివారం సమావేశమై ప్రభుత్వం ఈ విషయంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విధానాన్ని రూపొందించాలంటూ కోరాలని నిర్ణయించారు. మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ విషయంపై వివరించాలని అనుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను కలవాలని నిర్ణయించారు. జూనియర్లకే పోస్టింగ్లా...? విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోస్టింగ్ల కేటాయింపులో దళిత, గిరిజన ఐఏఎస్ అధికారులకు అన్యాయం జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం కేటాయించాల్సిన పోస్టులను సైతం ఎస్సీ, ఎస్టీ సీనియర్ ఐఏఎస్లను కాకుండా ఇతర వర్గాలకు చెందిన జూనియర్ ఐఏఎస్లకు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఉద్దేశపూర్వకంగానే అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. దీంతో కలెక్టర్ల పోస్టుల సంఖ్య కూడా పెరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వడంలేదు. అగ్రవర్ణాలకు చెందిన జూనియర్ ఐఏఎస్లకు జిల్లాల కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తున్నారు. కలెక్టర్గా పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి లక్ష్యంగా ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఈ అవకాశం కల్పించడం లేదు. ఒకటి, రెండు జిల్లాల వారికే ఈ అవకాశం కల్పించారు. రిటైర్డ్ ఉన్నతాధికారి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ప్రభావం వల్లే ఇలా జరుగుతోంది. చిన్నచిన్న తప్పులను సీఎం కేసీఆర్కు పెద్దగా చేసి చూపి పోస్టింగ్ ఇవ్వకుండా చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లకు కీలక విభాగాలను కేటాయించడంలేదు. సీనియారిటీని పట్టించుకోవడంలేదు. ఎక్స్ కేడర్ పోస్టులను కొత్తగా సృష్టించి మరీ ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లకు అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారు. ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించాల్సిన సీనియర్ అధికారులను అప్రాధాన్య పోస్టులలో ఏళ్లపాటు కొనసాగిస్తున్నారు. కొందరు బీసీ ఐఏఎస్ అధికారులకూ అన్యా యం జరుగుతోంది. అగ్రవర్ణాలకు చెందిన కొందరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నా వారికి ప్రాధాన్యత పోస్టులలో అవకాశం ఇస్తున్నారు. నాన్ ఐఏఎస్ అధికారులను ఐఏఎస్ల పోస్టులలో నియమిస్తున్నారు. పదవీ విరమణ పొందినా కొందరికి ప్రాధాన్యత కలిగిన ఐఏఎస్ల పోస్టులు ఇస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐఏఎస్ అధికారులలో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. అందుకే కొందరు ఇతర రాష్ట్రాలు, కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికైనా పరిస్థితి మారాలి. దీని కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని కలసి వివరిద్దాం. అనంతరం సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించాలి’అని సమావేశంలో ఐఏఎస్లు నిర్ణయించారు. -
కేటీఆర్ ఫన్నీ ట్వీట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతీ అంశంపై ఎప్పటికప్పడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ చిన్నారి హోంవర్క్ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్ చేస్తూ కేటీఆర్ ఓ ఫన్నీ ట్వీట్ చేశారు. ‘జీవితంలో షార్ట్కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్... చిన్నారితో పాటు ఆ టీచర్ కూడా అంతే స్మార్ట్.’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. ఓ చిన్నారికి తన హోంవర్క్ సంబంధించి ఆకలితో ఉన్న పిల్లి ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ఓ ఫజిల్ అడిగారు. దానికి చిన్నారి ఫజిల్ లోపల ఎలా వెళ్లాలనేదాని గురించి ఆలోచించకుండా, పిల్లి నుంచి పాలకు షార్ట్కట్గా గీత గీసి ఫజిల్ పూర్తి చేసింది. విద్యార్థి జవాబుకి టీచర్ కూడా రైట్ మార్కు వేసి.. స్టార్ సింబల్ కూడా ఇచ్చారు. అందుకే ఈ చిన్నారి తెలివితేటలకు ఫిదా అయిన కేటీఆర్ ట్వీటర్ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇపుడా ఆ ట్వీట్ వైరల్గా మారింది. Who said there are no shortcuts in life? Gotta love this smart kid 😀 and the teacher is equally smart it appears 😀 pic.twitter.com/tjNBt7gnDa — KTR (@KTRTRS) June 21, 2018 -
భూ వివాదాలు కొలిక్కి తెస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్లోని భూ వివాదాలను కొలిక్కి తెస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్, ఎఫ్టీఎల్లకు సంబంధించిన భూ వివాదాల్లో పాలనాపర అంశాలను 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. 58, 59 జీవోల కింద గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మరో సారి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు, కాలనీల ప్రజలతో సోమవారం ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ చర్చించారు. దాదాపు 20 కాలనీలు, బస్తీల భూముల వివాదాలను క్షుణ్నంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీవో స్థాయిలో రికార్డుల సవరణ చేయకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, ఆ రికార్డులను వెంటనే సవరించాలని ఆదేశించారు. చట్టాలను సవరించాల్సి వస్తే సంబంధిత తీర్మానాలను వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చట్ట సవరణ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్ భూముల వివాదాలపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో త్వరలోనే సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల విక్రయాలకు సంబంధించి పదేళ్లకు పైగా ఉన్న నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎన్వోసీల జారీకి చర్యలు చేపడతామన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధి, కన్జర్వేషన్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. దాదాపు 4 గంటల పాటు.. మన్సూరాబాద్ సర్వే నంబర్ 44, 45లలోని నిర్మాణాలను 2007 రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆయా కాలనీల వాసులు కోరగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాగోల్ సాయినగరంలోని 101, 102 సర్వేలలో ఉన్న 1,952 ఇళ్ల వివరాలను రికార్డుల్లో తప్పుగా పేర్కొన్నారని, 15 రోజుల్లోగా వాటిని సవరించాలని రంగారెడ్డి ఇన్చార్జి కలెక్టర్ ఎన్.వి.రెడ్డిని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఎఫ్టీఎల్ కన్జర్వేషన్ జోన్ల జోలికి వెళ్లమన్నారు. గ్రీన్ పార్కు కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న 3,200 గజాల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని కార్పొరేటర్ ఎం.శ్రీనివాసరావు కోరగా.. ఆ భూమి విషయంలో వివాదం లేకపోతే కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, సీసీఎల్ఏ రాజేశ్వర్ తివారీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ ఎన్.వి.రెడ్డి పాల్గొన్నారు. -
యోధుడికి ‘ఆత్మకథ’ బహుమతి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకుని పోరాడిన యోధుడు మా తాతయ్య. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజున (జూన్ 17) ఆవిష్కరించి తాతయ్యను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా’’అంటూ మంత్రి కె.తారకరామారావుకు 17 ఏళ్ల నిధిరెడ్డి మే 4న ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది. సరిగ్గా 2 నిమిషాల అనంతరం కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ‘‘తప్పకుండా చేద్దాం. అలాంటి పోరాట యోధుడి కోసం నేను మీ ఇంటికి వస్తాను’’అని బదులిచ్చారు. వివరాలు పంపాలంటూ కొద్ది నిమిషాల తర్వా త కేటీఆర్ ఆఫీసు నుంచి మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే..: ఆదివారం హైదరాబాద్ హబ్సిగూడలోని స్ట్రీట్ నం.7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవరెడ్డి ఇంటికి కేటీఆర్ స్వయంగా వచ్చారు. నడవలేని స్థితిలో మంచంపై ఉన్న యాదవరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జ్ఞాపికను అందించారు. కుటుంబీకుల సమక్షంలో యాదవరెడ్డి కేక్ కట్ చేయగా, కేటీఆర్ కేక్ తినిపించారు. గతంలో ఆయన చేసిన కార్యక్రమా లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన రచించిన ‘నా జ్ఞాపకాలు’ ఆత్మకథను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. భావి తరాలకు స్ఫూర్తి: కేటీఆర్ మిట్ట యాదవ రెడ్డి మాట్లాడుతూ.. అనుక్షణం రాష్ట్రం కోసమే తపించానని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధి దిశగా నడవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, యాదవరెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాల కు స్ఫూర్తి అన్నారు. చరిత్రను చూసిన యాద వరెడ్డి వంటి పెద్దల ప్రశంసలు తమను మరిం త స్ఫూర్తితో ముందుకు నడుపుతాయన్నారు. మిట్ట యాదవరెడ్డి నేపథ్యం: జనగామ, సూర్యాపేట తాలూకాల సంగమ ప్రదేశం వెలిశాల గ్రామంలో జన్మించిన యాదవరెడ్డి 1945–47లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టులో జాతీయ జెండా ఎగురవేసి, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలై తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టంలో చేరి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరులో చేరారు. జనవరి 1948లో తాటికొండ గ్రామం వద్ద రజాకార్లు, నైజాం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. సాయు ధ పోలీసులు, రజాకర్లు మూకుమ్మడిగా దాడి చేయడం.. యాదవరెడ్డి దళం వద్ద మందుగుండు అయిపోవడంతో అరెస్ట్ అయ్యారు. చర్మం వలిచి, సూదులతో గుచ్చినా దళం ఆచూకీ కానీ, తోటీ కామ్రేడ్ల వివరాలు కానీ చెప్పని ధీశాలి ఆయన. 1951లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహె చ్డీ పూర్తి చేసి ఓయూలో అధ్యాపకుడిగా పని చేశారు. సోషల్ౖ సెన్స్ విభాగానికి డీన్గా రిటైర్ అయ్యి హబ్సిగూడలో నివాసముంటున్నారు. -
‘ఔటర్’ టోల్కు గండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ టోల్ ‘దందా’సాగింది. టెండరు గడువు ముగిసినా కొత్త కాంట్రాక్టర్లకు టోల్ వసూలు బాధ్యతను అప్పగించకుండా పాత కాంట్రాక్టు కంపెనీ టోల్కు గండి కొట్టింది. కంప్యూటర్ ద్వారా కాకుండా చేతి రాతతోనే రశీదు ఇస్తూ రూ.లక్షల్లో దండుకుంది. ఈ విషయమై ప్రశ్నించిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి సైతం ‘ఇక్కడింతే’అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. రోజూ రూ.80 లక్షలు.. మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు. సగటున రోజుకు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల టోల్ వసూలవుతుంది. గతంలో ప్రతి నెలా రూ.16 కోట్ల చొప్పున ఏడాదికి రూ.192 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. గత కంపెనీ గడువు ముగియడంతో తాజా టెండర్ ప్రక్రియ చేపట్టగా ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టెండర్ దక్కించుకుంది. ప్రతి నెలా రూ.26 కోట్ల చొప్పున ఏడాదికి రూ.312 కోట్లకు ఆదాయం కూడా పెరిగింది. 158 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై టోల్ వసూలులో అవకతవకలకు తావు లేకుండా అధునాతన టోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగిస్తున్నారు. అయితే పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య గొడవ కారణంగా కొత్త కాంట్రాక్టరుకు టోల్ వసూలు బాధ్యతను అప్పగించకుండా భారీ మొత్తంలో టోల్కు పాత కంపెనీ గండి కొట్టింది. అన్ని టోల్ గేట్లలో తమ సిబ్బందిని మోహరించి చేతి రాతతోనే రశీదు రాసి రోజుకు రూ.లక్షల్లోనే దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీ చేసేందుకు తన సొంత వాహనంలో అటుగా వెళ్లిన ము న్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్కు కూడా చేతి రాతతో రాసిన రశీదు ఇచ్చారు. దీంతో ఈ విషయమై ఆయన ప్రశ్నించగా ‘ఇక్కడింతే’అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. క్రిమినల్ కేసులు పెట్టండి: కేటీఆర్ ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టోల్ టెండర్లు, హెచ్ఎండీఏ ఆదాయం పెంపుపై సంబంధిత అధికారులతో చర్చ జరగ్గా పాత కాంట్రాక్టర్ల టోల్ దందా విషయాన్ని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. కానీ అలాంటిదేమీ లేదని, అంతా సజావుగా సాగుతుందని హెచ్ఎండీఏ అధికారులు వివరించగా.. తన దగ్గర ఉన్న చేతి రశీదును మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ చూపించారు. దీంతో అధికారులంతా అవాక్కయ్యారు. తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్ కొత్త కంపెనీకి టోల్ బాధ్యతలు అప్పగించాలని, పాత కాంట్రాక్టు కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడొద్దని ఆదేశించారు. -
అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి
-
పూరి గుడిసెపై రూ.500 పన్నా!
సాక్షి, హైదరాబాద్: వృద్ధ దంపతులు నివాసముంటున్న ఓ గుడిసెపై స్థానిక పంచాయతీ కార్యదర్శి రూ.500 ఆస్తి పన్నును వసూలు చేసిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్లూర్ మండలం కర్దెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉదంతాన్ని ట్విట్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు చెల్లించిన ఆస్తి పన్నును వెనక్కి ఇప్పించడంతో పాటు వారికి డబుల్బెడ్ రూం ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులు నిర్దయగా వ్యవహరించారని ఉత్తమ్ తప్పుపట్టారు. దీనికి కేటీఆర్ స్పందించి ఈ పొరపాటును సరిదిద్దాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆ దంపతులకు డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్ రాని పక్షంలో అదీ మంజూరు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఉత్తమ్కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ ఆదేశాలపై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ ట్వీటర్లో స్పందించారు. ఈ విషయం తన దృష్టికి నాలుగు రోజుల క్రితమే వచ్చిందని.. వెంటనే బాధితులకు ఆస్తిపన్ను తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. ఆ వృద్ధ దంపతులకు ఇప్పటికే ఆసరా పింఛన్ అందుతోందని.. డబుల్ బెడ్రూం పథకం కింద ఇంటిని మంజూరు చేస్తామని కేటీఆర్కు ఆయన బదులిచ్చారు. -
‘ఇసుక మాఫియాకు కేటీఆర్ అండ’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇసుక మాఫియాకు మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారని దళిత, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు గజ్జెల కాంతం ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో నేతలు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సిరిసిల్ల, నేరెళ్లలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇసుక దందాలు నడుస్తున్నాయని, అడ్డుకొనేందుకు ప్రయత్నించిన దళితులను చిత్రహింసలకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. -
మురుగు కాల్వల శుభ్రతకు ఆధునిక టెక్నాలజీ
-
సైబర్ భద్రతకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ భద్రతను పటిష్టపరిచేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలోని డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్సీఐ) సంస్థ భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీ–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదికను ఆవిష్కరించేందుకు శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో డీఎస్సీఐతో రాష్ట్ర ఐటీ శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ను సైబర్ సెక్యూరిటీకి హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సులువుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూపొందించిన ‘టీ–వెబ్’ (httpr://tweb. telangana.gov.in)ను మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచార భద్రత కోసం రూపొందించిన తెలంగాణ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(టీ–ఎస్వోసీ)ను కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా 34 ఎంబీపీఎస్, 12 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించేందుకు తెలంగాణ స్టేట్ వైడ్ నెట్వర్క్ (టీ–స్వాన్) 2.0 కార్యక్రమంతో పాటు.. ఆధార్తో అనుసంధానం ద్వారా హాజరు నమోదు కోసం రూపొందించిన ‘టీఎస్టీఎస్ అబాస్’ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ అవసర సామగ్రిని మీ–సేవ కేంద్రాల ద్వారా రైతులకు ఇం టి వద్దే సరఫరా చేసేందుకు ఇఫ్కో బజార్తో ప్రభు త్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పలు ఐటీ కంపెనీలకు పురస్కారాలు ఐటీ రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పరిశ్రమలకు కేటీఆర్ తెలంగాణ ఆవిర్భావ దిన పురస్కారాలు అందించారు. రూ.10,889 కోట్ల ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్కు పెద్ద కంపెనీల విభాగంలో అత్యధిక సాఫ్ట్వేర్ ఎగుమతుల పురస్కారం లభించింది. సూక్ష్మ, మధ్యంతర పరిశ్రమల విభాగంలో వాల్యూ మొమెంటమ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీకి ఈ పురస్కారం వరించింది. అత్యధిక ఉద్యోగాల కల్పన పురస్కారం పెద్ద కంపెనీల విభాగంలో ఇన్ఫోసిస్కు, సూక్ష్మ, చిన్న కంపెనీల విభాగంలో ఆర్ఎంఎస్ఐ ప్రైవేటు లిమిటెడ్కు దక్కింది. ఐటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన కంపెనీగా ఆర్ఎంఎస్ఐ, విశేషంగా సీఎస్ఆర్ సేవలందించిన కంపెనీగా టెక్ మహీంద్రా, అత్యంత సృజనాత్మక స్టార్టప్గా చిట్మాంక్స్, మోస్ట్ ప్రామిసింగ్ యాడ్టెక్ స్టార్టప్గా అడాన్మో, మోస్ట్ ఇన్నోవేటివ్ స్మార్ట్ సిటీ స్టార్టప్గా అయాస్టాలకు పురస్కారాలు లభించాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పురస్కారం కాలిబర్ టెక్నాలజీస్కు, తూర్పు క్లస్టర్ ప్రోత్సాహక పురస్కారం ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్కు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ రంగ అభివృద్ధి పురస్కారం టెక్ మహీంద్రాకు, టాస్క్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధికి విశేష కృషి చేసినందుకు ఇన్ఫోసిస్కు, సైబరాబాద్లో మహిళల భద్రతకు కృషి చేసినందుకు ఐపీఎస్ అధికారి జానకి షర్మిళకు పురస్కారాలు అందించారు. కంప్యూటర్ విద్యను మారు మూల ప్రాంతాల్లో అందించినందుకు పి.కోటేశ్వర్రావు, ఆర్.పావని, రాజేశ్, పుల్యాల రజని, వి.నాగరాణిలకు డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అం దించారు. టాస్క్ ద్వారా గ్రామీణ యువతకు సాధికారత కల్పించినందుకు దీపిక రెడ్డి, అత్యుత్తమ సేవలందించిన ఎన్జీవోగా తెలంగాణ ఐటీ అసోసియేష న్, ఐటీ కారిడార్లో చేనేత దుస్తుల ప్రోత్సాహానికి గాను ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్కు పురస్కారాలు అందించారు. ‘ఆరోగ్య హైదరాబాద్గా తీర్చిదిద్దుతాం’ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను అందమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని.. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రపంచ పర్యావరణోత్సవాల నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్తో కలసి నగర శివారులో అటవీశాఖ అభివృద్ధి చేసిన భాగ్యనగర్ నందనవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును కేటీఆర్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎరిక్ సోల్హెమ్ ప్రశంసించారు. అర్బన్ ఫారెస్టు పార్కు నిర్వహణ బాగుందని.. నగరాల్లో నివసించే ప్రజలకు మంచి వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా ఇలాంటి పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. పార్కు సందర్శన అనంతరం ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎరిక్కు వివరించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కులో ఉన్న మొక్కలు, పూల సమాచారంతో తయారు చేసిన ‘ది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ కేబీఆర్ నేషనల్ పార్క్’పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఏసీ బస్ షెల్టర్స్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ఏసీ బస్ షెల్టర్స్ ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. నేడు ఖైరతాబాద్, కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్లను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ ఆధునిక బస్ షెల్టర్లలో ఏసీ, వైఫై, ఏటీఎం, టీవీ, మొబైల్ చార్జింగ్ పాయింట్స్, ఫ్యాన్లు, టాయిలెట్, టికెట్ కౌంటర్లులతో పాటు ఎమర్జెన్సీ హారన్ వంటి సౌకర్యాలు కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ బస్షెల్టర్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపడుతుంది. గ్రేటర్లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. పాశ్చత్య దేశాలలోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్ షెల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్టీసీ ఆఫీస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఏసీ బస్ షెల్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. దేశంలో తొలిసారిగా ఏసీ బస్టాప్ను ఏర్పాటు చేసిన ఘనతను జీహెచ్ఎంసీ సాధించింది. సోమాజిగూడలో నిర్మించిన అత్యాధునిక ఏసీ బస్టాప్లను మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభంచారు. జీహెచ్ఎంసీ, యూనియాడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో రూ. 60 లక్షల వ్యయంతో ప్రయోగాత్మకంగా ఏసీ బస్టాప్ను ఏర్పాటు చేశారు. ఒక్కో బస్టాప్ దాదాపుగా 25మంది ప్రయాణికులకు చోటివ్వనుంది. ఈ సందర్భంగా యూనియాడ్స్ ప్రతినిథులు ప్రవీన్ రామారావు, ఎంఎన్ రాజులు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు రెడ్ బటన్ ప్రేస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుందన్నారు. తొలుత రెండు ఏసీ, మరో రెండు నాన్ఏసీ బస్టాప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ప్రత్యేక కారణాలతో నాలుగు బస్ షెల్టర్లకు ఏసీలను అమర్చామని తెలిపారు. ఈ బస్టాప్లకు అధునాతన టఫ్పెల్ గ్లాస్లను అమర్చినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణ, ఆర్టీసీ ఈడీ రమణారావు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, జోనల్ కమిషనర్ భారతి హోలికేరి, డిప్యూటీ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్, డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నగరం ఆవలకు కాలుష్యకారక పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించేందుకు సనత్ నగర్, నాచారం, కాటేదాన్ ప్రాంతాల్లోని పరిశ్రమలతో చర్చించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను మంగళవారం ఆయన సమీక్షించారు. ఐటీ లాంటి నూతన రంగాల పరిశ్రమల అభివృద్ధికి ఆయా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడాలని సూచించారు. జిల్లాలతో పాటు నగర శివార్లలో నిర్మిస్తున్న పారిశ్రామికవాడల పురోగతి వివరాలను కేటీఆర్ తెలుసుకున్నారు. దండు మల్కాపూర్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కు నిర్మాణం పూర్తయిందని, ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. బండ మైలారంలో సీడ్ పార్కు, బండ తిమ్మాపూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, శివనగర్లో ఎల్ఈడీ పార్కు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారు
నల్లగొండ : యాబై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నల్లగొండను అభివృద్ధి చేయకుండా వారి స్వార్థం కోసం ఫ్లోరైడ్ పీడిత జిల్లాగా మార్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నల్లగొండ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా నల్లగొండ మండలంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మంత్రి జి. జగదీశ్రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్రెడ్డి హాజరైన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేయడానికి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచారని, కేసీఆర్ను నమ్ముతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పే కపట మాటలు ఇక్కడ చెల్లవని అన్నారు. -
ఎన్టీఆర్ పేరు చెడగొట్టను: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సరైన అవగాహన కల్పిస్తే క్యాన్సర్ను జయించవచ్చని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పటల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్సు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ను ఆయన గురువారం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బసవతారకం హాస్పటల్ ఆవరణలో నైట్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు బాలకృష్ణకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ లేరు. నేను ఆయన అభిమానిని. ఎన్టీఆర్ పేరు నిలబెడతా, ఆయన పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చెయ్యను’ అని కేటీఆర్ పేర్కొన్నారు. (ఎన్టీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎనలేని అభిమానం. ఆయనపై ఉన్న అభిమానంతోనే తన కుమారుడు కేటీఆర్కు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు). బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవల గురించి తన తల్లి ఎప్పుడూ చెబుతుండేవారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, అవసరం అయినవారు దీన్ని ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. కార్యక్రమంలోని ఓ దృశ్యం ఆస్తి పన్ను రద్దు సంతోషకరం.. బసవతారకం ట్రస్ట్కు రూ.6కోట్ల ఆస్తిపన్నును జీహెచ్ఎంసీ రద్దు చేయడం సంతోషకరమని హాస్పటల్ చైర్మన్ బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్లో క్యాన్సర్ హాస్పటల్ గురించి కూడా ఉంటుందని తెలిపారు. నాన్నగారి పేరునే కేటీఆర్కు పెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా అన్ని ట్రస్ట్లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. -
నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కేలా ‘జోనల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగులకే దక్కేలా జోనల్ విధానం తయారు చేయాలని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల తరపున తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, మధుసూదన్, కృష్ణ యాదవ్, రాజ్ కుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోనల్ వ్యవస్థపై టీజీవో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుందని శ్రీనివాస్గౌడ్ మంత్రికి తెలిపారు. త్వరలోనే ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేస్తామని వివరించారు. -
తెలంగాణ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానం
-
ఇసుక ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పాటు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వడ్డెర సొసైటీలకు, ఎస్సీ, ఎస్టీ యువకులతో ఏర్పడే సొసైటీలకు ఇసుక తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచ్ల నుంచి వస్తున్న సహజ ఇసుకకు బదులుగా తయారీ ఇసుక వినియోగం పెంచాలన్నారు. స్టోన్ క్రషర్ల వంటి వాటి ద్వారా వడ్డెరల ఉపాధి పోయిందని, ఈ ఇసుక ప్లాంట్ల ఏర్పాటుతో వారికి ఉపాధి దొరికే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ యువతకు సంబంధిత సంక్షేమ శాఖ, ఉప ప్రణాళికల ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణ, రుణాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. వచ్చే ఏడాదికి జిల్లాల వారీగా అవసర ఇసుక అవసరాలు, డిమాండ్పై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ విభాగాలు సంయుక్తంగా ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. -
‘వారి పాలన రైతులకు చుక్కలు చూపించింది’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్లో మంగళవారం రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పాలన రైతులకు చుక్కలు చూపిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కులు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలో ఉండి రైతులకు ఐదు రూపాయల సహాయం చేయలేదని, కానీ నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో నాలుగు వేల చెక్కు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి మాటలు వింటే బాదేస్తుందని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలా గడ్డం పెంచుకుంటే సన్నాసుల్లో కలుస్తారు తప్ప సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. రైతు మోహంలో ఎప్పూడూ సంతోషం ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు బంధు పథకంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశంలో హరిత విప్లవానికి తెలంగాణా కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. -
వ్యవసాయం పండుగయ్యే వరకూ ‘రైతుబంధు’
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వ్యవసాయాన్ని పండుగలా చేసి రైతును రాజులా మార్చే దాకా రాష్ట్రంలో రైతుబంధు పథకం కొనసాగుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను రాబందుల మాదిరిగా పీక్కుతింటే.. సీఎం కేసీఆర్ రైతులకు బంధువుగా మారారని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండల కేంద్రంలో సోమవారం ఆయన రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా రైతుల్లో చైతన్యం కల్పించడం కోసం రైతుబంధుపై ప్రచారం కల్పించాం. ఏ రాష్ట్రంలోనైనా రైతు రైతే కాబట్టి ఆయా ప్రభుత్వాలను నిలదీయాలి. దేశంలో 20 రాష్ట్రాల్లో బీజేపీ, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడ రైతులు తమపై తిరగబడతారోనని వారు భయపడుతున్నట్టుంది. అందుకే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకంపై దేశంలోని రైతుసంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి, ఆఖరికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ సైతం రైతుబంధు పథకం వివరాలు విని ఆశ్చర్యపోయారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం, ఆర్బీఐ అడ్డుపడ్డాయి.. రైతులను రుణవిముక్తి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలప్పుడు ప్రకటించిన రూ.లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని ఒకేసారి అమలు చేయాలని ఎంతో కృషి చేశామని, దురదృష్టం కొద్ది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు అడ్డుపడ్డాయని పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని చూసి ఓర్వలేక భూ యజమానులు, కౌలు రైతులు, ప్రభుత్వానికి మధ్య చిచ్చుపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. జూన్ 2నుంచి ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమాను ప్రభుత్వమే చేయించి, ప్రీమియం చెల్లిస్తుందని ప్రకటించారు. -
ఆ ఆలోచన నుంచే రైతుబంధు పథకం
సాక్షి, మహబూబ్నగర్: ‘కరెంటు కోసం ధర్నాలు చేసే పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించాం. ఎవరు ఎన్ని కేసులు వేసినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం’ అని మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో కర్వెన రిజర్వాయర్ కోసం 5,700 ఎకరాల భూసేకరణకు సహకరించిన రైతులకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నానని తెలిపారు. భూత్పూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సభలోరైతులకు మంత్రి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పోలీసుల బందోబస్తు నడుమ ఎరువులు పంపిణీ చేసిన ఘటనలు కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడి యాక్ట్ ద్వారా కేసులుపెట్టి రైతుకు మేలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతులను రుణ విముక్తులను చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే రైతుబంధు పథకమని అన్నారు. గత ప్రభుత్వాలు రాబంధులుగా రైతులను పీక్కుతింటే.. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధువుగా ఈ పథకం చేపట్టిందన్నారు. కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సహకారం లేకపోవడంతోనే ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేకపోయామని తెలిపారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు రైతులకు నాలుగు రూపాయలైనా ఉచితంగా ఇచ్చారా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లినవారు సకాలంలో రాకపోయినా.. వారు ఎప్పుడొస్తే అప్పుడు చెక్కులు అందించాలని కలెక్టర్కు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కౌలురైతులకు, ప్రభుత్వానికి తగాదాలు పెట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని, భూ యజమానులే స్వయంగా తమకు అందిన చెక్కులో సగం డబ్బులు కౌలు రైతులకు అందించి సమస్య పరిష్కారించుకోవాలని సూచించారు. -
సరికొత్త హరిత విప్లవానికి నాంది
సాక్షి, సిరిసిల్ల: గత 60 ఏళ్ల పాలనలో పాలకులు రైతులకు చుక్కలు చూపెడితే తాము చెక్కులు పంచుతున్నామని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్లో శుక్రవారం రైతుబంధు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు కార్యక్రమం దేశంలో సరికొత్త హరిత విప్లవానికి నాంది పలుకుతోందని చెప్పారు. ఈ విప్లవం దేశవ్యాప్తంగా పాకి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతుందని జోస్యం చెప్పారు. గతంలో వారికి రాని ఆలోచనలు తమకు వస్తున్నందుకు ప్రతిపక్షాలు ఓర్వలేక కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు. రైతుబంధుపై పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. దశాబ్దాలుగా జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలివ్వడమే కానీ రైతుల కోసం ఎవరూ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులను చైతన్యవంతుల్ని చేయడానికే తాము వాణిజ్య ప్రకటనలు ఇస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతుబంధుపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తనకున్న 40 ఎకరాలకు వచ్చే పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని అన్నవాళ్లకు ఈ రోజు కళ్ల ముందున్నది కనబడుతలేదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గతంలో 4 లక్షల గోదాంలు ఉంటే ఇప్పుడు 22 లక్షల గోదాంలను నిర్మించామని వివరించారు. నకిలీ విత్తనాలు తయారుచేసే వారిపై పీడీ యాక్ట్ను ప్రయోగిస్తున్నామని తెలిపారు. 800 కోట్ల రూపాయల నీటి తీరువాను సీఎం రద్దు చేశారని వివరించారు. ఒక రైతుబిడ్డ సీఎం అయితే ఎట్లా ఉంటదో కేసీఆర్ చేసి చూపిస్తున్నారని చెప్పారు. జూన్ 2 నుంచి మరో అద్భుతమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. రైతు కుటుంబంలో చనిపోయిన ఇంటిపెద్దకు రూ.5 లక్షల బీమా వర్తించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చిన్నారి చేయూత రూ.30 వేలు కేటీఆర్కు అందజేత గంభీరావుపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రైతు బంధు పథకానికి ఓ చిన్నారి తన వంతు ఆర్థిక సాయాన్ని అందించింది. సిరిసిల్లకు చెందిన సెస్ ఉద్యోగి రాజేందర్ కూతురు అక్షిత స్థానిక కేంద్రీయ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతోంది. తాను దాచుకున్న రూ.30 వేల సొమ్మును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కలెక్టర్ కృష్ణభాస్కర్కు అందించింది. ఆ చిన్నారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. -
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో..
సాక్షి, రాజన్న సిరిసిల్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవాం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకం కింద సిరిసిల్ల జిల్లాలో రూ. 100 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే యాసంగికి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి రైతులకు రూ. 5లక్షల భీమా పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
నిరుద్యోగుల లెక్కెంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి నిరుద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. వరంగల్కు చెందిన కాంగ్రెస్ నేత, కుడా మాజీ చైర్మన్ చెరుకుపల్లి శ్రీనివాస్రెడ్డి బుధవారం టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఈయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తారో లెక్క చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే చీకట్లు తప్ప కరెంటు ఉండదని, తినడాని కి బువ్వ ఉండదని, పరిపాలన చేసే తెలివి లేదని అన్నవాళ్లే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పొగుడుతున్నారని చెప్పారు. ఎండాకాలం వస్తే కరెంటు లేక పంటలు ఎండిపోయేవని, పరిశ్రమలకు వారానికి 2 రోజులు కరెంటు ఇవ్వకుండా వేధించేవారని గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగా ణ ఒక్కటేనన్నారు. నాడు ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి ఎండలో వెళ్లి తెచ్చుకునే పరిస్థితి అని, విత్తనాలను పోలీసుస్టేషన్లలో ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. దేశాని కి అన్నం పెడుతున్న రైతన్నలకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాబందు.. రైతుబంధు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని చూసి కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ ఆశ్చర్యపోయారని, పెట్టుబడి కింద ఇచ్చే డబ్బులను రైతులు తిరిగి చెల్లించాలా అని అడిగారని చెప్పారు. గతంలో రాబందు ప్రభుత్వాలు ఉండేవని, ఇప్పుడు ఉన్నది రైతు బంధు ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు సమన్వయ కమిటీలతో రైతులకు ఇబ్బందులు లేకుం డా చేస్తున్నామని తెలిపారు. 1956కు ముందు నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని, పాలించిన నాయకుల అసమర్థత వల్లే అది వచ్చిందన్నారు. ఇంటింటికీ తాగు నీళ్లు ఇస్తామని, ఇవ్వలేకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తెస్తున్నామన్నారు. వరంగల్కి రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించామని, అన్ని ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని చెప్పారు. గల్లీ ప్రజలే టీఆర్ఎస్కు బాసులు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సహనం నశించి, భవిష్యత్తు లేదనే భయంతో కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో కొట్లాడుదామని, మిగిలిన సమయంలో అభివృద్ధి చేసుకుందామని సూచించారు. గడ్డం పెంచిన వారంతా గబ్బర్సింగ్లు అవుతారా అని ఉత్తమ్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఢిల్లీ చెప్పుచేతల్లో ఉంటూ రాష్ట్రాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. ఢిల్లీలో టీఆర్ఎస్కు అధిష్టానం లేదని, గల్లీలో ఉన్న ప్రజలే టీఆర్ఎస్కు బాసులని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.2 లక్షల రుణమాఫీ అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, దీని గురించి గతంలో రాహుల్ గాంధీతో చెప్పించినా ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్లో అన్ని కేసులున్న వారూ ఉన్నారని, వారిని ప్రజలు ఎలా సహిస్తారని ప్రశ్నించారు. దేశంలో అందరినీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఎన్నో త్యాగాలు చేసి, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా కేసీఆర్ నాయకత్వంలోనే నడవాలన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షత వహించారు. ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుండ్లపోచంపల్లిలో హస్తకళల శిక్షణా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల హస్తకళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గుండ్లపోచంపల్లి పారిశ్రామిక వాడలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా మని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీని నిర్వహణ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయి స్తామన్నారు. అలాగే ఈ పారిశ్రామికవాడలో సంబంధం లేని ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తుల అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. చేనేత శాఖపై మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. పాశమైలారం టెక్స్టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు టెస్కో ఆధ్వర్యంలో విక్రయ కేంద్రాల పెంపు, వెబ్సైట్ ఏర్పాటు, రీ బ్రాండింగ్ వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, లూమ్స్ అప్గ్రెడేషన్ వంటి కార్యక్రమాలను లబ్ధిదారుల్లోకి తీసుకెళ్లేందుకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లను నియమించుకోవాలన్నారు. సెప్టెంబర్లోగా అందుబాటులోకి బతుకమ్మ చీరలు: చేనేత శాఖ డైరెక్టర్ ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ మంత్రికి నివేదించారు. మొత్తం చీరలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయిస్తున్నామని, సెప్టెంబర్ మూడో వారంలోగా చీరలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక వసతులు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ను కలిసిన బ్రిటన్ మంత్రి సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ ప్రభుత్వంలోని ఆసియా, పసిఫిక్ వ్యవహారాల మంత్రి మార్క్ ఫీల్డ్ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును మంగళవారం కలిశారు. బ్రిటన్ హై కమిషనర్ డొమినిక్ అస్క్విత్, డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ను కలిసిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడల విశేషాలను కేటీఆర్ బ్రిటన్ మంత్రికి తెలియజేశారు. -
ట్విట్టర్ బాంధవుడు..!
సిరిసిల్ల: ట్విట్టర్, వాట్సాప్ల ద్వారా వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్.. ఈసారి ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడారు. హైబీపీతో మెదడులో నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిన అతడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బేరుగు రమేశ్ (40) నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. 12 గంటల్లో ఆపరేషన్ చేయాలని, ఇందుకోసం రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని బస్భవన్లో ఆర్టీసీ అధికారులను ఆశ్రయించారు. సర్వీసు ఆధారంగా రూ.4 లక్షలకు మించి ఆరోగ్యబీమా వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు. డబ్బులు చెల్లిస్తేనే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో బాధితుడు రమేశ్ బావ అనిల్కుమార్ వెంటనే సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ట్విట్టర్, వాట్సాప్కు రమేశ్ పరిస్థితిని వివరిస్తూ మెసేజ్ పెట్టారు. స్పందించిన మంత్రి కేటీఆర్: కండక్టర్ రమేశ్ పరిస్థితిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వెంటనే ఆపరేషన్ చేయాలని ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లిస్తామని, ఒకవేళ అలా సాధ్యం కాకుంటే.. సొంతగా ఆ డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడంతో 12 మంది డాక్టర్లు ఐదున్నర గంటలపాటు శ్రమించి రమేశ్కు ఆపరేషన్ చేశారు. రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి కేటీఆర్కు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శులకు రమేశ్ భార్య అరుణ, పిల్లలు సాత్విక్, ప్రగతి కృతజ్ఞతలు తెలిపారు. -
నేనూ ఛోటాభీమ్ ఫ్యాన్నే..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఛోటా భీమ్ అంటే తెలియని పిల్లలు ఉండరు. ఓ కార్టూన్ చానెల్లో ప్రసారమైన ఛోటా భీమ్ సీరియర్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటూ.. కిడ్ సూపర్హీరోగా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నగరంలోని హెచ్ఐసీసీలో సోమవారం ఛోటాభీమ్ సీరియల్ పది సంవత్సరాల సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఛోటా భీమ్కు తాను కూడా అభిమానినేనని తెలిపారు. ఇలాంటి కార్టూన్స్ పాత్రలతో పిల్లలకు యానిమేషన్ రంగంపై ఆసక్తి కలుగుతుందని చెప్పారు. ఛోటా భీమ్ పాత్ర ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిందన్నారు. యానిమేషన్ ఇండస్ట్రీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని తెలిపారు. ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన కోరారు. గేమింగ్ ఎంటర్టైన్మెంట్ యానిమేషన్ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్ టవర్స్ ను హైదరాబాద్లో నిర్మిస్తామని చెప్పారు. -
గల్ఫ్లో ఉన్న రైతులకూ పెట్టుబడి సాయం
సిరిసిల్ల: గల్ఫ్లో ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన ‘రైతుబంధు పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్థానికంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17వ తేదీ తర్వాత గల్ఫ్లో ఉన్న వారికి.. చిన్నచిన్న సమస్యలతో ఆగిన వారికి చెక్కులను అందిస్తామని మంత్రి వెల్లడించారు. రైతులందరికీ రైతుబంధు పథకం వర్తిస్తుందన్నారు. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అనే భేదంలేదన్నారు. ఇంతపెద్ద కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు ఉంటే.. సవరించేందుకు ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. ఎవరైనా గొడవలు చేసినా భయపడేది లేదని, ధర్నాలు చేయించినా.. ఆందోళన పడొద్దని మంత్రి కోరారు. అలాగే కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లిపోకుండా ప్రతి రైతును కలవాలని కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ నాయకులు బస్సుల్లో రావాలి. ఈనెల 10న హుజూరాబాద్లో జరిగే సీఎం సభకు జిల్లా నుంచి 25వేల మంది రైతులు రావాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ నాయకులు కార్లలో కాకుండా రైతులతోపాటు బస్సుల్లో రావాలన్నారు. ఏ ఊరి నాయకులు ఆ ఊరి రైతులతో కలసి రావాలని, బస్సులకు మామిడి తోరణాలు కట్టుకుని దసరా పండుగలాగా.. సంతోషంగా రావాలని సూచించారు. రెండురోజుల పాటు ఇసుక లారీలు, గ్రానైట్ లారీలను ఆపి వేయాలని ఎస్పీ రాహుల్హెగ్డేను కోరారు. అందరూ క్షేమంగా ఇల్లు చేరే విధంగా టీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఎండల నేపథ్యంలో చెక్కుల పంపిణీని ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డే, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపైనున్న మెజారిటీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, పెండింగ్ కేసులను కూడా త్వర లో ఎత్తివేస్తామని మంత్రులు నాయిని, కేటీఆర్, జగదీశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివా లయంలోని హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగ్ కేసులపై చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసు షీట్లలో వివరాలు సరిగ్గా పేర్కొనకపోవడం వల్ల కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని డీజీపీ మంత్రులకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేశామని డీజీపీ మంత్రులకు తెలిపారు. రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీకి సూచించారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుంచి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడీకరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి అప్పగించి, సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ తెలిపారు. టీఆర్ఎస్కు కేసుల సమాచారం పంపండి ఈ సమావేశానంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసులు ఎత్తివేస్తూ 1138 జీవో జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. ఇంకా 19 రకాల కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారాన్ని contact@trspartyonline.org వెబ్సైట్ లేదా వాట్సాప్ నంబర్ 8143726666 కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని, ఇందుకు nnreddy.hm@ gmail.com, 04023451073ను సంప్రదిం చవచ్చని మంత్రులు తెలిపారు. ఉద్యమసమయంలో పెట్టిన కొన్ని రైల్వే కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. అయితే, కేంద్ర పరిధిలో ఉన్న వాటిని వేరుగా పరిష్కరించాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
మీ చేతగానితనం వల్లే మాకు అధికారం
సాక్షి, సిరిసిల్ల: ‘మీ చేతగానితనం వల్లే ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు. మీరే బాగుంటే తమకు ఈ అవకాశం వచ్చేది కాదు’ అని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్లలో గురువారం నిర్వహించిన రైతుబంధు పథకం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాగూ గెలవలేమని తెలిసి ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. మీ పాలనలో ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని, అసలు మిమ్మల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అన్నదాతలు బ్యాంకులను అప్పు కోసం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. సబ్బు, పేస్టు తదితర ప్రతీ వస్తువుకు ధర నిర్ణయించే అవకాశం ఉత్పత్తిదారులకు ఉందని, కానీ తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రైతు చేతుల్ని బలోపేతం చేసేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. గతంలో అప్పు చెల్లించకపోతే రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన తీరును చూశామని, ఇప్పుడు దేశంలోనే ఎవరూ చేయని విధంగా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడానికి రైతుబంధు పథకం ద్వారా రైతుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని మంత్రి వివరించారు. స్వామినాథన్ సిఫారసుల్లో ఒకటైన నాణ్యమైన కరెంటును నిరంతరం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ఒకప్పుడు కరెంటు కావాలని రైతులు ధర్నాలు చేస్తే ఇప్పుడు 10 గంటలు కరెంటు చాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది గుణాత్మక మార్పు కాదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో రాజన్న సిరిసిల్ల జిల్లాను నంబర్ వన్గా నిలిపినందుకు అధికారులను అభినందించారు. హరీశ్.. వాయువేగంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, పెద్దఎత్తున చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ నీటిబొట్టును సాగుకు యోగ్యమైన భూమికి అందించడానికి మంత్రి హరీశ్రావు వాయువేగంతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రాజెక్టులను సందర్శించిన కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజినీర్లు వాటిని చూసి అబ్బురపడుతున్నారని చెప్పారు. తనకు వ్యవసాయంలో ప్రత్యక్ష అనుభవం లేదని, కానీ మనం పండించిన పంట అందరికీ ఉపయోగపడుతుందంటే అందులోని తృప్తి వేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, రసమయి బాలకిషన్ ఆటపాటలతో సందడి చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్బాషా పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్తో అఖిలేశ్ ‘ఫెడరల్ భేటీ’
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్ యాదవ్కు మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ప్రగతి భవన్కు వెళ్లిన అఖిలేశ్.. అక్కడ సీఎం కేసీఆర్తో సమావేశమై.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్యాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మమతా బెనర్జీ, దేవేగౌడ, కరుణానిధి, స్టాలిన్ వంటి నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఈ ప్రక్రియలో భాగంగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా కలిసి పనిచేసే విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. -
కేసీఆర్ను ఎవరూ ఏమీ చేయలేరు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం వంటి వాటిపై దృష్టిపెడితే తెలంగాణ ఏర్పాటు అవసరమే ఉండేది కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మేడే ఉత్సవాల్లో హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. గడ్డాలు పెంచుకునేటోళ్లు (ఉత్తమ్కుమార్ రెడ్డి), పాటకీలు పగులగొడ్తామని (టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం) ప్రగల్భాలు పలికేటోళ్లు సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతారన్నారు. ప్రగతిభవన్పై కొంతమంది విమర్శలు చేస్తున్నారని..ఒక్కొక్కరంగానికి చెందిన ఉద్యోగులను, కార్మికులను ప్రగతిభవన్కు ఆహ్వానించి, అన్నం పెట్టి జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ది అని చెప్పారు. ప్రగతి నిరోధకులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని స్పష్టం చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ..అసంఘటిత కార్మికులపై బుధవారం నుంచి సర్వే చేయిస్తున్నామని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల వల్ల 50 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ను ఓడించడానికే ఒకాయన పార్టీ పెట్టిండని ఆయన వెనుక ఎవరూ లేరని ప్రజలు తమ వెంటే ఉన్నారని నాయిని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తున్న మంత్రులు నాయిని,కేటీఆర్. చిత్రంలో మేయర్ రామ్మోహన్ -
హైదరాబాద్కు వరప్రదాయిని ఓఆర్ఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వరప్రదాయినిగా మారనుందని పురపాలక మంత్రి కె.తారకరామారావు అన్నారు. రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన 1.10 కిలోమీటర్ల కండ్లకోయ జంక్షన్తో పాటు టోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏ జిల్లాకు వెళ్లాలన్నా ఓఆర్ఆర్ దిక్సూచిగా మారిందని, ఇది నగరానికి గొప్ప ఆస్తి అని అభివర్ణించారు. ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు జరిగితే సత్వరం అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేందుకు 19 ఇంటర్ ఛేంజ్ల వద్ద ట్రామా కేర్ సెంటర్లను త్వరలో అందుబాటులోకి తెచ్చేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. వాహన వేగాన్ని నియంత్రించడంతోపాటు సురక్షిత ప్రయాణం కోసం హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్లో భాగంగా ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురానున్నామని కేటీఆర్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు అంతర్గత రహదారులను ఓఆర్ఆర్కు అనుసంధానించే రేడియల్ రోడ్లను పూర్తి చేస్తున్నామన్నారు. స్కైవేలకు కేంద్రం అడ్డుపుల్ల హెచ్ఎండీఏ ద్వారా శామీర్పేట నుంచి జూబ్లీ బస్టాండ్, ప్యాట్నీ సెంటర్ నుంచి సుచిత్ర సెంటర్ వరకు రూ.2,500 కోట్ల అంచనాలతో రెండు స్కైవేల నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డటంతో ఈ పనులు ప్రారంభించలేకపోతున్నామని కేటీఆర్ ఆరోపించారు. అర్థంపర్థం లేకుండా అభివృద్ధి ప«థకాలకు కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ నుంచి 100 ఎకరాల భూమిని కోరామని, అందుకు ప్రతిగా సమాన విలువైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని కోరడంతో శామీర్పేటలో 600 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశామని చెప్పారు. అయితే సంవత్సరానికి ఆస్తి పన్ను రూపంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని కోల్పోతామని, ఆ నష్టపరిహారాన్ని ఏటా చెల్లించాలని రక్షణ శాఖ కోరిందని, ఇది అన్యాయమని అన్నారు. మరో మూడు రోజుల్లో రక్షణ శాఖతో జరిగే సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి పోట్లాడి భూమి ఇచ్చేలా ఒప్పించాలని కోరారు. భూమి ఇవ్వాలని తాను బహిరంగంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని, దీనికి సంబంధించి త్వరలో ఓ లేఖ కూడా రాస్తానని చెప్పారు. హెచ్ఎండీఏ ద్వారా అభివృద్ధి పనులు జంటనగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో హెచ్ఎండీఏ కృషిని కేటీఆర్ కొనియాడారు. ప్రస్తుతం రూ.1,750 కోట్ల అభివృద్ధి పనులను హెచ్ఎండీఏ నిర్వహిస్తోందని చెప్పారు. అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరిస్తూ, ఆర్థికంగానూ మెరుగుపడిందని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు కృషిని కేటీఆర్ అభినందించారు. కాగా, ప్రపంచంలోని ఏ నగరానికి లేని విధంగా హైదరాబాద్కు ఉన్న 158 కి.మీ. ఓఆర్ఆర్ను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించేందుకు లేఖ రాస్తున్నామని చిరంజీవులు తెలిపారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ పనులు పూర్తి చేయడంలో నిబద్ధతతో పనిచేసిన అధికారులు సీజీఎం ఇమామ్, జీఎం రవీందర్, డీజీఎం నవీన్, ఈవో గంగాధర్ తదితరులను మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరదాగా కారు నడిపిన కేటీఆర్ కండ్లకోయ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చెసిన మంత్రి కేటీఆర్ సరదాగా ఎంపీ మల్లారెడ్డి కారును నడిపారు. సుతారిగూడ టోల్ ప్లాజా నుంచి కండ్లకోయ జంక్షన్కు వస్తుండగా ఎంపీ మల్లారెడ్డి కారు డ్రైవింగ్ సీట్లో కేటీఆర్ కూర్చుని రింగ్ రోడ్డుపై కారు నడిపారు. యువత రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పే హోదాలో ఉన్న మంత్రి కేటీఆర్ కనీసం సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం విమర్శలకు తావిచ్చింది. -
సైన్స్ అకాడమీ సాంకేతిక సలహాలివ్వాలి
హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు మరింత విజయవంతం కావాలంటే రాష్ట్ర సైన్స్ అకాడమీ ప్రభుత్వానికి శాస్త్ర, సాంకేతిక పరమైన సలహాలు, సూచనలు అందించాల్సిన అవసరమెంతైనా ఉందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తులు తయారు చేసేందుకు ఆధునిక పంటల విధానాలపై యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. సైన్స్ అకాడమీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో నిర్వహించిన యువ శాస్త్రవేత్తల అవార్డు ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ.25 వేల కోట్లు వెచ్చించి మంచినీటి సరఫరా, చెరువుల మరమ్మతులు, డ్యామ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో వ్యవసాయ రంగం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం పది మిలియన్ ఎకరాల భూమిలో సాగుబడి జరుగుతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో మరో 8 లక్షల ఎకరాలను సాగుబడిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా మోనోపలి పంటల విధానం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంత అంతరాయం జరుగుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలను సామాన్య మానవులకు తెలియజేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు పరిశోధనా సంస్థలు మార్గాలను కనుక్కోవాల్సిన అవసరముందన్నారు. ప్రజారోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. తక్కువ ఖర్చుతో రోగాల నివారణ జరిగే విధంగా మందుల తయారీ జరగాలని, ఆ దిశగా పరిశోధనా ఫలితాలు ఉండాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు యువ శాస్త్రవేత్తలకు మంత్రి అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ వర్సిటీ మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా, సైన్స్ అకాడమీ ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు పాల్గొన్నారు. -
స్కై వేలకు రక్షణ శాఖ మోకాలడ్డు
హైదరాబాద్: నగరంలో స్కై వేల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మోకాలడ్డుతోందని మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విరుచుకుపడ్డారు. శనివారం మాదాపూర్ మైండ్ స్పేస్ అండర్ పాస్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. జూబ్లీ బస్ స్టేషన్, ప్యాట్నీ సెంటర్ల వద్ద చేపట్టబోయే రెండు స్కై వేల పట్ల రక్షణ శాఖ మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రెండు స్కై వేలకు అనుమతిస్తే రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల స్థలం పోతోందని, అంతే విలువైన స్థలం కోరితే శామీర్పేట్ లో 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థలంతో పాటు ఏటా రూ.30 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని రక్షణ శాఖ లేఖ రాసి కొర్రీ పెట్టిందన్నారు. జీవిత కాలం ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్లో ఇష్టం వచ్చినట్లు రోడ్డు మూసివేస్తే సమీప కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించకపోయినా కనీసం రోడ్లు మూసేయవద్దన్నారు. మే 5న రక్షణ శాఖ ఎస్టేట్ అధికారులు, ఎంపీలతో సమావేశం ఉందని తెలిపారు. సామరస్య ధోరణితో పరిష్కారానికి రక్షణ శాఖ ముందుకు రావాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. క్యాలెండర్తో పని చేస్తున్నాం అభివృద్ధి పనులను క్యాలెండర్ ప్రకారం పూర్తి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎస్ఆర్డీపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ జనవరిలో అందుబాటులోకి రాగా మైండ్ స్పేస్ అండర్ పాస్ రెండో ఫలమని అన్నారు. ‘జూలైలో మైండ్ స్పేస్ ఫ్లయ్ఓవర్, డిసెంబర్లో రాజీవ్ గాంధీ స్టాట్యూ ఫ్లయ్ఓవర్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎల్బీనగర్ కారిడార్లో రూ.448 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. మే 1వ తేదీన చింతల్కుంట అండర్ పాస్, జూన్లో కామినేని లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్ఓవర్, సెప్టెంబర్లో ఎల్బీ నగర్ లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్ఓవర్, డిసెంబర్లో ఎల్బీ నగర్ లెప్ట్ హ్యాండ్ సైడ్ అండర్ పాస్, 2019 మార్చిలో బయోడైవర్సిటీ ఫ్లయ్ఓవర్, కామినేని రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్ఓవర్, బైరామల్గూడ లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్ఓవర్, జూన్లో ఎల్బీనగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్ఓవర్ అందుబాటులోకి రానున్నాయి’అని కేటీఆర్ చెప్పారు. 2019కి అందుబాటులోకి.. రూ.184 కోట్లతో చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి 2019 మార్చికి, రూ.150 కోట్లతో రోడ్డు నంబర్ 45 నుంచి నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ 2019 సెప్టెంబర్కి, రూ.263.09 కోట్లతో చేపట్టనున్న కొత్తగూడ గ్రేడర్ సపరేటర్, రూ.387 కోట్లతో చేపట్టనున్న బాలానగర్ గ్రేడ్ సపరేటర్, రూ.132 కోట్లతో ఒవైసీ హాస్పిటల్ వద్ద బహదూర్పుర రోడ్డు, రూ.333.55 కోట్లతో చేపట్టనున్న షేక్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ 2019 డిసెంబర్కు, రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అంబర్పేట్ 6 నంబర్ ఫ్లయ్ఓవర్ 2019 డిసెంబర్కు అందుబాటులోకి రానున్నాయని కేటీఆర్ తెలిపారు. పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత రూ.436 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లయ్ఓవర్ నిర్మిస్తామని వివరించారు. నగరంలో వేగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతోనే నగరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. శనివారం మాదాపూర్లోని మైండ్ స్పేస్ అండర్ పాస్ను ఆయన మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లతో కలసి ప్రారంభించారు. నిర్ణీత సమయానికి ముందే పనులు పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో రవాణా మంత్రి మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ సార్.. స్పందించండి: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై మూడు, నాలుగుసార్లు తెలంగాణ మంత్రి కేటీఆర్గారికి తాను ట్వీట్ చేశానని అయినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని, మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇండస్ట్రీలో తమపై వేధింపులపై నేరుగా కలుసుకుని చర్చించాలని భావిస్తున్నట్లు శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ట్వీట్లను స్క్రీన్ షాట్లు చేసి శ్రీరెడ్డి తాజాగా చేసి ఎఫ్బీ పోస్ట్ వైరల్గా మారింది. 'కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్పై పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. మూవీకి సంబంధించిన పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదు. వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.' 'సార్, ఇటీవల విడుదలైన మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను'కు మీరు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలపై స్పందించేందుకు మాత్రం సమయంలో ఎందుకు కేటాయించడం లేదు. మీ పీఏ మొబైల్కి పలుమార్లు మెస్సేజ్లు చేశాను. కానీ స్పందన కరువైంది. మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పండి సార్' అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. (సంబంధిత కథనం: ‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా) -
దోచుకున్న డబ్బు దాచుకునేందుకే..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని అవినీతి మంత్రి కె. తారక రామారావు శాఖల పరిధిలోనే జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్తోపాటు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రైవేటు సంస్థలకు భూకేటాయింపుల విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని, హెటెరో కంపెనీకి రాజధానిలోని మాదాపూర్లో రూ. వేల కోట్ల భూమి ఎందుకు ఇచ్చారో తేల్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అలాగే వెల్స్ పన్ గ్రూప్ కంపెనీకి వివిధ జీవోల ద్వారా 800 ఎకరాలు కేటాయించడంతోపాటు రూ. 40 కోట్ల మేర రాయితీలు, మూలధన వ్యయంలో రూ. 80 కోట్ల సబ్సిడీ ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇవి చాలవన్నట్లు వడ్డీ సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, వంద శాతం జీఎస్టీ సబ్సిడీ ఇచ్చిందని, ఈ కంపెనీకి భూముల కేటాయింపు విషయంలో మంత్రి కేటీఆర్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు ఎంత ముట్టిందో తేల్చాలన్నారు. కేటీఆర్ దోపిడీకి జయేశ్ రంజన్ సహకరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్ను కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని, ప్రజలు అప్పుల పాలవుతుంటే, కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరుగుతున్నాయన్నారు. 80 సీట్లు గెలుస్తాం... తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్కు బలం పెరిగిందని సర్వేలే చెబుతున్నాయని, నిన్నటివరకు దక్షణ తెలంగాణలో స్వీప్ చేస్తామని భావించామని, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ సైతం స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి చేరికతో ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి అలకబూనారన్న వార్తలపై పార్టీలో చర్చిస్తామన్నారు. ప్రజా చైతన్య బస్సు యాత్రపట్ల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని, యాత్రలో పాల్గొంటానని రాహుల్ చెప్పారని ఉత్తమ్ తెలిపారు. జన్ ఆక్రోశ్ ర్యాలీని జయప్రదం చేయాలి: కుంతియా ఈ నెల 29న ఢిల్లీలో జరిగే జన్ ఆక్రోశ్ ర్యాలీని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కోరారు. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టాక దేశంలో నిరుద్యోగం, మహిళలపై హత్యాచారాలు, పెట్రోల్, డీజిల్, సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న వ్యాపారులు పూర్తిగా చితికిపోయారన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో విమాన ప్రమాదం నుంచి రాహుల్ క్షేమంగా బయటపడ్డారని, అయితే ఈ ఘటనపై విచారణ జరపాలని కుంతియా డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అదో అబద్ధాల ప్లీనరీ: పొన్నం టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా అన్నీ అబద్ధాలే చెప్పారని, అదో అబద్ధాల ప్లీనరీ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, దళితులు, గిరిజనులకు ఏమీ చేయని కేసీఆర్... కేంద్రంలో చక్రం తిప్పుతాడా’అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఓ మచ్చర్ పహిల్వాన్ అని, ఆయన్ను చూసి కాంగ్రెస్ భయపడే స్ధితిలో లేదన్నారు. భరత్ అనే నేను సినిమాలా ‘కేసీఆర్ అనే నేను..నా అబద్ధాలు’అని సినిమా తీస్తామన్నారు. -
పార్టీనే సుప్రీం!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీనే సుప్రీం అన్న దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లోని పార్టీ నేతల్లో అసంతృప్తి చాయలు ఉన్నట్టు సీఎం దృష్టికి వచ్చింది. ఎన్నికల తరుణంలో ఏ స్థాయి నాయకుడు పార్టీని వీడినా ఎంతోకొంత నష్టం తప్పదని, పార్టీ కోసం పనిచేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా కాపాడుకోవాలని కేసీఆర్కు పలు విజ్ఞప్తులు అందాయి. దీంతో పార్టీ నిర్మాణంపై సీఎం దృష్టి సారించారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్కు సూచించారు. అందుబాటులో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ప్లీనరీ వేదికగా ఆయన పలు కీలకాంశాలను ప్రకటించే అవకాశం ఉంది. అందరితో కలిసి.. టీఆర్ఎస్కు సొంతంగా గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలకుతోడు ఇతర పార్టీల నుంచి చేరిన 25 మందితో కలిపి మొత్తం 90 మంది శాసనసభ్యులున్నారు. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్చార్జిలకు మధ్య విభేదాలున్నట్టుగా అధినాయకత్వం గుర్తించింది. నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నిఘా వర్గాల ద్వారా కూడా ఇదే సమాచారం అందింది. దీంతో అసంతృప్తి నేతలను మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో మమేకం చేసేలా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా పార్టీ నిర్మాణం చేసే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే కూడా కట్టుబడి ఉండేలా నిర్మాణం, యంత్రాంగం ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ముఖ్య నేతలు కోరుతున్నారు. ప్లీనరీ బాధ్యతలన్నీ కేటీఆర్కే.. ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ బాధ్యతలన్నీ మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన సన్నిహితులైన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, మైనంపల్లి హన్మంతరావు, కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు వేదిక వద్దే ఉంటూ ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా, బుధవారం మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీకి చెందిన 13 వేల మంది ప్రతినిధులతో పాటు 20 దేశాల ఎన్నారై ప్రతినిధులు హాజరవుతున్నారని ఈటల చెప్పారు. -
మాది ‘రైతుబంధు’ ప్రభుత్వం
సాక్షి, జగిత్యాల: తమది ‘రైతుబంధు’ప్రభుత్వమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘రాయితీ కాదు.. అప్పు కాదు.. నేరుగా పెట్టుబడి రూపంలో పంటకు రూ.4 వేల చొప్పున ఇచ్చి తిరిగి తీసు కోని ఏకైక ప్రభుత్వం మాదే’ అని అన్నారు. జగిత్యాల జిల్లాలో రూ.285.83 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయ న శంకుస్థాపన, రూ.250 కోట్ల రుణాలు పంపి ణీ చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన ‘రైతు బంధు’ అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతుకు ప్రధానంగా కావాల్సింది పెట్టుబడని, అది త్వరలోనే ఇస్తున్నామన్నారు. పండించిన పంటకు మద్దతు ధర విషయంలో కూడా తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించామని, ఈ సమితులు రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడికి సంబంధించి మే 10 నుంచి ప్రారంభం కానున్న రైతుబంధు పథకం ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచిం చారు. దేశంలో ఎంతో మంది నాయకులు.. ఎన్నో ప్రభుత్వాలు పని చేసినా ఇప్పటి వరకు ఎవరికీ రాని ‘రైతుబంధు’ ఆలోచన కేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమైందని చెప్పారు. నాడు శాపాలు పెట్టిండ్రు ‘సమైక్య రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ వస్తే చీకట్లో మగ్గుతది.. బోర్ల పడ్తది అనే శాపాలు పెట్టిండు’ అని మంత్రి అన్నారు. అప్పట్లో మేం ప్రతిపక్షంలో ఉన్నం. ఎండిన కంకులు.. వరి చేలను పట్టు కుని శాసనసభకు వెళ్లినం, ధర్నాలు చేశామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వెంకటాపురానికి చెందిన మునిగె ఎల్లయ్య ఎరువుల కోసం క్యూ లో నిలబడి ఎండదెబ్బతో చనిపోయిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రావద్దనుకున్నామని, ఇప్పుడు అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. ఇప్పుడు కరెంట్ వద్దని రోడ్డెక్కుతున్నారు ఒకప్పుడు కరెంటు కావాలని రైతులు రోడ్డెక్కితే.. ఇప్పుడు అంత కరెంట్ వద్దని రోడ్డెక్కే పరిస్థితి నెలకొన్న విషయం వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అవసరం మేరకు నాణ్యమైన ఎరువులు.. విత్తనాలు రైతులకు అందిస్తున్నామన్నారు. జగిత్యాలలో మామి డికి అపార వనరులుండటంతో స్థానికంగా ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం, కరీంనగర్లో ఐటీ టవర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రూ.18 వేల కోట్ల వ్యయంతో 3 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలుంటే.. తెలంగాణకు మినహా మిగిలిన 28 రాష్ట్రాలు కలిపి హౌసింగ్ పాలసీపై చేస్తున్న ఖర్చు.. మన రాష్ట్రంలో డబుల్ బెడ్రూం నిర్మాణాల ఖర్చుకు సమానం కాదన్నారు. సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పసుపు, మిర్చి, పత్తి రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర అందించే విషయమై ఆలోచించాలని మంత్రిని కోరారు. స్పందించిన కేటీఆర్ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
ఏచూరి కాదంటే తెలంగాణ ఆగిందా?
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యతిరేకిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిందా, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ మాత్రం ఆగుతుందా అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆలోచనా శక్తి, మేధోపటిమకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్ను తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అప్పటి వరకు సీతారాం ఏచూరి వంటి వాళ్లు ఏమి మాట్లా డినా, ఏమనుకున్నా పట్టించుకోబోమని, తమ ఆలోచనలు తమకున్నాయన్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ 17వ ఆవిర్భావ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి జగదీశ్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్ సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ, ఇదే ఏచూరి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారన్నారు. ఏచూరి అనుకున్నంత మాత్రాన జరిగేది ఆగదని స్పష్టం చేశారు. ప్లీనరీకి ఎవరినీ పిలవట్లేదు.. జాతీయ పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యులెవరూ ప్లీనరీకి రావడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యులు ఎవరినీ ఆహ్వానించడం లేదని, ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమంగానే నిర్వహిస్తు న్నామని తెలిపారు. ఇది సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న అతి ముఖ్యమైన ప్లీనరీ అని చెప్పారు. 2019లో ఎన్నికల సమయంలో ప్లీనరీ నిర్వహించుకోలేమని, ఈ సమావేశమే రాజకీయంగా విస్తృతమైనదని పేర్కొన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఉండాలని కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగా ప్లీనరీలో నిర్ణయాలుంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నమూనా దేశానికి మార్గదర్శ కంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే దిశగా ఈ ప్లీనరీ ఉంటుందని చెప్పారు. ప్లీనరీ విజయవంతం కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశామన్నా రు. పార్టీ వార్షికోత్సవంలో భవిష్యత్ కార్యాచ రణ, పార్టీ కార్య క్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలుపై చర్చ, తీర్మానా లుంటాయని కేటీఆర్ వివరించారు. 13 వేల మంది ప్రతినిధులు ప్లీనరీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 13 వేల మంది ప్రతినిధులు, 20 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతి నిధులు సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతినిధుల నమోదు కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న తర్వాతనే ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. 8 భోజన శాలలు ఏర్పాటు చేశా మని తెలంగాణ వంటకాలు నోరూరిస్తాయ న్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీలో పాల్గొనే అందరికీ అంబలి, సల్ల (మజ్జిగ), నీరు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. శుక్రవారం రోజునే ప్లీనరీ ఉన్నందున ముస్లింలు నమాజ్ చేసుకు నేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవల కోసం డాక్టర్ల బృందం, నాలుగు అంబులెన్స్లు, హెల్త్ క్యాంప్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థి, యువజన విభాగం నుంచి 500 మంది సుశిక్షుతులైన వారిని ఎంపిక చేశామని, ఇబ్బందులు రాకుండా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ, మార్గనిర్దేశనం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మూసీ అందాలు చూస్తారు.. మూసీ సుందరీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని, సుందరీకరించిన తర్వాత సీతారాం ఏచూరిని కూర్చోబెట్టి మూసీ అందాలను చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూసీ నదిలోకి చాలా నీళ్లు వచ్చినట్టు ఎన్నికల నాటికి చాలా ఫ్రంట్ లు వస్తాయంటూ ఏచూరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ను, ఇక్కడ మూసీ అందాలను ఏచూరి చూస్తారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే మెచ్చుకుంటున్నారని చెప్పారు. దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల మంత్రులే రాష్ట్ర అభివృద్ధిని కీర్తిస్తున్నారన్నారు. బీజేపీ మంత్రులూ పొగుడుతున్నారని, తెలంగాణ అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. -
నా వల్లకాదు బాబూ.. నీకో దండం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ట్విటర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ట్విటర్లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. పలువురు కష్టాల్లో ఉన్నవారు ట్విటర్లో కేటీఆర్ను అభ్యర్థించి.. సాయం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఐపీఎల్ ప్రేమికుడు కూడా ట్విటర్లో కేటీఆర్ను ఆశ్రయించాడు. ‘కేటీఆర్ సార్.. హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లకు మూడు ఉచిత టికెట్లు ఇప్పించండి సార్’ అంటూ ఓ నెటిజన్ విజ్ఞప్తి చేశాడు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘నా వల్ల కాదు బాబూ..’ అంటూ ఓ దండం పెడుతూ రీట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. Naa Valla Kaadu Babu 🙏 https://t.co/mtPCxasMrq — KTR (@KTRTRS) 21 April 2018 -
సర్కారు ఆర్డర్లన్నీ నేతన్నలకే..
సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వం నుంచి ఏ వస్త్రం కొనుగోలు చేసినా వాటి ఆర్డర్లు నేతన్నలకే దక్కుతాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఇప్పటికే వచ్చిన ఆర్డర్లతో సిరిసిల్లలో నేతన్నలకు నెలకు రూ.15 నుంచి రూ.25 వేల వేతనం అందుతుందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల్ల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిపే వరకు విశ్రమించబోనని హామీ ఇచ్చారు. 24 గంటల కరెంటు, సాగు, తాగునీటితో పాటు రైతు బంధు పథకం ద్వారా ఏప్రిల్ 20న రైతన్నలకు ఎకరాకు రూ. 4 వేలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి దిశగా సాగాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్నారు. -
చేసిందంతా చేసి నీతులా..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రాన్ని చేసినంత నాశనం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు బస్సుయాత్రలంటూ ప్రభుత్వానికి నీతులు చెప్పేందుకు బయలుదేరిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జిల్లాలో ఖమ్మం, మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమ వారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలం శివాయిగూడెం వద్ద ఎమ్మెల్యే పువ్వా డ అజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల మాటల్ని ప్రజలు విశ్వసించక చాలా కాలమైందని, గడ్డాలు పెంచిన వారంతా గబ్బర్సింగ్లు కాలేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరు దెయ్యా లు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శిం చారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు మంచిగా కనబడిం దన్నారు. ఇక్కడి కాంగ్రెస్వారికి అసలు అభివృద్ధే కనపడనట్లుగా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.5,500 కోట్లను ఆసరా పెన్షనకు ఖర్చు పెట్టి న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరివ్వాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలను త్వరితంగా పూర్తి చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు లకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ చెబుతున్నారని, అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో మీరు ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తే రిటైర్డ్ కాబోయే మీ కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలి తప్ప.. మీ మాట విని ఓట్లు వేసే యువకులు ఎవరూ లేరన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతెత్తి అరిచినా వారి చరిత్ర మీ ముందు ఉందన్నారు. రైతన్నలూ.. ఆలోచించండి రైతన్నలూ.. ఆలోచించండి.. ఆనాడు వ్యవసా యంలో ఎలా ఉంది..? ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి బేరీజు వేసుకుని చూడాలన్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్కుమార్రెడ్డి ఎన్ని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదన్నారని, ఇప్పుడేమైంది.. మండుటెండ లోనూ 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నామన్నారు. తెలంగాణ హక్కు అయిన 1,200 టీఎంసీల నీటిని వాడుకుని సాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొ న్నారు. దేశం అబ్బురపడి చూసేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. మనసున్న సీఎం పాలన ఎలా ఉంటుందో.. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను చూస్తే తెలుస్తుందన్నారు. 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామన్నారు. 2004లో, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలను చేస్తామని హామీ ఇచ్చారని, వారు చేయకపోవడంతో సీఎం హామీ మేరకు కొత్తగా 2,630 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, కలెక్టర్ డీఎస్.లోకేశ్కుమార్, ఎమ్మెల్యే మదన్లాల్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు రూ. కోటి విలువైన వ్యాక్సిన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోటెక్ నూతన లోగోను ఆవిష్కరించింది. దేశీయంగా నూతన మాలిక్యూల్స్ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం కానున్నట్టు వెల్లడించింది. రూ.1 కోటి విలువైన వ్యాక్సిన్లను తెలంగాణ ప్రభుత్వ టీకా కార్యక్రమానికి ఉచితంగా ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన లెటర్ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుకు కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా అందజేశారు. -
ఓర్వలేకే తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే తట్టుకోలేక కొందరు ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు పరోక్షంగా కాంగ్రెస్ నాయకులనుద్దేశించి విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాచారం సింగంచెరువు తండాలో నిర్మించిన 176 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంత్రి శనివారం ప్రారంభోత్సవం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకనుగుణంగా వచ్చే వేసవిలోగా రాష్ట్రంలో 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు తప్ప మిగతా సమయాల్లో తాము రాజకీయాలు, పక్షపాతం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకునేందుకు వాటిపై కేసులు వేస్తున్నారని విమర్శించారు. అలాంటి నేతలు, పార్టీలను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ ఇళ్లు వంటి పథకాలు చేపడుతుంటే అప్పులు చేస్తున్నారంటూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకుపయోగపడే నిధులు పెట్టుబడి అవుతాయా.. అప్పులవుతాయా? తప్పులవుతాయా ..? అంటూ ప్రశ్నించారు. వారి నిరర్థక మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. స్థానిక యువతకు అవసరమైతే టీఎస్ఐపాస్ ద్వారా తగిన శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పరిశ్రమల రంగంలో 62 వేల యూనిట్లకు లక్షా 24 వేల కోట్ల పెట్టుబడులు రాగా, వాటిల్లో సగానికి పైగా పరిశ్రమలు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటిద్వారా 3.30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఐటీ రంగంలో జాతీ య సగటు 9% కాగా, మన రాష్ట్రం 14 శాతంతో ఉందన్నా రు. ఎర్రటి ఎండలోనూ రెప్పపాటు వ్యవధికూడా కరెంటు కోతల్లేకుండా చేసిన విషయా న్ని ప్రజలే చెప్పాలన్నారు. దేశానికే మోడల్ కానున్న తెలంగాణ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏడాది తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ రాష్ట్రమే నమూ నాగా చర్చ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఇది తమ ఆత్మవిశ్వాసం తప్ప అహంకారం కాదని స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధికి నమూనాగా మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ దేశానికే మోడల్ రాష్ట్రం కానుందన్నారు. గతంలోనూ పేదలకు ఇళ్లు నిర్మించినా తూతూమంత్రంగా నిర్మించేవారని, కాగితాల్లోని ఇళ్లు వాస్తవంగా కనపడేవి కావని పేర్కొన్నారు. నగరంలో అన్ని వసతులతో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల మాదిరిగా నిర్మించిన ఈ ఇళ్లకు యూనిట్కు రూ. 8.75 లక్షలు ఖర్చయినా, మార్కెట్ ధర మేరకు కనీసం రూ.30 లక్షలుంటుందన్నారు. రాష్ట్రంలోని 3 లక్షల ఇళ్లకు రూ.18 వేల కోట్లు ఖర్చవుతున్నా ఉచితంగా ఇచ్చిన గౌరవం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అంతకుముందు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 234 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ‘కేటీఆర్కు ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం’ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశానికి హాజరుకావాలని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకు ఆహ్వానం లభించింది. మే 24 నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వాణిజ్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిస్తారని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో పాల్గొని రాష్ట్ర వాణిజ్య ప్రాధాన్యం, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పాలసీల గురించి వివరించాలని మంత్రిని కోరారు. -
స్వీటీతో కేటీఆర్..
వరంగల్: జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్ పట్టణానికి విచ్చేశారు. కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో చోటుచేసుకున్న ఒక దృశ్యాన్ని ‘ఫేవరెట్ పిక్ ఆఫ్ది డే’ గా అభివర్ణిస్తూ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. స్వీటీతో షేక్హ్యాండ్: సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని కూడా తీసుకొచ్చారు. సుశిక్షితురాలైన స్వీటీ.. ఎంచక్కా ముందరికాళ్లను పైకెత్తి మంత్రిగారికి విష్ చెప్పి అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. ప్రతిగా కేటీఆర్ సైతం స్వీటీకి షేక్హ్యాడ్ ఇచ్చారు. సంబంధిత ఫొటోలను ట్విటర్లో షేర్చేసిన కేటీఆర్.. వాటిని ఫేవరెట్ పిక్ ఆఫ్ ది డేగా పేర్కొన్నారు. My fave pic of the day from Warangal today: ran into ‘Sweety’, a police canine who offered a warm handshake😊 pic.twitter.com/5JwhgZRglR — KTR (@KTRTRS) 4 April 2018 -
నగరంలో గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్
సాక్షి, హైదరాబాద్: యూరప్లోని ప్రముఖ విద్యా రంగ సంస్థల్లో ఒకటైన గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ (జీయూఎస్) దేశంలో తన తొలి కార్యాలయాన్ని నగరంలోని హైటెక్ సిటీ భవన సముదాయంలో ప్రారంభించింది. దేశ విద్యా రంగానికి సంబంధించిన సాంకేతిక అభివృద్ధి, డిజిటల్ కార్యకలాపాలు, వ్యాపార శక్తి సామర్థ్యాలకు ఊతం కలిగించాలనే లక్ష్యంతో 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోని వర్సిటీలు, కళాశాలలకు వినూత్న పరిష్కారాలను సంస్థ అందించనుంది. దీని ద్వారా ఉద్యోగాలు సృష్టించడం, నగరానికి పెట్టుబడులు తీసుకురావడం, మానవ వనరులను అంతర్జాతీయంగా వినియోగించుకునేందుకు సంస్థ తోడ్పాటు అందించనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సంస్థకు అవసరమైన ఉద్యోగులకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కల్పిస్తామన్నారు. జీయూఎస్ వ్యవస్థాపకుడు, జీఈవో ఆరోన్ ఇటింగెన్ మాట్లాడుతూ, ప్రస్తుతం 100 మందితో నగరంలో తమ కార్యాలయాన్ని ప్రారంభించామని, రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్య మరింత పెంచాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. దేశంలోని ఔత్సాహిక, అత్యున్నత స్థాయి ఉద్యోగులను వినియోగించుకుని దేశ విద్యా రంగంలో సంచలనాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, జీయూఎస్ (ఇండియా) ఎండీ శశి జలిగామ తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలు పెంచలేం!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వం పెంచితే తాము చెల్లించలేమని పురపాలికలు చేతులెత్తేశాయి. ప్రస్తుత వేతనాలనే మూడు, నాలుగు నెలలకోసారి కార్మికులకు చెల్లిస్తున్నామని, ఈ పరిస్థితిలో వేతనాలు పెంచితే చెల్లించడం సాధ్యం కాదని తేల్చాయి. ఆదివారం రామగుండంలో రాష్ట్ర మునిసిపల్ మేయర్లు, చైర్పర్సన్ల సంఘం అధ్యక్షుడు, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపాలిటీల చైర్పర్సన్లు, మునిసిపల్ కమిషనర్లు సమావేశమై పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మునిసిపల్ పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచకపోతే ఈనెల 31 తర్వాత ఏ క్షణం నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో పురపాలక మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహించారు. సానుకూలంగా ఉన్నాం పురపాలక మంత్రి కె.తారకరామారావుతో త్వరలో సమావేశమై మునిసిపల్ పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు ప్రతిపాదనలను సమర్పిస్తామని సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. కార్మికుల వేతనాల పెంపు అంశంపై సానుకూలంగా ఉన్నామని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -- రవీందర్ సింగ్ ప్రభుత్వమే పెంచాలి మునిసిపల్ కార్మికులకు జీవో నం.14 ప్రకారం వేతనాలు పెంచే అధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఖమర్ అలీ, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలను మునిసిపాలిటీలే పెంచుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించడం సరి కాదన్నారు. ప్రభుత్వమే వేతనాల పెంపు నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 31 తర్వాత ఏ క్షణం నుంచైనా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -- ఖమర్ అలీ, పాలడుగు భాస్కర్ ఆదాయం అంతంత మాత్రమే.. జీహెచ్ఎంసీ తరహాలో రాష్ట్రంలోని మిగతా 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.14 వేలకు పెంచే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మొత్తం 72 పురపాలికల్లో 16 వేల మంది కార్మికులు పని చేస్తుండగా, వారి వేతనాలను రూ.8,300 నుంచి రూ.14 వేలకు పెంచితే ఏటా రూ.75 కోట్ల అదనపు భారం పడనుంది. పురపాలికలకు పన్నులు, ఇతర రుసుముల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని, వేతనాలు పెంచితే పడే భారాన్ని 70 శాతం పురపాలికలు భరించే పరిస్థితిలో లేవని తేల్చారు. చివరిసారిగా 2011లో కార్మికుల వేతనాలు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వేతనాల పెంపు ఆవశ్యకత ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక చేయూ త అందిస్తేనే ఇది సాధ్యమవుతుందని మేయర్లు, చైర్పర్సన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచాలని నిర్ణయించారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మధ్య ఉన్న ఆర్థిక అంతరాల మేరకు ఆయా సంస్థల కార్మికుల వేతనాలను వేర్వేరుగా పెంచాలని ఓ ప్రతిపాదన రూపొందించారు. ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకు వస్తే కార్మికుల వేతనాలను రూ.14 వేలకు పెంచాలని మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. చివరగా కార్మికుల వేతనాలను కనీసం రూ.12 వేలకు పెంచాలని, ఇందుకు ప్రభుత్వ సహాయం కోరాలని నిర్ణయించారు. -
సమగ్రాభివృద్ధి దిశగా వేములవాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శనివారం శాసనసభలో వేములవాడ పట్టణం, ఆలయ అభివృద్ధిపై కేటీఆర్ సమీక్షించారు. పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా వేములవాడ సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అథారిటీ పరిధిలోకి పట్టణ పరిసర ప్రాంతాలను, ముంపు గ్రామాలను తీసుకొచ్చి.. వాటన్నింటినీ వేములవాడ పట్టణ అభివృద్ధితో అనుసంధానం చేయాలని సూచించారు. పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రానున్న ఐదు, పది, 25 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. పట్టణ జనాభా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. చారిత్రక వైభవాన్ని తలపించేలా.. దేవాలయ అభివృద్ధి డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని కేటీఆర్ చెప్పారు. పట్టణంలో చేపట్టే సివిల్ పనుల (భవనాలు, బ్రిడ్జీలు, రోడ్లు)లో చోళ–చాళుక్య శిల్ప కళా వైభవం ఉట్టిపడేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేములవాడ పట్టణ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. పట్టణంలో ప్రవేశించగానే ఒక ఆలయ ప్రాంతానికి వచ్చామనే భావన కలిగేలా.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా విస్తరించనున్న రోడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గుడి చెరువులోకి మురికినీరు రాకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్టాండ్ నుంచి దేవాలయం వరకు కేబుల్ కారు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ ఆదేశించారు. పట్టణంలో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా బస్సులు, అందులోనూ వీలైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. త్వరలో వేములవాడలో పర్యటించి.. పనులను క్షేత్రస్థాయితో పరిశీలిస్తామన్నారు. -
‘ఆరోగ్యసేవలు’ కొనసాగుతాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆర్యోగ సేవల పథకం(ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్) కొనసాగుతుందని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్తో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు రవికుమార్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ పథకంపై ఇటీవల వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించి అందరికీ ఆమోద్యయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సమాచార శాఖ కమిషనర్ను ఆదేశించారు. వెల్నెస్ సెంటర్లలో మందుల కొరత, కొన్ని ఆసుపత్రులు హెల్త్కార్డులను నిరాకరిస్తున్నాయని కేటీఆర్కు చెప్పారు. ఓ చానల్లో సీనియర్ సబ్ఎడిటర్గా ఉన్న కరీం అనే జర్నలిస్టు భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమె వైద్య ఖర్చులకు రూ.12 లక్షల ఎల్వోసీ ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2017 సెప్టెంబర్లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదుట పైప్లైన్ పగిలిపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో మురుగు నీటిని సాగర్లోకి మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. ‘సాగర్ ప్రక్షాళన కోసం అప్పటికే రూ.350 కోట్లు ఖర్చు చేశాం. అక్కడి నీటిలో కాలుష్యం బాగా తగ్గిందని నమూనా పరీక్షలు తేల్చాయి. అయితే అనుకోకుండా మురుగు నీటిని మళ్లించడం వల్ల నీటి కాలు ష్యం మళ్లీ తీవ్రమైన మాట వాస్తవమే’అని చెప్పారు. పురపాలక శాఖ బడ్జెట్ పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. చెన్నై కన్నా మన మెట్రోనే బెటర్ ‘హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో నడుస్తోందని పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే ప్రారంభమైన నాగోల్–అమీర్పేట్, అమీర్పేట్–మియాపూర్ మార్గాల్లో రోజూ 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రో రైలుతో పోల్చితే హైదరాబాద్ మెట్రోకు మంచి స్పందన ఉంది. వచ్చే జూలైలోగా మియాపూర్–ఎల్బీ నగర్, సెప్టెంబర్లోగా నాగోల్–హైటెక్ సిటీ, డిసెంబర్లోగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఇమ్లీబన్ బస్స్టేషన్ మార్గాల్లో మెట్రో సేవలను ప్రారంభిస్తాం. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో మనుషులతో మురుగు నీటి కాల్వలు శుభ్రం చేయించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రత్యామ్నాయంగా 75 మినీ జెట్టింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 75 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 5 పట్టణాల్లోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, మిగిలిన 69 పట్టణాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో టీఎఫ్యూడీసీ ద్వారా రాష్ట్రంలోని 43 పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. జపాన్లోని టోక్యో క్లీన్ అథారిటీ అందించనున్న సాంకేతిక సహకారంతో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. జీవన ప్రమాణాల్లో నంబర్వన్ రూ.3 వేల కోట్లతో హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.300 కోట్ల రుణం లభించిందని, ఇంకా రూ.800 కోట్ల కోసం త్వరలో మళ్లీ బాండ్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్ల తరహాలో హైదరాబాద్లోని మురికివాడల్లో బస్తీ క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించనున్నామన్నారు. రూ.100 కోట్లతో గండిపేట జలాశయం చుట్టూ చేపట్టిన సుందరీకరణ పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయని, దీంతో నగరానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. జీవన ప్రమాణాల రీత్యా దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ వరుసగా నాలుగో సారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. -
మన ఎయిర్పోర్ట్.. మరింత భారీగా!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో భాగ్యనగరానికి కీర్తి కిరీటంగా భాసిల్లుతున్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత సమున్నతంగా మారబోతోంది. విమానాశ్రయం ప్రారంభమై పదేళ్లయిన సందర్భంగా.. ప్రయాణికుల సామర్థ్యాన్ని భారీగా పెంచి, మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం కోసం యాజమాన్య సంస్థ విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టింది. ఏకంగా సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణించగలిగేలా సామర్థ్యాన్ని సమకూర్చనుంది. ఈ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయం దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. విస్తరణ పనులతో పాటు ఎయిర్పోర్టు సిటీ, 12 వేల మందికి ఒకేసారి ఆతిథ్యం ఇవ్వగలిగే కన్వెన్షన్, ఎగ్జిబిషన్ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. అయితే రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేసీఆర్ ఏమీ ప్రసంగించకుండా వెంటనే వెళ్లిపోయారు. దీంతో పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కీలకోపన్యాసం చేశారు. విశ్వనగర స్థాయికి తగినట్టుగా.. విశ్వనగరంగా అవతరిస్తున్న హైదరాబాద్లో విమానాల ట్రాఫిక్ బాగా పెరుగుతోందని.. దానికి తగినట్టుగా శంషాబాద్ విమానాశ్రయ విస్తరణను చేపట్టారని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. విశ్వనగర స్థాయిలో విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జీఎంఆర్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రస్తుతం ఏటా కోటిన్నర మంది వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉండగా.. దానిని నాలుగు కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి విస్తరిస్తుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ఫార్మాసిటీ, ఏరోస్పేస్ పార్కులతో పాటు ఐటీ పరిశ్రమల విస్తరణ వేగంగా జరుగుతోందని... దీంతో ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరగనుందని చెప్పారు. భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం పది కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విమానయాన ఇంధనంపై రాష్ట్రంలో ఉన్న 16 శాతం వ్యాట్ను ఒక శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. రూ.4,650 కోట్లతో రెండేళ్లలో మెట్రో రైలును విమానాశ్రయానికి అనుసంధానిస్తా మన్నారు. వైమానిక నగరంగా శంషాబాద్ విమానాశ్రయ ప్రాంత అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ను నిర్మిస్తామని చెప్పారు. తెలుగువాడైన జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆమోఘమని ప్రశంసించారు. సామాజిక బాధ్యతలో భాగంగా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ చేపడుతున్న పనులను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు.. బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎయిర్పోర్టు సిటీ, కన్వెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జీఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత నాలుగేళ్లలో శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధి రేటు 21% పెరిగింద న్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశం సించారు. ఇక కార్యక్రమంలో తొలుత జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా అందించే పలు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎయిర్పోర్టుకు సంబంధించిన ‘డికేడ్ ఆఫ్ ఎక్స్లెన్స్’సార్మక స్టాంపు కవర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్నయన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మోదీ వెన్నుతట్టారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరిస్తే బాగుందంటూ వెన్నుతట్టారని పురపాలక మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మున్సిపల్ బాండ్ల ప్రక్రియను ప్రధానే సూచించారని, దాంతో హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారని వివరించారు. గురువారం అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల నిధుల వినియోగంపై ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీనాథ్.. టీ హబ్ రెండేళ్ల విజయాలపై ఎమ్మెల్యేలు బి.గణేశ్గుప్తా, పువ్వాడ అజయ్కుమార్, గ్యాదరి కిశోర్కుమార్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘మెట్రో రైలు ప్రారంభోత్సవం కోసం గత నవంబర్లో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంలో ఆయనతో చర్చించే అవకాశం దొరికింది. గుజరాత్ సీఎం గా పని చేసినపుడు అహ్మదాబాద్ అభివృద్ధి కోసం మున్సిపల్ బాండ్ల ప్రక్రియ చేపట్టామని, హైదరాబాద్లోనూ అలా చేయమని మోదీ సూచించారు. బాండ్ల రూపంలో హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ భారీ రెవెన్యూ సమీకరణ, ఏఏ క్రెడిట్ రేటింగ్ ఆధారంగా బాండ్ల రూపంలో రూ.1,000 కోట్ల జారీకి ప్రతి పాదించింది. ఆర్థిక వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద తొలి దశలో రూ.200 కోట్లు సమీకరించింది. ఆ నిధులను ఎస్ఆర్డీపీ కింద పూర్తిగా రాజధాని రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వినియోగిస్తాం. సగటు ప్రయాణ వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడం, ఇంధన వినియోగం, వాయు కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తాం’అని చెప్పారు. ఐటీలో హైదరాబాద్ ప్రత్యేకం.. ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్లోని టీ–హబ్ 2017 నవంబర్ 5తో రెండేళ్లు పూర్తి చేసుకుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘టీ–హబ్ ప్రపంచంలోనే పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బ్యాంకింగ్, రవాణా రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. విద్యాశాఖతో కలసి ఇంటర్ స్థాయిలోనే ఆవిష్కరణలకు ఊతం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. చేనేత కోసం ఆసుయంత్రం తయారు చేసిన చింతకింది మల్లేశంకు రూ.కోటి ఇచ్చాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్లో ఐటీ హబ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం’అని వివరించారు. -
కాళేశ్వరం పరిధిలోకి ‘అప్పర్మానేరు’
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ప్రాజెక్టును కాళేశ్వరం పరిధిలోకి తీసుకురావాలని గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నీటి పారుదల మంత్రి హరీశ్రావు, పురపాలక మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు (నర్మాల) 2.2 టీఎంసీల రిజర్వాయర్ కాగా చాలాకాలంగా పూడుకుపోయిన దృష్ట్యా, ఇక్కడ పూడికతీతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాళేశ్వరంలోని ప్యాకేజీలు 9, 10, 11, 12లకు చెందిన టన్నెళ్లు, పంప్హౌస్, సర్జ్ పూల్, మెయిన్ కెనాళ్లు,, డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులపై గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. అప్పర్ మానేరులో పూడికతీత చేయాలని కేటీఆర్ కోరగా, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నర్మాలకు వెళ్లే కాలువలను రూ.38 కోట్లతో మరమ్మతు చేయనున్నట్టు హరీశ్ చెప్పారు. కాళేశ్వరంలో భాగమైన 9, 10, 11, 12 ప్యాకేజీల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు జరుగుతున్నట్టుగానే మిగతా ప్యాకేజీల పనులు అదే వేగంతో జరగాలని సూచించారు. ఈ నాలుగు ప్యాకేజీల కింద 3,51,150 ఎకరాలు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగులోకి రానున్నాయని మంత్రులు గుర్తు చేశారు. ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 625 చిన్న తరహా నీటి వనరులున్నాయని, వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపడం ద్వారా జిల్లాను మోడల్గా మార్చాలని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. సమీక్షలో శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, ఈఎన్సీ మురళీధర్రావు, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఈఎన్సీ విజయప్రకాశ్, లిఫ్టుల సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు. జూన్ కల్లా కాళేశ్వరం పంపుల రన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల రన్ నిర్వహించాలని హరీశ్ ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు మూడు పంప్హౌస్ల పనులను విడిగా మంత్రి సమీక్షించారు. షిప్పింగ్ వల్ల ఆలస్యమయ్యే పక్షంలో ఆయా యంత్రాలను ఎయిర్ కార్గో ద్వారా దిగుమతి చేయాలని ఆదేశించారు. ప్యాకేజీ 6,8 పనులను కూడా సమీక్షించారు. ఇందులో వాడనున్న 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల పంపు ఆసియా ఖండంలోనే లేదని, చారిత్రక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న మూడు బ్యారేజీలు, మూడు పంప్హౌస్ల నిర్మాణం వైపు దేశమంతా చూస్తోందని అన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘డల్’నెస్ సెంటర్లు!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెడికల్ రీయింబర్స్మెంట్ కంటే మెరుగైన వెల్నెస్ సెంటర్ల నిర్వహణకు మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉన్నతాధికారుల వైఖరితో వెల్నెస్ సెంటర్ల కార్యక్రమం క్రమంగా నిర్వీర్యమవుతోంది. ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్ఎస్)ను ఆరోగ్యశ్రీ ట్రస్టులో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈహెచ్ఎస్ సీఈవోగా ఉన్న కె.పద్మను సొంత శాఖకు బదిలీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా ఉన్న కె.మనోహర్కు ఈహెచ్ఎస్ నిర్వహణ బాధ్యతలను అదనంగా అప్పగించింది. దీంతో ఈహెచ్ఎస్కు ఉన్న ప్రత్యేకత తగ్గినట్లు అయ్యిందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. వెల్నెస్ సెంటర్ల నిర్వహణ అయోమయంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఈవోగా పద్మను తొలగించడం సరైంది కాదు..: జర్నలిస్టులు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సీఈవో బాధ్యతల నుంచి కె.పద్మను తప్పించటం సరైంది కాదని గురువారం పలువురు జర్నలిస్టులు మంత్రి కేటీఆర్ను శాసనసభ ప్రాంగణంలో కలసి విన్నవించారు. పథకం ప్రారంభం నుంచి పద్మ సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తించారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు సేవలు అందించటంలో పద్మ అంకితభావం మింగుడు పడక వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మంత్రికి ఫిర్యాదు చేశారు. పద్మకు తిరిగి ఈహెచ్ఎస్ సీఈవో బాధ్యతలు అప్పగించాలని కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతకుమారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రిని కలసిన వారిలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే కార్యదర్శి రవికాంత్రెడ్డి, ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమౌళిచారి, ఎస్.విజయ్కుమార్రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శైలేష్రెడ్డి తదితరులున్నారు. -
‘సిరిసిల్ల’ చైర్పర్సన్ రాజీనామా
-
‘సిరిసిల్ల’ చైర్పర్సన్ రాజీనామా
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ పరిధిలో పనులు చేసే కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇవ్వకుండా కౌన్సిలర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘మా మంత్రిగారే పర్సంటేజీలు తీసుకోవాలని చెప్పారు’ అని అన్న ఆమె మాటలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రి ఆదేశాల మేరకు శనివారం రాత్రి పావని తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ మేనేజర్ శ్యామ్సుందర్రావుకు అందజేశారు. ‘ చైర్పర్సన్ పదవికి నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్న’ అని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. పావని రాజీనామా విషయం తెలియడంతో రాత్రి 10 గంటల సమయంలో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మేనేజర్ గదిలో పావని రాజీనామా లేఖను అందించారు. అంతకుముందు ఆమె ఏమన్నారంటే.. ‘‘సిరిసిల్ల టౌన్లో ఎన్ని కోట్ల పనులొచ్చినా అందరూ అసంతృప్తిగా ఎందుకున్నరంటే.. వార్డుకు ఒక్కరే కాంట్రాక్టరు పనిచేస్తుండు.. మాకు వచ్చేది ఏమీ ఉండదు.. మా మంత్రి గారే చెప్పిండ్రు.. కాంట్రాక్టర్ల నుంచి వన్ పర్సెంటో.. టూ పర్సెంటో.. త్రీ పర్సెంటో ఉంటది’ అంటూ రాజీనామాకు ముందు పావని ఎలక్ట్రానిక్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు పర్సెంటేజీలు కౌన్సిలర్లకు ఇవ్వడం లేదని, కౌన్సిలర్గా ఎన్నో ఖర్చులు పెట్టుకున్నారని.. వారికి వన్, టూ పర్సెంట్ ఇవ్వకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. ‘‘మేం కొబ్బరి కాయలు కొట్టి ఏం లాభం? పొద్దున లేచి తిరుగుతున్నం.. వాళ్లు వర్క్లు చేసి మాకు ఇచ్చేది ఇవ్వకపోతే ఎట్లా? అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్లకే ఉండాలి’’ అని అన్నారు. ‘మళ్లీ దాన్ని రాజకీయం చేస్తున్నారని అంటున్నరు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్న.. నేను వెళ్లే వార్డుల్లో డ్రైనేజీలు వేస్తుండ్రు.. మోరీలు వేస్తుండ్రు.. పగుళ్లు ఉన్నాయని కాంట్రాక్టర్లకు చెబితే.. బాగు చేస్తున్నామని అంటున్నరు. పనుల్లో వన్ పర్సంటో.. టూ పర్సంటో తీసుకోమని చెప్పిండ్రు’’అని పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది మన సిరిసిల్లలోనే కాదు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ నడుస్తోంది.. అందరికి ఇస్తుండ్రో లేదో తెలియదు.. అందరితోపాటు నేనూ తీసుకుంటున్న.. అవి మాసారు చూస్తరు.. నేను రాజకీయం, మహిళా సంక్షేమం, మున్సిపల్ పనులు చూస్త’’అని అన్నారు. -
గనుల శాఖలో 477 లీజులు రద్దు
సాక్షి, హైదరాబాద్: గనుల శాఖ అనుమతి తీసుకుని కార్యకలాపాలు చేపట్టని లీజులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 477 లీజులకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించడం లేదని గుర్తించి.. వాటిని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇక వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో గనుల శాఖ అధికారులు 354 తనిఖీలు నిర్వహించి.. 79 చోట్ల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ మేరకు రాష్ట్రంలో గనుల శాఖ కార్యకలాపాలపై శుక్రవారం మంత్రి కె.తారకరామారావు సమీక్షించారు. అక్రమ మైనింగ్ను కట్టడి చేయాలని, ఇందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించండి గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గనుల పర్యవేక్షణలో జియోఫెన్సింగ్, జియో ట్యాగింగ్, ఉపగ్రహ చిత్రాల వినియోగం, డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలన్నారు. త్వరలో తీసుకురానున్న మైనింగ్ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను అమలుచేయాలని, ఆ పాలసీని చట్టరూపంలో తీసుకువస్తామన్నారు. ఈ–వేలం విధానంలో గనుల, ఇసుక రీచ్ల లీజులు కేటాయించాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో సున్నపురాయి గనుల లీజుపైనా చర్చిం చారు. వాటికి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయస్థాయి వేలం నిర్వహించాలని చెప్పారు. రాక్ శాండ్ వినియోగం పెంచండి పర్యావరణ సమతుల్యత కోసం రాక్ శాండ్ (రాతి ఇసుక) వినియోగాన్ని పెంచాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో చేపట్టిన నిర్మాణాల్లో దాని వినియోగం పెంచాలని, ఇందుకోసం ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. టీఎస్ఎండీసీ సైతం రాక్ శాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. పలు జిల్లాల్లో చేపట్టిన శాండ్ టాక్సీ విధానం విజయవంతమైందని, దానిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఒక్క ఫోన్ కాల్తో రాష్ట్రం లోని ఎవరికైనా ఏయే ధరల్లో ఇసుక లభిస్తుందో తెలిసేలా కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ఆదాయ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,166 కోట్ల ఆదాయ లక్ష్యం పెట్టుకోగా.. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా ఫిబ్రవరి నెలాఖరు నాటికే సుమారు రూ.3,500 కోట్లు (110 శాతం) ఆదాయం వచ్చిందన్నారు. ఇసుక ఆదాయలక్ష్యం రూ.388 కోట్లుకాగా.. రూ.538 కోట్లు (139శాతం) సమకూరినట్లు తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపిందని, అందువల్లే ఆదాయం కూడా పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాయితీలు పెరిగినా..‘విద్యుత్’ వాతే!
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ ఎత్తున విద్యుత్ చార్జీల పెంపు తప్పేటట్లు లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలినాళ్లలో ఎదురైన తీవ్ర విద్యుత్ కొరతను అధి గమించి కోతల్లేని విద్యుత్ సరఫరాను అందిస్తుం డటం, గత జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్కు శ్రీకారం చుట్టడం ద్వారా దేశంలో రాష్ట్రం పేరు మార్మోగిపోయింది. అయితే ఈ అవస రాల కోసం డిస్కంలు భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లు జరుపుతుండటంతో వాటిపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దీంతో కొన్నేళ్ల నుంచి తీవ్ర నష్టా లను ఎదుర్కొంటున్న డిస్కంల ఆర్థిక లోటు 2018–19 ముగిసే నాటికి రూ.9,970.98 కోట్లకు పెరగనుందని ఆయా సంస్థల యాజమన్యాలే ఇటీ వల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి నివేదించాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యుత్ చార్జీలనే 2018–19లో సైతం యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదిం చాయి. 2017–18లో డిస్కంలకు ప్రభుత్వం రూ.4,484.30 కోట్ల విద్యుత్ సబ్సిడీ కేటాయించగా, గురువారం ప్రవేశపెట్టిన 2018–19 బడ్జెట్లో రూ.5,650 కోట్లకు పెంచింది. అయినా, తీవ్ర నష్టాల నుంచి డిస్కంలు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను సర్దుబాటు చేసినా రూ.4320.98 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. ఈ నష్టాలను పూడ్చు కోవడానికి సాధారణ ఎన్నికల తర్వాత డిస్కంల యాజమాన్యాలు ట్రూ అప్ పేరుతో భారీగా విద్యుత్ చార్జీలు పెంచే అవకాశాలున్నాయి. ‘పెట్టుబడి’తో రైతుకు లబ్ధి.. పెట్టుబడి పథకానికి బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించారు. దీంతో రైతులు ప్రైవేటు అప్పులకు వెళ్లకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి వీలు కలుగనుంది. ఖరీఫ్, రబీల్లో ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతులకు అందజేస్తారు. ఈ పథకం రైతుల జీవితాల్లో వెలుగు నింపనుంది. రైతు బీమా పథకం వల్ల అన్నదాత ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షల బీమా అందనుంది. – పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి కీలక రంగాలకు తగిన కేటాయింపులు 2018–19 బడ్జెట్ అసాధారణం. కీలక రంగాలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరిగాయి. వ్యవసాయం కోసం రూ.12 వేల కోట్లు, రైతు లక్ష్మి కోసం రూ. 8 వేల కోట్లు కేటాయించడం ద్వారా ఆర్థికవృద్ధి గణనీయంగా పెరుగుతుంది. 2013–14లో 5.4 శాతం ఉన్న జీడీపీ 2016–17 ఆర్థిక సంవత్సరానికి 10.1కి, 2017–18 లో 10.4 శాతానికి పెరిగింది. జాతీయ జీడీపీ కేవలం 6.6 శాతం మాత్రమే ఉండగా తెలంగాణ జీడీపీ 10.4 శాతానికి పెరగడం వృద్ధికి నిదర్శనం. రైతుల సంక్షేమం కోసం ఆర్థిక మంత్రి ఈటల మరో విశిష్టమైన కేటాయింపులు చేశారు. రైతు బీమాకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేయడం కోసం రూ. 500 కోట్లు కేటాయించడం, రైతు పనిముట్ల కోసం కూడా భారీగా నిధులు ఇవ్వడం సంతోషకరం. ఇప్పటిదాకా ప్రభుత్వం 13,934 ట్రాక్టర్లు, 31,274 పనిముట్లు, 26,179 స్ప్రేయర్లకు 50 నుంచి 95 శాతం సబ్సిడీ ఇచ్చింది. ఇక నుంచి రైస్ ట్రాన్స్ప్లాంటర్లను కూడా ఇస్తాం. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. 25 వేల కోట్లు, చేనేతకు రూ. 1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. – మంత్రి కేటీఆర్ ట్వీట్ నిధుల కోత సరికాదు.. 2017–18 బడ్జెట్తో పోలిస్తే మార్కెటింగ్శాఖకు రూ. 336 కోట్ల మేరకు నిధులు తగ్గాయి. ఇలా నిధులు తగ్గించ డంలో ప్రభుత్వ ఆంతర్యమేంటో అంతు బట్టడంలేదు. పెట్టుబడికి, రైతు బీమాకు అదనపు నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పుల్లేవు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
ఏదీ శాశ్వతం కాదు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల ఫలితాలతో మరోసారి తేలిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు లాబీల్లో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీని ఢిల్లీలో, రాష్ట్రంలో కూర్చోబెట్టిన ప్రజలు.. ఉప ఎన్నికల్లో ఓడించి ఏదీ శాశ్వతం కాదనే సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారని అన్నారు. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోతే, మరో జాతీయ పార్టీ ధరావతును కూడా కోల్పోయిందన్నారు. ఉత్తరాదిన కీలకమైన రెండు పెద్ద రాష్ట్రాలు ఉత్తర్ప్రదేశ్, బిహార్లలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందడం ద్వారా ప్రాంతీయ పార్టీలకే ప్రజాదరణ ఉందన్న విషయం తేలిపోతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఇకపై నమ్మరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రజలు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్రాన్ని సాధించి రుణం తీర్చుకున్నారని, భారత పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతమాత రుణం తీర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని కేటీఆర్ చెప్పారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. సామాన్య ప్రజలకు ఏం కావాలో అదే కేసీఆర్ అజెండా అని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలెవరూ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. -
సభ్యుల ప్రవర్తనపై కఠినంగా ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సభ్యుల ప్రవర్తనపై కఠినంగా ఉండాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. మంగళవారం శాసనమండలి లాబీల్లో తనను కలసిన విలేకరులతో కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వం రద్దు, ఇతర సభ్యులపై సస్పెన్షన్ వేటు అంశాలపై ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు కఠినంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. నేరానికి పాల్పడినవారే కాదు, దానికి ప్రోత్సహించిన వారూ శిక్షార్హులేనన్నారు. అనుచితంగా వ్యవహరించిన సభ్యుల సభ్యత్వంపై వేటు పడితే, అందుకు ప్రోత్సహించిన వారిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా వేటు పడిందన్నారు. ఈ తరహా చర్యలు తీసుకోవడం దేశంలో కొత్తేమీ కాదన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అసెంబ్లీల్లో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. -
సిరిసిల్లలో అపెరల్ సూపర్ హబ్!
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికవాడలో ఆధునిక యంత్ర పరికరాలతో అపెరల్ సూపర్ హబ్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్థ ‘కే వెంచర్స్’ఈ హబ్ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖతో కే వెంచర్స్ సంస్థ మంగళవారం సచివాలయంలో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని 60 ఎకరాల్లో వస్త్ర పారిశ్రామికవాడను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా, అందులోని 20 ఎకరాల్లో 5,000 కుట్టు యంత్రాల యూనిట్లు సహా ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్, వాషింగ్ తదితర యంత్ర పరికరాలతో హబ్ ఏర్పాటు కానుంది. 3 విడతలుగా మూడేళ్లలో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభించనుందని.. అందులో 90% మహిళలే ఉంటారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ జనాభా 75 వేలని, ఈ పరిశ్రమ ద్వారా 30 వేల మందికి జీవనోపాధి లభిస్తుం దని చెప్పారు. హబ్ ఏర్పాటుకు కే వెంచర్స్ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, ప్రాజె క్టుకు మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న చేనేత, పవర్లూం రంగ కుటీర పరిశ్రమలన్నింటినీ సమీకరించి వర్క్ ఆర్డర్లు ఇప్పించడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు అపెరల్ సూపర్ హబ్ కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తారని, మరో ఏడాదిలోపు తొలి దశ ప్రాజెక్టు కింద వస్త్ర ఉత్పత్తులు ప్రారంభమవుతాయని చెప్పారు. పరిశ్రమ ద్వారా ఏటా 25 లక్షల వస్త్రాలు ఉత్పత్తి అవుతాయన్నారు. సూపర్ హబ్ నుంచి అరవింద్, శ్యాం లాంటి ప్రముఖ బ్రాండ్ల వస్త్ర ఉత్పత్తులు జరిపేందుకు ఆయా కంపెనీలతో కే వెంచర్స్ చర్చలు జరుపుతోందని మంత్రి చెప్పారు. గుండ్ల పోచంపల్లిలో ఫ్యాషన్ సిటీ కాకతీయ టెక్స్టైల్స్ పార్కులో కొరియాకు చెందిన యాంగ్వాన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుందని, దీని ద్వారా 8 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న గుండ్ల పోచంపల్లి వస్త్ర పారిశ్రామికవాడను ఉపయోగంలోకి తీసుకొస్తామని, దీని ద్వారా 25 వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నిఫ్ట్ డైరెక్టర్గా పని చేసిన డాక్టర్ రాజారాంను ఈ పారిశ్రామికవాడకు సీఈఓగా నియమించామన్నారు. మార్కెట్లోకి వస్తున్న ఫ్యాషన్ కొత్త పోకడలను అనుసరిస్తేనే వస్త్ర వ్యాపారం వృద్ధి చెందుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గుండ్ల పోచంపల్లిలో 10 ఎకరాల్లో ఫ్యాషన్ సిటీ ఏర్పాటు చేసేందుకు యాంగ్వాన్ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు. వస్త్ర పరిశ్రమ రంగంలో కోయంబత్తూరు, కరూరు, తిరుచూరులతో తెలంగాణ పోటీపడాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, కే వెంచర్స్ సీఈఓ ఎస్.సుసింద్రన్, సిరిసిల్ల మునిసిపల్ చైర్మన్ పావని తదితరులు పాల్గొన్నారు.