2న వైఎస్సార్ సీపీ గ్రేటర్ ఎన్నికల శంఖారావం | on 2 YSR CP Greater election Clarion | Sakshi
Sakshi News home page

2న వైఎస్సార్ సీపీ గ్రేటర్ ఎన్నికల శంఖారావం

Apr 25 2015 11:46 PM | Updated on Aug 14 2018 5:56 PM

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల శంఖారావాన్ని చందానగర్ డివిజన్...

చందానగర్ : రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల శంఖారావాన్ని చందానగర్ డివిజన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. చందానగర్‌లో మే 2వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభ కోసం హుడా కాలనీ గ్రౌండ్‌ను శనివారం వారు సందర్శించారు. చందానగర్‌లో గ్రేటర్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించి అన్ని ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు ధనలక్ష్మీ, జూలీ, హిమామ్ హుసేన్, వనజ, రామకృష్టా రెడ్డి, నారాయణమ్మ, అమర్‌నాథ్ రె డ్డి, నరసింహ, భవానీ చౌదరి, మహేశ్వర్ రెడ్డి, హరీష్ రెడ్డి, ప్రదీప్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement