జర్నలిస్టుల ఆత్మగౌవరం దెబ్బతినేలా అనుచిత వాఖ్యలు చేసి, జర్నలిస్టులపై దాడి చేయించిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సభ వార్తలను కవరేజ్ చేయడం కోసం పిలిపించి దాడి చేశారని, తిరిగి తమపైనే అక్రమంగా కేసులు పెట్టారని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను హోం మంత్రికి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ... కేసును విచారించాల్సిందిగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డికి సూచించారు. హోం మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్ధెల్లి వెంకటేశ్వర్లు, నేతలు పరశురాం, యోగానందరెడ్డి, విష్ణు, ప్రసన్న, సునీల్, మెదక్ జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు సాయినాథ్ ఉన్నారు.