పలు డాక్యుమెంట్లు స్వాధీనం
మిర్యాలగూడ అర్బన్: ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ నయీమ్ కోడలు సాజిదా బేగం కారు డ్రైవర్ మహ్మద్ మసూద్ అలీని సోమవారం అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ సీఐ భిక్షపతి తెలిపారు. మసూద్ ఆంధ్రా ప్రాంతానికి వెళ్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈదులగూడ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు.
మసూద్ అలీ నుంచి బొలేరో వాహనంతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భిక్షపతి తెలిపారు. ఆ డాక్యుమెంట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడకు చెందినవిగా గుర్తించినట్లు భిక్షపతి వివరించారు.
నయీమ్ కోడలు కారు డ్రైవర్ అరెస్టు
Published Tue, Aug 23 2016 2:47 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
Advertisement
Advertisement