Municipal Corporation
-
విజయవాడలో ధర్నాకు దిగిన మున్సిపల్ కార్మికులు
-
తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.దీంతో ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. -
ఆంధ్రప్రదేశ్లో కూటమి దౌర్జానాల మధ్య సగం చోట్ల ఎన్నికల వాయిదా. 3 కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు జరగాల్సి ఉండగా 5 చోట్ల జరగని ఎన్నికలు
-
ఏంది బాలయ్య.. ఇదీ ఓ గెలుపేనా?
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు. డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన. -
గుంటూరులో టీడీపీ బరితెగింపు..
-
కడప కార్పొరేషన్ లో TDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి దౌర్జన్యం
-
సెల్లార్ తవ్వుతుండగా కూలిన అపార్ట్మెంట్ ప్రహరీ
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భరత్పురి కాలనీ సెవెన్హిల్స్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ పక్కన ఆదివారం ఉదయం సెల్లార్ తవ్వుతుండగా ప్రహరీ కూలిపోయిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్మెంట్ పక్కనే సెల్లార్ కోవసం తవ్వుతున్నారని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మున్సిపల్ అనుమతి లేకుండానే సెల్లార్లు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే సెల్లార్ తవ్వకం పనులను నిలిపివేయించాలని అధికారులను అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్చేస్తే నేడు ఆమె..!
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? ‘సాధ్యం కాదు’ అనుకున్నదాన్ని ‘సాధ్యం’ చేయవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పే పేరు....రుక్మిణి రియర్. ఆరో తరగతి ఫెయిలైన రుక్మిణి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్ మున్సిపల్ కమిషనర్గా ‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా పనిచేస్తోంది... స్కూల్ రోజుల్లో రుక్మిణి బ్రైట్ స్టూడెంట్ కాదు. రుక్మిణి ఆరో తరగతి ఫెయిల్ కావడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఆ ఫెయిల్యూరే తనను సక్సెస్కు దగ్గర చేసింది. ‘ఫెయిల్యూర్ అంటే మొదలైన భయం ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలను పెంచింది’ అంటుంది రుక్మిణి. అమృత్సర్లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సోషల్ సైన్స్లో డిగ్రీ చేసిన రుక్మిణి ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్’లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.ఆ తరువాత ముంబై, మైసూర్లలో కొన్ని స్వచ్ఛందసంస్థలలో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న క్రమంలో అంకితభావం, వృత్తి నిబద్ధత ఉన్న ఎంతోమంది ఐఏఎస్ అధికారుల గురించి విన్నది. వారి గురించి విన్నప్పుడల్లా ‘ఐఏఎస్’ వైపు మనసు మళ్లేది. చివరికది అది తన కలగా మారింది.‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని రంగంలోకి దిగింది.కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ‘ఆరోతరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్ సాధించింది’... రుక్మిణి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు ఆమెను కలుసుకొని మాట్లాడి సలహాలు తీసుకునేవారు.కట్ చేస్తే...ఇప్పుడు రుక్మిణి రియర్ రాజస్థాన్లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్. యూపీఎస్సీలో సెకండ్ ర్యాంక్తో ఎలా వార్తల్లో నిలిచిందో మున్సిపల్ కమిషనర్గా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం అక్రమార్కుల పాలిట ఆమె సింహస్వప్నం కావడమే. డిసెంబర్లో జరగబోయే ‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానాశ్రయం నుంచి 22 గోదాముల వరకు ప్రధాన రోడ్లను పరిశీలిస్తూ వెళ్లింది.నగర పరిశుభ్రత, సుందరీకరణ గురించి స్థానికులతో మాట్లాడింది. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫ్లైవోవర్లు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి పెయింటింగ్, లైటింగ్ల కోసం సూచనలు ఇచ్చింది. గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి పబ్లిక్ టాయిలెట్లు, చెత్త కుండీలు శుభ్రం చేయడం వరకు ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తుంది. నగర సుందరీకరణతో పాటు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ ద్వారా జైపూర్ను గ్లోబల్ సిటీగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం జైపూర్ అద్భుతంగా కనిపించకపోయినా... పరిశుభ్రంగా, ఆక్రమణలు లేకుండా కనిపించాలి. ఇది అనుకున్నంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే సమ్మిట్కు ఎన్నో నెలలు లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కష్టపడుతూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది రుక్మిణి. ‘పని చెయ్యకపోయినా ఫరవాలేదు. చేస్తే మాత్రం శ్రద్ధగా, భక్తిగా చేయాలి’ అని అమ్మ అంటుండేది. ఆ మాటలే రుక్మిణి రియర్కు వేదవాక్కు.(చదవండి: దసరాలో ట్రెడిషనల్గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!) -
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి.. కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు
సాక్షి, నిజామాబాద్: అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ. 6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో రూ.2కోట్ల 93లక్షల 81వేల నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, 1కోటి 98 లక్షల విలువ చేసే ఆస్తుల్ని సీజ్ చేశారు. మొత్తం 6కోట్ల 7లక్షల విలువగల ఆస్తుల గుర్తించారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ అధికారి నరేందర్ బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నరేందర్ను అరెస్ట్ చేసిన అధికారులు హైదారాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు.ACB Seizes Crores in Cash During Raid on Nizamabad Municipal SuperintendentIn a significant operation by the Anti-Corruption Bureau (ACB), a staggering amount of cash and assets were uncovered during a raid on the residence of Dasari Narendar, the Superintendent and in-charge… pic.twitter.com/oJa4hrfUv7— Sudhakar Udumula (@sudhakarudumula) August 9, 2024 -
ఈ విజయం టీడీపీకి చెంపదెబ్బ.. కర్నూల్ లో YSRCP క్లీన్ స్వీప్..
-
బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
ఉప్పల్: ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్లీ టూర్ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఏకంగా బ్యాంకాక్ ఎగిరిపోయారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ.. శివారు కార్పొరేషన్ అయిన పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా ఈ నెల 6న కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ను సంప్రదించగా వచ్చే నెల 5న తీర్మానం తేదీని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ వారిని వెంబడిస్తూ కాంగ్రెస్ నేతల తీరుతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఏకంగా మీడియా, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. కాగా.. తమ మద్దతుదార్లయిన కార్పొరేటర్లకు విదేశీ టూర్ను ఆఫర్ చేశారు. అంతా ఆశ్చర్యపోయేలా కాస్ట్లీ టూర్కు తీసుకెళ్లడంతో ఆయా పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇంత ఖరీదైన టూర్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఏకంగా కార్పొరేటర్లను, వారి భర్తలను విదేశీ పర్యటనకు తీసుకెళ్లి ఆనంద డోలికల్లో ముంచెత్తడం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్సింగ్నగర్కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్కుమార్ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
ఆంధ్రా అమ్మాయి... జవహర్నగర్ మేయర్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన శాంతి తెలంగాణ రాష్ట్రంలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎంపికయ్యారు. ఆమె బాపట్ల మండలం, ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్య అభ్యసించారు. 2000లో తెనాలి మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన కోటేష్గౌడ్తో వివాహమైంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన మహిళ శాంతి మేయర్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్కు షాక్
-
ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం అయోధ్య ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. ముఖ్యంగా పూలతో చేసిన అలంకరణ చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పుష్పలను వివిధ రాష్ట్రాలను తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తైన తర్వాత ఆ పూలు వృధాగా అయ్యే పోకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. అందుకోసం వారు ఏంచేస్తున్నారో తెలుసా! బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు పది టన్నుల పూజలు తెప్పించారు. ముఖ్యంగా బాలరాముడి గర్భలయాన్ని అలకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను మూడువేల కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని క్రిస్తానియం, గెర్బెరా, ఆర్కడ్లు, ప్రోమేథియం, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ తదితర పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ వంటి ఇతర నగరాల నుంచి కూడా ఈ కత్రువు కోసం పలు రకాల పూలను తెప్పించారు. ఈ ప్రాణప్రతిష్ట క్రతవు ముగిసిన తదనంతరం అయోధ్య ధామ్లో అన్ని దేవాలయాలల్లోని సుమారు 9 మెట్రిక్ టన్నుల పుష్పల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఈ రీసైకిల్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్ చేసి అగరుబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగానే అయోధ్యధామ్లోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వలన్నింటిని ఇలా ప్రాసెంసింగ్ చేసి ధూప్ స్టిక్లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్. ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట క్రతువు కూడా ముగిసింది. ఇక ఆ తతంగంలో వినియోగించిన పువ్వలన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త కంగా 2.3 మెట్రిక టన్నులకు పెరిగింది. ప్రసతుతం మున్సిపాలటీ సిబ్బంది ఆ పువ్వలన్నింటిని ప్రాసెస్ చేస్ ధూప్ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. View this post on Instagram A post shared by PHOOL (@phool.co) (చదవండి: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?) -
AP: మున్సిపల్ కార్మికులతో చర్చలు
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. చదవండి: టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ -
వరంగల్లో టెన్షన్.. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రికత్త
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలు, నెరవేరని ఎన్నికల హామీలపై నేడు మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్లు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు బంపరాఫర్.. -
మున్సిపల్ నియామకాల్లో అవకతవకలు
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్లో మున్సిపల్ కార్పోరేషన్లలో నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. డమ్ డమ్, హలీసహర్, బడా నగర్ మున్సిపల్ కార్పొరేషన్లుసహా మొత్తం 14 కార్పోరేషన్ల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అయాన్ సిల్, అతని ఆఫీస్, మరో ముగ్గురికి చెందిన ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. సాల్ట్ లేక్ ప్రాంతంలోని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ముడుపులు తీసుకుని కొలువులు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ రంగప్రవేశం చేసింది. అయితే ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలో భాగమని పశ్చిమబెంగాల్ రాష్ట్ర మన్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. -
తిరుపతిలో అంగరంగా వైభవంగా గంగమ్మ జాతర
-
కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం : ఇవేం మ్యూటేషన్లు బాబోయ్
కోరుట్ల: సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ తయారీ కోసం రైటర్లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో అవగాహన లేనికొంత మంది డాక్యుమెంట్ రైటర్లు.. నివాసం లేదా ఖాళీస్థలం క్రయ, విక్రయాల డాక్యుమెంట్ తయారు చేసే సమయంలో తప్పలతడకగా వివరాలు నమోదు చేయడం.. అదే నమూనాతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తిచేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లకు ఓ సె క్షన్, ఖాళీస్థలాల రిజిస్ట్రేషన్లకు మరో సెక్షన్ ఉంటుంది. ఖాళీ స్థలాలకు వీఎల్టీ నంబరుతో రిజి స్ట్రేషన్లు చేయాల్సి ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంటిస్థలాల నంబర్లతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడే సమస్య తలెత్తుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పొరపాట్లు చోటుచేసుకోవడంతో యజమానులకు తెలియకుండానే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లకుండానే ఒకరి ఆస్తులు మరొకరి పేరిట నమోదు కావడం గందరగోళానికి దారితీసోంది. వెలుగులోకిరాని ఇలాంటి తప్పిదాలు అనేకం జరిగినా అధికారులు స్పందించడంలేదు. దిద్దుబాటు పరేషాన్.. ● పొరపాటుగా ఆస్తులకు చెందిన వీఎల్టీ లేదా ఇంటి నంబర్లు మారి రిజిస్ట్రేషన్లు జరగడంతో ఆ వివరాలు ఆటో మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుతున్నాయి. ● ఆ వివరాల ప్రకారం.. మున్సిపల్ అధికారులు పేరు మార్పిడి చేసి ఆస్తి పన్ను లేదా ఖాళీ స్థలాల పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ● మున్సిపల్ అధికారులు పన్నుల వసూలుకు వెళ్తున్న సందర్భంలో లేదా ఆస్తి హక్కుదారులు పన్ను చెల్లించే సందర్భంగా జరిగిన పొరపాట్లు వెలుగులోకి వస్తున్నాయి. ● ఈ పొరపాటును సరిదిద్దే అంశం తమ పరిధిలో లేదని మున్సిపల్ అధికారులు తేల్చి చెపుతుండగా.. మున్సిపాల్టీలో సరిదిద్దే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని..తాము సమస్యను జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తే కాలాయాపన జరుగుతుందని సబ్ రిజిస్ట్రార్ అధికారులు అంటున్నారు. ● మొత్తం మీద పొరపాట్లు అధికారులు చేస్తే ఆస్తి హక్కుదారులు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. ● ఉన్నతాధికారులు తగిన రీతిలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని పొరపాట్లును సరిదిద్దాలని బాధితులు కోరుతున్నారు. ఇతడి పేరు తోట గంగారాం. ఆస్తిపన్ను చెల్లించేందుకు వారంక్రితం కోరుట్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. ఇంటి నంబరు చెప్పగానే గంగారాం పేరిట ఇల్లే లేదని అధికారులు తేల్చేశారు. వేరేవాళ్ల పేరు ఎలా వచ్చిందని బిత్తరపోయిన గంగారాం.. ఇదేమిటని ప్రశ్నిస్తే.. రిష్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అడుగు అని ఉచిత సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే.. తన ప్రమే యం లేకుండానే ఇతరులు చేసుకున్న రిజిస్ట్రేషన్లో తనఇంటి నంబరు నమో దు చేసి.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా బల్దియా కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. దానిప్రకారం ఏడాది క్రితమే ఆటో మ్యుటేషన్తో తన ఇల్లు వేరేవారి పేరిట నమోదైనట్లు స్పష్టమైంది. కోరుట్ల మెయిన్డ్డుడ్లోని ఓ దుకాణా యజమాని.. తన ఇంటి సమీపంలోని ఖాళీస్థలాన్ని వీఎల్టీ నంబరుతో తన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. వారంక్రితం అతడు ఆస్తిపన్ను చెల్లించడానికి బల్దియా కార్యాలయానికి వెళ్తే.. ఖాళీ స్థలమే కాకుండా తన బంధువుల పేరిట నమోదు అయిందని తెలిసి నివ్వెరపోయాడు. జిల్లా రిజిస్ట్రార్కు నివేదిస్తాం వీఎల్టీ, ఇంటి నంబర్ల నమోదులో పొరపాట్లు జరగడంతో తప్పులు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నాం. వీటిని సరిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున ఆస్తుల వివరాలు మారిన వారు మాకు దరఖాస్తు చేసుకోవాలి. కొంత కాలయాపన జరిగినా ఆటో మ్యుటేషన్లో జరిగిన పొరపాట్లు సరిచేస్తాం. – శ్రీధర్రాజు, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, కోరుట్ల -
పాకిస్తాన్లో హిందూ డాక్టర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డెరెక్టర్, ప్రముఖ కంటి వైద్యుడు, హిందూ మతస్థుడైన డాక్టర్ బీర్బల్ జినానీని దుండుగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దుండుగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్లోని హైదరాబాద్ పట్టణంలో హిందూ మతానికి చెందిన ధరమ్దేవ్ రాఠీ అనే వైద్యుడిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. -
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు
ఇటీవల కాలంలో కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి పెంపుడు కుక్కలు కూడా చేరాయి. ఈ మధ్య పెంపుడు శనుకాలు కూడా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. అయితే కుక్కలు గాయపరిచిన ఘటనలో బాధితులకు పరిహారం అందడం చాలా అరుదు. కానీ తాజాగా ఓ పెంపుడు కుక్క కరిచిన ఘటనలో గాయపడిన మహిళకు ఉపశమనం లభించింది. పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ బాదితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక.. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ను(ఎంసీజీ) మంగళవారం ఆదేశించింది. కావాలంటే చెల్లించిన పరిహారం మొత్తాన్నికుక్క యజమాని నుంచి తిరిగి పొందవచ్చని పేర్కొంది. కాగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవించే మున్ని అనే మహిళ, తన కోడలుతోపాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వినిత్ చికారా పెంచుకుంటున్న కుక్క ఆగష్టు 11 న దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహిళ తల, ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను గురుగ్రామ్లోని ఆసుపత్రికి తరువాత ఢిల్లీలోని సఫ్దర్గంజ్ హాస్పిటల్కు తరలించారు. కుక్క దాడిపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళను కరిచిన శునకం ‘డోగో అర్జెంటీనో’ జాతికి చెందినదిగా యజమాని తెలిపారు. చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి... కుక్కను స్వాధీనం చేసుకోవాలని, దాని లైసెన్స్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది. అదే విధంగాపెంపుడు కుక్కల పాలసీని మూడు నెలల్లో రూపొందించాలని ఆదేశించింది. వీధి జంతువులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాటిని పౌండ్లలో ఉంచాలని, అలాగే హనికరమైన 11 అన్యదేశ జాతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతి కుక్కులను ఎవరైనా పెంచుకుంటే వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. డోగో అర్జెంటీనో వంటి క్రూర జాతికి చెందిన శునకం పెంపుడు విషయంలో యజమాని చట్టాన్ని, నిబంధనలు ఉల్లించాడని స్పష్టంగా అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి క్రూర జాతి కుక్కులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. -
దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్, 1 కేజీ వెండి, సిల్క్ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్ బాక్స్లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం. (చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!) -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్గఢ్లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్లీలా మైదాన్లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
ఆరోపణలు మాని మీ పని మీరు చూసుకోండి!: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ఆప్ల మధ్య స్కామ్ వర్సస్ స్కామ్ పోరు హోరాహోరిగా సాగుతుంది. ఈమేరకు ఢిల్లీలోని లెప్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ బీజేపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలకితీసే ఎత్తుగడకు పూనుకుంది. అందులో భాగంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ సంస్థలు టోల్టాక్స్ వసూళ్లలో రూ. 6 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయని, దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపముఖ్యముంత్రి మనీష్ సిసోడియాకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన లేఖలో... "బీజేపీ ఆధ్వర్యంలోని ఎంసీడీలో జరిగిన సుమారు రూ. 6 వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రెండునెలల క్రితమే లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేగాదు ప్రతిరోజూ ఢిల్లీలోకి ప్రవేశించే దాదాపు 10 లక్షల వాణిజ్య వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలు చేసే రెండు కంపెనీలతో ఎంసీడీ కుమ్మక్కయ్యిందని, అయితే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరదని ఆరోపించారు. ఐతే మీరు ఆ స్కామ్పై దృష్టి పెట్టలేకపోయారు. ఎందుకంటే అది బీజేపీ హయాంలో జరిగింది కాబట్టి వదిలేశారు. దాని బదులుగా నా ఇంటిపై సీబీఐ దాడులు జరిపించారు. లిక్కర్ స్కామ్లో బీజేపీ రూ. 10 వేల కోట్లు స్కామ్ జరిగిందంటే, మీరు రూ. 144 కోట్లు అన్నారు. ఆఖరికి సీబీఐ కోటీ రూపాయల స్కామ్ అంది. చివరికి మీరు జరిపించిన సీబీఐ దాడుల్లో ఏమి దొరకలేదు. కేవలం మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంపై ప్రతిరోజు కొత్త ఆరోపణలతో సీబీఐ దాడుల జరిపించే పనిలో బిజీగా ఉన్నారు. అయినా మీరు ముందు ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేసే బదులు మీరు నిర్వహించే శాఖలపై దృష్టి సారించండి. పెరిగిపోతున్న నేరాలను కట్టడి చేయండని, ఆక్రమణకు గురవుతున్న భూములను విముక్తి చేయమని కోరుతూ వస్తున్న లేఖలపై దృష్టి సారించండి" అని ఘటూగా విమర్శిసిస్తూ లేఖ రాశారు. అయినా 17 ఏళ్లుగా ఎంసీడీని పాలుస్తన్న బీజేపీ నగరాన్ని చెత్తకుప్పగా చేసిందని దుయ్యబట్టారు. (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
-
అవినీతిపై సర్కార్ ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: నగరపాలక, పురపాలక సంస్థల్లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాల్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కూడా అనకాపల్లి, బొబ్బిలి, సామర్లకోట, ఏలూరు, మార్కాపురం, తిరుపతి, రాజంపేట, పుట్టపర్తి, నందిగామ మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల్లో పట్టణ ప్రణాళికా విభాగం రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘14400’ టోల్ఫ్రీ నంబర్కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంపై అధికంగా అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువైతే అవినీతిపరులపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. దీంతో అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. కాగా ఏసీబీ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. గత కొన్నేళ్లుగా ఆరోపణలు.. మున్సిపల్, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని సిబ్బందిపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా.. ఆస్తి పన్ను అసెస్మెంట్ చేసేందుకు సర్వే చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తగా భవన నిర్మాణం చేపట్టాలన్నా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండి, ఇంటి ప్లాన్ కూడా నిబంధనల మేరకు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ)కి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతిపరుల ఆటకట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 14400 టోల్ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై అధిక ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ వాటిలో దాడులు ముమ్మరం చేసింది. ఏసీబీ తనిఖీలపై నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక సంస్థలు, 4,132 వార్డు సచివాలయాల్లో ప్రజలకు కనిపించేలా ‘14400’ టోల్ఫ్రీ నంబర్ ప్రదర్శించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం నిర్లక్ష్యం.. సూళ్లూరుపేటలో రూ.2,00,960, జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి మున్సిపాలిటీలో రూ.38,200, పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో రూ.35,560 అనధికార నగదును ఏసీబీ అధికారులు గత రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల సర్వే, ప్లాన్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను కాలవ్యవధికి మించి పెండింగ్లో ఉంచినట్టు గుర్తించారు. అంతేకాకుండా అనధికార నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేల్చారు. అలాగే నిబంధనల ప్రకారం కొన్ని భవనాలకు నిర్మాణాల అనుమతి రుసుం వసూలు చేయడంలో టౌన్ప్లానింగ్ సిబ్బంది విఫలమయ్యారని.. రికార్డులను సైతం సరిగా నిర్వహించడం లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థలో సంస్కరణలు
-
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్మిషన్లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు...వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. తనకేం తెలియదని చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని చెప్పాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ చెత్తబండిలో ఉన్న ఫోటోలను గుర్తించి ప్రశ్నించిన వ్యక్తి ఆయా ఫోటోలను సదరు వ్యక్తి నుంచి తీసుకోవడమే కాకుండా గౌరవంగా నిమజ్జనం చేస్తానని చెప్పాడు. ఐతే నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పే ఏముంది, చెత్త బుట్లలో ఉంటేనేగా అతను సేకరించి తీసుకువచ్చిందని ఒకరు, పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ మరోకరు మండిపడుతూ ట్వీట్ చేశారు. A contractual worker at UP's Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 (చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!) -
బెంగళూరులో చెత్త సంక్షోభం
బనశంకరి(బెంగళూరు): వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పౌరకార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం కారణంగా పౌరకార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో చెత్త సమస్య తలెత్తింది. బెంగళూరులో రోడ్లను స్వీపింగ్ యంత్రాలతో ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హమీ ఇచ్చేవరకు సమ్మె వదిలిపెట్టేది లేదని పౌర కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో నగర రోడ్లలో చెత్త రాశులుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. బెంగళూరులోని క్రీడా మైదానాలు, బస్టాండ్లు, బస్షెల్టర్లు, మార్కెట్లు ప్రాంతాల్లో చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి చెత్త తొలగింపు నిలిచిపోయింది. బెంగళూరులో 70 శాతం మంది సమ్మె బెంగళూరు నగరంలో 18 వేల మంది పౌర కార్మికులు ఉండగా 70 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంపు, పర్మినెంట్ తదితరాలపై ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 54,512 మంది కాంట్రాక్టు పౌర కార్మికులు ఉండగా వీరిలో 10,755 మందిని పర్మినెంట్ చేశారు. మిగిలిన కార్మికులను కూడా పర్మినెంట్ చేయాలని సమ్మెకు దిగారు. పౌర కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. యంత్రాలతో చేయిస్తాం సమ్మె వల్ల చెత్త సమస్య తలెత్తిందని పాలికె పొడిచెత్త నిర్వహణ విభాగం ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరీశ్కుమార్ తెలిపారు. సోమవారం బీబీఎంపీలో మాట్లాడుతూ రెండు స్వీపింగ్ యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని యంత్రాలను సమకూర్చుకుంటామని చెప్పారు. -
గులాబీకి గుడ్బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా బడంగ్పేట నగర పాలక సంస్థ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా హస్తినలో రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎల్బీనగర్లోనూ... ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. టీకేఆర్ను బుజ్జగించిన కేటీఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఆయన కోడలు తీగల అనితా హరినాథ్రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్రెడ్డిలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. (చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’) -
విషాదం: నీటి ట్యాంకు శుభ్రం చేయబోయి.. పైపులో జారిపడ్డ కార్మికుడు
ఖమ్మం మయూరిసెంటర్: భారీ మంచినీటి ట్యాంకును శుభ్రం చేసే యత్నంలో ఓ కార్మికుడు నీటిపైపు లో జారి పడి ప్రాణాలు పోగొట్టుకు న్నాడు. మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రోజువారీ కార్మికుడితో..: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని వాటర్ ట్యాంకులను అనుభవం కలిగిన పారిశుధ్య కార్మికులతో పదిహేను రోజులకోసారి శుభ్రం చేయిస్తారు. కార్మికులు తక్కువగా ఉండటంతో మంగళవారం రోజువారీ వేతన కార్మికుడు చిర్రా సందీప్(23)కు పని అప్పగించారు. ఉదయం సందీప్ మరో ఇద్దరితో కలిసి నయాబజార్ కళాశాల పక్కన ఉన్న వాటర్ట్యాంక్ ఎక్కాడు. ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేస్తున్న సందీప్ ప్రమాదవశాత్తు పైపులో జారిపడ్డాడు. మిగతా ఇద్దరు కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కేఎంసీ రెస్క్యూ టీం వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సందీప్ జారిపడిన పైపు దిగువన తెరిచి చూడగా అతను కనిపించలేదు. కొంచెం దూరంలో జేసీబీతో మట్టిని తొలగించి పైపును పగులగొట్టడంతో సందీప్ కాళ్లు కనిపించాయి. చదవండి👉🏼 ట్యాంక్బండ్పై నో పార్కింగ్.. బండి పెట్టారో.. రూ.1000 కట్టాలి! మృతదేహాన్ని బయటికి తీసేసరికి సాయంత్రం 5.20 గంటలు దాటింది. కాగా, నైపుణ్యం లేని కార్మికులతో పనిచేయించడంతో సందీప్ చనిపోయా డంటూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం, ఇంటి స్థలం, కుటుం బంలో ఒకరికి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చదవండి👉🏻 మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
విధులకు రాం.. జీతం మింగేస్తాం
టౌన్ప్లానింగ్ విభాగంలో చైన్మ్యాన్గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్ విభాగంలో ఏకైక వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్ విభాగంలో ఓ రెగ్యులర్ అటెండర్ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు. అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు. సార్ తిట్టాడని రాలేదు విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్మ్యాన్ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. – శాస్త్రి, ఏసీపీ, టౌన్ప్లానింగ్ (చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..) -
బోడుప్పల్ అంటే.. బాబోయ్ మాకొద్దంటున్న అధికారులు!
సాక్షి,బోడుప్పల్(హైదరాబాద్): బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గత కొంత కాలంగా అధికారులు లేకుండా పాలన కొనసాగుతుంది. ఇక్కడ పని చేసే అధికారులు కొంత మంది ఇష్టం లేక వెళ్లి పోవడం, మరి కొంత మంది సెలవులపై వెళ్లడంతో కిందస్థాయి సిబ్బందిచే పాలన కొనసాగిస్తున్నారు. అధికారులపై విపరీతమైన ఒత్తిడి, పనిభారంతో పాటు వేధింపులు ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ఏ అధికారి ఇష్ట పడడం లేదు. దీంతో ఇప్పటికే కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మేనేజర్, హరితహారం ఇన్చార్జ్ లేకుండానే తూతూ మంత్రంగా పాలన కొనసాగిస్తున్నారు. పాలనాధ్యక్షుడైన మేయర్కు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్కు ప్రజా పాలనపై పట్టు లేకపోవడం, ఇతర విషయాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించిపోతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్పై పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకపోగా, మరి కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. కమిషనర్ కూడా సెలవులపై వెళ్లడంతో నగర పాలక సంస్థలో పాలన అటకెక్కింది. సమన్వయ లోపం కారణమా? ► బోడుప్పల్ కమిషనర్, మేయర్కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో గత కొంత కాలంగా వారు ఎడ,పెడ మొఖంగా ఉన్నారు. దీంతో పాటు పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సెలవులపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ పదవీకాలం ముగిసింది. అనంతరం ఆయననే మళ్లీ అవుట్ సోర్సింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా తీసుకున్నారు. ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత ఇక్కడ చేయలేనని వెళ్లిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొంది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్లో అవార్డులు పొందిన బోడుప్పల్ నేడు చెత్త విషయంలో మురికి కూపంగా మారింది. ఇక్కడ పని చేసిన మేనేజర్ మరో చోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆర్ఓను ఇన్చార్జ్ మేనేజర్గా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా వస్తారు.. అలా వెళ్తారు.. ► మున్సిపాలిటీకి కీలకమైన విభాగం టౌన్ప్లానింగ్. ఇక్కడ గతంలో నల్గొండలో పనిచేసే ఓ ఏసీపీ అధికారి డిప్యూటేషన్పై మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు అక్కడ పని చేశారు. ఓ మంత్రి సహకారం మేయర్, కొంత మంది కార్పొరేటర్లు భవన నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆయన తన డిప్యూటేషన్ను రద్దు చేయించుకుని నల్గొండలోనే ఉండి పోయారు. ఆయన తరువాత మరో టీపీఓ డిప్యూటేషన్పై వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఇమడ లేక వెళ్లిపోయారు. ప్రస్తుతం అధికారి లేకుండానే టౌన్ ప్లానింగ్ విభాగం కొనసాగుతోంది. కిందిస్థాయి అధికారులతోనే.. ► ప్రతి సంవత్సరం హరితహారం కోసం బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ, మొక్కల పంపిణీ, పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పెరటి తోటల పంపకం, మొక్కలకు నీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, నిర్వహణ కోసం పదవీ విరమణ పొందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ను నెలకు రూ. 50 వేలు ఇచ్చి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన సదరు అధికారి సైతం పని చేయలేమని వెళ్లిపోయారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే అందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగం మినహా ఇస్తే మిగతా విభాగాలు కింద స్థాయి అధికారులు, సిబ్బందిచే నడుపుతున్నారు. దీంతో పాలన అంతా స్తంభించి పోయి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్సింగ్.. వైరల్ -
చక్రం తిప్పిన బీజేపీ.. రెండో స్థానంలో నిలిచినా చండీగఢ్ మేయర్ పీఠం కైవసం
చండీగఢ్: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. 35 వార్డులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దిగినా అత్యధికంగా 14 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, శిరోమణి అకాలీదళ్ కేవలం ఒకే ఒక్క చోట గెలిచిన విషయం తెల్సిందే. చదవండి: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్ కాగా, మేయర్ స్థానం కోసం శనివారం జరిగిన ఓటింగ్ రసవత్తరంగా సాగింది. ఓటింగ్ సమయంలో ఒక శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్, ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 35 సీట్లున్న నగర కార్పొరేషన్లో మేయర్ స్థానానికి జరిగిన ఓటింగ్లో సాధారణ మెజారిటీ 14కు పడిపోయింది. చండీగఢ్ ఎంపీ.. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్–అఫీషియో సభ్యుడి హోదాలో ఓటింగ్లో పాల్గొని బీజేపీకి మద్దతిచ్చారు. ఫలితాలు రాగానే ఒక కాంగ్రెస్ సభ్యుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆప్, బీజేపీ చెరో 14 మంది సభ్యులతో సమంగా నిల్చాయి. అయితే, శనివారం మేయర్ ఎన్నికలో ఒక ఆప్ సభ్యుని ఓటు చెల్లదని తేల్చడంతో మేయర్ పీఠం బీజేపీ వశమైంది. మహిళా కౌన్సిలర్ సరబ్జిత్ కౌర్ ధిల్లాన్ మేయర్గా గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆప్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్లు కావాలనే గైర్హాజరై బీజేపీకి పరోక్ష మద్దతిచ్చారని ఆప్ ఆరోపించింది. -
‘మెప్మా’.. కేసు కదలదేమి చెప్మా!
సాక్షి, హైదరాబాద్: అది కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్.. నలుగురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఓ టీఎంసీ, మరికొందరు రిసోర్సు పర్సన్లు... బ్యాంకు అధికారులతో కుమ్మక్కై 64 నకిలీ మహిళా సంఘాలను సృష్టించారు. రూ.కోట్లలో బ్యాంకులకు టోకరా పెట్టారు. దీనిపై మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు విచారణ జరిపి రూ.3.20 కోట్ల రుణ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు. ఒక టీఎంసీని, సీవోను సస్పెండ్ చేసి, మరో ముగ్గురు సీవోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. బ్యాంకుల అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత యథావిధిగా స్థానిక కార్పొరేటర్లు, పెద్ద నాయకులు రంగ ప్రవేశం చేయగా... ఓ సీవోను అరెస్టు చేయడం మినహా ఎలాంటి చర్యలు లేవు. ఏడాది దాటినా రికవరీ లేదు. కేసుల దర్యాప్తు కూడా ముందుకు సాగడం లేదు. ఈ బోగస్ రుణాల కుంభకోణం ఒక్క కరీంనగర్ కార్పొరేషన్తోనే ఆగలేదు. వరంగల్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లతోపాటు నల్లగొండ, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట తదితర మునిసిపాలిటీల్లోనూ సాగింది. అన్నిచోట్లా భారీస్థాయిలో రుణ కుంభకోణం సాగినట్లు తెలుస్తోంది. సంఘానికి రూ.7.50 లక్షల వరకు రుణం నకిలీ మహిళా సంఘాల పేరిట దందాలు 2015లో మొదలైనా 2018, 2019లలో అనేక నగరాలు, పట్టణాల్లో ఈ తతంగం సాగింది. కరీంనగర్లో 64 సంఘాల ద్వారా 3.20 కోట్లు రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ రాష్ట్రవ్యాప్తంగా రుణాల మంజూరు, రికవరీలపై దృష్టి పెట్టగా.. చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తేలింది. రిసోర్స్ పర్సన్ల ద్వారా ఒక బోగస్ సంఘాన్ని ఏర్పాటు చేయించి, బ్యాంకు అధికారులతో కలిసి మహిళల ఫొటోలు, పేర్లతోపాటు ఆధార్ నుంచి బ్యాంకు అకౌంట్ వరకు నకిలీవి సృష్టించి ఒక్కో సంఘం పేరిట రూ.2 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు రుణాలు పొందినట్లు తేలింది. కరీంనగర్లో మూడు సంఘాల నుంచి మాత్రమే రికవరీ చేశారు. గ్రేటర్ వరంగల్లో స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేయడంతో బోగస్ రుణాల కేసులు దాదాపుగా క్లోజయ్యాయి. ఇక్కడ ఏకంగా సీవోలను సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించారు. సస్పెండ్ అయిన వాళ్లు రికవరీ చేసే పనిలో ఉన్నారు. మరో ముగ్గురు ఆర్పీలపై చర్యలకు ఉపక్రమించినప్పటికీ ప్రజాప్రతినిధుల సిఫారసుతో యథావిధిగా కొనసాగుతున్నారు. మంచిర్యాలలో ముగ్గురు సీవోలను జిల్లాలోని వేర్వేరు మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. సిరిసిల్లలో 43 సంఘాల ద్వారా రూ.80 లక్షల రుణాలను తీసుకొని పత్తాలేకుండా పోయారు. సిద్ధిపేటలో రూ.18 లక్షల అక్రమ రుణాలు మంజూరయ్యాయి. ఖమ్మంలో జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న మహిళ ఏకంగా ఏసీబీకే చిక్కారు. ప్రతి ఆర్పీ నుంచి ఆమె నెలకు రూ.1,500 మేర లంచంగా తీసుకుంటారు. రామగుండంలో మెప్మా అధికారిగా ఉన్న మహిళ ఏడెనిమిదేళ్ల క్రితమే సస్పెండ్ అయి ఏడాదిన్నర తరువాత రాజకీయ పరపతితో తిరిగి మంచి పోస్టును దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరిపైనా చర్యల్లేవ్... రాష్ట్రంలో మెప్మా పరిధిలో 5,765 మహిళా సమాఖ్యలున్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 20–30 మహిళా సంఘాలు ఉంటాయి. ప్రతి సమాఖ్యకు ఒక రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) బాధ్యురాలిగా ఉండి ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించి, రికవరీ చేయించాలి. ప్రతి సమాఖ్యలోకి కొత్తగా సంఘాలను తీసుకునే అవకాశం ఉండటంతో దాన్ని ఆసరాగా చేసుకొని బోగస్ సంఘాలను సృష్టించి, రుణాలు పొందారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, టీఎంసీలు, బ్యాంకు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించారు. అయితే విషయం బయటకు పొక్కగానే ఎవరికి వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేసి తమను తాము రక్షించుకుంటున్నారు. దందాలో భాగస్వాములైన బ్యాంకు అధికారుల గురించి అడిగేవారే లేరు. బోగస్ సంఘాల అంశం వెలుగు చూడటంతో ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి కనపరచడం లేదు. -
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. తేల్చి చెప్పిన అధికారులు
ముంబై: కరోనా కట్టడికి నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాలనే లక్ష్యంతో థానే మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చేసింది. సోమవారం సివిక్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ, థానే మేయర్ నరేష్ మస్కే సహా సీనియర్ టీఎంసీ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్థరాత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, మొదటి డోస్ తీసుకోని పౌర ఉద్యోగులకు జీతాలు చెల్లించేది లేదంటూ స్పష్టం చేసింది. నిర్ణీత వ్యవధిలోపు రెండోసారి వ్యాక్సిన్ తీసుకోని పౌర ఉద్యోగులకు కూడా జీతాలు అందవని ఆ ప్రకటనలో పేర్కొంది. పౌర ఉద్యోగులందరూ తమ టీకా సర్టిఫికేట్లను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించడాన్ని టీఎంసీ తప్పనిసరి చేసింది. ఈ నెలాఖరులోగా నగరంలో వాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం అనంతరం మస్కే విలేకరులతో అన్నారు. చదవండి: గుజరాత్: ముగ్గురు మైనర్లపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారి కేకలు వేయడంతో.. -
నిజాంపేట్ కార్పొరేషన్లో ఆహ్లాద కేంద్రాలు అస్తవ్యస్తం!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు పార్కుల అభివృద్ధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేషన్లోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్లలో పార్కులు ఉండగా ఎక్కువగా ప్రగతినగర్లోనే ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో కొన్ని పార్కుల నిర్వహణ, అభివృద్ధి బాగానే ఉన్నా ఎక్కువ పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పలు పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పార్కుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కుల అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ప్రయోజనం కనపించడం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆట పరికరాలు కరువు... ► కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తువులు లేకపోవడంతో పరిసర ప్రాంతల్లో నివసించే పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..) ► కేవలం కొన్ని పార్కుల్లోనే పిల్లల ఆట పరికరాలు ఉండటంతో అనేక మంది అట్టి పార్కులకు వెళ్తుండటంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. ఓపెన్ జిమ్లు కూడా... ► అదే విధంగా ఓపెన్ జీమ్లు కూడా అన్ని పార్కుల్లో లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ► ప్రతి కాలనీలో ఉన్న పార్కులో ఓపెన్ జీమ్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పార్కుల నిర్వహణలో లోపం... పార్కుల నిర్వహణలో క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు. ► పార్కుల్లో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ► పెద్దపెద్ద రాళ్లు కూడా పార్కుల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి. ► అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రీనరీ కోసం నీటిని కూడా సక్రమంగా పట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ► పార్కులకు ఉన్న గేట్లు కూడా సరిగ్గా లేకపోవడంతో పశువులకు పార్కులు అవాసాలుగా మారాయని వాపోతున్నారు. ► కొన్ని పార్కుల్లో అయితే చెత్తాచెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. నిర్వహణ నిరంతరం చేయాలి పార్కుల అభివృద్ధి, నిర్వహణ నిరంతరం కొనసాగాలి. ప్రజలు ప్రతి రోజు ఆహ్లాదం కోసం పార్కులకు వస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ప్రకృతి, గ్రీనరీతో అనుభూతి పొందాలి. కానీ అలాంటి పరిస్థితి అనేక పార్కుల్లో లేదు. కేవలం కొన్ని పార్కుల్లోనే ఉంది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఉన్న పార్కుల్లో గ్రీనరీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి జీమ్లు, ఆట పరికారాలు లేని పార్కుల్లో వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – మురళి, స్థానికుడు అభివృద్ధి, నిర్వహణకు చర్యలు తీసుకుంటా.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధికి నోచుకొని పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అదే విధంగా నిర్వహణకు నోచుకొని పార్కులను వెంటనే గుర్తించి ప్రతి రోజు పార్కుల నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తా. అదే విధంగా పార్కుల్లో గ్రీనరీ పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటా. – శంకరయ్య, కమిషనర్, నిజాంపేట్ -
చెత్త దిబ్బల వద్ద షూటింగ్.. అయితే పైసలు కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: సాధారణంగా చెత్త అంటే వ్యర్థపదార్థంగానూ, లేక పెద్దగా ఉపయోగపడని వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఓ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం వ్యర్థాలు ద్వారా కూడా పైసలు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త దిబ్బల వద్ద వీడియోలు, షూటింగ్ తీసే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయాలని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. వీరి పరిధిలో ఎక్కడైనా చెత్త దిబ్బల వద్ద వెబ్ సిరీస్, ఇతర షూటింగ్ల చేయాలనుకునే వారు ప్రతిరోజూ రూ.75,000 చెల్లించాలని మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. దీంతో పాటు ల్యాండ్ఫిల్ సైట్ సమీపంలో షూటింగ్ కోసం రూ. 2 లక్షలు చెల్లించాలని తెలిపారు. అంతే కాకుండా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్గా రూ.25,000 చెల్లించాలని, వాటిని 2 వారాల్లో తిరిగి ఇస్తామన్నారు. అయితే, ఈ ఛార్జీలపై ఓ వెసులుబాటును కూడా కల్పించారు. ఎవరైనా పేరుకుపోతున్న చెత్త, వాటి తొలగింపు సమస్యపై డాక్యుమెంటరీ తీసినా లేదా సామాజిక సందేశాన్ని అందించేందుకు షూటింగ్ చేసేవారి నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. కాకపోతే అందుకోసం తమకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. -
చెత్త తో గ్యాస్
-
మహిళతో అసభ్యకర ప్రవర్తన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కు దేహశుద్ధి
సాక్షి, సంగారెడ్డి: మున్సిపల్ అధికారి వేధింపులు భరించలేని ఓ మహిళ తన భర్తతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పనిమీద వచ్చిన మహిళలను అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అధికారి ప్రవర్తనకు విసిగిపోయిన బాధితురాలు తన భర్తకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్యతో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్కు చితకబాది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
నేడు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక
-
మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ భర్తదాష్టీకం
-
15 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ
-
ఏలూరు కార్పొరేషన్: కౌంటింగ్ కొనసాగుతోంది
-
ఏలూరు కార్పొరేషన్: కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్
-
ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు రాష్ట్రంలోని 11 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపికకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. 30వ తేదీ ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎంపికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లకి ఈ నెల 26 లోపు సమాచారమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించుకునేలా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ల ఎంపిక చేపట్టాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరడంతో ప్రత్యేక సమావేశం నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు గ్రీన్ సిగ్నల్
-
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈనెల 25న ఉ.8 నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించుకోవచ్చన్న డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్ఈసీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్ నిబంధనలతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించింది. కాగా, మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఎలక్షన్లో 56.86% పోలింగ్ నమోదైంది. అయితే, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. -
కరోనా పేషెంట్లకు రూ.10 లక్షలు చెల్లించండి
ముంబై: కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి.దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు కరోనావైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడాను ఝులిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న 92 మంది బాధితులకు రూ.10 లక్షలు తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధితులకు కరోనా టెస్ట్ లు చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నాగ్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) అధికారులు ట్రీట్మెంట్ చేసినందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని అన్నీ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అధారంగా రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లో రేడియన్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా బాధితులు, లేదంటే వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శర్మ ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని అన్నారు. అంటువ్యాధి మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జలాజ్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
300 మందికి అంత్యక్రియలు చేశాడు.. చివరికి
చండీగఢ్: కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మయదారి మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపిన ఓ వ్యక్తి అదే కోవిడ్ సోకి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు.. 44 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. కరోనా వైరస్ రోగుల మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బృందానికి ప్రవీణ్ అధిపతి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి కోవిడ్తో మృత్యువాతపడిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమానం, భయం లేకుండాఇలా దాదాపు 300కుపైగా జరిపాడు. ఈ క్రమంలో ఇటీవల ప్రవీణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రవీణ్ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సోకిన రెండు రోజులకే ఆయన సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఎంతో మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ ఇలా మరణించడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్లో మంగళవారం జరిపారు. ప్రవీణ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. చదవండి:Corona: మృతదేహంపై ఆభరణాలు తీసిచ్చినందుకు రూ.14 వేలు -
ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్
-
తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్గా మారుస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ
-
ఒకే కార్పొరేషన్గా తాడేపల్లి, మంగళగిరి
సాక్షి, అమరావతి : తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్గా మారుస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను..అలాగే తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయతీలను కొత్త మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. -
తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్
కళ్యాణదుర్గం రూరల్: తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్ చైర్మన్ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్గా తలారి రాజ్కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్కుమార్కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్కు రిజర్వు కాగా.. వైఎస్సార్సీపీ టికెట్ రాజ్కుమార్కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. సీఎం వైఎస్ జగన్పై ప్రజలకున్న అభిమానం రాజ్కుమార్కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. చదవండి: నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ మామ అటెండర్గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
90.61 లక్షల మంది ‘పుర’ ఓటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 2,794 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులు ఉన్నాయి. పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితాలను పురపాలకశాఖ ఖరారు చేసింది. ఓటర్లలో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉన్నారు. నగరపాలక సంస్థల్లో విశాఖపట్నంలోను, పురపాలకసంఘాల్లో నంద్యాలలోను ఎక్కువమంది ఓటర్లున్నారు. ► మొత్తం ఓటర్లు 90,61,806 మంది. వీరిలో పురుషులు 44,59,064 మంది, మహిళలు 46,01269 మంది. ఇతరులు 1,473 మంది. ► 12 నగరపాలికల్లో ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుషులు 25,97,852 మంది, మహిళలు 26,53,762 మంది, ఇతరులు 741 మంది. ► 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 38,09,451. వీరిలో పురుషులు 18,61,212 మంది, మహిళలు 19,47,507 మంది, ఇతరులు 732 మంది. ► నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) విస్తీర్ణంలోను, ఓటర్ల సంఖ్యలోను మొదటి స్థానంలో ఉంది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఓటర్ల సంఖ్య 17,52,927. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,72,320 మంది, ఇతరులు 126 మంది. ► మచిలీపట్నం నగరపాలక సంస్థలో తక్కువ మంది ఓటర్లున్నారు. 50 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఓటర్ల సంఖ్య 1,31,829. వీరిలో పురుషులు 63,883 మంది, మహిళలు 67,936 మంది, ఇతరులు 10 మంది. ► ఓటర్ల సంఖ్యలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. 42 వార్డులున్న నంద్యాలలో ఓటర్ల సంఖ్య 1,86,310. వీరిలో పురుషులు 90,597 మంది, మహిళలు 95,640 మంది, ఇతరులు 73 మంది. ► గూడూరు నగర పంచాయతీ చివర్లో ఉంది. 20 వార్డులున్న ఈ నగర పంచాయతీలో ఓటర్ల సంఖ్య 15,789 మాత్రమే. -
పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేటగిరీలవారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లు ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి. అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి. దీనిపై పురపాలకశాఖ తుది నిర్ణయం తీసుకుని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. పురపాలకశాఖ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ఆస్తి పన్ను రేట్లు ఇలా.. ► నివాస గృహాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.10 శాతానికి తగ్గకుండా 0.50 శాతానికి మించకుండా ఆస్తి పన్నును ప్రతిపాదించారు. ► వాణిజ్య భవనాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.20 శాతానికి తగ్గకుండా 2 శాతానికి మించకుండా ఆస్తి పన్ను ప్రతిపాదించారు. ► ఒక మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతటా ఆస్తి పన్ను రేట్లు ఒకేలా ఉండాలి. ► 375 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలోపు నిర్మించిన ఇళ్లలో ఇంటి యజమాని నివాసం ఉంటే ఏడాదికి నామమాత్రంగా రూ.50 ఆస్తిపన్నుగా నిర్ణయించారు. ఖాళీ జాగాలపై పన్ను రేట్లు ఇలా ► మున్సిపాలిటీలలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.20 శాతం. ► మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.50 శాతం. ► ఖాళీ జాగాలలో చెత్త / ఇతర వ్యర్థాలు వేస్తే మున్సిపాలిటీలలో అదనంగా 0.10 శాతం, కార్పొరేషన్లలో అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు. అనధికార నిర్మాణాలపై జరిమానాలు ► అనుమతులకు మించి 10 శాతం అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 25 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులకు మించి 10 శాతాని కంటే ఎక్కువగా అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 50 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు (ఫ్లోర్లు) నిర్మిస్తే విధించిన ఆస్తిపన్నుపై 100 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. మొత్తం భవనమే అనధికార నిర్మాణం అయితే కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది. వీటికి పన్ను మినహాయింపులు ► ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ/ మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు, పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ► సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ జాగాకు పన్ను మినహాయింపు కలి్పంచారు. -
టీడీపీ నేతల కుట్ర భగ్నం..
సాక్షి, అనంతపురం: రూ.8 కోట్లు కాజేసేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను కమిషనర్ పీవీఎస్ మూర్తి భగ్నం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు వెలుగు చూశాయి. అరెకరం స్థలానికి 9.63 కోట్ల పరిహారానికి తొలుత ప్రతిపాదనలు జరగ్గా, ప్రతిపాదనల తర్వాత స్థలం వివరాలను టీడీపీ నేతలు తారుమారు చేశారు. టీడీపీ హయాంలో చదరపు అడుగు 17వేల నుంచి 30వేలకు పెంచారు. పరిహారం డబ్బు రూ.9.63 కోట్ల నుంచి రూ.17 కోట్లకు పెంచారు. టీడీపీ నేతలకు అప్పటి జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సహకరించారు. లక్షల రూపాయల ముడుపులు చేతులు మారాయి. రూ.8 కోట్లు అదనంగా కాజేసే కుట్రను కమిషనర్ మూర్తి గుర్తించారు. పరిహారం రెట్టింపు చేసుకునేందుకు ప్రైం లోకేషన్ల వివరాలను టీడీపీ నేతలు జత చేయగా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలనలో అక్రమాలు బయటపడ్డాయి. మొత్తం రూ.17 కోట్ల పరిహారం నిలుపుదల చేశారుజ సమగ్ర వివరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ కమిషనర్ మూర్తి సిద్ధమయ్యారు. -
అనంతపురం కార్పొరేషన్లో వసూళ్ల పర్వం
ప్రభాకర్: నమస్తే .. సార్ నా కుమారునికి ఆరేళ్లు. బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అధికారి: ఎక్కడ పుట్టినాడో అక్కడే తీసుకోవాలి. ప్రభాకర్: అక్కడ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్.. అధికారి: అవునా.. ఏం అర్జెంట్ పని ఉందా.. ప్రభాకర్: అవును సార్.. చాలా పని ఉంది అధికారి: అయితే నీ ఫోన్ నంబర్ చెప్పు మధ్యాహ్నం తరువాత చేస్తా. ప్రభాకర్: ఎంత ఖర్చు అవుతుంది సార్. డబ్బులు సర్దుబాటు చేసుకుంటా. అధికారి: రూ. 2500 ఇస్తే.. మూడు రోజులకు సర్టిఫికెట్ ఇస్తా. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు సెక్షన్లో ఓ అధికారి నగరవాసితో జరిపిన సంభాషణ ఇది. దీన్ని బట్టి చూస్తే చాలు ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు పీడించుకొని తింటున్నారో తెలుస్తుంది. నగరంలో వేణుగోపాల్నగర్లో నివాసముంటున్న ప్రభాకర్ (పేరుమార్చాం) తన కుమారుడు సనత్ (పేరుమార్చాం)కి బర్త్ సరి్టఫికెట్ తీసుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగానికి వెళ్లారు. అన్ని రికార్డులు సమర్పించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అధికారికి విజ్ఞప్తి చేశారు. సదరు అధికారి ప్రస్తుతం రూ. 300 ఇచ్చి రెండు రోజులు తర్వాత రావాలని చెప్పారు. సర్టిఫికెట్ తీసుకునే రోజు రూ. 1,500 ఇవాల్సి ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారుడు కంగుతిన్నాడు. అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు విభాగం అధికారులు సేవలకు రేట్లు ఫిక్స్ చేశారు. అవసరాన్ని బట్టి రేటు పెంచేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ. 500 మొదలుకొని రూ. 5000 వరకూ అవసరాన్ని బట్టి దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పెరగడంతో నగరవాసులు నగరపాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ దాదాపు వంద మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. కానీ చేయి తడపందే ఇక్కడి సిబ్బంది ధ్రువీకరణ పత్రాలివ్వడం లేదు. ఉద్యోగుల చేతివాటం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఎక్కువగా చిన్నస్థాయి ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తుండటంతో అందినకాడికి దోచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో కొన్నేళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేశాడు. వాస్తవానికి అతను పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేయాల్సి ఉంది. కానీ ఇతర కారణాలు చూపి ఇక్కడే పాతుకుపోయాడు. ఏ పని కోసం వెళ్లినా సరే మొహమాటం లేకుండా బేరం మొదలు పెడతాడు. మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇదే రీతిలో పనిచేస్తున్నాడు. ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం నగర పాలక సంస్థ ద్వారా అందే సేవలన్నీ వార్డు సచివాలయాల్లోనే అందజేస్తున్నాం. ప్రజలెవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగంపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఓ అధికారిని తొలగించాం. తాజాగా వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని నగరపాలక సంస్థలో అవినీతి బయటపడింది. బిల్డింగ్ క్రమబద్ధీకరించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. వివరాలు.. టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తన బిల్డింగ్ క్రమబద్ధీకరణకు రూ.4 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు సత్యనారాయణ ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా లంచం డబ్బ కోసం ఆ అధికారులు తనని వేధిస్తున్నారని తెలిపాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం అడిగిన ఓ వీడియోను బాధితుడు బయటపెట్టాడు. రూ.లక్ష లంచం తీసుకుంటూ మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నెల రోజుల కిందట బాధితుడు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఇటీవల మున్సిపల్ ఉద్యోగి ఆయూబ్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. టైన్ ప్లానింగ్ అధికారులు వినయ్, అలివేలమ్మ తరఫున ఆయూబ్ లంచం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. దీంతో పాటు అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అవినీతిపై బాధితుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. -
మేయర్కు కరోనా.. ఆందోళనలో సిబ్బంది
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కరోనా కలకలం రేగింది.. సాక్షాత్తు మేయర్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె భర్త, అత్త, పీఆర్ఓకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటివ్గా తేలింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మేయర్కు పాజిటివ్గా తేలడంతో రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో పాల్గొన్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు కరోనా లక్షణాలు బయటపడటంతో వారందరూ హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా.. మేయర్ను కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కామారెడ్డి: జిల్లాలో కరోనా హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 35కు పైగా కుటుంబాలకు కరోనా బారినపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఇంటిల్లిపాది మొత్తానికి కరోనా వైరస్ సోకుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. (వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం) -
రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...
భోపాల్: కరోనా ఆంక్షల నేపథ్యంలో మాస్క్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన పెళ్లి కొడుక్కి జరిమానా విధించిన ఘటన సోమవారం రోజున మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. లాక్డౌన్ నిబంధనలు సడలింపుల అనంతరం.. ఇండోర్లో పెళ్లి చేసుకునేందుకు 12 మందికి అనుమతి ఉంది. అయితే పెళ్లి కొడుకు ధర్మేంద్రతో పాటు పెళ్లికి హాజరవుతున్న 12 మంది వ్యక్తులు కూడా ఒకే వాహనంలో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు వారికి జరిమానా విధించారు. ఈ సంఘటనపై మన్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వివేక్ గ్యాంగ్రాడే మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వారు కనిపించడంతో పెళ్లికొడుకుతో పాటు మరో 12 మందికి ఫైన్ వేసినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు రూ. 1,100.. మాస్క్లు ధరించనందుకు రూ. 1,000 జరిమానా విధించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలోనే జరిమానా రుసుమును కూడా వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇండోర్లో ఇప్పటిదాకా 4,069 కరోనా కేసులు నమోదవ్వగా.. 174 మంది మరణించారు. చదవండి: కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం -
కరోనా: కర్నూలు కార్పొరేషన్లో కలవరం
సాక్షి, కర్నూలు (టౌన్): కరోనా దెబ్బకు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం మూత పడింది. ఇటీవల ఈ కార్యాలయ కీలక అధికారితో పాటు అతని వద్ద పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయంలోని వారిద్దరి గదులను సీజ్ చేశారు. మూడు రోజులుగా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇలా చేస్తే వైరస్ చనిపోతుందని వైద్యులు పేర్కొనడంతో వారి గదులను ఆ విధంగా శుభ్రం చేçస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రీ, ఇరువురు వార్డు వలంటీర్లు, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, 2 వ డివిజన్ పబ్లిక్ హెల్త్ వర్కర్, 8 వ డివిజన్ హెల్త్ వర్కర్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్కు తరలించారు. (గ్రేటర్ దిగ్బంధం) భయాందోళనలో ఉద్యోగులు కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేసే కొంత మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా వారు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్గౌడ్ నేతృత్వంలో కొందరు కలెక్టర్ను కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని విన్నవించారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తే ఉద్యోగుల్లో భయాందోళనలు తగ్గుతాయని వారు పేర్కొన్నారు. మూడు విభాగాలకు మినహాయింపు కీలక అధికారితో పాటు పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తాత్కాలికంగా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల కార్యాలయాలను మూసేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్లైట్స్ విభాగాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా విభాగాల సిబ్బంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉంటున్నారు. -
లాక్డౌన్ పాటించండి: బహుమతులు గెలవండి!
థానే : కరోనా లాక్డౌన్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, నియమాలు పాటించేలా చేసేందుకు థానే మున్సిపల్ కార్పోరేషన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నియమాలను పాటించే వార్డులకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం వార్డు స్థాయిలో కాంటెస్ట్లు నిర్వహిస్తోంది. అంతేకాకుండా నిర్ణీతకాలం పాటు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాని వార్డులకు 25-50 లక్షల రూపాయలు అందించనుంది. ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి డిజిథానే యాప్ను తప్పక ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ట్రాక్టర్పై పెద్ద పులితో పోరాడి.. ) కాంటెస్ట్లో పాల్గొనే వార్డులపై టీఎమ్ఎసీ ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఆ వార్డులు లాక్డౌన్ నియమాలు పాటిస్తున్నాయా లేదా తెలుసుకోవటానికి సీసీటీవీ కెమెరాలు, పోలీసుల సహాయం తీసుకోనుంది. దీనిపై మేయర్ నరేష్ మస్క్ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 80 శాతం ప్రజలు లాక్డౌన్ నియమాలు పాటిస్తున్నారు. మిగిలిన 20శాతం మంది కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే టీఎమ్సీ ఈ నిర్ణయం తీసుకుంద’’ని తెలిపారు. (యూపీలో అరుదైన దృశ్యాలు కనువిందు ) -
‘నగరపాలక’ కమిషనర్గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థ కమిషనర్గా ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్లో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మున్సిపల్ ఆర్డీ హలీమ్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బదిలీ కావడంతో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చెన్నుడుకు, ఆతర్వాత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రకు కేటాయించారు. బుధవారం రెగ్యులర్ కమిషనర్ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగరంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన రెడ్జోన్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. -
రెడ్ జోన్లో 41.. ఆరెంజ్ జోన్లో 45
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా విభజించగా వాటిలో రెడ్జోన్లో 41 ప్రాంతాలను గుర్తించారు. మరో 45 ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్లలో 86 ప్రాంతాలున్నాయి. పట్టణప్రాంతాల్లో 43, గ్రామీణ ప్రాంతాల్లో మరో 43 ప్రాంతాలుగా ఉన్నాయి. వైరస్ ప్రభావం లేని.. అంటే గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు. ► కర్నూలు జిల్లాలో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా బాధితులు నమోదయ్యారు. ► నెల్లూరు జిల్లాలోనూ 13 మండలాలు వైరస్ ప్రభావానికి లోనయ్యాయి. ► రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ.. ఈ ఐదు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలోనే 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► వీరిలో 123 మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు, వారి ద్వారా వైరస్ సోకినవారే ఉన్నారు. ► అత్యధికంగా గుంటూరులో 59 కేసులు నమోదు. ► సోమవారం సాయంత్రానికి విడుదలైన బులెటిన్లో లెక్క చూస్తే రాష్ట్రం మొత్తమ్మీద ఈ ఐదు కార్పొరేషన్లలోనే 33.2 శాతం కేసులు నమోదైనట్టు తేలింది. -
మొబైల్ ఫోన్లో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం తన సెల్ఫోన్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒక అడుగు ముందే ఉండే హరీశ్రావు, లాక్డౌన్ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ స్థితిగతులపై సెల్ఫోన్ నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులతో తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా లాక్డౌన్లో ప్రజల సహకారం, కరోనా నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విధులు, పట్టణంలో పెండింగ్లోని పనుల వివరాలు, కరోనా నివారణకు ప్రతిరోజూ హైపోక్లోరైడ్ స్ప్రే స్థితిగతులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెత్త సేకరణతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, పబ్లిక్హెల్త్ ఈఈ ప్రతాప్, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఓఎస్డీ బాల్రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సతీష్లు పాల్గొన్నారు. -
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు
-
మునిసిపల్ పగ్గాలు చేపట్టిన యంగ్స్టర్స్
-
వన్ ఉమన్ ఆర్మీ
మోదీ వచ్చాక దేశంలో చెత్తశుద్ధి మొదలైంది. ఇదే పనిని.. మోదీ రాకముందే ముంబయిలో.. మారియా డిసౌజా చిత్తశుద్ధితో చేశారు! ఇప్పటికీ ఆ సిటీలో ఎక్కడ స్వచ్ఛ కార్యక్రమం ప్రారంభమైనా అత్యవసర సమయాల్లో సైన్యాన్ని దింపినట్లుగా.. మారియా డిసౌజాకు స్వాగతం పలుకుతుంటారు. అవును. ఆమె సైన్యమే. వన్ ఉమన్ ఆర్మీ! ‘జనం మీరు చేపట్టిన పనిని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తూ దుయ్యబడుతున్నారు... అంటే దాని అర్థం మీరు సరైన దారిలో వెళ్తున్నారని’. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం కోసం ఒక సామాజిక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు తనకు వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ఈ మాట అనలేదు మారియా డిసౌజా. అదే ఉద్యమంలో ముంబయిలోని నలభైకి పైగా నివాస ప్రాంతాలను, అక్కడ నివసించే వారిని కలుపుకుని ఉద్యమాన్ని విజయవంతం చేసిన తర్వాత అన్నమాట ఇది! ఆమె ముంబయిలో రోజూ బయల్పడే పదివేల టన్నుల చెత్తను ఉపయుక్తంగా మార్చడంలో కీలక పాత్ర వహించారు. వన్ మ్యాన్ ఆర్మీ అనే నానుడిని చెరిపేసి వన్ ఉమన్ ఆర్మీ అనే కొత్త భావనకు ప్రేరణ అయ్యారు. శుభ్రత పాఠాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయి.. నగర పౌరుల పచ్చటి భవిష్యత్తు కోసం 1997లో ఏఎల్ఎమ్ (అడ్వాన్స్ లొకాలిటీ మేనేజ్మెంట్) ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టింది. అందులో నగరంలో నివసిస్తున్న అందరినీ భాగస్వామ్యం చేస్తూ స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంది. ఆ కమిటీలు స్థానిక కాలనీల వాళ్లందరినీ చైతన్యవంతం చేయాలి. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చురుకుగా ముందుకు వచ్చారు బంద్రాలోని సెయింట్ స్టానిస్టాలస్ స్కూల్ టీచర్ మారియా డిసౌజా. ఆమె పని చేసే స్కూలు బయట గేటు పక్కన చెత్తతో నిండి పొర్లిపోతున్న రెండు పెద్ద డస్ట్బిన్ల నుంచే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా చెత్తను తొలగించకపోవడం, ఒకరోజు వర్షానికి నేలంతా చెత్త పరుచుకుని పిల్లలు కాలు పెడితే పాదం మడమలోతుకు కూరుకుపోవడంతో ఇక ఆమె ఊరుకోలేకపోయారు. పిల్లల చేతనే నగరపాలక సంస్థకు పెద్ద ఉత్తరం రాయించారు డిసౌజా. ఆ ఉత్తరం భారీ కదలికనే తెచ్చింది. అధికారి ఒకరు స్వయంగా వచ్చిచూసి వెంటనే చెత్త తీయించేశారు. దాంతో పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. జీరో వేస్ట్మేనేజ్మెంట్ గురించి స్కూలు గోడల మీద నినాదాలు రాయడం, చెత్త పేరుకుపోయి దోమలు ఎక్కువైతే వచ్చే అనారోగ్యాలతోపాటు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనను పీల్చడంతో వచ్చే శ్వాసకోశ సమస్యలను స్థానికులకు వివరించడంలో మారియా టీచర్తో భాగస్వాములయ్యారు. ఇదే ఇతివృత్తంతో చిన్న చిన్న నాటకాలు వేయడంలో కూడా పిల్లలకు శిక్షణనిచ్చారామె. చేదు అనుభవాలు స్థానికుల్లో చైతన్యం తెచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ‘ఆ చెత్త గొడవేంటో మీరు చూసుకోండి, మా పిల్లలను ఇన్వాల్వ్ చేయద్దు’ అని ప్రతిఘటించారు. మరికొందరు.. దారిలో వెళ్తుంటే ఆమె మీద కుళ్లిన టొమాటోలు, ఇంట్లో వచ్చిన చెత్తను పడేశారు. దాంతో మారియా తన ప్రయత్నాన్ని చర్చిలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు, స్కూళ్లలో అమలు చేసి చూపించారు. ఇంటింటికీ వెళ్లి వివరించారు. ‘చెత్తను ఎరువుగా మార్చుకోవడానికి సిద్ధమే కానీ, వాసన భరించలేం’ అన్న వాళ్లను మారియా ‘‘మరి ఈ చెత్తనంతటినీ తీసుకెళ్లి నగరానికి దూరంగా మరొక చోట పడేసినప్పుడు అక్కడ నివసించే వాళ్లు ఈ దుర్వాసనను ఎందుకు భరించాలి’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘నగరంలోని చెత్తను తరలించడానికి నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చు చాలా పెద్దది. మనం ఎక్కడి చెత్తను అక్కడే స్థానికంగా ఎరువుగా మార్చుకోగలిగితే, చెత్త రవాణాకు అయ్యే ఖర్చును నగరపాలక సంస్థ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది. చెత్తను తరలించే డబ్బు కూడా మనం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బే. అంటే మన డబ్బే’’ అని పిల్లలకు పాఠం చెప్పినట్లు చెప్పారు మారియా. చెత్తలో ఆహారాన్ని వెతుక్కుంటూ పక్షులు వచ్చి వాలడం, పక్షుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం వంటి పరిణామాలను తెలియచేశారు మారియా. తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్, హాస్పిటల్ వేస్ట్... నాలుగు రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారామె. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఆమె ఉద్యమం ఇప్పుడు గుర్తించదగిన స్థాయికి చేరింది. ముంబయి ప్రక్షాళన కార్యక్రమంలో నడివీధిలో ఆమె వేసిన అడుగులు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయి. తన 68 ఏళ్ల ప్రస్థానంలో ఇరవై ఏళ్ల జీవితాన్ని జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యమం కోసమే కేటాయించారు మారియా. పిల్లలను భాగస్వాములను చేయడంతో రాబోయే తరం గురించిన చింత లేదని, ఈ ఉద్యమం కొనసాగుతుందనే భరోసా కలుగుతోందని, తన విద్యార్థులకు రుణపడి ఉంటానని చెప్పారామె. – మంజీర ముంబయిలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’, రేఖ ఇల్లు ‘బసేరా’, సల్మాన్ ఖాన్ నివసించే గ్యాలక్సీ అపార్ట్మెంట్... అన్నీ బంద్రాలోనే ఉన్నాయి. అరేబియా మహా సముద్రం తీరాన బంద్రా బండ్ స్టాండ్లో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లకు ఒక సిమెంట్ బెంచ్ మీద రాజ్కపూర్ కనిపిస్తాడు. అప్పటి వరకు నడిచి నడిచి సేద దీరడానికి కూర్చున్నట్లు బెంచ్ మీద వెనక్కు వాలి ఎడమ చేతిని బెంచి మీదకు చాచిన రాజ్కపూర్ విగ్రహం ఉంటుంది. రాజ్కపూర్ పక్కన కూర్చుని ఆయన తమ భుజం మీద చేతిని వేసినట్లు మురిసిపోతూ ఫొటోలు తీసుకుంటూ ఉంటారు ముంబయికి వెళ్లిన పర్యాటకులు. సినిమా వాళ్లు నివసించే ప్రదేశం, సృజనాత్మకంగా ఉండడం సహజమే.. అనుకోవడమూ మామూలే. అయితే అదే బంద్రాలో జీరో వేస్ట్ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్కూలు పిల్లలు వీధి నాటకాలు వేయాల్సి వచ్చింది. తెర మీద తప్ప నేల మీద పెర్ఫార్మ్ చేయడానికి వాళ్లెవరూ ఇష్టపడకపోవడంతో ఈ సామాజిక ఉద్యమానికి మారియా డిసౌజా స్కూలు పిల్లలు ముందుకు వచ్చారు. -
ఇవి చాలా కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగి మున్సిపాలిటీలోని ఓ వార్డులో 1,414 ఓట్లున్నాయి. ఈ వార్డులో మాజీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఇరువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుం చి బరిలో ఉన్నారు. ఒక ఓటు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పలు కుతోంది. ఈ వార్డులో గెలవాలంటే కనీసం 500 ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ఓట్ల కోసం సగటున ఓటుకు రూ.7 వేలు అనుకున్నా... 500 ఓట్లకు గాను రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే..’ కోటిన్నర అయినా తగ్గేది లేదు.. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలోని 1, 5, 20, 23 వార్డులు జనరల్కు రిజర్వయ్యాయి. ఇక్కడ తీవ్ర పోటీ ఉండటంతో రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడేది లేదని పదవులు ఆకాంక్షిస్తున్న వారి శిబిరాలు తేల్చి చెప్పేస్తున్నాయి. పండుగ ఖర్చు మాదే.. నగర శివార్లలోని ఓ ‘పట్టణ’సంస్థలో ఓ వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ ఎన్నికైన అభ్యర్థి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ వార్డు పరిధి లోని ఓటర్లు నారాజ్ కాకుండా ఏం చేశాడో తెలుసా.. సంక్రాంతి పండుగ పిండివంటలకు సరుకులు పంపాడు. 5 లీటర్ల నూనె, 5 కిలోల గోధుమపిండి, వీటికి అదనంగా మందు బాటిల్ పంపిణీ చేశాడు. ఇటు ఐటీ హబ్కు సమీపంలోని పురపాలికలోని ఓ వార్డులో మాజీ సర్పంచ్ భర్త పోటీ చేస్తున్నారు. ఈయ నే టీఆర్ఎస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ఉన్న నేత.. తన అన్న కుమారుడిని బరిలో దించా డు. బీజేపీ చైర్మన్ అభ్యర్థి.. తన సోదరుడిని నిలబెట్టారు. చైర్మన్ పదవి దక్కించుకోవ డంలో కీలకం కానున్న సంఖ్యాబలాన్ని దక్కించుకునేందుకు.. ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు.. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు నేతలు వెనుకాడటం లేదు. జూనియర్ ఆర్టిస్టులుండే చిత్రపురి కాలనీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇద్దరు సినీ పరిశ్రమకు సంబంధించిన వారే పోటీ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజధాని శివార్లలో ఓటు కోసం రూ.2 వేల నోటు, 100 పైపర్స్ ఫుల్ బాటిల్ కావాల్సిందే అనే డిమాం డ్ అప్పుడే వినిపిస్తోంది. గత ఆదివారం నుంచే కాలనీ సంక్షేమ సంఘాలకు మంచి దావత్లు కూడా మొదల య్యాయి. సమయానికి సంక్రాంతి పండుగ కూడా రావడంతో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్పర్సన్లు కావాలనుకుంటున్న వారు కాసులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం డివిజన్కు రూ.కోటి, కౌన్సిలర్ గిరీకి రూ.50 లక్షలు తగ్గకుండా ఖర్చు పెడతామంటూ చేస్తున్న హడావుడితో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంక్రాంతి పండుగ సందడి ఈ నెల 22 వరకు కనిపించనుంది. డబ్బు.. డబ్బు! స్థానికంగా మంచి పరువు ప్రతిష్టలు తీసుకొచ్చే ‘హాట్ సీట్ల’లో గెలుపు కోసం నగర శివార్లలో హార్డ్ క్యాష్ పోగవుతోంది. శివార్లలో ఉన్న బండ్లగూడ, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, మీర్పేట, బడంగ్పేట, బోడుప్పల్ నగరపాలక సంస్థలతో పాటు పెద్దఅంబర్పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, శంకర్పల్లి, మణికొండ, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పోచారం, ఘట్కేసర్, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో డబ్బు విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు, అనివార్యత కనిపిస్తున్నాయి. ఐటీ, రియల్ రంగాలకు పట్టుగొమ్మల్లాంటి ఈ పురపాలికల్లో పెత్తనం కోసం డబ్బున్న నేతలు తహతహలాడుతుండటం, ఆర్థికంగా మంచి బలమైన వారు రంగంలో ఉండటంతో కోనసీమ పందెపు కోడి బరి అప్పుడే రాజధాని శివారు మున్సిపాలిటీల్లో కనిపిస్తోంది. టికెట్లు తెచ్చుకునేందుకే లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని నేతలు, ఎన్నికల్లో గెలిచేందుకు కాసులు కురిపించడానికి, ఖరీదైన గిఫ్టులు, తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రూ.50 లక్షలకు తగ్గకుండా రూ.4 కోట్ల వరకు ఒక్కో డివిజన్, వార్డుకు ఖర్చు పెట్టాలని, ఇక మేయర్లు, చైర్పర్సన్ పదవులు ఇస్తామంటే ఎన్ని కోట్లయినా తగ్గేదే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దావత్లు షురూ.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో జనరల్కు రిజర్వయిన ఓ వార్డులో ఇప్పటికే కాసు ల వర్షం కురుస్తోంది. ఎన్నికలకు 10 రోజుల సమయముండగానే దావత్లు మొదలయ్యా యి. ఈ వార్డులో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచ నా. ఇంజాపూర్ మున్సిపాలిటీలోని ఓ వార్డుకు ఇద్దరు బిగ్షాట్స్ పోటీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి చిట్ఫండ్ వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బడాబాబు కాగా, మరో అభ్యర్థి పౌల్ట్రీ వ్యాపా ర దిగ్గజం. గతంలోనూ ఈ రెండు కు టుంబాల మధ్య హోరాహోరీగా స్థానిక పోరు జరగ్గా.. ఈసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఓటర్లపై ‘ఇక కనకవర్షమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. నగదు ‘హవా...లా’ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న ఎన్నికల కోలాహలం ‘హవాలా’దారులు కూడా చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు అవసరం కావడంతో లిక్విడ్ క్యాష్ దొరకడం గగనమైపోయింది. మనీ డిజిటలైజేషన్ కావడం, రూ.2 వేల నోట్లు మార్కెట్లో తగ్గడం, ఖర్చు బ్యాంకు అకౌంట్ ద్వారానే చేయాల్సి ఉండటంతో నగదు ఎక్కడి నుంచి తేవాలి.. ఎలా ఖర్చుపెట్టాలన్నది అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో అయితే అప్పుడే హవాలా మార్గాలను వెతకడం కూడా ప్రారంభించేశారు. కార్పొరేటర్ నుంచి మేయర్లు, చైర్పర్సన్లు కావాలంటే నగదు కోట్లలో కావాల్సి రావడంతో హవాలా మార్గాలను ఎంచుకునే పనిలో పడిపోయారు కొందరు అభ్యర్థులు. -
ఉత్కంఠకు తెర
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు జరిగిన తరువాత రెండు రోజులకు ఈ నెల 24న కరీంనగర్ కార్పొరేషన్లోని 60 వార్డులకు పోలింగ్ జరుగనుంది. కార్పొరేషన్ పరిధిలోని 3, 24, 25 వార్డులకు ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును గురువారం డివిజన్ బెంచ్ నిలిపివేస్తూ ఎన్నికల నిర్వహణకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి గురువారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. స్క్రూటినీ, అభ్యంతరాలు, ఉపసంహరణలు తదితర ప్రక్రియలు ముగిసిన తరువాత 16వ తేదీన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 24వ తేదీన 60 డివిజన్లలో పోలింగ్ జరుగుతుంది. 25న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించి 27న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. (చదవండి: కరీంనగర్ ఎన్నికలకు లైన్ క్లియర్) రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా పోలింగ్ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు ఈ నెల 22న జరుగనుండగా, 25న ఓట్ల లెక్కింపు జరిపి, అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. కరీంనగర్ పోలింగ్ను ఒకవేళ 25 తరువాత నిర్వహించాల్సి వస్తే ఆ ఫలితాల ప్రభావం కరీంనగర్ ఎన్నికపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫలితాలతో సంబంధం లేకుండా 24వ తేదీనే కరీంనగర్ పోలింగ్కు ముహూర్తంగా నిర్ణయించింది. అన్ని మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత రిపబ్లిక్ దినోత్సవం మరుసటి రోజు 27న ఫలితాలు వెలువడనున్నాయి. ఊపిరి పీల్చుకున్న ఆశావహులు మూడు వార్డుల్లో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పొరేషన్ను మినహాయించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెల్లవారితే నామినేషన్లు దాఖలు చేయాలని ఏర్పాట్లు చేసుకున్న నాయకులు ఒక్కసారి నిరుత్సాహానికి గురయ్యారు. బుధవారం నోటిఫికేషన్ వెలువడుతుందని భావించినప్పటికీ, హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపలేదు. గురువారం మధ్యాహ్నం 2 గంటల తరువాత హైకోర్టు స్టే ఉత్తర్వులను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో కరీంనగర్ ఎన్నికకు అడ్డంకులు తొలిగి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ భవితవ్యాన్ని నామినేషన్ల ద్వారా పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా నోటిఫికేషన్ రెండు రోజులు ఆలస్యంగా విడుదల కావడంతో అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీల నాయకులకు మరింత స్పష్టత వచ్చినట్లయింది. టికెట్లు రావని భావించిన టీఆర్ఎస్లోని కొందరు నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ఈ రెండు రోజుల్లో మరిన్ని కప్పదాట్లు సాగే అవకాశం ఉంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 10 నుంచి 2 వరకు నామినేషన్లు 13న నామినేషన్ల పరిశీలన, అర్హత గల అభ్యర్థుల ప్రచురణ 14న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్కు అవకాశం 15న అప్పీల్లో అర్హత పొందిన వారి వివరాల ప్రకటన 25న రీపోలింగ్(అవసరమైతే) 27 న కౌంటింగ్, ఫలితాల ప్రకటన -
లంచాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్లు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి ట్రామ్ (రైలు) తరహా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలి. అందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాల ప్రసక్తే లేకుండా బిల్డింగ్ ప్లాన్లు ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యతాక్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. మంచినీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, డీశాలినేషన్ (సముద్రం జలాల శుద్ధి) చేసిన నీటినే పరిశ్రమలకు వినియోగించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి సహా వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. పలు సూచనలు చేశారు. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో లంచాలు తీసుకోకుండా బిల్డింగ్ ప్లాన్లు మంజూరు చేసే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఇందుకు ఏసీబీ సాయం తీసుకోవాలని సూచించారు. మెరుగైన వ్యవస్థను తయారు చేయడానికి అహ్మదాబాద్ ఐఐఎం సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతిలేని వ్యవస్థను తీసుకు వస్తే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. విశాఖ నగరానికి నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం నుంచి భూగర్భ పైప్లైన్ ద్వారా తాగునీటిని నేరుగా విశాఖ నగరానికి సరఫరా చేయడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. విశాఖలో దాదాపు 1.50 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీలుగా కమలాపురం, కుప్పం వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా, ప్రాధాన్యతా క్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. మురుగు నీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా> 110 మున్సిపాల్టీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మించడానికి రూ.23,037 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలను అధికారులు సీఎంకు వివరించారు. లక్షకు పైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాల్టీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కోసం రూ.11,181 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. డీశాలినేషన్ చేసిన నీటినే పరిశ్రమల అవసరాలకు వాడుతూ.. మంచి నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడేందుకు అవసరమైతే చట్టం చేద్దామని సీఎం అన్నారు. ఇందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్ స్పెసిఫికేషన్స్ మార్చకుండా పట్టణ గృహ నిర్మాణ పథకంలో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫ్లాట్ల నిర్వహణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీల్లానే ఫ్లాట్ల నిర్వహణ కోసమూ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 48,608 హౌసింగ్ యూనిట్ల(ఇళ్ల)కు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. రూ.2,399 కోట్ల కాంట్రాక్టు విలువ గల పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్ల ద్వారా రూ.303 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్ టెండరింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి, మంగళగిరి, పులివెందులలో అభివృద్ధి చూపించాలి తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మున్సిపాలిటీల్లో కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. ఈ మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలన్నారు. ఆ మేరకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేస్తున్నామని అధికారులు వివరించారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో 10,794 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు తెలుపగా, మోడల్ కాలనీ కట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో ముంపునకు గురికాకుండా కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. -
ఒకే ఇంట్లో 32 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ప్లాట్లకు ఇంటి నెంబర్లు తీసుకుని వందకు పైగా ఓటర్ల నమోదు.. ఒకే ఇంట్లో 38 మంది ఓటర్లు, మరో ఇంట్లో 32 ఓట్లు.. ఇలా ఒక్క మున్సిపల్ డివిజన్లోనే 380 నుంచి 400 వరకు నకిలీ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో ఓటర్ల జాబితాలు, ఓటర్ల నమోదులో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలు. ఈ అంశం ఎంతవరకు వెళ్లిందంటే ఒక ఇంటి యజమాని తన చిరునామాతో 32 బోగస్ ఓట్లు ఉన్నాయంటూ సంబంధిత తహసీల్దార్కు ఫిర్యాదు చేసేంత. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఆయా ఇంటినెంబర్ల వారీగా ఎవరెవరున్నారన్న విషయాన్ని సరిచూసుకున్న సందర్భంగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఈ కార్పొరేషన్లోని 18వ డివిజన్ సాయినగర్లోని 8–22 ఇంటినెంబర్లో 38 ఓట్లు, అదేకాలనీలోని 8–21 ఇంటినెంబర్లో 32 ఓట్లు, 8–91 ఇంటినెంబర్తో 30 ఓట్లు ఉన్నట్టుగా తేలింది. అంతేకాకుండా ఇదే డివిజన్లోని బాలాజీనగర్లో ఓపెన్ప్లాట్కు 7–58 ఇంటినంబర్ను తీసుకుని అందులో ఇళ్లు లేకపోయినా వందకు పైగా ఓట్లు నమోదైనట్టు, అదేవిధంగా అయోధ్యనగర్లోని మరో ఓపెన్ప్లాట్కు కూడా ఇంటి నంబర్ తీసుకుని వంద దాకా ఓట్లు నమోదు చేశారని శ్రీసాయినగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్. అల్వాల్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ అంశంపై ఇదివరకే ఎమ్మార్వోకు, ఆర్డీవో కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి అల్వాల్రెడ్డి, హరిగౌడ్, శ్రీనివాస్రెడ్డి, గోవింద్రెడ్డి, దీప్కాంత్ వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని అల్వాల్రెడ్డి తెలిపారు. ►‘ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓటర్లున్నారంటూ అందిన వినతిపత్రంలోని విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. జాబితాలను పరిశీలించి అక్రమ పద్ధతుల్లో ఓటర్లుగా చేరి ఉంటే వారి నివేదికల అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాం.’ – వి.నాగిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ -
ప్లాస్టిక్ తెచ్చి.. భోజనం చేసి వెళ్లండి
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు. -
కొత్త వార్డులొచ్చేశాయి !
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన ఓ కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరగనున్న 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ప్రకటనను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పురపాలికల వారీగా వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వార్డుల విభజన కోసం ఈ నెల 3న 14 రోజుల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం వార్డులు/డివిజన్ల పునర్విభజన ముసాయిదాను ప్రకటించి, వారం రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది. వీటిని పరిష్కరించడం ద్వారా మంగళవారం వార్డులు/డివిజన్ల పునర్విభజన తుది ప్రకటనను జారీ చేసింది. కొత్త వార్డులు/డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను రెండుమూడు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశముంది. కొత్త వార్డులు/డివిజన్ల భౌగోళిక స్వరూపం, సరిహద్దులను దృష్టిలో పెట్టుకుని వీటికి సం బంధించిన ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత వార్డులు/డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను చేపట్టనున్నారు. దీనికి దాదాపు వారం రోజులు పట్టనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జనాభా దామాషా ప్రకారం... మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వార్డు, చైర్పర్సన్ స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కార్పొరేషన్లలో సైతం ఇలానే చేస్తారు. మున్సి పల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండగా, ఎస్సీ, ఎస్టీల కోటా పోగా మిగిలి స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. అంతా సజావుగా జరిగితే జనవరి చివరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఏవైనా అడ్డంకులొస్తే ఫిబ్రవరి లో జరుగుతాయి. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సాధారణ మున్సిపల్ ఎన్నికలు కావడంతో కొత్త రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్)ను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసిన రోస్టర్ను ఈ ఎన్నికల్లో కొనసాగించరు. రోస్టర్ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించనున్నారు. -
ఖర్చులు తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు
వాతావరణ కాలుష్యం, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ (ఈ–కార్లు) కార్లు ఎంతో ఉపయోగపడుతాయి. మార్కెట్లోకి ప్రవేశించిన ఈ–కార్ల వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మొదటగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రభుత్వ శాఖల నుంచే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, మరమ్మతులు తక్కువగా ఉంటోంది. జిల్లాలో తొలుత ఏడాది కిందటే ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ–కార్లను వినియోగంలోకి తీసుకోవడంతో తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ కూడా వీటిని వినియోగిస్తోంది. కార్ల వినియోగంలో వ్యయం లెక్కిస్తే కిలో మీటరుకు కేవలం ఒక్క రూపాయి లోపలే ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇప్పటికే విద్యుత్ శాఖ జిల్లా విద్యుత్ భవన్లో, జిల్లాలోని పలు సబ్ స్టేషన్లలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థ తమ కార్యాలయంలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. సాక్షి, నెల్లూరు సిటీ: కాలుష్య నివారణ.. ఇంధనం పొదుపు.. ప్రభుత్వ నిధుల అనవసర ఖర్చులు.. లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయ అధికారులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కార్పొరేషన్లోని పలు విభాగాల అధికారులకు ప్రైవేట్ కార్లను అద్దెకు వినియోగించుకునే వారు. ఇందుకు నెలకు రూ.5.40 లక్షల అద్దె చెల్లించే పరిస్థితి. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్మూర్తి అనవసర ఖర్చులు తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. అద్దె కార్ల స్థానంలో ఆయా విభాగాల అధికారులకు 15 ఎలక్ట్రిక్ కార్లను రుణసదుపాయంతో కొనుగోలు చేశారు. నెలకు ఒక కారుకు రూ.20 ఈఎంఐ చెల్లింపులతో ఆరేళ్లలో కారుకార్పొరేషన్ సొంతం అవుతుంది. కార్పొరేషన్ కార్యాలయంలో ఎలక్ట్రిక్ కార్లు రూ.105తో 80 కి.మీ. ప్రయాణం ఎలక్ట్రిక్ వాహనాలకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎనిమిది పాయింట్లలో 7 గంటల్లో 100 శాతం చార్జింగ్ వచ్చేందుకు, రెండు పాయింట్లలో 2 గంటల్లో చార్జింగ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అధికారులు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో తిరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఒకసారి చార్జింగ్ చేశాక దాదాపు ఏసీ ఆన్ చేసినా 80 కి.మీ. వరకు ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. ప్రతి రోజూ ఒక కారుకు రూ.105 ఖర్చుతో చార్జింగ్ చేయగా 80 కి.మీ. వరకు వస్తుంది. దీంతో కార్పొరేషన్కు ఖర్చులు తగ్గాయి. రూ.5.40 లక్షల ఖర్చుకు ఫుల్స్టాప్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని అధికారులకు కార్లు బాడుగకు ప్రతి నెలా రూ.5.40 లక్షలు చెల్లిస్తున్నారు. కమిషనర్, ఇంజినీరింగ్ ఎస్ఈ, అడిషనల్ కమిషనర్ కార్లకు రూ.45 వేలు చొప్పున రూ.1.35 లక్షలు, ఇంజినీరింగ్ విభాగంలోని ముగ్గురు ఈఈలు, డిప్యూటీ కమిషనర్, టౌన్ప్లానింగ్ అధికారి, ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు, సెక్రటరీ, ఎగ్జామినర్, ఎంహెచ్ఓ అధికారులకు రూ.35 వేలు చొప్పున రూ.3.45 లక్షలు చెల్లిస్తున్నారు. మేయర్ కారుకు రూ.60 వేలు చెల్లించారు. ఇలా ప్రతి నెలా రూ.5.40 లక్షలు కార్లు బాడుగలకు చెల్లించారు. అయితే వీరిలో కొందరు అధికారులు సొంత కార్లను వినియోగిస్తూ బాడుగ డబ్బులను వారే తీసుకునేవారు. ఈ పరిస్థితికి చెక్ పడింది. ఆరేళ్లలో కార్లు కార్పొరేషన్ సొంతం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పలు విభాగాల అధికారులకు కార్లు బాడుగ ఖర్చు కోసం ప్రతి నెలా రూ.5.40 లక్షలు చెల్లిస్తున్నారు. దీంతో సొంత కార్లు లేకపోవడంతో కార్పొరేషన్పై భారం పడింది. అయితే కమిషనర్ కొత్త నిర్ణయంతో కార్పొరేషన్ అధికారులకు సమకూర్చిన మహేంద్ర ఈ వెరిటో కంపెనీకి చెందిన 15 ఎలక్ట్రిక్ కార్లకు ప్రతి నెలా ఒక్కొక్క కారుకు రూ.20 వేల వంతున నెలకు ప్రస్తుతం రూ.3 లక్షలు చెల్లిస్తే.. ఆరేళ్లకు కార్లు కార్పొరేషన్ సొంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతానికి నెలకు రూ.2.40 లక్షల ఖర్చు భారం తగ్గింది. ఆ తర్వాత నుంచి కేవలం చార్జింగ్ ఖర్చు మాత్రమే అవుతుంది. ఈ-కార్లు ఎంతో మేలు నెల్లూరు (వీఆర్సీ సెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్లోని విద్యుత్ శాఖ గతేడాది 12 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. అయితే వీటిని నెల్లూరు కేంద్రంగా ఉండే 12 మంది డీఈ, ఏడీఈ స్థాయి అధికారులకు కేటాయించారు. ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి ముందు డీజిల్, పెట్రోల్తో నడిచే కార్లను ప్రైవేట్ యాజమాన్యాల నుంచి అద్దెకు తీసుకుంటుంది. వీటికి ఒక్కొక్క కారు నెలకు 2 వేల కిలో మీటర్ల పరిమితికి రూ.30 వేల అద్దె, ఆపై తిరిగితే కి.మీ.కు రూ.7 వంతున అదనంగా అద్దె చెల్లించాల్సి వచ్చేది. ఈ లెక్కన 12 కార్లకు నెలకు రూ.3.60 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అద్దె చెలిస్తుండేది. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన సంస్థకు నిర్వహణ ఖర్చు లేకపోవడంతో డ్రైవర్లకు మాత్రం నెలకు రూ.15 వేల వేతనంగా చెల్లిస్తోంది. నిర్వహణ (మెయింటెనెన్స్) ఖర్చులకు తావుండదు. దీంతో నెలకు 12 ఎలక్ట్రికల్ కార్లపై రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదా అవుతోంది. విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన ఏసీ, డీసీ చార్జింగ్ పాయింట్లు రూ.100లతో 100 కిలోమీటర్ల ప్రయాణం ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీ బ్యాకప్ 10 యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. వీటికి చార్జింగ్ కోసం కేటగిరీ–2 విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ కేటగిరీలో యూనిట్ ధర రూ.9.06 ఉంది. ఒక్కసారి చార్జింగ్ కోసం 10 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ఈ లెక్కన 10 యూనిట్ల విద్యుత్కు సగటున రూ.100 అవుతుంది. ఒక్క యూనిట్తో 10 కి.మీ. వంతున 100 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. కారులో ఏసీ వినియోగిస్తే 80 కి.మీ. నడుస్తుంది. కిలోమీటర్కు ఖర్చు ఒక్క రూపాయి అవుతుంది. డీసీ, ఏసీ చార్జింగ్ స్టేషన్లు, పాయింట్లు ఈ ఎలక్ట్రిక్ కార్లు విద్యుత్ చార్జింగ్ ఆధారంగానే నడుస్తాయి. కార్లకు విద్యుత్ చార్జింగ్ చేసే ప్రక్రియలు రెండు రకాలుగా ఉన్నాయి. డీసీ (డైరెక్ట్ చార్జింగ్), ఏసీ (అ్రల్టానేట్ చార్జింగ్) రూపాల్లో చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. డీసీ విద్యుత్ ద్వారా అయితే పూర్తిగా చార్జింగ్ చేయాలంటే ఒకటిన్నర గంట, అదే ఏసీ విద్యుత్ ద్వారా అయితే 6 గంటల సమయం పడుతుంది. విద్యుత్ సంస్థ అధికారులు వాడుకునే ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ కోసం నగరంలోని విద్యుత్ భవన్లో ఒక చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు డీసీ, నాలుగు ఏసీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని ఆయా విద్యుత్ సబ్స్టేషన్లలో 30 ఏసీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల విద్యుత్ అధికారులు ఆయా సబ్స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఏసీ చార్జింగ్ పాయింట్ల ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ చేసుకునే వీలుంది. డ్రైవింగ్ సులువుగా ఉంది డీజిల్, పెట్రోల్ కార్ల కన్నా ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవింగ్ చేయడం సులువుగా ఉంది. కారు ఇంజిన్ స్టార్ట్ చేసినా ఎటువంటి శబ్దం లేకుండా ఉంది. గతంలో కంటే డీజిల్కు అయ్యే ఖర్చు కూడా తగ్గింది. కేవలం రూ.105లతో 80.కి.మీ. వరకు మైలేజీ వస్తుంది. – ప్రదీప్కుమార్, టౌన్ప్లానింగ్ అధికారి డ్రైవర్ విద్యుత్ కారుతో ఖర్చులు కూడా తగ్గాయి విద్యుత్ కారు వినియోగంతో పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా తగ్గాయి. ఉదయం ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 80 కి.మీ. మేర ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. రెండు గంటల్లోనే చార్జింగ్ అయ్యేలా చార్జింగ్ యూనిట్ను కార్పొరేషన్లో ఏర్పాటు చేశారు. – వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ అధికారి డ్రైవర్ కాలుష్య రహిత కార్లు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడే వీలుంటుంది. దీంతో పాటు తరిగిపోతుçన్న సంప్రదాయ వనరులు అయిన డీజిల్, పెట్రోల్ను పొదుపు చేసి భావితరాలకు అందించేందుకు ఎంతో దోహదపడే వీలుంటుంది. అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండానే ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించు కోవచ్చు. – కె.విజయ్కుమార్రెడ్డి ఎస్ఈ, ఏపీ ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ -
ఒడిదుడుకులు తట్టుకుంటేనే విజయం సాధిస్తాం
షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మేయర్గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికై రికార్డు సృష్టించారు. షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం జరిగిన రెండవ టర్మ్ మేయర్ ఎన్నికల్లో యెన్నం కాంచన ఘన విజయం సాధించారు. అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో రెండేళ్ల క్రితం కృష్ణవేణి రెడ్డి కార్పొరేటర్గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు మహిళ కాంచన యెన్నం ఏకంగా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. పెళ్లి తర్వాతే తన జీవితంలో మార్పు పచ్చిందని కాంచన యెన్నం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఈగె అయిలప్ప, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన కాంచన షోలాపూర్లోనే పుట్టి పెరిగారు. స్థానిక డీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాంచనకు ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన యెన్నం రమేష్తో 1992లో వివాహం జరిగింది. సాధారణ గృహిణిగానే జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఆమె భర్త రమేష్ రాజకీయాల్లో తిరుగుతుండడం చూసి ఆమెకు కూడా కూడా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజసేవ చేయాలన్న సంకల్పం కలిగింది. దాంతో బీడీ కార్మికులు, కుట్టు పనులు చేసే మహిళలు తదితరుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయగలగడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. భర్త ప్రేరణ, ప్రోత్సాహం సమాజసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలోనే కాంచనకు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ‘‘1997లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేముండే మార్కండేయనగర్ వార్డు మహిళ కోటాలోకి రావడంతో ఈ వార్డు నుంచి టికెట్ కోసం నా భర్త తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఏ పార్టీకోసం పాటు పడుతున్నారో, ఆ పార్టీనే తనను పక్కన పెట్టేసరికి ఇద్దరం పార్టీ మారాం. ఇలా సుమారు గత 22 సంవత్సరాలుగా మేము బీజేపీలో కొనసాగుతున్నాం. 2002లో బీజేపీ నాకు మార్కండేయనగర్ వార్డు (షోలాపూర్ కార్పొరేషన్) నుంచి టికెట్ ఇచ్చింది. అలా నేను నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా విజయం సాధించి కార్పొరేషన్లో అడుగుపెట్టాను. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాను’’ అని కాంచన తెలిపారు. ఊహించని విజయం అయితే మేయర్ పీఠం దక్కుతుందని మాత్రం తను ఊహించలేదని కాంచన అన్నారు. ‘‘బీజేపీ నన్ను అభ్యర్థిగా ప్రకటించింది. నాకు పోటీగా శివసేనకు చెందిన సారిక పిసే, కాంగ్రెస్కు చెందిన ఫిర్దోస్ పటేల్, ఎంఐఎంకు చెందిన శహజిదా బానో శేఖ్ బరిలోకి దిగారు. అయితే ఎన్నికకు ముందు సారిక పిసే, ఫిర్దోస్ పటేల్లు తప్పుకోవడంతో బానో శేఖ్తో నాకు పోటీ ఏర్పడింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలు జత కట్టాయి. కాని ఎన్నికకు ఒక రోజు ముందే వీడిపోయారు. దాంతో ఈ ఎన్నికలో నాకు 51 ఓట్లు పోలవ్వగా బానో శేఖ్కు కేవలం ఎనిమిది ఓట్లు పోలయ్యాయి. ఇలా ఊహించని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించగలిగాను’’ అని ఆమె చెప్పారు. ఆదర్శ కార్పొరేటర్ కుటుంబ సభ్యులతో (భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తె, మనుమడు) యెన్నం కాంచన కాంచన యెన్నం అనేక పదవులను అలంకరించారు. సుమారు 17 ఏళ్లనుంచి కార్పొరేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ప్రస్తుతం షోలాపూర్ బీజేపీ వర్కింగ్ కమిటి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇందిరా మహిళ సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్గా, షోలాపూర్ మన్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) మహిళ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, అదేవిధంగా ఎస్ఎంసిలోని పలు పదవులను అలంకరించారు. 2016–17లో స్టాండింగ్ కమిటి చైర్మన్గా కూడా ఉన్నారు. ఆదర్శ కార్పొరేటర్ అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ పనిలోనైనా జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజమని కాని వాటిని తట్టుకుంటేనే విజయం లభిస్తుందని కాంచన యెన్నం అంటారు. – గుండారపు శ్రీనివాస్, మావునూరి శ్రీనివాస్ సాక్షి, ముంబై -
‘మున్సిపోల్స్’కు ముహూర్తం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే ఏడాది జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి దాదాపు 18–20 రోజుల వ్యవధిలోగా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసే అవకాశముంది. 73 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మళ్లీ వార్డుల విభజనకు ముసాయిదా ప్రకటన జారీచేసి వారం పాటు అభ్యంతరాలు స్వీకరించాలని, ఆ తర్వాత వారంలోగా ఈ అభ్యంతరాలు పరిష్కరించి వార్డుల విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ను జారీ చేయాలని హైకోర్టు సూచించింది. అయితే వార్డుల విభజన ప్రక్రియను 7 రోజుల్లో పూర్తి చేయాలని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు పేర్కొంటున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. తదుపరి డిసెంబర్ తొలి వారంలో వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత 14 రోజుల గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన.. వార్డుల విభజన అనంతరం ఎన్నికలు జరగాల్సి ఉన్న 141 పురపాలికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియను పురపాలికలు చేపట్టనున్నాయి. తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. అనంతరం వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు మున్సిపాలిటీలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాయి. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోగా వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్లను జారీ చేయనున్నాయి. వార్డుల విభజన ప్రకటన ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించనుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తికావడానికి దాదాపు నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన రెండు, మూడు రోజులకే ఎన్నికల నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వసన్నద్ధతో ఉంది. ఫిబ్రవరి దాటితే మళ్లీ వాయిదే.. మున్సిపల్ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే మరో 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో మరెలాంటి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలోగానే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
కుళ్లిన మాంసంతో బిర్యానీ
ఇబ్రహీంపట్నం రూరల్: కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్పై మున్సిపల్ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్పల్లి గేట్ వద్ద ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్పై దాడి చేసి హోటల్ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్లో కుళ్లిన మాంసం లభించింది. హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని, మరోసారి ఇలాంటిది పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా హోటల్కు రూ.20 వేలు జరిమానా విధించారు. ఈ దాడిలో మున్సిపాలిటీ సిబ్బంది రాజశేఖర్, సదానందం, పర్వతాలు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పెరగనున్న పురపరిధి..!
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పలు మునిసిపాలిటీల పరిధి పెరగనుండడంతో పాటు మరికొన్ని మునిసిపాలిటీల్లో ఉన్న వార్డుల పునర్విభజన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆయా మునిసిపల్ కమిషన్లకు అందాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మునిసిపాలిటీలోని జనాభాను వార్డుకు సరాసరి విభజించాలని ఆదేశాల్లో పేర్కొన్నా రు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తర్వుల్లో ఇలా.. 2011 జనాభా ప్రకారం మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు మునిసిపాలిటీలతో పాటు చిత్తూ రు మునిసిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన చేయాలని రాష్ట్ర పురపాలన పరిపాలనశాఖ సంచాలకులు విజయకుమార్ ఆదేశించారు. ఉదాహరణకు చిత్తూరు నగరంలో 1.89 లక్షల జనాభా ఉండగా.. ప్రతి డివిజన్లో సగటున 3,787 మంది చొప్పున (మొత్తం 50 డివిజన్లు) ఉండాలి. ఇందులో 10 శాతం తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. అంతకన్నా తేడా ఉంటే దాన్ని సమీపంలోని వార్డుల్లో కలపాలి. ఇలా 2011 జనాభా లెక్కల ప్రకారం మదనపల్లెలో 35 వార్డులు, పలమనేరు 24 , నగరిలో 27, పుత్తూరులో 24 వార్డులు ఏర్పడ్డాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సగటు జనాభా 10 శాతం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా వార్డుల పునర్విభజన జరగనుంది. చిత్తూరు కార్పొరేషన్లో 46, 47, 49, 50వ డివిజన్లలో స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీన్ని ఇతర డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. అయితే కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరగకపోగా.. మునిసిపాలిటీల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీనం తప్పదా ? మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీలతో పాటు తిరుపతి కార్పొరేషన్ పేరు ప్రస్తావించలేదు. అంటే శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలోకి సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీల విలీనం అనంతరం వీటిలో వార్డుల పునర్విభజన వర్తింపచేసే అవకాశాలున్నాయి. తిరుపతి కార్పొరేషన్కు సంబంధించి విలీన ప్రక్రియలో ఇప్పటికే న్యాయపరమైన సమస్యలుండా దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచురణ షెడ్యూల్ వార్డుల పునర్విభజన ముసాయిదాను సెప్టెంబరు 3వ తేదీ లోపు, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబరు 11లోపు, 13వ తేదీ జాబితాను రాష్ట్ర మునిసిపల్ అధికారులకు పంపడం, అక్టోబర్ 10వ తేదీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేస్తుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. చిత్తూరు కార్పొరేషన్లో మాత్రం వచ్చేనెల 24వ తేదీ డివిజన్ల వారీ జనాభాను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తుంది. -
మున్సిపల్ కాంప్లెక్స్ భవనం.. దాసోహమా?
తిరుపతి నగర పాలక సంస్థకు చెందిన భవనం శ్రీచైతన్య విద్యాసంస్థల కంబంధ హస్తాల్లో చిక్కుకుంది. సాంకేతిక సమస్యలను అడ్డుపెట్టుకుని ఆ సంస్థ ఏళ్ల తరబడి నామమాత్రపు అద్దె చెల్లిస్తోంది. కార్పొరేషన్ కాంప్లెక్స్ను చట్టపరంగా స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చినా సదరు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఖజానాకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి : తిరుపతి నడిబొడ్డున ఉన్న గాంధీరోడ్డు ప్రధాన వ్యాపార కేంద్రం. 1995కు ముందు 30 సెంట్లు (360 అంకణాలు) పైగా స్థలంలో మున్సిపల్ మార్కెట్ను నిర్వహించేవారు. నగరం విస్తరించడం, గాంధీరోడ్డు రద్దీ కావడంతో మార్కెట్ను తుడా ఆఫీస్ ఎదురుగా మార్చారు. 1999లో గాంధీరోడ్డులోని పాత మార్కెట్ స్థలంలో 5800 చ.అ విస్తీర్ణంలో కాంప్లెక్స్ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 9 కమర్షియల్ గదులు, మొదటి, రెండు అంతస్తులను హాళ్లుగా నిర్మించారు. 1999 ఏప్రిల్లో ఈ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించారు. ఇందులో మొదటి, రెండో అంతస్తులను పూర్తిగా శ్రీచైతన్య విద్యాసంస్థ దక్కించుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లోని 3, 7 గదులు మినహా మిగిలిన గదులను ఆ సంస్థ దక్కించుకుంది. 2004 వరకు నెలకు రూ.75వేల అద్దెను చెల్లించేది. ఐదేళ్ల వరకు ఇదే అద్దెను చెల్లిస్తూ వచ్చింది. ఆపై ప్రభుత్వ నిబంధనల మేరకు మూడేళ్లకు ఒకసారి 33.33 శాతం అద్దెను చెల్లించాలి. ఆ విధంగా 2007లో 33.33శాతం పెంచి అద్దెను చెల్లించింది. 2008లో తిరుపతి టాస్క్ఫోర్సు కమిటీ సమావేశమై నిబంధనలకు విరుద్ధంగా రద్దీ ప్రాంతంలో కళాశాలను నడిపేందుకు కేటాయించారని, కళాశాల గాంధీ రోడ్డులో ఉండడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గుర్తించి లీజ్ను రద్దుచేయాలని నిర్ణయించింది. అధికారులు కళాశాలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. 33.33శాతం అద్దెను పెంచి చెల్లించాలని 2007లో అప్పటి అధికారులు చైతన్య కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను ఆధారంగా చూపిస్తూ 2010 వరకు నిబంధనలు వర్తిస్తాయని కళాశాల యాజమాన్యం వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. అప్పటి నుంచి కోర్టులో దీనిపై వాదనలు జరుగుతూ వచ్చాయి. 2016లో అప్పటి కమిషనర్ వినయ్చంద్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ బచేయాలని, కోర్టులో పూర్తిస్థాయిలో చార్జ్ ఫైల్ చేయాలని ఆదేశించారు. ఆ ఫైల్ను వేగంగా నడిపించారు. దీంతో 2017లో కళాశాలకు పర్మినెంట్ ఇంజెక్షన్ ఇస్తూ కార్పొరేషన్ చట్టప్రకారం భవనాన్ని స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. గత కమిషనర్ విజయ్రామరాజుకు సంబంధిత ఫైల్ను రెండుసార్లు పంపినా ఆయన పెద్దగా స్పందించలేదు. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారులు కళాశాలకు అనుకూలంగా వ్యవహరించారు. కార్పొరేషన్కు లక్షల్లో నష్టం గడిచిన 20 ఏళ్లుగా మున్సిపల్ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించకపోవడంతో కార్పొరేషన్కు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. మూడేళ్లకు ఒకసారి 33.33శాతం అద్దెను పెంచి నామమాత్రంగా చెల్లిస్తున్నారు. మూడేళ్లకు ఒకసారి రీటెండర్ నిర్వహించి ఉంటే అద్దె మరింతగా పెరిగి కార్పొరేషన్కు ఆదాయం చేకూరేది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రధానమైన వ్యాపార కేంద్రం కావడంతో గాంధీరోడ్డులో ప్రైవేట్ భవనాల్లో అద్దె ఆకాశాన్ని అంటుతోంది. 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ భవనానికి రెండంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్లోని ఏడు గదులకు కలిపి 2019 మార్చి నుంచి నెలకు రూ.2లక్షల 58వేలు చెల్లిస్తున్నారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుపుతున్న భవనానికి రూ.నాలుగు లక్షలకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్పందిస్తారా? గత ప్రభుత్వ ఒత్తిడి కారణంగా శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుపుతున్న కార్పొరేషన్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించలేదు. గడిచిన ఐదేళ్లుగా కోర్టుకు సరైన పత్రాలు సమర్పించలేకపోయారు. తీరా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ఆదిశగా చర్యలు చేపట్టలేకపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్పొరేషన్కు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కేంద్రంలోని రద్దీ ప్రాంతంలో నడుపుతున్న భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. మున్సిపాలిటీ టెండర్ ప్రకారం శ్రీచైతన్య విద్యాసంస్థ గాంధీరోడ్డులోని కాంప్లెక్స్ను దక్కించుకుంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆకాంప్లెక్స్లో విద్యా సంస్థలను నడపడం చట్టవిరుద్ధం. 20 ఏళ్ల పాటు అదే భవనంలో కళాశాలను నడుపుతున్నారు. తిరుపతి నడిబొడ్డున ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న గాంధీరోడ్డులో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. కళాశాలకు విద్యార్థులు వచ్చి వెళ్లే సమయాల్లో విపరీతమైన రద్దీ సమస్య నగర వాసుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. గాంధీరోడ్డు, తీర్థకట్టవీధి, గోవిందరాజ తేరు వీధి, తిలక్రోడ్డు వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. విద్యాశాఖ, కార్పొరేషన్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా అవసరాల దృష్ట్య ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా అధికారులు ఆదిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ
సాక్షి, విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీలో లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ.. ఏసీబీకీ పట్టుబడ్డాడు. దరఖాస్తు దారుని నుంచి లంచం తీసుకుంటూ ఆర్ఐ శంకరరావు అడ్డంగా దొరికిపోయాడు. పట్టణంలోని బహుళ అంతస్తు భవనానికి అసెస్మెంట్ ట్యాక్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి 2.80 లక్షల భారీ మొత్తం డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించటంతో పక్కా ప్రణాళికతో నిఘా వేసిన ఏసీబీ.. మున్సిపల్ ఆర్ఐ శంకరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. -
కర్నూలు కమిషనర్గా అభిషిక్తు కిషోర్
సాక్షి, కర్నూలు : నగర పాలక సంస్థ కమిషనర్గా మళ్లీ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. ముట్టింబాకు అభిషిక్తు కిషోర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం సాయంత్రం జీవో 1760 జారీ చేశారు. ప్రస్తుతం ఈయన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 2015 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. కాగా.. గత నెల 14న కర్నూలు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఎస్. రవీంద్రబాబు 20 రోజుల వ్యవధిలోనే బదిలీ కావడం గమనార్హం. నగర పాలక సంస్థలకు కమిషనర్లుగా ఐఏఎస్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే అభిషిక్తు కిషోర్ను ఇక్కడ నియమించింది. రవీంద్ర బాబు కన్నా ముందు ఐఏఎస్ అధికారి ప్రశాంతి ఇక్కడ కమిషనర్గా పనిచేసిన విషయం విదితమే. -
‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్ ఏఈ
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం) : ఇల్లెందు మున్సిపల్ ఏఈ అనిల్ ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని మంగళవారం పట్టుకున్నారు. నంబర్ 2 బస్తీకి చెందిన కాంట్రాక్టర్ సంపత్ మున్సిపాల్టీ లో వివిధ నిర్మాణ పనులు రూ.18 లక్షల బిల్లుకు గాను ఎంబీ రికార్డుకు రూ.75 వేలు ఏఈ లంచం అడిగాడు. కొద్ది రోజులపాటు బిల్లు కోసం ఇబ్బందులకు గురి చేస్తుండడంతో మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మున్సిపాల్టీలో రూ.39 కోట్లతో మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా సంపత్ ఓ కాంట్రాక్టర్ నుంచి గుడ్విల్గా తీసుకుని పనులు చేపటాడు. ఇందుకు సంబంధించిన బిల్లుల విషయంలో జరుగుతున్ను జాప్యంపై ఆగ్రహం చెందిన సంపత్ ఏసీబీ దృష్టికి తీసుకొచ్చి ఏఈని పట్టించాడు. వరంగల్ డీఎస్సీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రవి, క్రాంతికుమార్, రమణకుమార్, రవీందర్, పదిమంది సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అవినీతి, లంచగొండితనం నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ 1064 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. నాడు సీనియర్ అసిస్టెంట్ మనోహర్.. మున్సిపాల్టీలో ఏఈ అనిల్ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇదే మొదటిసారి కాదు. 2008లో సీనియర్ అసిస్టెంట్ మనోహర్ ఇంటి పన్ను విషయమై 21 ఏరియాకు చెందిన బిందె కుటుంబరావు దగ్గర నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విషయం విదితమే. బిల్లుల కోసం వేధించాడు: సంపత్ మున్సిపాల్టీలో 7వ వార్డులో చేసిన రోడ్డు పనికి బిల్లుల కోసం ఏఈ చుట్టూ తిరిగి విసిగిపోయి చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు కాంట్రాక్టర్ సంపత్ తెలిపాడు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద 7వ వార్డులో రూ.10 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణం పనులు చేపట్టి బిల్లు కోసం 15 రోజుల పాటు తిరిగినా రికార్డు చేయలేదన్నారు. బిల్లులు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు డబ్బులు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని స్పష్టం చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు. తాను ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పకడ్బందీగా వలపన్ని ఏఈని పట్టుకున్నట్లు చెప్పారు. -
మరీ ఇంత బరితెగింపా?
సాక్షి, చిత్తూరు : దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలనేది ప్రత్యక్షంగా చూడాలంటే చిత్తూరు నగరానికి రావాల్సిందే. అధికారంలో ఉండగానే ముందుచూపుతో దాదాపు రూ.5 కోట్ల విలువైన మునిసిపల్ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్చేశారు. ఇంకేముంది.. దీనికి కార్పొరేషన్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు తోడవ్వడంతో చకాచకా పనికానిచ్చేశారు. చిత్తూరు నగరంలోని కొత్త బస్టాండును ఆనుకుని ఉన్న రూ.5 కోట్లు విలువ చేసే కార్పొరేషన్కు చెందిన 3,500 అడుగుల స్థలంలో భవన నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. పక్కాగా ప్రణాళిక 20 ఏళ్ల క్రితం ఉద్యోగుల యూనియన్ కార్యాలయం కోసం ఆర్టీసీ బస్టాండులో స్థలాన్ని కేటాయించారు. దీన్ని తనకు లీజుకు ఇస్తే భవనం నిర్మించి, మొదటి అంతస్తును యూనియన్ కార్యకలాపాలకు, మిగిలిన దాన్ని తాము వాణిజ్య సముదాయంగా వినియోగిస్తామనే ప్రతిపాదనను టీడీపీ నేత కార్పొరేషన్లోని తనకు అనుకూలంగా ఉన్న ఉద్యోగి వద్ద చెప్పారు. వెనువెంటనే అప్పటివరకు ఉన్న ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని మార్చేసి కొత్త వ్యక్తిని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. ముందుగా అనుకున్నట్లు తనవద్ద డ్రైవర్గా పనిచేసే వ్యక్తికి రూ.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా యూనియన్లో ఓ అజెండాను ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. ఆర్నెల్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగానే ఉంచగలిగారు. ఆ హక్కు ఉందా? మునిసిపల్ స్థలాన్ని యూనియన్కు కేటాయించినా కమిషనర్ స్థాయి అధికారి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసివ్వాలి. కానీ ఇప్పటివరకు ఆ స్థలం యూనియన్ పేరిట రిజిస్ట్రేషన్ కాలేదు. మూడేళ్లు, అయిదేళ్లు పాటు ఎవరికైనా స్థలా న్ని అద్దెకు ఇవ్వొచ్చు తప్ప 25 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వ డం, రిజిస్ట్రేషన్ చేసివ్వడం చట్టరీత్యా నేరం. కమిషనర్ అనుమతి లేకుండా మునిసిపల్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిచ్చినందుకు ఉద్యోగులను సస్పెండ్ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం కమిషనర్కు ఉంటుంది. ప్రభుత్వం మారడంతో వెలుగులోకి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఇటీవల ఉద్యోగులతో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశం నిర్వహించినప్పుడు ధైర్యం చేసిన ఉద్యోగులు కార్పొరేషన్ స్థలం కబ్జా అవుతున్న విషయంపై నోరు విప్పారు. స్థలా న్ని ఎవరికీ లీజుకుగానీ, రిజిస్ట్రేషన్గానీ చేసివ్వొద్దంటూ ఎమ్మెల్యే మునిసిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో వారం క్రితం కొత్త యూనియన్ను ఎన్నుకోవడానికి సమావేశం పెట్టడం, స్థలం లీజుకు ఇవ్వడం చెల్లదంటూ అందరూ ముక్తకంఠంతో ప్రశ్నించారు. అయితే ఇద్దరు మునిసిపల్ ఉద్యోగులు మాత్రం ఖాళీ స్థలంలో పనులు త్వరగా పూర్తిచేయాలని టీడీపీ నేతకు సూచించడంతో ప్రస్తుతం ఇక్కడ భవనం నిర్మించడానికి మట్టిని కూడా తీసుకొచ్చి సిద్ధమవుతున్నారు. క్రిమినల్ కేసు పెట్టిస్తా ఇది మునిసిపాలిటీ స్థలం. దీన్ని యూనియన్కు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఏవీ నాకు చూపించలేదు. ఈ స్థలాన్ని ఎవరూ ఎవరికీ లీజుకు ఇవ్వడం.. రిజిస్ట్రేషన్ చేసివ్వడం కుదరదు. ఒకవేళ ఎవరైనా లీజుకు తీసుకుని ఇక్కడ నిర్మాణాలు చేపడితే అతనితో పాటు కార్పొరేషన్ స్థలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిచ్చినందుకు ఉద్యోగ సంఘ నాయకులపై క్రిమినల్ కేసు పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తా. – చల్లా ఓబులేసు, కమిషనర్, చిత్తూరు నగర పాలక సంస్థ -
కొత్తపట్నం ఏర్పాటు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం చుట్టూ మరో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నిజాంపేట్, బండ్లగూడ, జవహర్నగర్, బడంగ్పేట్లను సమీప ప్రాంతాలను చేర్చి కార్పొరేషన్లుగా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్కు ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు శాసనసభకు ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. మహానగరంలో కలిసిపోయినశివారు ప్రాంతాలను మున్సిపాలిటీలుగా కొనసాగించాలా లేక, జీహెచ్ఎంసీలో విలీనం చేయాలా అన్న అంశంపై కొద్ది రోజులుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఒక దశలో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి శివారు ప్రాంతాలను విలీనం చేయాలన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. చివరకు కొత్తగా ఆరు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక నగరంలో పూర్తిగా కలిసిపోయిన మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్ తదితర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఏర్పాటు ఇలా.. ♦ నిజాంపేట్: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ♦ బోడుప్పల్: బోడుప్పల్, చెంగిచర్ల ♦ ఫిర్జాదిగూడ: ఫిర్జాదిగూడ, పర్వతాపూర్, మేడిపల్లి ♦ జవహర్నగర్ ♦ బండ్లగూడ: హైదర్షాకోట్, పీరంచెరువు, హిమాయత్సాగర్, కిస్మత్పూర్ ♦ బండంగ్పేట్: జిల్లెలగూడ, మీర్పేట్, అల్మాస్గూడ, నాదర్గుల్, కుర్మల్గూడ, బాలాపూర్, మామిడిపల్లి, మల్లాపూర్, బాలాజీనగర్, సుల్తాన్పూర్ -
విజయనగరం ఇక కార్పొరేషన్
సాక్షి, విజయనగరం : విద్యలకు నిలయం.. కళలకు కాణాచి... సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరం కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అంటే ప్రభుత్వ పని వేళలు ముగిసినప్పటి నుంచి టీడీపీ పాలకవర్గం పదవీకాలం ముగియటంతో 2016 ఫిబ్రవరి 12న ప్రభుత్వం జారీ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కార్పొరేషన్ హోదాలో విజయనగరంలో పాలన సాగనుంది. ఓ వైపు పాలకవర్గం పదవీ కాలం ముగియటం... మరో వైపు కార్పొరేషన్గా రూపాంతరం చెందిన విజయనగరానికి ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ నియమితులయ్యారు. పదవీకాంక్షతో నాడు అడ్డు వాస్తవానికి విజయనగరం పట్టణం 2015 సంవత్సరంలోనే కార్పొరేషన్ హోదా దక్కించుకుంది. 2015 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన కార్పొరేషన్ స్థాయిని అందుకోగా.. అప్పటి వరకు మున్సిపల్ కార్యాలయం బోర్డును సైతం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చారు. కార్పొరేషన్ స్థాయి కమిషనర్గా జి.నాగరాజును నియమించారు. అయితే ఈ ఉత్తర్వులు కేవలం రెండు నెలలు మాత్రమే అమలయ్యాయి. 2014లో ఎన్నికైన టీడీపీ పాలకవర్గం ఈ ఉత్తర్వుల కారణంగా అధికారానికి దూరమవుతుంది. స్పందించిన స్థానిక అధికార పార్టీ నేతలు అప్పట్లో ఆ ఉత్తర్వులను అభియన్స్లో పెట్టించారు. 2016 సంవత్సరం ఫిబ్రవరి 12 నుంచి మున్సిపాలిటీగా కొనసాగించగా... కౌన్సిల్ పదవీ కాలం ముగియగానే అభియన్స్లో ఉంచి మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ జీఓ నంబర్ 36ను జారీ చేసింది. తాజాగా కౌన్సిల్ పాలకవర్గం ముగియటంతో కార్పొరేషన్గా పాలన సాగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించనుంది. విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నాటికి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,44,598 మంది జనాభా ఉన్నారు. ప్రత్యేకాధికారిగా కలెక్టర్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్గా రూపొంతరం చెందిన రోజు నుంచి ప్రత్యేకాధికారి పాలన ప్రారంభం కావటం విశేషం. ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అంతంతమాత్రంగానే జరిగింది. రూ. కోట్లు నిధులున్నా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. అధికారిక లెక్కల ప్రకారం ఐదేళ్లలో 2164 అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ276.43 కోట్లు కేటాయించినా రూ. 85.83 కోట్లతో 1037 పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. అసంపూర్తి పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా పాలకవర్గం పదవీకాలం ముగియటం , మున్సిపల్ కార్పొరేషన్గా హోదా దక్కించుకోవటం, అదే సమయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులు కావడంతో అభివృద్ధి సాధించగలదని నగరవాసులు ఆకాంక్షిస్తున్నారు. -
పట్టు తప్పుతున్న ప్లానింగ్
సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖ నగరంలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందా? ఉన్న అధికారాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల గుప్పిట్లో బందీ అయ్యాయా? అంటే అవుననే స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్లు వినకపోతే ఉద్యోగానికి భద్రత ఉండదనే భయంతో ఐదేళ్ల పాటు వారు చెప్పినట్లే వినాల్సిన పరిస్థితి. గత కమిషనర్ సైతం ఈ విభాగంపై సరైన దృష్టి సారించలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర ప్రాథమిక అవసరాలపైనే దృష్టి సారించారు తప్ప టౌన్ప్లానింగ్ విభాగంలో ఏం జరుగుతుందనే విషయాలను పట్టించుకోలేదనీ అంటున్నారు. ఆఖరి కొద్ది నెలల్లో పట్టణ ప్రణాళిక విభాగం గురించి ఆలోచించినా.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. సరైన మోనటరింగ్ వ్యవస్థ లేకపోవడం, ఎమ్మెల్యేల పెత్తనంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారు చెప్పిందే చేస్తూ జోన్లను ప్రత్యేక వ్యవస్థలుగా మలచుకున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత గతంలో ప్రతి జోన్కు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు చైన్మెన్ ఉండేవారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణం కానీ, ఆక్రమణలు కానీ కనిపిస్తే ప్రధాన కార్యాలయానికి నేరుగా సమాచారం అందించేవారు. కానీ ఇప్పుడు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి జోనల్ కార్యాలయంలో ఏసీపీ, టీపీఎస్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పైనే టౌన్ ప్లానింగ్ విభాగం ఆధారపడి పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక జీవీఎంసీ విషయానికొస్తే.. ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా లేరాయె.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న సమయంలో 110 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో నలుగురు సూపర్వైజర్లు, ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు టీపీవోలు, ఒక సిటీ ప్లానర్ ఉండేవారు. 2006లో 600 చ.కి.మీ.కి పైగా విస్తీర్ణం పెరిగిన జీవీఎంసీలో 25 మంది సూపర్ వైజర్లు, 11 మంది టీపీవోలు, 11మంది ఏసీపీలు, నలుగురు డీసీపీలు, ఇద్దరు సిటీ ప్లానర్లు, ఒక చీఫ్ సిటీ ప్లానర్ ఉండాలి. కానీ ఒకే ఒక్క సిటీ ప్లానర్, ఒక డీసీపీ, 8 మంది ఏసీపీలు, 11 మంది టీపీవోలు, 15 మంది సూపర్వైజర్లు మాత్రమే ఉన్నారు. వీరికి తోడుగా 30 మంది అప్రెంటిస్ను గత ప్రభుత్వం నియమించింది. కానీ, వీరిని సాంకేతిక సలహాలకు మాత్రమే తప్ప క్షేత్రస్థాయి పరిశీలనలకు వినియోగించకూడదు. జీవీఎంసీ విస్తీర్ణం ప్రకారం 50 మంది సూపర్వైజర్లు ఉండాలి, కానీ నగరంలో ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అద్దం పడుతోంది. దీనివల్ల క్షేత్ర స్థాయి పరిశీలనలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విభాగాన్ని గాడిలో పెట్టాలంటే కొత్త కమిషనర్ సృజన కఠిన చర్యలు అవలంబించాల్సిందే. సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తే తప్ప అనధికారిక కట్టడాలకు చెక్ పెట్టలేరు. -
పైసలుంటేనే పని జరిగేది..!
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): రాజాం నగర పంచాయతీ అక్రమాలకు అడ్డాగా మారింది. 2005లో ఏర్పడిన ఈ నగర పంచాయతీకి ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోయినా..పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలకు మాత్రం ఇంటి పన్ను, కొళాయి పన్నుల రూపంలో అదనపు భారం పెరుగుతోంది. ఇవి చాలవు అన్నట్టు అక్రమ వసూళ్లతో నగర పంచాయతీ అధికారులు ప్రజలను పీక్కుతింటున్నారు. పని ఏదైనా పైకం చెల్లించాలి గత ఐదేళ్లుగా రాజాం నగర పంచాయతీలో అధికారుల అక్రమాలు అధికమయ్యాయి. చేయి తడపనిదే ఏ పని జరగని పరిస్థితి దాపురించింది. ఇంటి ప్లానింగ్ అప్రువల్, బీపీఎస్, టాక్స్ చెల్లింపు, బిల్డిండ్ ప్లానింగ్ వంటి పనులకు వసూళ్ల పర్వం అధికమైంది. వాస్తవంగా ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే ఇక్కడి అధికారులకు అధికంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజాం నగరంలో వ్యాపారాలు నిలిచిపోవడానికి, ఫ్యాక్టరీలు మూతపడడానికి ఇదొక కారణమని అంటున్నారు. బాధితుని ఫిర్యాదుతో ఏసీబీ దాడులు ఇటీవల వారం రోజుల క్రితం రాజాం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏసీబీ దాడులు జరిగిన విషయం పాఠకులుకు విధితమే. ఆ రోజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుని వద్ద అతని వద్దనున్న ఇంటి స్థలం కంటే ఎక్కువ మొత్తాన్ని నగర పంచాయతీ అధికారులు డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా ఆయన ఒక్కరే కాదు ఇంటి ట్యాక్స్లు, కొత్తగా స్థలాలు కొనుగోలు చేసినవారు, ప్లాట్లు నిర్మించుకుందామని అనుకున్నవారు నగర పంచాయతీ అధికారులకు లక్షల్లో ముట్టజెప్పాల్సిందే. ఇక్కడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దగ్గర నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగి వరకూ అందరూ ఎంత ఇవ్వగలవు అని అనేవాళ్లే. ఒక్కొక్కరిదీ ఒక్కో రేటు రాజాం నగర పంచాయతీలో ప్రతీ అధికారి తమకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని ఉంటారు. ట్యాక్స్ చెల్లించాలన్నా, కొత్త భవంతి నిర్మించాలన్నా ముందుగా నగర పంచాయతీ కార్యాలయంలోని మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని కలవాల్సి ఉంటుంది. అక్కడ ఆయన తన రేటు చెప్పిన తరువాత బిల్లు కలెక్టర్ స్థాయి వ్యక్తిని కలవమని చెబుతారు. బిల్లు కలెక్టర్ వాస్తవ రేటును చెబుతారు. వాస్తవంగా రూ.600లు చెల్లించాల్సి ఉంటే అధికారులు ఖర్చులు నిమిత్తం రూ.2000లు అదనంగా కలిపి మొత్తం రూ.2600లు డిమాండ్ చేస్తారు. ఇవి చెల్లిస్తేనే బిల్లు కలెక్టర్ మెజర్మెంట్లు వేస్తారు. లేకుంటే ఫైలు అక్కడే ఉండిపోతుంది. అక్కడి నుంచి ఆర్ఐ స్థాయి అధికారి వద్దకు ఫైల్ వెళ్తుంది. అక్కడ ఆయన ఎంత చలానా తీయాలో నిర్ణయించి రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే ఆయనకు రూ.500లు విలువ చేసే పనికి రూ.2 వేలు అదనంగా చెల్లించాలి. ఈ మొత్తం మొదట్లో బిల్లు కలెక్టర్కు చెల్లించిన మొత్తంతో సంబంధం ఉండదు. ఇక్కడ చెల్లింపు తరువాత ఈ ఫైల్ మేనేజర్ స్థాయి అధికారుల వద్దకు వెళ్తుంది. ఆయన మరోసారి ఇళ్లు, స్థలం చూడాలని కొర్రీలు వేస్తారు. ఈ సమయంలో ఆయన తరుపున అక్కడ ఉన్న దళారులు రంగ ప్రవేశం చేస్తారు. ఎంత చిన్న సంతకానికైనా కనీసం రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీరి ముగ్గురు సంతకాలు తరువాతే ఫైల్ నగర పంచాయతీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి వద్దకు చేరుకుంటుంది. అక్కడ వేరే వేరే ధరలు ఉంటాయి. ప్రధానంగా వీరి ముగ్గురి అప్రూవల్ లేకుంటే అవతలి వ్యక్తి ఎంతటి వాడైనా ఆ ఫైల్ నిలిచిపోతుంది. ఇదే తరహాలో ఇటీవల అనేక ఫైళ్లు నిలిచిపోయాయి. ఇందులో కొంతమంది బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కగా, మిగిలిన వారు తప్పించుకున్నారు. ఈ తంతు జరిగి వారం రోజులు గడవకముందే నగర పంచాయతీలోని అధికారులు మళ్లీ తమ వసూళ్లను ప్రారంభించేశారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమాలు అడ్డుకోవాలని పలువురు పట్టణ వాసులు కోరుతున్నారు. ఇంతవరకూ నగర పంచాయతీగా కార్యరూపం దాల్చని నగర పంచాయతీ కార్యాలయంలో ఈ అక్రమ దందాలు చేయడం తగునా అని వాపోతున్నారు. ఈ వసూళ్లపై నగర పంచాయతీ ఏఈ సురేష్ వద్ద సాక్షి ప్రస్తావించగా కార్యాలయంలో ఒకరిద్దరి అధికారుల వలన ఇబ్బందులు వస్తున్నాయని, ఎవరూ అదనంగా నగదు చెల్లించరాదని, ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. -
నగరపాలక సంస్థ కమిషనర్గా ప్రశాంతి
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ ప్రశాంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు అహుడా వైస్ చైర్పర్సన్గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఈమె కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేస్తున్నారు. అంతకు ముందు అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) వైస్ చైర్పర్సన్గా పనిచేశారు. అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా.. ఏ మాత్రం లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో ఆమెను కర్నూలు కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో ఆమె ఐదు నెలలుగా కమిషనర్ హోదాలు పని చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం అనంతపురం కమిషనర్గా పని చేస్తున్న పీవీవీఎస్ మూర్తి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్నూలులో రిలీవ్ ఐఏఎస్ పి.ప్రశాంతి కర్నూలులో శనివారం రిలీవ్ అయ్యారు. త్వరలోనే అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పి.ప్రశాంతి పేరు వినగానే కొందరు అధికారులు, సిబ్బందిలో వణుకు పుడుతోంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్లడంతో పాటు అభివృద్ధి విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహిస్తారనే పేరున్న అధికారిణి కావడంతో అక్రమార్కులు అప్పుడే ఆలోచనలో పడ్డారు. -
ఇక సెన్సెస్–2021
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేందుకు నిర్ధేశించిన జన గణనకు అధికార యంత్రాంగం మరోసారి సమాయత్తం అవుతోంది. పదేళ్లకోసారి జరిపే జనగణన 2011లో ముగిసింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. 2021 జన గణన కోసం ఇప్పటి నుంచే సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 2020 చివరి వరకు జనాభా లెక్కల ప్రక్రియ సాగుతుంది. 2021 నుంచి కొత్త లెక్కల ప్రకారం కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది. కాగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతోపాటు మండలాలు, గ్రామ పంచా యతీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సెన్సెస్ –2021 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం జిల్లాకు చెందిన మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. 021 జనగణన కోసం పునర్విభజన అనంతరం ఏర్పాటైన మండలాలు, గ్రామాలు, మునిసిపాలిటీల హద్దులతో కూడిన మ్యాపులను, పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిం చారు. మ్యాపులను బుధవారంలోగా సమర్పిం చాలని అన్నారు. అన్ని గ్రామాల్లో విలేజీ రిజిస్టర్, పట్టణాల్లో టౌన్ రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ గ్రామాలను ప్రామాణికంగా వివరాలు సేకరించాలన్నారు. మునిసిపాలిటీలలో ఎన్నికల వార్డులను ప్రామాణికంగా తీసుకొని కాలనీలు, వార్డుల మ్యాపులతోపాటు మునిసిపాలిటీ, కార్పొరేషన్ మ్యాపులు పంపిం చాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పంపిన మ్యాపుల ఆధారంతగా జియో ట్యాగింగ్తో నిర్ధిష్టమైన మ్యాపులను హైదరాబాద్లో రూపొందించనున్నట్లు చెప్పా రు. డిసెంబర్ 31లోపు మ్యాపులన్నీ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేటర్లను నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. మునిసిపాలిటీలు, మండలాల నుం చి వివరాలు డూప్లికేట్ కాకుండా కమిషనర్లు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ప్రత్యేక అధికారి ప్రావీణ్య, డీఆర్ఓ బిక్షానాయక్, ప్రణాళిక శాఖ ఉప సంచాలకులు శక్తికుమార్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, చెన్నయ్య, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పన్నుల వేటలో ‘బల్దియా’
జనగామ: పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మొండి బకాయిలను సైతం వసూలు చేసేలా పక్కా ప్రణాళికను రూపొందించారు. కమిషనర్ రవీందర్ యాదవ్ నేతృత్వంలో డిమాండ్ నోటీసులు సిద్ధం చేసి యజమానులకు అందిస్తున్నారు. జనగామ మునిసిపల్ పరిధిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి (గృహ), కమర్షియల్, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.3.97 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పన్నులను వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఖచ్ఛితమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. పన్నులు చెల్లించే క్రమంలో బకాయిదారులను బెదిరించే కంటే బుజ్జగించడమే మేలుగా భావించిన బల్దియా అధికారుల ఆలోచన సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. రూ. కోట్లలో పేరుకుపోతున్న బకాయిలతో అభివృద్ధి సాధ్యం కాదని తేల్చుకున్న పురపాలక శాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రూ.3.97 కోట్లు పట్టణ పరిధిలో 11,388వేల గృహ, కమర్షియల్ భవనాలు ఉన్నాయి. ఇందులో 9,151 నివాస గృహాలు, 879 దుకాణాలు, 81 ప్రభుత్వ కార్యాలయాలు, 1,277 నివాస గృహాలతో కలిపి ఉన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటిపై రూ.3.97,25 కోట్ల పన్నులు రావాల్సి ఉంది. ఆరు వేల నివాస గృహాలతో పాటు వ్యాపార సంస్థలకు డిమాండ్ నోటీసులు అందించారు. ‘పన్నులు చెల్లించండి.. పట్టణాభివృద్ధికి సహకరించండి’ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.30 లక్షలకు పైగా పన్నులు వసూలు చేశారు. పేరుకుపోయిన ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఆస్తి పన్ను విషయంలో గృహ వినియోగ దారులతో కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వేరుగా వసూలు చేస్తుంది. ప్రభుత్వ శాఖల నుంచి రూ.10.49 లక్షలకు పైగా పన్నులు రావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్నులను ముక్కు పిండి వసూలు చేసేందుకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేయడంలో అంకితభావంతో పనిచేయాలి. వందశాతం టార్కెట్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. ఆస్తి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించి ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తమతో పాటు కలిసి రావాలి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పన్నులను చెల్లించాలి. – నాగారపు వెంకట్, మునిసిపల్ చైర్పర్సన్ -
‘ముందస్తు’ ఆదాయం
సాక్షి, వరంగల్ రూరల్: మునిసిపాలిటీల్లో ఇంటి యజమానులు ముందస్తుగా పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని పురపాలక శాఖ ప్రకటించింది. ఈ గడువు గత నెల 30వ తేదీతో ముగి సింది. ఈ మేరకు శాఖ విడుదల చేసిన ప్రకటనకు గృహయ జమానులు పలువురు ముందుకొచ్చా రు. ఉమ్మడి జిల్లాలోని యజమానులు రూ.15 కోట్ల మేర పన్నులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు కాగా.. యజమానులకు సైతం రాయితీ కింద రూ.75లక్షల మేరకు కలిసొచ్చింది. విస్తృత ప్రచారం రాష్ట్రంలో అన్ని పురపాలికల్లో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా పన్నులు చెల్లిస్తే పురపాలక శాఖ ఐదు శాతం రాయితీని ప్రకటించింది. పురపాలికలకు ఆదాయం పెరుగుతుందని ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఏప్రిల్ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. దీనికి ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకొచ్చేలా అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మునిసిపాలిటీల పరిధిలో ప్లెక్సీలు కట్టించడంతో పాటు జీపులు, ఆటోల ద్వారా ప్ర త్యేకంగా ప్రచారం నిర్వహిం చారు. బిల్ కలెక్టర్లు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ పన్ను ల వసూలుకు ప్రయత్నించారు. ముఖ్యంగా పెం డింగ్ బకాయిలు ఉన్న వారి నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసేలా ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఇచ్చారు. అయినా అంతంతే... రాయితీ ద్వారా అయినా పన్నులు త్వరగా చెల్లిస్తారనే ఉద్దేశంతో పథకం ప్రవేశపెట్టినా అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 1,12,194 గృహాలు ఉంటే 25,894 గృహాల వారు మాత్రమే స్పందించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 36శాతం గృహాల వారు ప్రభుత్వ రాయితీకి స్పందించి పన్నులు చెల్లించారు. మిగతా మున్సి పాలిటీల్లో అంతంత మాత్రంగానే చెల్లించారు. అత్యల్పంగా మరిపెడ మున్సిపాలిటీలో కే వలం తొమ్మిది మంది మాత్రమే స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1,68,922 గృహాలకు గాను 32,164 గృహాల వారు రూ.15,00,95,000 చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రాయితీ ద్వారా యజమానులకు రూ.75,04,750 మేర కలిసొచ్చింది. నూతన మునిసిపాలిటీల్లో స్పందన కరువు గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన పట్టణాల్లో ఇంటి పన్నుదారుల నుంచి స్పందన కరువైంది. వర్దన్నపేట, డోర్నకల్, మర్రిపెడ, తొర్రూరు గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో డీసీ తండాను విలీనం చేశారు. దీనిని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఇంటి పన్నులు చెల్లించేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితే మిగతా చోట్ల కనిపించింది. రాయితీపై ప్రచారం నిర్వహించాం ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. పన్ను చెల్లింపుదారుల్లో ప్రతీ ఇంటి తలుపుతట్టి సమాచారాన్ని అందించాం. మరో మూడు నెలలు గడిస్తే అదనంగా పన్నుపై 2 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని వివరించాం. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా ముం దస్తుగా ప్రజలు స్పందించి ఆస్తి పన్ను చెల్లించారు. – రవి కిరణ్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ -
ప్లాన్ ఓకే అయితేనే ప్లాట్ల రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లలో స్థలాల క్రయ విక్రయాలకు ముకుతాడు వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ల శాఖను అప్రమత్తం చేస్తోంది. మొదట హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో ఈ పద్ధతిని అమలు చేసి తర్వాత.. డీటీసీపీ ఆధీనంలోని గ్రామీణ ప్రాంతాల్లోని లేఅవుట్లకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ అనుమతి పొందని లేఅవుట్లలో ప్లాట్లపై నిషేధం విధిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక లేఅవుట్లలో మాత్రమే రిజిస్ట్రేషన్లను అనుమతించాలని కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆయన లేఖ రాశారు. 7 జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను గుర్తించేందుకు గత నెల 29 నుంచి ఈ నెల 10 వరకు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు చౌకగా లభించే అనధికార లే అవుట్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుద్దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. లేఅవుట్ అభివృద్ధితో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధం లేకపోవడంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను యథేచ్ఛగా చేస్తోంది. దీంతో ఇకపై ఇలాంటి వ్యవహారానికి ఫుల్సాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ నుంచి తుది అనుమతి (ప్లాన్ అప్రూవ్డ్) అయిన వెంచర్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖను కోరింది. -
ఈ నెలాఖరులోపు చెల్లిస్తే..!
సాక్షి, అమరావతి : ఇంటి పన్నుపై నిన్న మొన్నటి వరకు వడ్డీ వసూలు చేసిన మున్సిపాలిటీలు ఇప్పుడు ఆఫర్లు ప్రకటించాయి. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రచారం చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉద్యోగులను పన్ను చెల్లింపుదారుల ఇళ్లకు పంపుతున్నాయి. ఆదివారమైనా కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెబుతున్నాయి. రెండు నెలలుగా మున్సిపల్ సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో 40 శాతం కూడా వసూలు కాలేదు. రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేయలేని దుస్థితి. మరో రెండు నెలల వరకు జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. దీంతో మున్సిపల్ అధికారులు పన్నులపై రాయితీ ప్రకటించారు. రోజువారీ ఖర్చులకూ డబ్బుల్లేవ్ చిన్న, మధ్యతరగతి మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పన్ను రాయితీని ప్రకటించి యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు, 16 నగర పాలక సంస్థలు కలిపి 2019 మార్చి 31తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరానికి రూ.219.34 కోట్ల పన్నును వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాయి. గత ఏడాది ఏప్రిల్లోనే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేశాయి. ఆలస్యంగా చెల్లించే వారినుంచి నెలవారీ వడ్డీ వసూలు చేస్తామని ప్రకటించి.. డిసెంబరు వరకు వసూలు చేశాయి. జనవరి నుంచి మున్సిపల్ సిబ్బంది ఓటర్ల జాబితాలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన పనుల్లో నిమగ్నం కావడంతో పన్ను వసూళ్లు మందగించాయి. మార్చి 31 నాటికి రూ.219.34 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉంటే.. రూ. 21.03 కోట్లను వసూలు చేశాయి. రూ.36.45 కోట్ల కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. రూ.3.78 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.197 కోట్ల ఇంటి పన్నును వసూలు చేయాల్సి ఉంది. ఈ మొత్తాలకు తోడు ఐదారు సంవత్సరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు దాదాపు రూ.1,200 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే.. పన్నుల బకాయిలు రూ.1,400 కోట్ల వరకు చేరింది. ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆ మర్నాడు నుంచే మున్సిపల్ సిబ్బందిని పన్నుల వసూలుకు నియమించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. -
మున్సిపాలిటీ నిధులు బొక్కేశారు
సాక్షి, కావలి : కావలి మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధులు ఇష్టారాజ్యంగా కాజేశారు. పట్టణంలో ఒక్క చెత్తను తరలించే పని వ్యహారంలోనే రూ. 6 కోట్లు నిధులు ఈ ఐదేళ్ల కాలంలో కాజేశారు. మున్సిపాలిటీకి అవసరం లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు తమ చేతుల్లో అధికారం ఉందని తమకు కావాల్సిన 50 మందిని పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించారు. వీరికి నెలకు రూ.10,000 జీతంగా పట్టణ ప్రజలు పన్నుల రూపంలో అందజేసిన నిధులను చెల్లిస్తున్నారు. ఈ ఐదేళ్లకాలంలో వీరికి రూ. 3 కోట్లు సమర్పించారు. అలాగే ఆటోలు అవసరం లేకపోయినప్పటికీ 5 ఆటోలను, వీధుల్లో చెత్త నిల్వ చేసే డంపర్లను ఏర్పాటు చేశారు. వీటికి డీజిల్, మరమ్మతులకు ఈ ఐదేళ్ల కాలంలో రూ.3 కోట్లు నిధులు కాజేశారు. పట్టణంలో రోజుకు 50 టన్నుల చెత్తను మున్సిపాలిటీ తరలించాల్సి ఉంది. వీటిని తరలించడానికి ఒక పెద్ద కంపాక్ట్ వాహనం, రెండు చిన్న కంపాక్ట్ వాహనాలు సరిపోతాయి. కావలి మున్సిపాలిటీలో అధికార పెత్తనం కోసం 1987 నుంచి నుంచి అర్రులు చాస్తున్న టీడీపీ నాయకులు, 2014 లో వైఎస్సార్సీపీలో గెలుపొందిన కౌన్సిలర్లను ఫిరాయింపులకు పాల్పడిన మున్సిపాలిటీలో అధికారాన్ని దక్కించుకొన్నారు. అప్పటి నుంచి మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో కూడా నిధులు లూటీకి స్కెచ్లు వేసి యథేచ్ఛగా కాజేశారు. ఈ క్రమంలో చెత్త తొలగింపు అంశాన్ని సైతం స్వాహాకు సద్వినియోగం చేసుకొన్నారు. -
పల్లెలకు పట్టణ సొబగులు
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సం స్థలో విలీనమైన 8 గ్రామపంచాయతీలు పట్టణీకరణను సంతరించుకుంటున్నాయి.నగరంలో విలీ నం కావడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. విలీన గ్రామాలన్నింటినీ సమీప డివిజన్లలో కలపడంతోపాటు బోర్డులు ఏర్పాటు చేయడంతో గ్రా మాలకు నగరపాలక హంగులు కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో ప్రజ లకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు పనులు చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కనీస సౌకర్యాలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలను తక్కువ సమయంలోనే డివిజన్లకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రతీ విభాగానికి ప్రత్యేక అధికారులను కేటాయించి పనులు చేపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మాదిరిగా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. విలీనం తర్వాత పన్నుల భారం లేకుండా మరో మూడేళ్ల వరకు యధావిధిగా పన్నులు వసూలు చేయనున్నట్లు సమాచారం. అ దేవిధంగా ప్రతీ ఇంటికి తాగునీటి వసతి కల్పిం చేందుకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ను అంది ంచనున్నారు. రాబోయే రోజుల్లో మిషన్భగీరథ కింద ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి నీటి సరఫరాను మెరుగుపర్చే ప్రక్రియపై దృష్టిసారిం చారు. పట్టణానికి ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పి ంచేందుకు నిదుల కేటాయింపు సైతం చేస్తున్నా రు. ఇక గ్రామాలు నగరంలో విలీనం కావడంతో స్థిరాస్తుల విలువలు సైతం రెట్టింపవుతున్నాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో పారి శుధ్యం మెరుగుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు. ప్రతీ గ్రామానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్కు బాధ్యతలు అప్పగించి పనులు పూర్తిచేసేందుకు ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో దుమ్ముదూళి లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరి శుభ్రం చేసుకునే విధంగా చైతన్య పరుస్తున్నారు. వీధిదీపాలకు మరమ్మతులు గ్రామపంచాయతీల్లో వెలగని వీధిదీపాలకు మరమ్మతు చేస్తూ చీకట్లలో మగ్గుతున్న కాలనీలకు వెలుగులు నింపుతున్నారు. ఎల్ఈడీ వీధిదీపాలు అందుబాటులోకి వచ్చాక, వాటిస్థానంలో తొలగించిన ఎస్యూ, హైమాస్ లైట్లను ప్రస్తుతం గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రధాన చౌరస్తాలో ఈ బల్బులను బిగిస్తుండడంతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుంటుంది. అయితే గ్రామాల ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలనే ఇబ్బంది లేకుండా గ్రామపంచాయతీ ప్రస్తుత వార్డు కార్యాలయాల్లో అధికారుల నంబర్లు అంటించారు. దీంతో ఏ అవసరమున్నా ఫిర్యాదు చేసే వీలుంటుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో ఇక నుంచి ఇంటి అనుమతులన్నీ ఆన్లైన్లోనే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే టౌన్ప్లానింగ్ విభాగానికి చెందిన డీపీఎంఎస్కు లింక్ చేశారు. ఇందు కోసం గ్రామాలకు చెందిన ఇంటి నంబర్లను సైతం తీసుకొని ఆన్లైన్ చేయనున్నారు. ఆయా గ్రామాలను అటాచ్ చేసిన డివిజన్లకు బాధ్యులుగా ఉన్న టౌన్ప్లానింగ్ సిబ్బంది ఇంటి అనుమతులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు పౌరసేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు నగరంలో ఏవిధంగా సేవలు అందుతున్నాయో.. విలీన గ్రామాల ప్రజలకు సైతం అదే విధంగా సేవలు అందించనున్నారు. వేగంగా అభివృద్ధి పనులు విలీన గ్రామాలను నగర డివిజన్లకు ధీటుగా అభివృద్ది చేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాం. కార్పొరేషన్లో కలిస్తే ఎన్ని సౌకర్యాలు ఉంటా యో అన్ని కల్పిస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంచాయితీలో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, కారొబార్ తదితర సిబ్బందిని కార్పొరేషన్ వర్కర్లుగా గుర్తించాం. టౌన్ప్లాన్, ఇంజనీరింగ్, శానిటేషన్, వీధిదీపాలు, నీటి సరఫరా ఇలా అన్ని విభాగాల నుంచి నగర ప్రజలు పొందే సౌకర్యాలన్నీ కల్పిస్తాం. – సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ -
పాలకవర్గం లేకుండా పదేళ్లు!
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థకు పదేళ్లుగా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఎన్నికలను నిర్వహించలేకపోయాయి. మునిసిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన శ్రీకాకుళం నగరపాలకసంస్థ పదేళ్లుగా పాలకవర్గం లేకుండా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతోంది. రాజ్యాంగం ప్రకారం ఇంత సుదీర్ఘకాలం పాటు ఎన్నికలు జరపకుండా ఉండకూడదు. అయితే ప్రభుత్వాలు దీనిని అధిగమించేందుకు పక్కదారులు పడుతూ కోర్టుల్లో కేసులు వేయిస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చాయి. 2010లో పాలకవర్గం కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎన్నికలు నిర్వహించడంలో తాత్సారం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సైతం అన్ని మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించినా శ్రీకాకుళం నగరపాలకసంస్థకు ఎన్నికలు నిర్వహించలేదు. కోర్టు కేసును సాకుగా చూపించి ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. నిజానికి కోర్టులో కేసి వేసింది తెలుగుదేశం సానుభూతిపరులే కావడం గమనార్హం. నగరపాలకసంస్థలో పంచాయతీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సర్పంచ్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. అటు తర్వాత దేనినైతే సర్పంచ్లు వ్యతిరేకించారో అదే పనిని తెలుగుదేశం పూర్తి చేసింది. అంతకుముందే పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. పలు సర్వేల్లో అధికార పార్టీకి వ్యతిరేకత ఉందని తేలడంతో కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. కోర్టు ఆగ్రహించినప్పుడల్లా డివిజన్ల ఏర్పాటు అంటూ ఒకసారి, ఓటర్ల జాబితా తయారీ అంటూ మరోసారి హడావుడి చేస్తూ ప్రభుత్వం తాత్సారం చేసింది. ఇలా పాలకవర్గం లేకపోవడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల రాబట్టేవారే లేకుండాపోయారు. కొంతమంది ఉద్యోగుల్లో కూడా జవాబుదారీతనం కొరవడింది. ప్రజాప్రతినిధులు సైతం కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయించాలన్న ప్రయత్నమే చేయకపోవడంతో పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
కోడ్ కూసింది..రంగంలోకి దిగిన యంత్రాంగం
సాక్షి, రాజంపేట: ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి కోడ్ అమలుచేసేందుకు అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది. రాజకీయనాయకుల ఫ్లెక్సీల తొలిగింపు చర్యలు చేపట్టారు. అలాగే ఎన్టీ రామారావు, వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 18న మొదటి నోటిఫికేషన్ విడుదలచేయనుంది. అధికారులు ఎన్నికల ఆదేశాలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమలుకు ఆలస్యం రాజంపేట నియోజకవర్గంలో కోడ్ అమలు చేయడంలో ఆలస్యమైంది. సాయంత్రం ఎన్నికలసంఘం నోటిఫికేషన్ విడుదల కాగానే కోడ్కు సంబంధించిన నిబంధనలు పాటించడంలో అధికారులు జాప్యం చేశారు. ఆదివారం కావడంతో సిబ్బంది అందుబాటులో లేక ఈ పరిస్థితి నెలకొనిందని అధికారులు అంటున్నారు. నియోజకవర్గంలోని రాజంపేట, నందలూరు, ఒంటమిట్టి, సిద్దవటం, వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో కోడ్ అమలుచేసేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.రాజంపేట పట్టణంలో అధికారపార్టీ, జనసేన జెండాలు కోడ్ వచ్చినా కూడా దర్శనిమిచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్పైనే చర్చ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎక్కడచూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికలనోటిఫికేషన్కు సంబంధించి అంశాలను వాట్సాప్ ద్వారా సేర్ చేసుకుంటున్నారు. చాలామంది టీవీలకు అతుక్కుపోయారు. కోడ్ కఠినంగా అమలు చేస్తాం ఎన్నికల కోడ్ను కఠినంగా అమలుచేస్తాం. ఎన్నికల సంఘం నుంచి నియమనిబంధనలు వచ్చాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా కోడ్ను వెంటనే అమలుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కోడ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –నాగన్న, ఆర్డీఓ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేస్తాం. ఆదివారం సాయంత్రం నుంచి హోర్డింగ్, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలిగించే కార్యక్రమం చేపట్టాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. –పత్తి శ్రీహరిబాబు, కమిషనర్, రాజంపేట -
అవినీతి కార్పొరేషన్..కమీషన్ ఇస్తేనే బిల్లులకు మోక్షం
సాక్షి, నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్న్లున్నాయి. ఆయా డివిజన్లలో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తుంది. ఆ నిర్మాణాలను నిబంధనల ప్రకారం, నాణ్యతా ప్రమాణాలతో చేయించాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ విభాగం అధికారులది. సదరు విభాగంలో ఇంజినీరింగ్ సూపరింటెండెంట్, ముగ్గురు ఈఈలు, ఐదుగురు డీఈలు, 12 మంది ఏఈలు, 60 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్లు ముందస్తుగా నిర్ణయించారని ఓ కాంట్రాక్టర్ తెలిపారు. కమీషన్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. వారికి తప్పనిసరి.. కాంట్రాక్టర్ ఏదైనా రోడ్డు, కాలువ నిర్మాణాలు చేపట్టాలంటే అధికారులతోపాటు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇన్చార్జి లకు సైతం కమీషన్లు ఇవ్వాల్సిందే. వారి డివిజన్లలో పనులు చేయాలంటే తప్పనిసరిగా ఐదుశాతం ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. కమీషన్ ఇవ్వకపోతే నాణ్యత లేదంటూ కుంటిసాకులు చెబుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఓ వైపు అ«ధికారులు, మరో అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇవ్వడంతో పలువురు నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కాగా ఇంజినీరింగ్ అధికారుల నుంచి సంతకాలు పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు విషయం అకౌంట్స్ విభాగంలో ఉంటుంది. దీంతో అకౌంట్స్ విభాగంలోని ఓ అధికారికి ఒక శాతం, ఎగ్జామినర్కు ఒక శాతం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఆ విభాగంలోని ఓ అటెండర్ కూడా కాంట్రాక్టర్ వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది. పెట్రోల్, డీజిల్లోనూ.. కార్పొరేషన్ పరిధిలో చెత్తాచెదారాలు తరలించేందుకు వాహనాలు కుక్కలగుంటలోని వెహికల్ షెడ్లో పెట్రోల్, డీజిల్ను నింపుకోవాల్సి ఉంది. అయితే స్థానిక ఏఈ ఆంజనేయులరాజు (గురువారం ఏసీబీ దాడిలో పట్టుపడ్డ వ్యక్తి) ట్రిప్పులు ఎక్కువ తిరిగినట్లు లెక్కలు చూపి పెట్రోల్, డీజిల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 4 లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తప్పుడు లెక్కలు చూపుతున్నారని సమాచారం. ఏసీబీ దాడిలో ఆంజనేయులు పట్టుపడ్డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల కార్లకు సైతం ఈ షెడ్ నుంచి డీజిల్ను సరఫరా చేస్తున్నారని తెలిసింది. నిబంధనల ప్రకారం అధికారుల వాహనాలకు ఇక్కడ డీజిల్ పట్టకూడదు. లంచం డిమాండ్ నగరపాలక సంస్థ అధికారులు 18 ట్రాక్టర్ల ద్వారా పలు ప్రాంతాల్లోని ప్రజలను తాగునీరు అందిస్తున్నారు. సదరు ట్రాక్టర్లు రోజూ సుమారు 97 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఒక్కో ట్రిప్పునకు రూ.435 చెల్లిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు నుంచి 8 ఎనిమిది ట్రిప్పులు తిరగాలి. అయితే కొందరు ట్రిప్పులు తక్కువ నగదు స్వాహా చేస్తున్నారు. అధికారులు వారి నుంచి నగదు తీసుకుని పట్టించుకోవడంలేదు. కొందరు సక్రమంగా ట్రిప్పులు వేసినా అధికారులు బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవిగో అక్రమాలు + నెల్లూరు మైపాడుగేట్ సెంటర్లో రూ.50 లక్షల వర్క్కు సంబంధించి రెండు శాతం కమీషన్ చెల్లించాలని ఓ అధికారి కాంట్రాక్టర్కు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్ తనకు నష్టం వచ్చిందని చెప్పినా అధికారి పట్టించుకోలేదు. నగదు తీసుకున్నాకే సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. + బారాషహిద్ దర్గాలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారి పేరు చెప్పి మరో రూ.లక్ష కూడా వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది. + గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీపై కార్పొరేషన్కు వచ్చిన ఓ అధికారి ఒకటో డివిజన్ నుంచి ఐదో డివిజన్ వరకు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తాను కూడా పనుల్లో భాగం తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ వర్గాల సమాచారం. రూ.10 లక్షల పనిలో ఏఈ కూడా రూ.5 లక్షలు భాగంతో పనులు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఆయా పనుల్లో నాణ్యతను పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. + ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ఫిట్టర్లకు డివిజన్ కేటాయింపుల్లో చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. నగదు తీసుకుని ఓ ఫిట్టర్కు డివిజన్ కేటాయించకపోవడంతో అతను అధికారి వ్యవహారం బట్టబయలు చేశాడు. ఈ విషయం కార్పొరేషన్లో కలకలం రేపింది. అవినీతిపరులకు కీలక బాధ్యతలు మంత్రి నారాయణ అవినీతిపరులైన కొందరికి కార్పొరేషన్లో అధికార ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఓ మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్, నెల్లూరు కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్పై ఏసీబీ దాడి చేసింది. వారు భారీగా అక్రమాస్తులు కుడబెట్టారనే విషయాన్ని గుర్తించింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ ఉత్తర్వులు జారీచేశారు. అలాంటి వారికి మంత్రి నారాయణ కార్పొరేషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఓ అధికారిని పారిశుద్ధ్య ం మెరుగుపరిచేందుకు ప్రత్యేకాధికారిగా మౌఖిక ఆదేశాలతో నియమించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు నెల్లూరు కార్పొరేషన్లో బాధ్యతలు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను మంత్రి ద్వారా మేయర్ పేషీలో కీలక స్థానం సంపాదించాడు. దీంతో కార్పొరేషన్లోని ఉద్యోగులు అవినీతిపరులకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఏసీబీ వలలో నెల్లూరు మిన్సిపల్ ఇంజనీర్
-
నీటి కష్టాలకు చెక్!
ఆదిలాబాద్రూరల్: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతీ సంవత్సరం వేసవిలో తాగునీటి సమస్య ఎదురైతే మున్సిపాలిటీ పరంగా పరిష్కరించేందుకు సాధారణ నిధులు కేటాయించి వేసవి ప్రణాళికను మున్సిపల్ ఇంజినీర్ అధికారులు రూపొందిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. త్వరలో జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుంది. ఆమోదం అనంతరం వేసవి ప్రణాళిక నిధుల వినియోగానికి లైన్ క్లియర్ అవుతుంది. మున్సిపాలిటీలో ప్రస్తుతం రెండురోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దాహార్తి తీర్చేందుకు ప్రణాళిక పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకుమున్సిపాలిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాకు రూ.10లక్షలు వినియోగించేందుకు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తీసుకోనున్నారు. అలాగే ఎక్కడైనా పైప్లైన్లు పగిలి నీటి సరఫరా నిలిచిపోతే వెంటనే వాటి మరమ్మతు కోసం అత్యవసరంగా ఈ నిధులు వినియోగించనున్నారు. పట్టణంలో 25 వేల కుటుంబాలు ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ పరిధిలో 2015 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 25 వేల కుటుంబాలు ఉన్నాయి. పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి మావల, లాండసాంగ్వి సమీపంలోని వాగుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలో రోజుకు ఒక్కొక్కరికి 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతీరోజు పట్టణానికి 19 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం. కానీ ప్రస్తుతం ఆయా సంప్హౌస్ల నుంచి కేవలం 12 మిలియన్ లీటర్ల నీళ్లను మాత్రమే పట్టణానికి సంప్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కొక్కరికి కేవలం 90 లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నారు. పాత పైపులైన్ కావడంతో లీకేజీలు అధికమవుతుండంతో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 25వేల కుటుంబాలు ఉన్నా కేవలం 13వేల కుటుంబాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 12వేల కుటుంబాల్లో నల్లాలు లేవు. రూ.100కే నల్లా కనెక్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వీరు కూడా కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు మరింత నీటి కొరత ఏర్పడనుంది. 11,700 కిలో లీటర్ల సరఫరా ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ పరిధిలో 25వేల కుటుంబాలు ఉండగా ఇందులో 1.17కోట్ల జనాభా ఉంది. వీరి దాహార్తి తీర్చడానికి 8 ఓహెచ్ఆర్ పాత ట్యాంకులు ఉండగా.. మరో 5 కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ట్యాంకులు ఈ వేసవిలోపు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ సారి కూడా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తేలా ఉంది. ఆయా ఓహెచ్ఆర్ ట్యాంకుల్లో ప్రతీరోజు 11,700 కిలో లీటర్ల సామర్థ్యం నీరు నిల్వ కానుంది. సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ (సీపీహెచ్ఈవో) ప్రకారం ప్రతీ ఒక్కరికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న జనాభాకు ప్రతీరోజు 19 మిలియన్ లీటర్ల (ఒక కోటి 90లక్షల) నీళ్లు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పట్టణంలో 170 కిలో మీటర్ల మేరకు పైపులైన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. ఇప్పటి వరకు 156 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం ప్రస్తుతం ఉన్న ఓహెచ్ఆర్ ట్యాంకుల ద్వారా పట్టణ ప్రజలకు ప్రతీరోజు నీటిని సరఫరా చేయలేం. అందుకే రెండు రోజులకో సారి చేస్తున్నాం. కొత్తగా 5 ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మిస్తున్నా ఇందులో ఒక ఓహెచ్ఆర్ ట్యాంకు మాత్రమే పూర్తయ్యేలా ఉంది. మిగతా ఓహెచ్ఆర్ ట్యాంకులు వేసవిలోగా పూ ర్తి అయ్యేలా కనిపించడం లేదు. పట్టణ ప్రజల దా హార్తిని తీర్చేందుకు రూ.10లక్షల వరకు అవసరమవుతాయి. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో జరగబోయే కౌన్సిల్లో ఆమోదం తీసుకుంటాం. – మారుతిప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
నరసారావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు
-
హర్యానా కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ముందంజ
చండీగఢ్ : హర్యానాలో అయిదు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. మూడు కార్పొరేషన్లలో బీజేపీ మేయర్ అభ్యర్ధులు సమీప ప్రత్యర్ధులపై భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా, మరో రెండు చోట్లు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిసార్లో బీజేపీ మేయర్ అభ్యర్థి గౌతమ్ సర్ధానా ఆధిక్యంలో ఉండగా..కర్నాల్, పానిపట్, రోహ్తక్, యమునానగర్లలోనూ బీజేపీ మేయర్ అభ్యర్ధులు వరుసగా రేణు బాల, అవనీత్, మన్మోహన్, మదన్సింగ్లు విపక్ష మేయర్ అభ్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు. పలు రౌండ్ల లెక్కింపు మిగిలిఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ ఎన్నికలను పాలక బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా కొందరు ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తోంది. విపక్ష ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచింది. -
సింగిల్ విండో కావాలి!
సాక్షి, హైదరాబాద్: టీఎస్–ఐపాస్ ద్వారా ఎలాగైతే పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులను మంజూరు చేస్తున్నారో.. అలాగే నిర్మాణ రంగ అనుమతులకూ ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. సింగిల్ విండో సిస్టమ్లో నిర్మాణ అనుమతులిచ్చే మున్సిపల్ శాఖతో పాటూ అగ్నిమాపక, నాలా కన్వర్షన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మైన్స్ అండ్ జియోలజీ విభాగాలనూ భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అనుమతుల మంజూరులో జాప్యం తగ్గడంతో పాటూ అవినీతి కూడా తగ్గుతుందని.. దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తాయని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అభిప్రాయపడింది. ఇటీవల టీబీఎఫ్ నాల్గవ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ ఇంటి నిర్మాణం అంటే మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, పర్యావరణ, ఎయిర్పోర్ట్.. వంటి చాలా ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్వోసీ) తీసుకోవాలి. ఇందుకోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని.. కాబట్టి ఒక్క దరఖాస్తుతోనే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీలను జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ♦ రెవెన్యూ ల్యాండ్లను జియో ట్యాగింగ్ చేసి రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలి. అప్పుడే భూములకు వర్చువల్ బౌండరీలు కనిపిస్తుంటాయి. దీంతో ద్వంద్వ రిజిస్ట్రేషన్స్ వంటి అక్రమాలకు తావుండదు. ♦ అభివృద్ధి నగరం నలువైపులా విస్తరించాలి. లుక్ ఈస్ట్ పాలసీతో తూర్పు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉప్పల్లోని ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తాన్ని ఐటీ జోన్గా ప్రకటించాలి. పోచారంలోని రహేజా ఐటీ పార్క్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. నివాసితులకు ఆరోగ్య వాతావరణం కోసం నగరంలోని పార్క్లను కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్స్లాగా అభివృద్ధి చేయాలి. నెలకొకసారి స్థల మార్పిడి కమిటీ.. ప్రస్తుతం ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కమిటీ 2–3 నెలలకొకసారి సమావేశం అవుతోంది. దీంతో స్థల మార్పిడికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా ప్రతి నెలకు ఒకసారి సమావేశం జరగాలి. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలు, ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)పై కోర్టు కేసులో ఉంది. దీన్ని త్వరితగతిన పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో చాలా మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారు. ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్ ఒక సర్వే నంబరులో ఉండే వేల ఎకరాల్లో కొంత స్థలానికి ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే.. రెవెన్యూ శాఖ ఆ సర్వే నంబరు అంతటినీ ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్ కింద పెట్టేస్తున్నారు. దీంతో ఆ సర్వే నంబరులోని మిగిలిన స్థలానికి రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. ఏ స్థలం వరకైతే లీగల్ సమస్యలున్నాయో అంత వరకే ప్రొహిబిషనరీ విధించాలి. లేకపోతే మిగిలిన స్థలంలోని కొనుగోలుదారులకు నష్టం వాటిల్లుతుంది. ♦ ఉదాహరణకు భోగారం సర్వే నంబరు 281లో మొత్తం 12 ఎకరాల 19 గుంటల భూమి ఉంది. ఇందులో 4 ఎకరాల 2 గుంటలు పట్టా, 8 ఎకరాల 17 గుంటలు అసైన్డ్ ల్యాండ్. దీంతో రెవెన్యూ విభాగం ఈ సర్వే నంబరును ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్ కింద పెట్టేసింది. దీంతో పట్టా ల్యాండ్లో భూమి కొన్నా.. రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. ఇదే అదనుగా ఆ సర్వే నంబరులోని పట్టా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్కు కూడా సబ్–రిజిస్ట్రార్లకు చేతులు తడపాల్సి వస్తోంది. అలా కాకుండా సర్వే నంబరు 281 (ఏ), (బీ) అని ప్రత్యేకంగా చూపించినట్లయితే.. కొనుగోలుదారులకు ఇబ్బందులుండవు.. జేబు భారమూ తప్పుతుంది. – సీ ప్రభాకర్ రావు, టీబీఎఫ్ ప్రెసిడెంట్ విజయవాడ రోడ్లో దృష్టి మెట్రో రైల్ ప్రారంభం, ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణంతో ఇప్పుడు ఎల్బీనగర్ ప్రాంతం అత్యంత బిజీ ఏరియాగా మారింది. పోచారం ఐటీ హబ్తో వరంగల్, ఆదిభట్ల ఎయిరో స్పేస్ హబ్తో సాగర్ రోడ్ ఎలాగైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయో.. అలాగే విజయవాడ జాతీయ రహదారిలోనూ అభివృద్ధి ప్రాజెక్ట్లను ప్రకటించాలి. దీంతో నగరం నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది. – టీ నరసింహా రావు, ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్మికులకు బీమా సౌకర్యం భవన నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న కార్మికులున్నారు. నిర్మాణ సమయంలో జరిగే ప్రమాదాలకు డెవలపర్లను బాధ్యుల్ని చేయడం, కేసులు పెట్టడం సరైంది కాదు. భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లవుతుంది. – ఎం. సీహెచ్ రాఘవరావు,వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ లేబర్ సె‹స్పై అవగాహన నగరంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నగరం చుట్టూ ఇసుక డిపోలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. డెవలపర్ల నుంచి వసూలు చేసే లేబర్ సెస్ ప్రభుత్వం వద్ద మూలుగుతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ సొమ్మును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. – ఎం. శ్రీనివాసన్, కూకట్పల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
రావణాసురుడూ మరణించాడు!
రావణాసురుడూ మరణించాడు! ఇతని పేరు దల్బీర్సింగ్. అమృత్సర్ దసరా ఉత్సవాల్లో రావణుడి వేషం కట్టి అందరినీ అలరించాడు. రావణ దహనాన్ని కళ్లారా చూడాలని అనుకున్నాడు. ఆ సందడి, ఆ కోలాహలం బాగా కనిపించాలన్న ఉద్దేశంతో రైల్వే ట్రాక్ ఉన్న వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ వందలాది మంది చేరుకొని చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఉత్సవం చూడటంలో మునిగిపోయారు. అదే సమయంలో సూపర్ స్పీడ్తో రైలు మృత్యు శకటంలా తరుముకొస్తూ ఉండటాన్ని దల్బీర్ గమనించాడు. రైల్వే ట్రాక్ మీదున్న వాళ్లకి ప్రమాదం గురించి హెచ్చరించాలని పరుగులు తీశాడు. కానీ రెప్పపాటులోనే ఘోరం జరిగిపోయింది. రైలు దల్బీర్ను ఢీకొట్టి అతని శరీరాన్ని ఛిద్రం చేసింది. ఒకవైపు రావణుడి దిష్టిబొమ్మ మంటల్లో దగ్ధమవుతుంటే అదే సమయంలో రావణ పాత్రధారి ఇనుప చక్రాల కింద పడి నలిగిపోవడం అందరినీ కలిచివేసింది. రామ్లీలాలో గత పదేళ్లుగా దల్బీర్ సింగ్ వివిధ రకాల పాత్రల్ని పోషిస్తూనే ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు పాత్రధారులకి కూడా మేకప్ తదితర అంశాల్లో సహకరించాడు. కార్యక్రమం పూర్తయి ముగింపు దశకు వచ్చే సమయంలో తోటి వారిని ఆదుకోవడానికి వెళ్లి తానే బలైపోయాడు. దల్బీర్ సింగ్కు భార్య, ఎనిమిదినెలల కొడుకు ఉన్నాడు. అమృత్సర్: ఘోర రైలు ప్రమాదంతో పంజాబ్ అమృత్సర్లోని జోడా ఫాటక్ ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోవైపు అటు రైల్వే, ఇటు అమృత్సర్ నగరపాలక సంస్థ అధికారులు ఈ దుర్ఘటనకు తాము కారణం కాదని వాదిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 61 అని శుక్రవారం చెప్పిన అధికారులు తాజాగా లెక్కను సవరించి ఈ ఘటనలో 59 మంది చనిపోయారనీ, మరో 57 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల బంధువులను పరామర్శించిన అనంతరం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సీఎం ప్రతిపక్షాలను కోరారు. తప్పెవరిదో నాలుగు వారాల్లో విచారణలో తేలుతుందని చెప్పారు. క్షతగాత్రులను శుక్రవారం రాత్రే ఆసుపత్రులకు తరలించిన సిబ్బంది శనివారం ఉదయానికల్లా ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తొలగించారు. చనిపోయిన 59 మందిలో 40 మందిని గుర్తించామనీ, 36 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయని అధికారులు శనివారం చెప్పారు. మరో నలుగురి మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని వారి సొంత ప్రాంతాలకు పంపించామన్నారు. చనిపోయిన వారిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బిహార్లకు చెందిన వలస కూలీలేననీ, వీరంతా జోడా ఫాటక్ చుట్టుపక్కలే నివసించేవారని అధికారులు చెప్పారు. ఆసుపత్రుల వద్ద మృతుల బంధువులు, క్షతగాత్రుల రోదనలతో అమృత్సర్లో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. సమాచారం లేదు.. అనుమతి తీసుకోలేదు ఈ ప్రమాదానికి బాధ్యత తమది కాదనీ, ఇందులో తమ తప్పేమీ లేదని అమృత్సర్ నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదానికి రైల్వే ఎంత మాత్రం కారణం కాదనీ, డ్రైవర్పై విచారణ ఏదీ ఉండదని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. పట్టాలపై మనుషులను చూసిన వెంటనే గంటకు 91 కి.మీ.ల వేగంలో ఉన్న రైలును డ్రైవర్ 68 కి.మీ.లకు తగ్గించగలిగాడని చెప్పారు. రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని మాట్లాడుతూ ‘జోడా ఫాటక్ దగ్గర కార్యక్రమం గురించి రైల్వేకు సమాచారం ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన చోట లెవెల్ క్రాసింగ్ లేదు. ప్రజలే అక్రమంగా పట్టాలపైకి వచ్చారు’ అని చెప్పారు. అయినా డ్రైవర్ అత్యవసరంగా రైలును ఆపేందుకు ప్రయత్నించి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ సోనాలి మాట్లాడుతూ ‘జోడా ఫాటక్ దగ్గర దసరా వేడుకలకు ఎవ్వరూ అనుమతి ఇవ్వలేదు. అసలు మమ్మల్ని ఎవ్వరూ అనుమతి కోరనే లేదు’ అని చెప్పారు. అమృత్సర్లో రైలు ప్రమాద మృతుల సామూహిక అంత్యక్రియల దృశ్యం భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే.. ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. శనివారం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతో అక్కడి ప్రజలు ఘర్షణకు దిగారు. పట్టాల పక్కన అలాంటి వేడుక జరిగేందుకు ఎందుకు అనుమతించారు?’ అని ఓ స్థానికుడు ప్రశ్నించారు. శనివారం ఉదయం స్థానికులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలపడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 37 రైళ్లను రద్దు చేయగా మరో 16 రైళ్లను దారి మళ్లించారు. మరోవైపు ఈ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా రావణ దహన వేడుకలను నిర్వహిస్తున్నందున పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 500 రైళ్లొచ్చినా కదలరు రైల్వే పట్టాల సమీపంలో రావణ దహనం కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారుడు ఆధ్వర్యంలో జరిగింది. వేడుకలకు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చిన వాళ్లు ట్రాక్ మీద నిలబడిన విషయాన్ని కూడా మర్చిపోయారు. దాదాపు 5 వేల మంది ప్రజలు రైల్వే ట్రాక్పై నిలబడ్డారు. 500 రైళ్లు వచ్చినప్పటికీ.. వాళ్లు మాత్రం అక్కడ నుంచి కదలరు’అని కౌర్కు చెప్పాడు. ఘటన జరిగినప్పటి నుంచి కౌన్సిలర్ కొడుకు అదృశ్యమయ్యాడు. రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు నిర్వాహకుడు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
మాచర్ల టీడీపీలో వర్గపోరు
-
మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు.. అజ్ఞాతంలో మంగమ్మ
సాక్షి, గుంటూరు : మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ అజ్ఞాతంలోకి వెళ్లటంతో.. నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ మొదలైంది. గతంలో అధిష్టానం ముగ్గురు ఛైర్ పర్సన్ల పదవీ కాలాన్ని పంచింది. అప్పట్లో శ్రీదేవి అనే ఛైర్ పర్సన్ను బలవంతంగా పదవీనుంచి తొలగించటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత వచ్చిన మంగమ్మను సైతం బలవంతంగా పదవీనుంచి రాజీనామా చేయించారు. మంగమ్మ స్థానంలో షాకీర్ హున్నీసాను ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 15 మంది కౌన్సిలర్లతో షాకీర్ హున్నిసా బుధవారం సమావేశానికి హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఆమెను మున్నిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు.ఇందుకు అంగీకరించని మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ తన వర్గానికి చెందిన పదిమంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన మంగమ్మ కోరం ఉంటుందా? ఎన్నిక జరుగుతుందా? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
బ్లాక్మెయిల్
సంధ్యవేళ. ఆరున్నర దాటుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ముందు ధబ్బుమని శబ్దమైంది. అక్కడున్న కొందరు ఉలిక్కిపడ్డారు. మూడంతస్తుల ఆ బిల్డింగ్ పైనుండి ఎవరో కిందపడ్డారు. మెయిన్ గేటు దగ్గరవున్న కొందరు పారిశుద్ధ కార్మికులు పరిగెత్తుకొచ్చారు. మర్రిచెట్టు చప్టా మీద కూర్చుని సిగరెట్ తాగుతున్న కమిషనర్ డ్రైవర్ అసదుల్లా ఖాన్ సిగరెట్టు అవతల పారేసి హడావుడిగా వచ్చాడు.శ్రావణి శరీరం నేల మీద పడివుంది. కపాలం పగిలి మెదడు కనిపిస్తూ ఉంది. నెత్తుటి మడుగులో ఆమె శవం చూసేవారికి భయం కలిగిస్తోంది. ఆమె కమిషనర్ పర్సనల్ అసిస్టెంట్. డ్రైవర్ అసదుల్లా ఖాన్ కమిషనర్ చాంబర్లోకి పరిగెత్తాడు. కమిషనర్ శాంతి శరణ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.‘‘సార్! శ్రావణి బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.’’ రొప్పుతూ చెప్పాడు డ్రైవర్. ‘‘వాట్..?’’ అదిరిపడుతూ అన్నాడు కమిషనర్. రిసీవర్ క్రెడిల్ చేసి హడావుడిగా వెళ్లాడు. శ్రావణి శవం చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ చాలామంది వెళ్లిపోయారు. కొద్దిమంది పెండింగ్ పని చేసుకుంటూసీట్లలో ఉన్న వాళ్లు వార్త విని పరిగెత్తుకొచ్చారు. కాసేపటికి అంబులెన్స్ వచ్చింది. ఆమె శరీరాన్ని ఎక్కించి పంపించారు. అప్పటికే ఆమెలో ప్రాణం లేదు. పద్ధతి ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విషాదభరితమైన వాతావరణం నెలకొని ఉంది. ఆఫీస్ స్టాఫ్, స్వీపర్లు వగైరా వర్కర్లు హాస్పిటల్ ఆవరణలోని కారిడార్లలో, బైట చెట్ల కింద గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.శ్రావణి తండ్రి రాఘవయ్య మున్సిపాల్టీ ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కారుణ్య నియామకం కింద శ్రావణికి ఉద్యోగం ఇచ్చారు. ఆమె గ్రాడ్యుయేట్. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసింది. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అందులో మానేసింది.ఆమె ఉద్యోగంలో చేరి ఏడేళ్లయింది. కొంతకాలం జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. కంప్యూటర్ కోర్సులు చేసి అందులో ప్రావీణ్యం సంపాదించింది. తర్వాత కమీషనర్కి పర్సనల్ అసిస్టెంట్ అయింది. చాలా మంచిదనీ, సహాయ గుణం కలదనీ పేరు తెచ్చుకుంది. ఆమె అర్ధంతరంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.శ్రావణి తల్లి నిర్మలమ్మ గోడు గోడున ఏడుస్తోంది. ఆమె దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారు ఓదారుస్తున్నారు. పోస్ట్మార్టమ్ తర్వాత ఆమె శవాన్ని అప్పగించారు. శ్రావణి అంత్యక్రియలు జరిగిపోయాయి.ఇన్స్పెక్టర్ చక్రపాణి, ఎస్సై రసూల్ మున్సిపాల్టీ ఆఫీసుకి చేరుకున్నారు. కమిషనర్ శాంతి శరణ్ చాంబర్కి వెళ్లారు. ఆయన చాలా విచారంగా కనిపించాడు. శ్రావణి రోజులో ఆఫీసు సమయం ఆయన దగ్గరే గడుస్తుంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఆఫీసు పనుల్లో సహకరించే అమ్మాయి ఆమె. ‘‘సార్! శ్రావణి సూసైడ్ ఎందుకు చేసుకుని ఉంటుంది? మీరేమైనా చెప్పగలరా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ చక్రపాణి. ‘’నాకు అదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. నాకు తెలిసి ఆమెకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేవు. ఆమె తండ్రి ఉన్నప్పుడు సంపాదించింది ఏం లేదు. అతను తాగుబోతు అని చెప్తారు. నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చి మూడేళ్లే.’’ ‘‘ఐసీ!’’‘‘తండ్రి డెత్ బెనిఫిట్స్, కొంత బ్యాంక్లోన్తో ప్రశాంతినగర్లో ఒక ఫ్లాట్ తీసుకుంది. ఆమెకు తల్లి ఒక్కతే. ఇంకెవరూ లేరు. ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి? అఫ్కోర్స్ తల్లి ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉండొచ్చు.’’ అన్నాడు శాంతి శరణ్. ‘‘ఆమెకు ఇరవై ఏడేళ్లు వచ్చాయి. పెళ్లెందుకు చేసుకోలేదంటారు? లవ్ ఎఫైర్స్ ఏమైనా ఉండి ఉంటాయా? లవ్ ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకుని ఉంటుందా?’’‘‘మేబీ.. మేనాట్బీ. ఎందుకంటే ఆమె పర్సనల్ విషయాలు నాకు తెలీవు. మా మధ్య ఆఫీసు విషయాలే ఉంటాయి!’’ చెప్పాడు కమిషనర్. ఇన్స్పెక్టర్, ఎస్సై ఇద్దరూ చాంబర్ బైటకు వచ్చారు. ‘‘సార్! మఫ్టీలో మన కానిస్టేబుల్స్ నాగరాజు, యాదయ్య మున్సిపాల్టీ సిబ్బంది దగ్గర శ్రావణి విషయాలు సేకరించడానికి తిరుగుతున్నారు. గంటలో ఏమైనా క్లూ దొరుకుతుందేమో తెలుసుకుని వస్తాను.’’ అన్నాడు ఎస్సై రసూల్. చక్రపాణి తలూపాడు. తర్వాత పొర్టికోలోకి వచ్చిన పోలీస్ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయాడు. రసూల్ మున్సిపాల్టీ ఆవరణలో ఉన్న మర్రిచెట్టు చప్టా దగ్గరికి బయల్దేరాడు. అక్కడ కొందరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిలో ఇద్దరు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్. వారు ఏదో పనిమీద వచ్చిన వారిలా స్టాఫ్తో మాటలు కలిపారు. శ్రావణి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లాడు చక్రపాణి. నిర్మలమ్మను కలుసుకున్నాడు. ఇరవై ఏడేళ్ల అందమైన యువతి, జాబ్ చేస్తున్నది అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకున్నదంటే ఏదో తీవ్రమైన, బలమైన కారణం ఉండి ఉంటుంది. ఆమె దగ్గర సూసైడ్ నోట్ వంటిది ఏమీ దొరకలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. కుటుంబంలో గొడవలు లేవు. ఆమెకు జీవితం మీద విరక్తి చెందడానికి కారణాలేవీ కనబడలేదు. ఏదైనా లవ్ ఎఫైర్? అది ఫెయిలైందా? అదే తెలుసుకోవాలి. ప్రేమ భగ్నమైతే జీవితం మీద విరక్తి కలగడం, చావాలనిపించడం సహజం. ‘‘సార్! మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోమని పోరుతూనే ఉన్నాను. ‘అమ్మా! నేను చనిపోతే ఒంటరిదానివవుతావు. నేను బాగా ఉండగానే పెళ్లి చేసుకో’ అని సతాయిస్తున్నాను. ‘నువ్వెక్కడ పోతావు? నీకంటే నేనే ముందు పోతాను. నువ్వు నూరేళ్లు బతుకుతావు’ అనేది పిచ్చితల్లి.’’ అంటూ నిర్మలమ్మ కూతుర్ని తలుచుకుని ఏడ్చింది. ‘‘శ్రావణికి పెళ్లి ఇష్టం లేదని మీకేమైనా అనుమానం ఉందా?’’ ప్రశ్నించాడు చక్రపాణి. ‘‘పెళ్లికి ముందు బాగా సెటిలైపోవాలి. తొందరేంటి? పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు అనేది.’’ చెప్పింది నిర్మలమ్మ.‘‘సొంత ఇల్లుంది. నెలనెలా జీతం వచ్చే మంచి జాబ్ ఉంది. సెటిలైనట్టేగా? ఇంకేంటి?’’‘‘కాదండీ! శ్రావణికి పెద్ద కోరికలున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలి. తర్వాతే పెళ్లి అనేది.’’‘‘విల్లానా? గేటెడ్ కమ్యూనిటీలోనా? మినిమమ్ కోటి రూపాయలు కావాలిగదా!’’‘‘సార్! ఆ మాటే నేనూ అన్నాను. అమ్మా! ఈ ఫ్లాట్ అమ్మేద్దాం. నా దగ్గర కొంత డబ్బుంది. లోన్ తీసుకుందాం అనేది.’’‘‘ఏమీ అనుకోకండి. మీ అమ్మాయికి జీతంకాక పై సంపాదన ఏమైనా ఉండి ఉంటుందా?’’‘‘అనుకోవడానికి ఏముందండీ! అప్పుడప్పుడు డబ్బు తెస్తుండేది. మనం అడగనవసరం లేదమ్మా! నజరానాలు వాళ్లే ఇస్తారు అని నవ్వేదండీ.’’‘‘శ్రావణికి సంబంధించిన డైరీలు కానీ, డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవ్వండి. ఆమె మరణానికి సంబంధించిన క్లూ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం.’’నిర్మలమ్మ ఖరీదైన స్మార్ట్ఫోన్ ఒకటి తెచ్చి ఇచ్చింది.‘‘సార్! ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఈ ఫోన్ ఇంట్లోనే ఉంచుతుంది. వేరే ఫోన్తో ఆఫీస్కి వెళ్తుంది. రెండు ఫోన్లు ఎందుకమ్మా? అంటే కావాల్లే అమ్మా అనేది.’’ చెప్పింది నిర్మలమ్మ. శ్రావణి ఇంట్లో వాడుకునే స్మార్ట్ఫోన్ తీసుకుని ఆఫీస్కి బయల్దేరాడు ఇన్స్పెక్టర్ చక్రపాణి. శ్రావణికి కాంట్రాక్టర్ భానుప్రకాశ్తో గాఢమైన స్నేహం ఉందనీ, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ, మున్సిపాల్టీ స్టాఫ్, వర్కర్లు అంతరంగ సంభాషణల్లో ఎస్సై రసూల్కి వెల్లడించారు. అప్పుడప్పుడు కమిషనర్ వెళ్లిపోయాక, శ్రావణి భాను ప్రకాశ్ కారులో వెళ్లడం చూశామని కొందరు చెప్పారు.భాను ప్రకాశ్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. అనుభవం గడించాక మున్సిపాల్టీలో కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. శ్రావణితో సన్నిహిత సంబంధాలున్నాయని తెలుసుకున్నాక స్టేషన్కి పిలిపించారు. ‘‘చెప్పండి భానుప్రకాశ్! శ్రావణి ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటారు? మీకు ఆమెతో క్లోజ్ రిలేషన్ ఉందని మాకు సమాచారం ఉంది.’’ అన్నాడు చక్రపాణి, తన ఎదురుగా కూర్చున్న భాను ప్రకాశ్తో. భాను ప్రకాశ్ చాలా నిబ్బరంగా కనిపించాడు. అతనిలో ఆందోళన, తడబాటు ఏమాత్రం లేవు. ‘‘సార్! ఆ విషయంలో నేనేమీ చెప్పలేను. నేను శ్రావణితో రిలేషన్లో ఉన్న మాట నిజమే. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. కానీ శ్రావణికి పెద్ద ఆశలుండేవి. ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలనేది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం. ‘తొందరేంటి? పెళ్లికి ముందే లైఫ్ బాగుంటుంది. ఆ తర్వాత రొటీన్లో పడిపోతాం. పిల్లలు పుట్టాక లైఫ్లో థ్రిల్ ఏముంటుంది?’ అనేది.’’ చెప్పాడు భాను ప్రకాశ్. ‘‘అంతేనా? లేక మీ పెళ్లికి నిర్మలమ్మ ఏమైనా అభ్యంతరం పెడుతున్నదా?’’‘‘అటువంటి ప్రాబ్లమ్ వస్తే మేం సివిల్ మ్యారేజ్ చేస్కుందాం అనుకున్నాం. ఆమె తల్లి వల్ల ప్రాబ్లమ్ ఉన్నట్టు శ్రావణి ఎప్పుడూ అనలేదు సార్.’’ చెప్పాడు భాను ప్రకాశ్. చక్రపాణి అతనితో మాట్లాడుతుండగా ఎస్సై రసూల్ వచ్చి శ్రావణి స్మార్ట్ఫోన్ అందించి నిలబడ్డాడు. తనతో ఏదో చెప్పబోతున్నాడని చక్రపాణి గ్రహించాడు. శ్రావణి విషయంలో ఏదైనా క్లూ దొరికితే చెప్పమని భాను ప్రకాశ్ని పంపించివేశాడు చక్రపాణి. మర్నాడు కమిషనర్ శాంతి శరణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘శాంతి శరణ్ గారూ! చెప్పండి శ్రావణిని ఎందుకు మేడమీద నుంచి తోసేసి హత్యచేశారు?’’ఏసీపీ అడిగిన ప్రశ్నకు అతనికి ముచ్చెమటలు పడుతున్నాయి. కాదనడానికి ఛాన్స్ లేదు. శ్రావణి స్మార్ట్ఫోన్లో రికార్డయిన దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక నోరు విప్పక తప్పలేదు. ‘‘బ్లాక్మెయిల్ సార్..’’ అన్నాడు శాంతి శరణ్. ‘‘బ్లాక్మెయిలా?’’‘‘అవును సార్! శ్రావణి కనిపించేంత అమాయకురాలు కాదు. తన స్నేహితురాలంటూ సురేఖను పరిచయం చేసింది. ఆమె మోడలింగ్ చేసేది. మిస్ ఇండియా అవార్డ్ కొంచెంలో తప్పిపోయిందని చెప్పేది. సురేఖ చొరవగా నన్ను లొంగదీసుకుంది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. శ్రావణికి డబ్బు ఆశ చాలా ఎక్కువ. నేను అప్పుడప్పుడూ బిల్డర్స్ దగ్గరా, కాంట్రాక్టర్ల దగ్గరా నజరానాలు ఇప్పించేవాడిని. ఆ చిన్న చిన్న మొత్తాలు ఆమెకు తృప్తి కలిగించేవి కావని పసిగట్టలేకపోయాను. ఒక పెద్ద వెంచర్లో నాకు భారీగా డబ్బు ముట్టింది. శ్రావణి అందులో సగం ఇమ్మని అడిగింది. ఇవ్వకపోతే సురేఖతో ఉన్న ఇంటిమేట్ సీన్స్ అన్నీ నా భార్యకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేసింది. ఆమెలో ధనదాహం నాకు కోపం తెప్పించింది. మాకు ఎప్పుడూ బిల్డర్స్తో డీలింగ్సే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను బ్లాక్మెయిల్కి లొంగితే, అది అప్పటితో పోదు. ఇక తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. ఆ రోజు డబ్బు ఇస్తాను రమ్మని టెర్రస్పైకి తీసుకెళ్లాను. చీకటి పడ్డాక టెర్రస్పైన బిల్డర్స్తో రహస్య సమావేశాలు మామూలే. పైన కుర్చీలు, టేబుల్ వంటివి వేసి ఉంటాయి. శ్రావణి నా ఆలోచన పసిగట్టలేకపోయింది. మాటలు చెబుతూ ఆమెను కిందకు నెట్టేసి నా చాంబర్కి వెళ్లిపోయాను. ఎవరూ చూడకపోవడం అదృష్టం అనుకున్నాను.’’ చెప్పాడు కమిషనర్ శాంతి శరణ్. - వాణీశ్రీ -
వీళ్లు సామాన్యులు కాదు
ప్రజాధనాన్ని దోచుకోవడానికి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ నేతలు వదులుకోవడం లేదు. ఇందుకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చిరునామాగా నిలుస్తోంది. చేయని పనులకు తప్పుడు బిల్లులు సృష్టించిన టీడీపీ నేతలు రూ.78 లక్షల ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకున్నారు. తప్పుడు పనులకు ఫైలు సృష్టించిన అధికారులకు పర్సెంటేజీల రూపంలో మామూళ్లు అందజేశారు. చిత్తూరు అర్బన్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగేళ్ల కాలంలో జేసీబీలకు చెల్లించిన అద్దె రూ.78 లక్షలు. ఏంటీ అవాక్కయ్యారా..? నిజమండీ బాబు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ చిట్టా పద్దుల్లో రాసుకున్న అక్షర సత్యం. రోడ్లు వేయాలంటే సిమెంటు కొనాలి. కమ్మి, రాళ్లు, కూలి ఇవ్వడంతో పాటు పెట్టుబడి కూడా పెట్టాలి. రూ.లక్ష పెట్టుబడి పెట్టి నాణ్యతగా రోడ్డు వేస్తే రూ.8 వేలు మిగిలే అవకాశముంది. అది కూడా అధికారులకు ఎలాంటి మామూళ్లు ఇవ్వకపోతే. కానీ పైసా పెట్టుబడి పెట్టకుండా, క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా గమ్మత్తుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఒకే ఒక్క అవకాశం జేబీసీకే దక్కుతుంది. మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు తీశామని, రోడ్డుకు పక్కనున్న మట్టిని తీయించామని, చెరువు కట్టపై పిచ్చి మొక్కలు తొలగించామని, చెరువుకట్ట తెగ్గొట్టడానికి, కట్టను పూడ్చడానికి, రోడ్డు విస్తరణ పనులు అబ్బో ఇలా చాలా కారణాలను కష్టపడి మరీ కనుక్కుని రికార్డుల్లోకి ఎక్కించారు. ఇలా పలు కారణాలకు నాలుగేళ్ల కాలంలో జేసీబీని ఏకంగా 464 రోజులు వినియోగించినట్లు బిల్లులు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా కార్పొరేషన్ కార్యాలయంలోని ఒక్క పారిశుద్ధ్య విభాగంలోనే రూ.అరకోటి దోచేశారు. అందరికీ వాటాలు.. పక్కాగా చేసిన పనులకైతే ఏ ఒక్కరికీ వాటాలు, లంచాలు ఇవ్వాల్సిన అసరంలేదు. చేయని పనులకు, తప్పుడు పనులకు, నాణ్యత లేని పనులకు తప్పకుండా వాటాలు పంచాల్సిందే. జేసీబీల ద్వారా పనులు చేయకుండానే టీడీపీ చెందిన 18 మంది కార్పొరేటర్లు రూ.62 లక్షల బిల్లులు బినామీల పేరిట కాజేశారు. ఇదే సమయంలో వాస్తవ పనులకు జేబీసీ పెట్టిన పలువురికి ఇప్పటికీ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. నేతలు చూపించిన దారి మున్సిపల్ కార్యాలయంలోని ఓ శానిటరీ ఇన్స్పెక్టర్, మరో గుమాస్తా, ఇంజనీరింగ్ విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేసే మరో గుమస్తాకు బాగా కలిసి వచ్చింది. జేసీబీల పేరిట తప్పుడు బిల్లులు సృష్టించి రూ.7 లక్షల వరకు జేబుల్లో వేసుకున్నారు. టీడీపీ నేతలకు ఈ విషయం తెలిసినా అడగలేని పరిస్థితి. అడిగితే తమ బాగోతం బయటకొస్తుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు. బిల్లుల మంజూరులో ఓ ఇంజినీరు, గణాంక శాఖ విభాగంలోని మరో అధికారి, గుమస్తాకు రూ.2 లక్షల వరకు వాటాలు చేరాయని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తవే కొనేయొచ్చు.. నాలుగేళ్లలో జేసీబీలకు పెట్టిన ఖర్చుతో మూడు కొత్త జేసీబీ యంత్రాలను కొనచ్చు. ఒక్కో కొత్త యంత్రం రూ.28 లక్షలే. ఇక మంచి కండీషన్లో ఉన్న సెకండ్హ్యాండ్ యంత్రాలైతే ఏకంగా ఎనిమిదింటిని కొనేయచ్చు. ఇదంతా అధికారులకు తెలియనివా అంటే అన్నీ తెలుసనే చెప్పాలి. తప్పదన్నట్లు కొన్ని.. తమకెంత అని మరికొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. విజిలెన్స్ లాంటి విభాగాలు ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే జరిగిన అవకతవకలు బయటపడే అవకాశముంది. -
కుట్రతోనే బదిలీ చేశారు
అనకాపల్లి: తనను కుట్రతోనే బదిలీ చేశారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనకాపల్లి జోనల్ కమిషనర్ షేక్ సుభానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ కార్యదర్శిగా పదోన్నతిపై బదిలీ చేస్తూ ఈ నెల 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి విధుల నుంచి రిలీవ్ కావల్సిన నేపథ్యంలో పలువురు అధికారులు, రాజకీయ పార్టీ నేతలు సుభానీని మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల సమక్షంలో కమిషనర్ సుభానీ తన బదిలీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అదనపు సంచాలకులు ఆశాజ్యోతి తనను కుట్రతో బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. ఆశాజ్యోతి గతంలో ఆర్డీగా పనిచేసినప్పుడు తనను పలు అంశాల్లో ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు తన బదిలీ విషయంలోనూ కావాలని లక్ష్యం చేసుకున్నారని ఆరోపించారు. తనకు కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే సర్వీసు ఉందని, ఇటువంటి సమయంలో బదిలీ చేయరాదని, ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే సమీప ప్రాంతానికి బదిలీ చేయాలే తప్ప పుట్టపర్తి వంటి దూర ప్రాంతానికి పంపించడం అన్యాయమన్నారు. ఎక్కడికైనా బదిలీపై వెళ్లేందుకు అభ్యంతరం లేదని, కాని వ్యక్తిగత సమస్యలు ఉన్నందున ఇబ్బందులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తానని కూడా వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. తన బదిలీని నిలుపుదల చేసుకునేందుకు ఎటువంటి పైరవీలు చేయనని చెప్పడం గమనార్హం. -
కోటి కొట్టేశారు
నెల్లూరు నగరపాలక సంస్థ దోచుకున్నవాడికి దోచుకున్నంత అనే రీతిలో తయారైంది. పనులు చేయకపోయినా çపర్వాలేదు.. పరపతి ఉంటే చాలు పాత బిల్లులు కూడా మంజూరు చేసేస్తారు. అయితే ప్రతి దానికీ ఓ రేటు ఉంటుంది. కాంట్రాక్టర్లు పరపతి వినియోగించుకోవటంతో పాటు ఆ రేటుకు ఒప్పుకుంటే చాలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులు రోజుల వ్యవధిలో మంజూరవుతాయి. 2016 సంవత్సరంలో బిల్లులు సదరు కాంట్రాక్టర్కు తెలియకుండానే గత నెలలో చెల్లించే వ్యవహారం ఇప్పటికే తీవ్ర దుమారం రేపింది. దీనికి కొనసాగింపు అనే రీతిలో గతంలోనూ ఇదే తరహా బిల్లుల చెల్లింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2011లోని బిల్లులను 2015లో చెల్లించారు. ఏకంగా రూ.కోటి చెల్లించారు. దీని వెనుక అధికార పార్టీ కీలక నేత ముఖ్య అనుచరుడు అంతా తానై వ్యవహారం నడిపాడు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థలో జవాబుదారీ తనం పూర్తిగా లోపించింది. ఉన్నతాధికారులకు శాఖపై పూర్తి పట్టులేకపోవటమో లేక లంచాలు తీసుకోవడంతో సంస్థలో జరుగుతున్న అక్రమాలపై మౌనం వహిస్తున్నారు. వరుసగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కకు మించి విచారణలు నగరపాలక సంస్థలో జరగుతున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సొంత జిల్లాలోని కార్పొరేషన్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా ఆయన ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. దీంతో అధికారులదే ఇష్టారాజ్యంగా మారింది. నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్లు ఉన్నప్పటికీ ఎవరితో పనిలేకుండా కొందరు అధికారులు వ్యవహరించి అడ్డగోలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా గత నెల్లో చెల్లించిన పాత బిల్లు రూ.65 లక్షల వ్యవహారం హాట్టాపిక్గా మారింది. దీంతో పాటు విజిలెన్స్ విచారణ సాగుతున్న క్రమంలో అదే రీతిలో మరో వ్యవహారం బయటపడింది. పాత బిల్లుతో రూ.కోటి స్వాహా పలువురు కమిషనర్లు ఓ బిల్లు మంజూరు చేసేందుకు నిరాకరించారు. చివరకు ఓ కమిషనర్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని బిల్లు మంజూరు చేశారు. అది కూడా ఐదేళ్ల కిందటి బిల్లు కావటం విశేషం. 2011–13 సంవత్సరం మధ్య నగరపాలక సంస్థ కమిషనర్గా ఆంజనేయులు పనిచేశారు. ఆయన హయంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి లెక్కకు మించి ఖర్చు చేసినట్లు రూ.కోటి వరకు బిల్లులు సృíష్టించారు. 2011 నుంచి 2013 మధ్యలో పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్, సున్నం చల్లడం, కాలువ పూడిక తీత తదితర ఎమర్జెన్సీ పనుల నిమిత్తం సుమారు రూ.కోటి సీ బిల్లులు సృష్టించారు. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ ఆంజనేయులు ఆకస్మిక బదిలీ నేపథ్యంలో ఆ బిల్లులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తరువాత కమిషనర్లుగా వచ్చిన జాన్ శ్యామ్సన్, ఐఏఎస్ అధికారి చక్రధర్బాబు, మరో కమిషనర్ పీవీవీఎస్ మూర్తితో పాటు ఇద్దరు ఇన్చార్జ్ కమిషనర్లు మారారు. వీరిలో ఒక్క కమిషనర్ కూడా బిల్లులు చెల్లించేందుకు సుముఖత చూపలేదు. ప్రధానంగా చేయని పనులకు సీ బిల్లులు సృష్టించినట్లు కమిషనర్ల దృష్టికి రావటంతో వారు ఫైల్ను పక్కన పెట్టేశారు. దీంతో 2015 సంవత్సరంలో కరణం వెంకటేశ్వర్లు కమిషనర్గా వచ్చి కేవలం తొమ్మిది నెలలు పనిచేశారు. ఈ సమయంలోనే సుమారు ఐదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను గుట్టుచప్పుడు కాకుండా మంజూరు చేశారు. దీని వెనుక ఇద్దరు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి తీసుకున్న లంచంలో కమిషనర్కు 20 శాతం వరకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. చక్రం తిప్పింది ఇద్దరే.. కరణం వెంకటేశ్వర్లు కమిషనర్గా ఉన్న సమయంలో సిద్ధిక్ అనే వ్యక్తి అకౌంటెంట్గా పనిచేశారు. ఆయన కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య దళారిగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2011 నుంచి 2013 మధ్యలోని బిల్లులను కరణం వెంకటేశ్వర్లు టేబుల్ పైకి తీసుకొచ్చి కె.మహేశ్వరరావు అనే కాంట్రాక్టర్కు నెల వ్యవధిలో రూ.65 లక్షలు బిల్లులు చెల్లించారు. మరో రూ.25 లక్షలకు పైగా గతంలోని బిల్లులు మంజూరు చేశారు. ఈ వ్యవహారం వెనుక అకౌంటెంట్ సిద్ధిక్, మేయర్కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఇదే తరహా బిల్లుల వ్యవహారంపై విజిలెన్స్ దృష్టి పెట్టిన క్రమంలో అక్రమాలు తెరపైకి రావటం గమనార్హం. -
నీ అంతు చూస్తాం
నగరపాలక సంస్థ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తూ, నోరు పారేసుకుంటున్నారు. ఇలాగైతే తాము ఇక్కడ పని చేయలేమంటూ అధికారులు, సిబ్బంది చర్చించుకోవడం దుమారం రేపుతోంది. అనంతపురం న్యూసిటీ: రాంనగర్లోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలో టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండా ఓ యజమాని నిర్మాణాలు చేపట్టాడు. టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) వినయ్కుమార్ చాలాసార్లు బిల్డర్ (యజమాని)కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ నెల 29న నిర్మాణ పనులు మరింత వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం టీపీఎస్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వెళ్లి అనధికార నిర్మాణం చేపడుతున్న గోడను తొలగించారు. స్థల యజమాని కుమారుడు, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మిత్రులు. విషయం ఎమ్మెల్యే వర్గీయుల దృష్టికి వెళ్లింది. ఫోన్లో నటేష్చౌదరి వార్నింగ్ చివరకు కార్పొరేటర్ నటేష్చౌదరి రంగంలోకి దిగి టీపీఎస్ను ఫోన్లో దుర్భాషలాడాడు. తనకు తెలియకుండా, తన అనుమతిలేకుండా తన డివిజన్లోకి అడుగుపెట్టి నిర్మాణాన్ని తొలగిస్తావా అంటూ ఆగ్రహించాడు. తనపై ఇదివరకే మర్డర్ కేసు ఉందని, కేసులు కొత్తేమీ కాదని.. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక ఎక్కడున్నావంటూ గద్దించడంతో ఆఫీసులో ఉన్నానని టీపీఎస్ తెలిపాడు. కార్పొరేటర్ మందీమార్బలంతో వస్తున్నాడని పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని భావించిన అధికారులు టీపీఎస్ను అక్కడి నుంచి పంపించేశారు. అనుకున్నట్టుగానే నటేష్చౌదరి కార్యాలయానికి చేరుకుని టీపీఎస్ ఎక్కడున్నాడంటూ వీరంగం వేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టార్గెట్ టీపీఎస్ ఎమ్మెల్యే వర్గీయులు టీపీఎస్ వినయ్కుమార్ను తరచూ టార్గెట్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆరో రోడ్డులో తెలుగుదేశంపార్టీ ఫ్లెక్సీ తొలగించినప్పుడు కార్పొరేటర్లు సద్దల హేమలత, విజయశ్రీ, నాయకులు సద్దలశేఖర్, సరిపూటి శ్రీకాంత్ తదితరులు నగరపాలక సంస్థలో హంగామా చేశారు. -
‘పుర’ సమరానికి నిధుల పాచిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. వచ్చే ఏడాది పురపాలికలకు జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచింది. ప్రగతి పద్దు కింద పురపాలక శాఖకు 2017–18లో రూ.2,869.22 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో కేటాయింపులను రూ.4,680.09 కోట్లకు పెంచింది. వరంగల్ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్ల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.117.23 కోట్ల నుంచి రూ.755.20 కోట్లకు పెంచింది. అయితే మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సహాయక నిధులను మాత్రం రూ.426.41 కోట్ల నుంచి 230.10 కోట్లకు తగ్గించింది. మునిసిపల్ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.7.55 కోట్ల నుంచి రూ.141.64 కోట్లకు పెంచింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం అందించే టీయూఎఫ్ఐడీసీకి తొలిసారిగా రూ.200 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150 కోట్ల నుంచి రూ.89.39 కోట్లకు కేటాయింపులను తగ్గించి, అమృత్ పథకానికి రూ.203.96 కోట్ల నుంచి రూ.313.63 కోట్లకు పెంచింది. స్వచ్ఛ భారత్కు రూ.115 కోట్ల కేటాయింపులను కొనసాగించింది. ఆలయాలకు నిధుల వెల్లువ! రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు పెంచింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.100 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.250 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లను కేటాయించింది. తొలిసారిగా భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లు, ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు చెరో రూ.50 కోట్లను కేటాయించింది. ‘మూసీ’ అభివృద్ధికి రూ.377 కోట్లు ప్రగతి పద్దు కింద హైదరాబాద్లో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్ల కేటాయింపులను కొనసాగించి, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులను రూ.377.35 కోట్ల నుంచి రూ.566.02 కోట్లకు పెంచింది. హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టుకు తొలిసారిగా రూ.400 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద జలమండలి, హెచ్ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. హైదరాబాద్ జలమండలికి రూ.1,420.50 కోట్ల రుణం, మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం, హెచ్ఎండీఏకు రూ.250 కోట్ల రుణం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణాల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. -
మీ డీడీఎన్ ఎంత ?
మీ డీడీఎన్ ఎంత? అని ఇకపై ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. డీడీఎన్ అంటే ఏమిటబ్బా!! అని ఆశ్చర్యపోకండి. మీ ఇంటి డిజిటల్ డోర్ నంబరే సంక్షిప్తంగా డీడీఎన్. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, సెల్ఫోన్ నంబర్ లాగే భవిష్యత్తులో డీడీఎన్ రాబోతోంది. ఓ వ్యక్తికి ఆధార్ నంబర్ ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ఓ ఇంటికి డీడీఎన్ కూడా అదే రీతిలో గుర్తింపు కల్పిస్తుందని పురపాలక శాఖ చెబుతోంది. సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇంటింటికీ డిజిటల్ డోర్ నంబర్లు (డీడీఎన్) కేటాయించే కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. సూర్యాపేటలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇంటింటికీ డీడీఎన్ల కేటాయింపు విజయవంతం కావడంతో రాష్ట్రంలోని 72 నగరాలు, పట్టణాల్లోని 12 లక్షలకు పైగా ఇళ్లకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. ఐదు నెలల వ్యవధిలో డీడీఎన్లు కేటాయించేందుకు కాంట్రాక్టర్ల కోసం ప్రకటన జారీ చేసింది. జియో ట్యాగింగ్.. ఇప్పటికే నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే జరిపి ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసిన పురపాలక శాఖ.. ఇళ్లకు కేటాయించే డీడీఎన్లతో జియో ట్యాగింగ్ నంబర్లను అనుసంధానం చేయనుంది. డీడీఎన్ను ఉపయోగించి గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సహాయంతో సంబంధిత ఇంటిని గుర్తించి అక్కడికి చేరుకునేందుకు వెసులుబాటు కలగనుంది. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో లొకేషన్కు చేరుకునేందుకు ఉపయోగపడనుంది. క్యాబ్, ఫుడ్, కొరియర్ తదితరాల డెలివరీకి 30 శాతం వరకు సమయం ఆదా కానుంది. భవిష్యత్తులో డీడీఎన్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్యం, వంట గ్యాస్, తపాలా, అత్యవసర సేవలు అందించే అవకాశముంది. డీడీఎన్ సెర్చ్ సదుపాయం తెలంగాణ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో పురపాలక శాఖ డీడీఎన్ల కేటాయింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంగ్ల అక్షరాలు, సంఖ్యల కలయికతో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన డీడీఎన్ను కేటాయించనున్నారు. ఇంటింటికి సర్వే జరిపి పాత ఇంటి నంబర్, మైలు రాయి, వీధి పేరు, ప్రాంతం, నగరం పేరుతోపాటు ఇంటి ఫోటో, యజమాని ఫోన్ నంబర్ను సేకరించనున్నారు. ఈ వివరాలను ఆ ఇంటికి కేటాయించే డీడీఎన్తో అనుసంధానం చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత పౌరులకు పురపాలక శాఖ ‘డీడీఎన్ సెర్చ్’అవకాశాన్ని కల్పించనుంది. అనంతరం పట్టణ ప్రాంతాల డిజిటల్ రోడ్ నెట్వర్క్ను కూడా రూపొందించనుంది. -
12 నుంచి 14 వరకూ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అమరావతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2017ను నిర్వహించనున్నట్లు కమిషనర్ జె.నివాస్ వెల్లడించారు. తన చాంబర్లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోందన్నారు. పిల్లల హక్కులకు సంబంధించిన సినిమాలు చూపించి వాటిపై చర్చ చేపట్టనున్నట్లు తెలిపారు. సినిమాను చూసి ఏం నేర్చుకోవాలనే విషయాన్ని తెలియజెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు. 48 గంటల చాలెంజ్లో భాగంగా పిల్లలతో షార్ట్ ఫిల్మ్స్ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో వచ్చిన పిల్లల చిత్రాలను చూపించి వాటి ఆధారంగా షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక రూపొం దించామని వివరించారు. పూణేకు చెందిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు షార్ట్ ఫిల్మ్ తయారీపై పిల్లలకు శిక్షణ ఇస్తారన్నారు. బెస్ట్ ఫిల్మ్స్కు బహుమతుల్ని అందిస్తామన్నారు. వర్థమాన కథానాయకులు ఆదర్మ్, నిఖిల్ హాజరుకానున్నట్లు తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ తయారీపై ఆసక్తి గల నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులతో పాటు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా స్కూల్స్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిల్మ్ మేకింగ్కు సంబంధించి 24 క్రాఫ్ట్స్పై అవగాహన కల్పించడంతో పాటు మేకింగ్కు సంబంధించి పరికరాలను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండియా సమకూరుస్తోందని తెలిపారు. నగరంలోని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. -
అక్కడ ప్రతిరోజూ జనగణమన
జైపూర్ : జాతీయగీతం జనగణమనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న దశలో జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అపూర్వమైన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రతి రోజూ జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతాలాపనపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వారం రోజులు తరువాత ఇక్కడి అధికారులు ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారం నుంచి జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి రోజూ ఉదయం 9:50 గంటలకు జాతీయ గీతం జనగణమన, సాయంత్రం 5:55 గంటలకు జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 9:50 గంటలకు అధికారులంతా నిలబడి జనగణమన ఆలపించారు. జాతీయ గీతాలాపనపై జైపూర్ మేయర్ అశోక్ లాహోటి మాట్లాడుతూ.. జనగణమన ఆలపనతో పని ప్రారంభించడం వల్ల ఉత్తేజంతో పనిచేస్తామని తెలిపారు. -
జననాల నమోదు ‘డబుల్’
జననాల నమోదు శాతం భారీగా పెరిగింది. పదేళ్ల కింద 40.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 82.9 శాతానికి పెరిగింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో జనన ధ్రువీకరణ కీలకంగా మారింది. ఆధార్ కార్డు వంటి వివిధ కార్డుల జారీలోనూ జనన ధ్రువీకరణ తప్పనిసరైంది. దీంతో ప్రజల్లో జనన నమోదుపై శ్రద్ధ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జననాల నమోదు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ పట్టణాల్లోనే మెరుగ్గా.. జననాల నమోదులో పట్టణ ప్రాంతాల్లోనే పరిస్థితిమెరుగ్గా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక వ్యవస్థ ఉండటంతో నమోదుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసిన పక్షం రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 92.9 శాతం జననాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా 62.6 శాతమే నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో అయోమయం.. గ్రామీణ ప్రాంతాల్లో జనన ధ్రువీకరణ పత్రాల పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వీలుంది. అయితే ఆ పంచాయతీ కార్యకలాపాలన్నీ ఆన్లైన్ ద్వారా పనిచేస్తే కేంద్రం రూపొందించిన జనన, మరణ నమోదు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా జారీ చేయాలి. కానీ రాష్ట్రంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్గానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.దీంతో పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. వాటిని స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి ‘రికార్డ్ నాట్ ఫౌండ్’అని పేర్కొంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. కనిష్టంగా నెల రోజుల తర్వాత ఈ పత్రాన్ని జారీ చేసినప్పటికీ.. జనన ధ్రువీకరణ పత్రం ఎక్కడ పొందాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. -
చెప్పుతో కొట్టుకున్నకార్పొరేటర్
అనంతపురం: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ టీడీపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. తన డివిజన్ పై నిర్లక్ష్యం చూపుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ మూర్తి ఎదుట టీడీపీ కార్పొరేటర్ ఉమా మహేశ్వర్రావు చెప్పుతో కొట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల తీరుపై ఊగిపోయిన అధికారపార్టీ కార్పొరేటర్ ఉమా చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. -
వాటా ఇస్తేనే సంతకం
► పర్సంటేజీ ఇవ్వకపోతే బిల్లుల్లో జాప్యం చేస్తున్న అధికారి ► కాళ్లరిగేలా తిరుగుతున్న కాంట్రాక్టర్లు నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు చేతులు తడిపితేనే పని జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కార్పొరేషన్ ఆడిటింగ్ విభాగంలో ఓ అధికారి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తనకు రావాలి్సన పర్సంటేజీలను అడగకముందే ఇస్తే రెండు రోజుల్లో సంతకాలు చకచక జరిగిపోతున్నాయి. పర్సంటేజీలు చెల్లించకపోతే కొర్రీలు పెడుతూ ఆ అధికారి జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఫైళ్లు తెప్పించుకుంటున్న వైనం కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేసిన అనంతరం ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి నోట్ ఫైల్ను తయారు చేశారు. ఆ తర్వాత ఆడిటింగ్ విభాగంలోని అధికారి పరిశీలించి అకౌంట్స్ విభాగానికి పంపుతారు. చివరికి కమిషనర్ బిల్లులను మంజూరు చేస్తారు. అయితే కమిషనర్ పరిశీలన అనంతరం కూడా ఆడిటింగ్ విభాగంలోని అధికారి తిరిగి మళ్లీ ఫైల్ను తన చాంబర్కు తెప్పించుకుంటున్నారని సమాచారం. పర్సంటేజీ ఇవ్వని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు ఆడిటింగ్ విభాగంలోని ఇద్దరు అధికారుల మధ్య పర్సంటేజీల వివాదం నడుస్తోంది. రూ.లక్ష లోపల పనులకు సంబంధించిన బిల్లులకు అసిస్టెంట్ ఎగ్జామినర్ సంతకాలు చేస్తున్నారు. రూ.లక్షకు పైబడిన బిల్లులకు అసిస్టెంట్ ఎగ్జామినర్కు సంబంధం లేకుండా ఫైళ్లపై ఎగ్జామినరే సంతకాలు చేస్తున్నారు. దీంతో వీరి మధ్య పనుల పంపకాలపై ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. మరోవైపు పర్సంటేజీలను డిమాండ్ చేయడంపై కాంట్రాక్టర్లు కమిషనర్ ఢిల్లీరావుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇంజినీరింగ్, అకౌంట్స్, ఆడిటింగ్ విభాగాలకు పర్సంటేజీల రూపంలో చెల్లిస్తే తాము నాణ్యమైన పనులను చేయలేమని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. -
నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు
నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఉన్న అప్పులు చాలవన్నట్లు కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం రూ.137 కోట్లు, జేఎన్ఎన్యూఆర్ఎం గృహ నిర్మాణాలు, ఇతర ప్రాజెక్టుల పూర్తికి రూ.100 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. రూ.73 కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోయాయి. టాప్ డిఫాల్టర్స్ లిస్ట్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండటం పాలకుల పనితీరును తేటతెల్లం చేస్తోంది... విజయవాడ సెంట్రల్ : నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అనే చందంగా టీడీపీ పాలకుల పనితీరు తయారైంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నగరపాలక సంస్థ ఆదాయానికి పాలకులు మరింత గండికొడుతున్నారు. ఏళ్ల తరబ డి పన్ను బకాయిలు చెల్లించకుండా ఆట లాడుతున్నారు. సుమారు రూ.73.39 కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులే లెక్కతేల్చారు. టాప్ 100 డిఫాల్టర్స్లో చోటుదక్కించుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) రూ.9,44,505, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్ రూ.14,86,358 మేర పన్నుబకాయిలు చెల్లించాల్సి ఉం ది. గడిచిన రెండేళ్లుగా బకాయిలు చెల్లిం చలేదని సమాచారం. సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి నగరపాలక సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పడండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించే అధికారులు పాలకుల నుంచి పన్నులు వసూలు చేయలేక అగచాట్లు పడుతున్నారు. జలీల్ఖాన్ ఇటీవలే రూ.2లక్షలు చెల్లించి మిగతా మొత్తాన్ని బకాయి పెట్టినట్లు తెలుస్తోంది. అదేమంటే మాది ఉమ్మడి ఆస్తి, నా తమ్ముడు వాటా తాలూకు బకాయి ఉందంటూ రెవెన్యూ అధికారులకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ కేశినేని వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రూ.2 లక్షలపైనే బకాయి ఉన్నారు. 2016–17 సంవత్సరానిదే కాబట్టి కట్టేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అప్పుమీద అప్పు కాంగ్రెసోళ్ళు అప్పులు చేసి కార్పొరేషన్ను నాశనం చేశారని పదేపదే తిట్టిపోసే టీడీపీ పాలకుల నోట అప్పుల పాట వినిపిస్తోంది. జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్ట్లోని గృహనిర్మాణాలు, ఇతర పథకాల పూర్తి కోసం రూ.100 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకొనేందుకు ఇటీవలే కౌన్సిల్లో తీర్మానం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా బందరు, ఏలూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్నామ్నాయ రహదారులు, వంతెనల నిర్మాణం కోసం రూ.137 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ఇందుకోసం అప్పు చేయాలని ప్రభుత్వం నగర పాలక సంస్థకు సూచించింది. మెట్రోరైలు ప్రాజెక్ట్కు నగరపాలక సంస్థకు సంబంధం ఏమిటన్నది అంతుబట్టని విషయం. రూ.137 కోట్లు అప్పు తీసుకున్నట్లైతే కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి చిధ్రం అవుతోంది. ఇప్పటికే రూ.284 కోట్ల అప్పులో ఉంది. జెఎన్ఎన్యూఆర్ఎం, మెట్రోరైలు అప్పులు కలిపి రూ. 237 కోట్లు వెరసి రూ.521 కోట్లకు అప్పు ల చేరుతోంది. కార్పొరేషన్ ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే సరిపోతుంది. పుష్కర నిధుల్లో కోతే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.186 కోట్లలో ఇప్పటి వరకు రూ.91 కోట్లే విడుదలయ్యాయి. మిగితా రూ.95 కోట్లలో కోతపెట్టాలనే యోచన లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్లు, డ్రెయినేజ్ పనులు ఇంకా పెండింగ్లో ఉండగా వాటిని పక్కన బెట్టేయమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పుష్కరాలను పురస్కరించుకొని చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ.17.16 కోట్లు ఇప్పటికీ మంజూరు చేయలేదు. వీటి విడుదల కోరుతూ మేయర్ శ్రీధర్ ఆర్థికమంత్రి, ఎంఏయూడీ ప్రిన్సిపుల్ సెక్రటరీ, డీఎంఏల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అప్పు కాదు గ్రాంటు మెట్రో రైలు ప్రాజెక్ట్కు రూ.137 కోట్లను ప్రభుత్వం గ్రాంట్గా మంజూరు చేస్తోంది. ఇందుకోసం ఎలాంటి అప్పు చేయడం లేదు. జెఎన్ఎన్యూఆర్ఎం పథకం పూర్తి కావాలంటే అప్పు చేయక తప్పదు. త్వరలోనే కృష్ణాపుష్కరాల నిధులు విడుదల అవుతాయి. కోనేరు శ్రీధర్ మేయర్, నగరపాలక సంస్థ -
టీడీపీ నేతల కుర్చీల లొల్లి!
-
బల్దియాలో.. లంచావతారులు
పైసలివ్వనిదే కదలని ఫైళ్లు ఇప్పటికే ఏసీబీ వలలో ఏడుగురు ఉద్యోగులు అయినా మారని తీరు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు, సిబ్బంది ప్రజలను రాబందుల్లా పీక్కుతుంటున్నారు. ఉండటానికి ఇళ్లు నిర్మించుకుందామనుకుంటే పునాది వేసినప్పటి నుంచి ఇంటి నెంబర్ వచ్చేంతవరకు లంచావతారులు ప్రజలను జలగల్లా పీక్కుతింటున్నారు. ఆర్ఐ కరీముల్లాఖాన్ ఇంటినెంబర్ వేయడానికి భగత్నగర్లోని పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న వజ్రనివాస్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భగత్నగర్కు చెందిన మాచర్ల రాంనర్సయ్య వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. పైసలిస్తేనే! నగరపాలక సంస్థలో ఏ పని కావాలన్నా లంచంలేనిదే ఫైల్లు కదలడం లేదు. పైసలిస్తే పనులు అవుతున్నాయి. లేదంటే ఏళ్లకొద్దీ కార్యాలయం చుట్టూ తిరిగిన పనిమాత్రం కాదు. బల్దియాలోని అన్ని శాఖల్లో అవినీతి పెచ్చుమీరింది. లంచాలకు అలవాటుపడ్డ అధికారులు పైసలు చేతుల పడందే పనిచేయడం లేదు. రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, అకౌంట్స్, చివరకు పుట్టినా.. చచ్చినా.. సర్టిఫికెట్ కోసం సైతం లంచం సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కార్పొరేషన్లో అవినీతి తాండవిస్తున్నా అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినపడుతున్నారుు. అధికారులు, ఉద్యోగులు లంచాలు ముట్టవద్దని, బాధ్యతగా పనిచేయాలంటూ ప్రభుత్వం ఓ వైపు అడ్డగోలుగా వేతనాలు పెంచుతున్నప్పటికీ, గుట్టు చప్పుడు కాకుండా జేబులు నింపుకుని కింది నుంచి పైదాకా వాటాలు పంచుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటుపడ్డ అధికారులు నిజాయితీగా పనిచేసేందుకు ముందుకురావడం లేదు. రెచ్చిపోతున్న లంచావతారులు కరీంనగర్ మున్సిపాలిటీలో 1993 నుంచి ఇప్పటి వరకు ఏడుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. 1993లో నేతికుంట యాదయ్య అనే కాంట్రాక్టర్కు సంబంధించిన బల్లులు చెల్లించేందుకు అకౌంటెంట్ చంద్రశేఖర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2001లో రాంరెడ్డి అనే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ను మాజీ కౌన్సిలర్ మంజీత్సింగ్, 2006లో మనోహర్ అనే క్లర్క్ను కాంట్రాక్టర్ శ్రీనివాస్, 2007లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బిల్ కలెక్టర్లు బాల్రెడ్డి, సంజీవరెడ్డిలను, 2009లో బిల్లుల చెల్లింపులో లంచం అడిగినందుకు మేనేజర్ కైలాసంను కాంట్రాక్టర్ చల్ల హరిశంకర్ ఏసీబీకి పట్టించారు. తాజాగా గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరీముల్లాఖాన్ వజ్ర అపార్టుమెంట్ అసెస్మెంట్కోసం సదరు యజమాని మాచర్ల రాంనర్సయ్య వద్ద రూ.30 వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ను ఆశ్రయించాడు. సామాన్యులను బల్దియా ఉద్యోగులు ఏవిధంగా పీడించుకు తింటున్నారనేది అర్థమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతిని అరికట్టేందుకు, పారదర్శకమైన పాలనను అందించేందకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బాలీవుడ్ హీరోకు నోటిసులు
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు మున్పినల్ కార్పోరేషన్ వారు నోటీసులు జారీ చేశారు. షాహిద్ వ్యక్తిగతంగా ఉపయోగించే స్విమింగ్ పూల్లో డెంగీ వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్టుగా గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. చాలా రోజులుగా పూల్లో నీరు మార్చకపోవటమే ఇందుకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. షాహిద్ ఉంటున్న అదే అపార్ట్మెంట్లోని మరో స్విమింగ్ పూల్ ఓనర్కు కూడా ఇదే కారణంతో నోటిసులు జారీ చేశారు. అయితే షాహిద్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమెకు డెంగీ సోకినట్లుగా అనుమానిస్తున్న అధికారులు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో స్విమింగ్ పూల్లో డెంగీ కలిగించే దోమలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిరాకరించారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు!
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు!
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న మూడంచెల వ్యవస్థను కొనసాగించాలని పేర్కొంది. పంచాయతీ సర్పంచ్లు మండల పరిషత్ చైర్మన్ను, మండల పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారని తెలిపింది. నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. స్థానిక సంస్థల పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి పూంచీ కమిటీ చేసిన సిఫార్సులపై రాష్ట్రం ఈ మేరకు తన అభిప్రాయాలను కేంద్రానికి లిఖిత పూర్వకంగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేసిన పక్షంలో రాష్ట్రంలో 10,148 ఎంపీటీసీ, 660 జెడ్పీటీసీ పదవులు రద్దు కానున్నాయి. ఇక స్థానిక సంస్థలకు అధికారాల బదిలీకి చట్టబద్ధత కల్పించాలని పూంచీ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై చట్టబద్ధత వద్దని, ఒక నమూనాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పంచాయతీరాజ్ చైర్పర్సన్ పదవులకు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ విధానంపై కొనసాగించాలని, అయితే ఒకే టర్మ్లో కాకుండా 2 టర్మ్ల తరువాత రొటేషన్ రిజర్వేషన్లను అమలు చేయాలని పూంచీ కమిటీ సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తూనే రిజర్వేషన్లను నోటిఫై చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని కోరింది. -
డబ్బుల్లేవ్!
► నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేనట్టే ► ప్రస్తుతం 29 సిగ్నల్స్లో పనిచేసేవి ఆరే సిగ్నల్స్ ఏర్పాటు, ► జీబ్రా లైన్ల బాధ్యత నగరపాలక సంస్థదే ► కనీసం పుష్కర నిధుల్లో కేటాయించాలని ► కోరిన పోలీసులు చేతులెత్తేసిన నగరపాలక సంస్థ సాక్షి, విజయవాడ : నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే సూచనలు లేవు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్లు, ఇతర ట్రాఫిక్ అవసరాలు తీర్చాల్సిన నగరపాలక సంస్థ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. దీంతో నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. మరో 100 రోజుల్లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. ఈ క్రమంలో అయినా కనీసం నగరంలో కొద్దిమేరకైనా ట్రాఫిక్ తక్షణ అవసరాలు తీర్చకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ట్రాఫిక్ పోలీసు అధికారులు నగర మేయర్ను కలిసి అదే కోరారు. తమ వద్ద నిధులు లేవని ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే చలానాలతోనే అభివృద్ధి చేసుకోవాలంటూ ఆయన సూచించటంతో రెండు శాఖల మధ్య జగడం మొదలైంది. రాజధాని అయిన తరువాత నగరంలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. రద్దీ నియంత్రణకు అనువుగా ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ లైన్లు, ఫుట్పాత్ల నిర్మాణం, ఫ్రీ లెఫ్ట్ కోసం రోడ్డు మార్జిన్ల విస్తరణ, రోడ్లపై ఆక్రమణలకు తావు లేకుండా హాకర్ జోన్లు.. ఇలా అన్నీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పైనే ఉంది. నగరంలోని ట్రాఫిక్ అవసరాలను నగరపాలక సంస్థ తీర్చటం ప్రధాన విధి. ముఖ్యంగా విజయవాడ నగరంలో 29 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా వాటిలో పనిచేస్తున్నవి కేవలం ఆరే. మిగిలినవి అటకెక్కి కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుత నగర ట్రాఫిక్ స్థితికి అనుగుణంగా 65 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని గతంలో ఒక నివేదిక సూచించింది. దీంతో కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం కూడా సిగ్నల్స్ పెంచాలని, కొత్త జంక్షన్లలో ట్రాఫిక్ మెరుగుకు చర్యలు తీసుకోవాలని, రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించాలని కోరింది. చేతులెత్తేశారు... కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు డీసీపీ నాగరాజు నేతృత్వంలో ట్రాఫిక్ ఏసీపీలు, ట్రాఫిక్ సీఐలు బుధవారం నగర మేయర్ కోనేరు రాజేంద్రప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. మేయర్ మాత్రం.. కార్పొరేషన్ వద్ద నిధులు లేవని తేల్చిచెప్పారు. ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే చలానాల్లో కొంత మొత్తం ఖర్చుపెట్టి సిగ్నల్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పుష్కరాల పనుల కోసం కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించింది. వాటిలో నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆ నిధుల్లో అయినా కొంతమేరకు కేటాయిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎంతోకొంత తగ్గుతాయనేది పోలీసుల వాదన. -
ముదురుతున్న చైర్ వార్
వేడెక్కిన నగరపాలక సంస్థ టీడీపీ పాలి‘ట్రిక్స్’ మేయర్ను దింపేందుకు అసమ్మతి వర్గం యత్నాలు తమకు మద్దతిచ్చి గద్దెనెక్కిస్తే నెలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రతిపాదన సీఎం వద్ద పంచాయితీకి సిద్ధమైన మేయర్ గ్రూపు ఎత్తుకు పై ఎత్తులతో నగరపాలక సంస్థ టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ను గద్దె దింపేందుకు అసమ్మతి వర్గం రూ.లక్షల్లో ఎరవేసింది. నెలవారీ ఆదాయంగా రూ.2 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో మెజారిటీ కార్పొరేటర్లు అసమ్మతి వర్గానికి చేరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. విజయవాడ సెంట్రల్ : ఐదేళ్లపాటు నగర పాలన బాధ్యతలను అప్పగించిన ప్రజల తీర్పును టీడీపీ అపహాస్యం చేస్తోంది. పార్టీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. అసమ్మతి వర్గం మేయర్ కుర్చీకోసం మామూళ్ల పర్వానికి తెరలేపగా.. మేయర్ వర్గం కుర్చీని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. మేయర్ చైర్ను దక్కించుకొనేందుకు అసమ్మతి వర్గం అధికారపార్టీ కార్పొరేటర్లకు మామూళ్ల ఎర వేసింది. తమ ప్యానల్ గద్దెనెక్కితే సహకరించిన కార్పొరేటర్లకు ఒక్కక్కరికి నెలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో మెజారిటీ (23మంది) కార్పొరేటర్ల మద్దతు కూడగట్టగలిగిందని సమాచారం. అసమ్మతి వర్గం కదలికలపై నిఘా పెట్టిన మేయర్ గ్రూపు ఈ విషయాన్ని పసిగట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైందని తెలిసింది. కోల్డ్ వార్కు కారణాలెన్నో... టీడీపీలో కొంతకాలంగా సాగుతున్న కోల్డ్వార్ బట్టబయలవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు చేసిన ప్రతిపాదనను మేయర్ తోసిపుచ్చడం వల్ల వారే అసమ్మతి వర్గం కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పాలక సంస్థ వాటర్ట్యాంకులపై ప్రైవేటు కంపెనీల సెల్టవర్లు ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించమనివారు కోరగా మేయర్ నిరాకరించారు. గతనెలలో జరిగిన సమావేశంలో వాటర్ ట్యాంకులపై ప్రస్తుతం ఉన్న అన్ని సెల్టవర్లను తొలగించాల్సిందిగా కౌన్సిల్లో తీర్మానం చేశారు. సెల్టవర్ కంపెనీలతో భారీ డీల్ కుదుర్చుకోగా మేయర్ గండికొట్టడంతో వారు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో ప్లాంట్ఫారాలపై వ్యాపారాలు చేసుకొనే వారి అద్దెలను పెంపుదల చేయాల్సిందిగా మేయర్ అధికారులను ఆదేశించారు. అద్దె పెంపుదల చేయొద్దన్న బుద్దా సూచనలను మేయర్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ మనసులో పెట్టకొనే మేయర్ కుర్చీకి ఎసరు పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం అపాయింట్మెంట్ కోరిన మేయర్ వర్గం అసమ్మతి గ్రూపు, వారికి సహకరిస్తున్న నాయకుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు మేయర్ వర్గం సిద్ధమైంది. ఈ మేరకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆధారాలతో సహా సీఎంకు ఫిర్యాదు చేస్తారని సమాచారం. విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం మేయర్ను మార్చేద్దామని చండీఘర్లోనే వ్యూహరచన చేసిందని, ఇందులో భాగంగానే సంతకాల సేకరణ పేరుతో హంగామా చేస్తోందని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. తలనొప్పిగా మారిన నగరపాలక సంస్థ టీడీపీ పాలి‘ట్రిక్స్’పై పార్టీ అధిష్టానం సీరియస్గా ఉందని తెలిసింది. -
టీడీపీలో ముసలం
మేయర్ను మార్చేందుకు సంతకాల సేకరణ అసమ్మతి వర్గానికి ఎమ్మెల్యేల అండ అంతర్మథనంలో మేయర్ వర్గం విజయవాడ: నగరపాలక సంస్థ టీడీపీలో ముసలం పుట్టింది. మేయర్ చైర్ను కదిలించేందుకు ఆ పార్టీ కార్పొరేటర్లే పన్నాగం పన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం ఇందులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పనిలో పనిగా డిప్యూటీ మేయర్, ఫ్లోర్లీడర్ పదవుల్ని మార్చేయాలంటూ సోమవారం రాత్రి నుంచి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి మరీ తమకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. మేయర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 12 మంది సభ్యుల నుంచి సంతకాలు సేకరించినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం భేటీ అయింది. ఏం చేసైనా అసమ్మతి వర్గం ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ప్రతివ్యూహం రూపొందిస్తోంది. మెజార్టీ సంతకాలు పూర్తిచేసి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి పి.నారాయణను కలవాలన్నది అసమ్మతి వర్గం నేతల ఆలోచనగా తెలుస్తోంది. అసంతృప్తే కారణం... మేయర్ కోనేరు శ్రీధర్ వైఖరిపై ఆ పార్టీలో మెజార్టీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది వారి వాదన. తమను డమ్మీలను చేసి ఆడిస్తున్నారని, కౌన్సిల్లో విలువ లేకుండా చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు సైతం మేయర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో నగరంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సైతం మేయర్కు ఆహ్వానం పంపడం లేదనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు వద్ద మేయర్కు మంచి మార్కులే ఉండటంతో ఇప్పటివరకు సమయం కోసం అసమ్మతి వర్గం ఎదురు చూసింది. కార్పొరేటర్ల విజ్ఞానయాత్ర నేపథ్యంలో పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంది. టూర్కు మొత్తం 33 మంది కార్పొరేటర్లు వెళ్లగా, ఇందులో 23 మంది టీడీపీ సభ్యులే. అసమ్మతి వర్గం వీరితో టూర్లోనే రాయబేరాలు సాగించిందని భోగట్టా. మేయర్ను మార్చేయాలన్న ప్రతిపాదనకు ఈ నెల 16న బీజం పడింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపారు. సంతకాల సేకరణలోనూ ఆయనే కీలకభూమిక పోషిస్తున్నారని సమాచారం. అంతర్మథనంలో మేయర్ వర్గం తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం అంతర్మథనంలో పడింది. మేయర్ తనను సపోర్టు చేసే కార్పొరేటర్ల కోసం వెతుకులాట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లోర్లీడర్ గుండారపు హరిబాబు, కో ఆప్షన్ సభ్యుడు సిద్ధెం నాగేంద్రరెడ్డిలతో సోమవారం రాత్రి తన చాంబర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో ఆయనతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. అత్యధిక శాతం మంది కార్పొరేటర్లు అసమ్మతి వర్గంతో జట్టు కడితే పరిస్థితి ఏమిటి, వాళ్లను తమవైపు ఎలా తిప్పుకోవాలనే చర్చల్లో మేయర్ వర్గం మునిగింది. అసమ్మతి వర్గం కంటే ముందే తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లే యోచనలో మేయర్ ఉన్నట్లు తెలుస్తోంది. -
పచ్చదనానికి పది కోట్లు
♦ మున్సిపల్ కార్పొరేషన్లకు సీఎం నజరానా ♦ పెద్దఎత్తున మొక్కలు పెంచాలని కార్పొరేటర్లకు సూచన ♦ మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని ఉద్బోధ ♦ ముగిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ కార్యక్రమం చేవెళ్ల: మొక్కలు పెంచి పచ్చదనానికి కృషి చేసే మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.10 కోట్ల నజరానా అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. పచ్చదనానికి పెద్దపీట వేసే డివిజన్కు రూ.కోటి అందజేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల మూడ్రోజుల శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కార్పొరేటర్లను ఉద్దేశించి రెండు గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పచ్చదనం పెంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా కృషిచేయాలని సూచించారు. పట్టణాలను, నగరాలను అభివృద్ధి పరిచేందుకు ప్రతి ప్రజాప్రతినిధి బంగారు కల కనాలన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలన్నారు. ‘‘పెరుగుతున్న జనాభాతో పట్టణాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి. మౌళిక రంగాల్లో అభివృద్ధి సాధించకుంటే పట్టణాలు చెత్తకుప్పలా మారతాయి. జనాభాకు అనుగుణంగా కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్స్, రోడ్లు, ట్రాఫిక్ తదితర రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధించాలి’’ అని ఉద్బోధించారు. కార్పొరేషన్లకు గతంలో ప్రకటించిన రూ.100 కోట్లే కాదని, అవసరమైతే మరిన్ని నిధులిస్తామని చెప్పారు. పార్కులు, మొక్కల పెంపకం, శ్మశాన వాటికల నిర్మాణాలు జనాభాకు సరిపోయే విధంగా చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించండి ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పర్యటించి అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సీఎం కార్పొరేటర్లకు సూచిం చారు. మహారాష్ట్రలోని మల్కాపూర్ మున్సిపాలిటీ సహా నాగ్పూర్, ఢిల్లీలోని అభివృద్ధి చెందిన పట్టణాలను సందర్శించి రావాలన్నారు. హైదరాబాద్ను మూలాల నుంచి అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు, పి.మహేందర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని ఎంపీలు కవిత, బాల్క సుమన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్పై బదిలీవేటు?
పనితీరుపై మంత్రి, సీఎం అసహనం మేయర్తో విభేదాలు కలెక్టర్తో సన్నిహిత సంబంధాలపై విమర్శలు {పత్యామ్నాయంగా సీనియర్ ఐఏఎస్ల పేర్ల పరిశీలన విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ బదిలీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కమిషనర్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నగరంలో పారిశుధ్యం ఏమాత్రం బాగోలేదంటూ ఇటీవలే క్లాస్ తీశారు. మేయర్ కోనేరు శ్రీధర్కు, కమిషనర్కు మధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్రమంలో బదిలీ షురూ అవుతుందన్న వాదనలు బలపడుతున్నాయి. మొత్తం మీద కమిషనర్ బదిలీ ప్రచారంపై కార్పొరేషన్ ఉద్యోగులతో పాటు నగర ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వర్గమైతే ఏకంగా కమిషనర్ బదిలీని ధ్రువీకరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వీరపాండియన్ తనదైన శైలిలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు మకాం మార్చిన దగ్గర నుంచి సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉంటున్న కమిషనర్ నగర ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. పుష్కర చిచ్చు... కృష్ణా పుష్కరాలకు సంబంధించి నగరపాలక సంస్థ సుమారు రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ బడ్జెట్లో రూ.360 కోట్లకు కుదించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లు విదిల్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేటాయించిన పుష్కర నిధులు చాలవని, మరికొంత పెంచాలని కమిషనర్ కోరగా, చంద్రబాబు సీరియస్ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. కమిషనర్ పనితీరుపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు భోగట్టా. కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కన్నబాబుతో సైతం కమిషనర్ మంచి సంబంధాలు కొనసాగించకపోవడంపై మంత్రికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. కలెక్టర్ బాబు.ఏకు అత్యంత దగ్గరగా ఉంటూ సీడీఎంఏను సైతం పట్టించుకోకపోవడంపై మంత్రి గుస్సాగా ఉన్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో వీరపాండియన్ను సాగనంపాలనే పట్టుదలతో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది కోల్డ్ వార్.. కౌన్సిల్లో బహిర్గతం.. మేయర్, కమిషనర్ మధ్య కొద్దినెలలుగా సాగుతున్న కోల్డ్ వార్ ఇటీవల జరిగిన కౌన్సిల్ సాక్షిగా బహిర్గతమైంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి పది శాతం ఫైన్ విధింపులో మినహాయింపు ఇవ్వాలన్న టీడీపీ కార్పొరేటర్ల డిమాండ్కు కమిషనర్ ససేమిరా అన్నారు. 168 జీవో ప్రకారం రెండో అంతస్తుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే వరకు ఇదే విధానం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మేయర్ కొంత అసహనానికి గురయ్యారు. పుష్కరాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 23 రోడ్లను విస్తరించాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు అవి ఓ కొలిక్కి రాలేదు. టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య, ఎస్టేట్స్ విభాగాల పనితీరు ఏమాత్రం బాగోలేదని పలుమార్లు మేయర్ చెప్పినప్పటికీ కమిషనర్ ఉదాశీనంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో కమిషనర్ పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మేయర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి, మేయర్, సీఎం కమిషనర్ వ్యవహారశైలిపై అసహనంతో ఉన్న నేపథ్యంలో బదిలీ వేటు తప్పదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాలకు సంబంధించి గడువు ముంచుకొస్తోంది. కమిషనర్ వీరపాండియన్ బదిలీ అనివార్యమైన పక్షంలో సీనియర్ ఐఏఎస్ను కమిషనర్గా నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యామ్నాయంగా రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ఏపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కర్నూలు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే విషయంలో గడువు కోరడంపై హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. ఎన్నిసార్లు ఇలా వాయిదాలు కోరుతారు.. మీరు కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు ఎన్నికలు పెడతారని మేం అడిగితే ప్రతీసారీ ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా కోరుతున్నారు. ఇలా ఇప్పటికే మూడుసార్లు వాయిదా అడిగారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలా వాయిదాలు కోరడం ద్వారా మీరు మా సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్నారు అంటూ.. కృష్ణప్రకాశ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్కు ఎప్పటిలోపు ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, లేనిపక్షంలో తామే నిర్ధిష్ట గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ సర్కార్కు హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ తమ ఆదేశాలను అమలు చేయకుంటే ఏం చేయాలో తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి కాలవ్యవధి ముగిసినప్పటికీ కర్నూలు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం, బుధవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కష్ణ ప్రకాశ్ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మీరు ఈ కేసులో ఇలా వాయిదా కోరడం ఇది మూడోసారి. ఇలా వాయిదాలు కోరుతూ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. కోర్టులో ఏం చెప్పినా జరిగిపోతుందిలే అని అనుకుంటున్నట్లున్నారు అని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వి.వి.ప్రభాకరరావు స్పందిస్తూ, ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేసు విచారణను వాయిదా వేస్తున్నామని, ఎప్పటిలోపు ఎన్నికలు నిర్వహిస్తారో, అందుకు సంబంధించిన ప్రక్రియను ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని కృష్ణప్రకాశ్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం మధ్యాహ్నం కేసు విచారణకు కృష్ణప్రకాశ్ మళ్లీ వాయిదా కోరారు. ధర్మాసనం మళ్లీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయబోమని, రేపటి వరకు గడువునిస్తున్నామని, ఎప్పటిలోపు ఎన్నికలు నిర్వహిస్తారు, అందుకు సంబంధించిన ప్రక్రియను ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పి తీరాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ చెప్పకుంటే తామే గడువు నిర్ధేశించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని, ఆ ఆదేశాలను అమలు చేయకుంటే ఏమి చేయాలో తమకు బాగా తెలుసునంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
పాలి‘ట్రిక్స్’పై మేయర్ అసహనం
♦ పట్టాభి నియామకంపై సీనియర్ల గుర్రు ♦ సీఎంకు ఫిర్యాదు చేయాలనే యోచన ♦ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే పరువు తీస్తున్నారు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రాజకీయాలపై తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పెత్తనం పేట్రేగుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్ర అసహనంతో ఉన్నారు. కార్పొరేషన్ వ్యవహారాల ఇన్చార్జిగా తాజాగా పట్టాభిని నియమించడంపై గుర్రుగా ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజార్టీ ఉన్న కౌన్సిల్లో అధిష్ఠా నం పాలి‘ట్రిక్స్’తో అభాసుపాలవుతున్నామనే ఆవేదం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవలే పార్టీ సీనియర్ కార్పొరేటర్లతో మేయర్ భేటీ అయిన సందర్భంలో పట్టాభి నియామక విషయం చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. బయటి వ్యక్తులకు పెత్తనం అప్పగించడం వల్ల తన చైర్ వీక్ అవుతోందనే అభిప్రాయాన్ని మేయర్ వ్యక్తం చేసినట్లు భోగట్టా. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ పాలి‘ట్రిక్స్’పై మేయర్ అసహనం ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్తో మాట్లాడి కార్పొరేషన్లో తమకు కావాల్సిన పనుల్ని గప్చుప్గా చక్కబెట్టేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. డెప్యూటీ మేయర్, ఫ్లోర్లీడర్, డెప్యూటీ ఫ్లోర్లీడర్ పదవుల మార్పునకు సంబంధించి అధిష్ఠానం చేస్తున్న ప్రచారంతో పార్టీ డామేజ్ అవుతోందనే అభిప్రాయాన్ని మేయర్ వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎదురీత.. నగరపాలక సంస్థ రాజకీయాల్లో మేయర్ ఎదురీత సాగించాల్సి వస్తోంది. అధికారుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంది. కమిషనర్ జి.వీరపాండియన్ పనితీరు బాగోలేదంటూ మేయర్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కలెక్టర్తోనే ఎక్కువ సమయం గడపడంతో కార్పొరేషన్లో పనులు సకాలంలో పూర్తి కావడం లేదన్నది ఆయన వాదన. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో కలెక్టర్ బాబు.ఏ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కమిషనర్ వ్యవహారశైలిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. ఎస్టేట్స్, రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారుల వ్యవహారశైలిపై మేయర్ అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే రూ.కోట్లు ఆదాయం పెరుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన తరుచూ వ్యక్తం చేస్తుంటారు. పార్టీ నాయకుల వ్యవహార శైలి, కార్పొరేషన్ పాలి‘ట్రిక్స్’పై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలనే యోచనలో మేయర్ ఉన్నట్లు వినికిడి. అల్లరి చేస్తోంది అధిష్ఠానమే.. దర్గా భూముల తీర్మానం మార్పు, కనకదుర్గ లే అవుట్కు ‘పచ్చ’జెండా ఊపడం వంటి వ్యవహారాల్లో టీడీపీ అవినీతి మకిలి అంటించుకుంది. మేయర్ చైర్ను లక్ష్యం చేసి ఆయన ప్రత్యర్థుల పావులు కదిపారు. ఈ రెండు సందర్భాల్లో కూడా అధిష్టానం వ్యవహరించిన తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందనేది మేయర్ అభిప్రాయం. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాల్లో సైతం రచ్చ చేశారని సన్నిహితుల వద్ద మేయర్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఓ సీనియర్ కార్పొరేటర్ శ్రీధర్ను మారుస్తున్నారంటూ ప్రచారం నిర్వహించడంపై మేయర్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం వైఖరి వల్లే అతను దుష్ర్పచారం చేస్తున్నారనే అభిప్రాయాన్ని సహచర కార్పొరేటర్ల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నో సాధించిన తనపై విషప్రచారం చేయడం సరికాదనే ఆవేదన వెలిబుచ్చినట్లు సమాచారం. -
కోట్లు దోచిపెడుతున్నారు
♦ అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు ♦ నాలుగున్నర కోట్ల పనులకు సింగిల్ టెండర్ ♦ ప్రేక్షకపాత్రలో ప్రత్యేక అధికారి జిల్లా కేంద్రం... ఒంగోలు నగరపాలక సంస్థ... దీని పర్యవేక్షణకు ఓ కమిషనర్... ఇది చాలదన్నట్టు ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగమవుతుందేమోనని పరిరక్షణకు ఐఏఎస్ హోదాలో ఉన్న జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. వీరికితోడు పలు విభాగాలు. ఒక్కో విభాగానికి ఓ అధికారి. వీరికింద వందలాది మంది సిబ్బంది. వీరంతా పన్నుల రూపంలో వచ్చిన ప్రతి పైసాకు పహారా కాస్తున్నారంటే పొరపాటే. ఆశపోతులంతా చేరి మోసుకుపోతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అది ఎలా అంటే... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కోట్ల రూపాయల పనులు బహిరంగంగా పంచేసుకుంటున్నారు. నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ ప్రైవేటు లిమిటెడ్గా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ టెండర్లలో ఫైవ్మెన్ కమిటీ పేరుతో అధికార పార్టీ చేస్తున్న దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లను నయానో భయానో బెదిరించి తమ మనుషులచే పనులు చేజిక్కించుకుంటున్నారు. కోట్లాది రూపాయలతో పిలుస్తున్న టెండ‘రింగ్ల’ విషయంలో జరుగుతున్న అవకతవకలపై నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులే పచ్చచొక్కాలు వేసుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఫోన్లు చేసి ‘ఈ టెండర్లు మీరు వేయద్దు, వేస్తే ఇబ్బంది పడతారని’ బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గురువారం 11 కోట్ల రూపాయలకు పిలిచిన టెండర్లలో సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల పనులను ఫైవ్మెన్ కమిటీవారు సూచించినవారు దక్కించుకోవడం దాదాపు ఖరారైంది. మొత్తం 170 పనులకుగాను సుమారు 80 పనులకు సింగిల్ టెండర్లు పడ్డాయి. ఇవన్నీ ఎస్టిమేట్ ధరలకే వేసినట్లు సమాచారం. సీసీ డ్రైన్ పనులకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటి వల్ల కార్పొరేషన్కు రూ.30 లక్షల వరకూ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మిగిలిన పనులకు కాంట్రాక్టర్లు ఫైవ్మెన్ కమిటీ వత్తిళ్లను దాటి టెండర్లు వేయడంతో వీటి విషయంలో ఏం చేయాలనేదానిపై తర్జన భర్జన పడుతున్నారు. సొసైటీ కాంట్రాక్టర్లు ఎదురు తిరగడంతో వారికి బిల్లులు ఎలా వస్తాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మిగిలిన పనులకు పోటీ ఉండటంతో 15 నుంచి 20 శాతం వరకూ లెస్ టెండర్లు పడినట్లు తెలిసింది. అసలు ఈ టెండర్లు పిలవడం, రద్దు చేయడం, మళ్లీ విడివిడిగా పిలవడం, సిండికేట్ అవ్వడం, పర్సంటేజీల కోసం డిమాండ్ చేయడం తదితర అంశాలపై స్పెషలాఫీసర్ దృష్టి సారిస్తే జరుగుతున్న అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం తప్ప మిగిలిన వాటిని పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టెండర్లు ఎవరు వేయాలనే విషయం కూడా వారే కాంట్రాక్టర్లకు ఫోన్లు చేస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
ఈ నిధులు ఏమూలకు!
• కృష్ణా పుష్కరాలకు రూ. 800 కోట్లతో ప్రతిపాదనలు • రూ. 250 కోట్లు విదిల్చిన రాష్ట్ర ప్రభుత్వం • నగరపాలక సంస్థ కేటాయింపులపై స్పష్టత ఏదీ • ఖజానాపై భారం తలుచుకునికార్పొరేషన్ పరేషాన్ రాజధాని ఏర్పడిన తర్వత తొలిసారి జరగనున్న కృష్ణా పుష్కరాలకు విజయవాడ నగరం ప్రధాన వేదిక కానుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉండటంతో పుష్కర స్నానంతో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చనే ఆలోచనతో భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో జరగనున్న పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈ నిధులు ఏమూలకు సరిపోతాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్పై భారం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ : కొత్త రాష్ట్రం.. కొత్త రాజధాని.. ఈ క్రమంలో వస్తున్న కృష్ణా పుష్కరాలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. ఆగస్టులో జరిగే పుష్కరాలను విజయవంతం చేయాలంటే సమష్టి కృషితోపాటు నిధుల విడుదలలో సర్కారు కాస్త పెద్ద మనసు చేసుకోవాల్సి ఉంది. పుష్కరాల నిర్వహణకు జిల్లాలో రూ.450 కోట్లు, విజయవాడ కార్పొరేషన్ పరిధిలో రూ. 350 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు మంజూరుచేసింది. ప్రధానంగా పుష్కరాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగరంలో సుందరీకరణ పనులు మొదలుకొని, పుష్కర ఘాట్ల మరమ్మతుల వరకు ఎన్నో పనులు జరగాల్సి ఉంది. మెరుగైన పారిశుద్ధ్యం, అదనపు సిబ్బంది వినియోగం వంటివి వందల కోట్ల ఖర్చుతో కూడుకున్న అంశాలు. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిధులు విడుదల చేయడం, కార్పొరేషన్కు ఎంత ఇచ్చేదీ స్పష్టంగా ప్రకటించకపోవడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలే లోటు బడ్జెట్తో కోట్లాది రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయవాడ నగరపాలక సంస్థకు పుష్కరాలు గుదిబండలా మారే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. నగరానికి ప్రాధాన్యత ఏదీ! పుష్కరాల్లో విజయవాడ నగరం కీలక కేంద్రంగా మారుతుంది. ముఖ్యమంత్రి నుంచి వీవీఐపీల వరకు అంతా ఇక్కడే ఉంటారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, వీఐపీల తాకిడి ఎక్కువగా విజయవాడ నగరానికే ఉంటుంది. కనకదుర్గమ్మవారి దేవస్థానం ఉండడంతో యాత్రికుల రద్దీ అధికంగానే ఉంటుంది. అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా నగరాన్ని కేవలం నాలుగు నెలల కాలంలో తాత్కాలిక అభివృద్ధి చేయాలంటే కనీసం రూ.250 కోట్ల నిధులు అవసరం. కాని ప్రభుత్వ కేటాయింపులు ఇప్పటికే పూర్తికావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ప్రభుత్వం వివిధ శాఖలతో నిమిత్తం లేకుండానే రూ.234 కోట్ల నిధులు కేటాయించింది. తక్కువ సమయం ఉండడంతో రూ.170 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మాత్రమే చేశారు. దీంతో అక్కడ రూ.64 కోట్ల నిధులు మిగిలిపోయాయి. రూ.760 కోట్ల నుంచి రూ.350 కోట్లకు గతంలో నగరపాలక సంస్థ అధికారులు పుష్కరాల అభివృద్ధి పనులు, పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ కార్యక్రమాల నిర్వహణ, ఇతర పనుల కోసం రూ.760 కోట్లు అవసరమని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రతిపాదనల స్థాయి ఎక్కువగా ఉందని, తగ్గించి మళ్లీ పంపాలని మౌఖిక ఆదేశాలు అందిన క్రమంలో రూ.350 కోట్లతో మార్పుచేసి పంపారు. ఇప్పటికే నగర మేయర్, కమిషనర్ సీఎం చంద్రబాబును కలిసి నిధులు మంజూరుచేయాలని కోరారు. నిరంతర శానిటేషన్ కోసం 35 వేల మంది అదనపు సిబ్బంది నియామకానికి వీలుగా నిధులు, వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, పుష్కర ఘాట్ల వద్ద 24 గంటలు పారిశుద్ధ్య నిర్వహణ, 200కు పైగా అద్దె వాహనాలు, పుష్కరాల నేపథ్యంలో నగరంలోని కీలక రహదారుల విస్తరణ, తాత్కాలిక వసతి కోసం భారీ షెడ్ల ఏర్పాటు.. ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధుల విషయంలో మొండిచెయ్యి చూపితే నగరపాలక సంస్థ ఖజనాకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది. కోటలు దాటే మాటలు.. కృష్ణా పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా.. నామమాత్రంగా నిధులు విడుదల చేయడం విమర్శలకు దారితీస్తోంది. డబ్బుల్లేకుండా అభివృద్ధి పనులెలా చేయాలని నగరపాలక సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాకు కేటాయించిన రూ.250 కోట్లలో ఎక్కువగా పంచాయతీరాజ్, జలవనరుల శాఖలకే దక్కనున్నాయి. ఈ క్రమంలో విజయవాడ నగరానికి ఏమేర అవసరం ఉంది. తక్షణం ఎంత కేటాయించాలి... మిగిలిన నిధులు ఎప్పుడివ్వాలి అనే దానిపై స్పష్టత లేదు. -
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని మునిసిపల్ కార్పొరేషన్ అతిథిగృహానికి చేరుకంటారు. 11 గంటలకు కాపు రుణమేళాలో పాలొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. మూడు గంటలకు సంక్షేమ శాఖ అధికారులతో అతిథిగృహంలోనే సమీక్షిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్కు వెళతారు. -
కార్మికుల పొట్టకొట్టొద్దు
రిలే దీక్షలు చేపట్టిన నగరపాలక సంస్థ కార్మికులు ఈ జీవో కార్మికుల కడుపుకొట్టేదే.. దీక్షనుద్దేశించి ప్రసంగించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం ఒంగోలు క్రైం : మున్సిపల్, నగరపాలక సంస్థ కార్మికుల పొట్టకొట్టే జీవో నంబర్-279ని వెంటనే రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం దీక్షలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తారన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన జీవో 279ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అప్పటి నుంచి కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని అనేక సార్లు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు, మున్సిపల్ ఉన్నతాధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చర్చల ద్వారా కూడా సమస్యను విన్నవించారన్నారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో 13వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఆ తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే మున్సిపల్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జెఏసి) నిర్ణయించిందని గుర్తు చేశారు. రిలే దీక్షల్లో యూనియన్ నాయకులు కె.గోపి, కె.చిననాగేశ్వరరావు, కె.రవి, కె.బాలకృష్ణ, కె.చినయాకోబు, కసుకుర్తి వెంకాయమ్మ, రాగిరాములు, సుజాత, ఆర్.సుందరం, వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణ, టి.విజయ, కె.మోహనరావు, ఎన్.కోటయ్య, ఎస్.నాగేశ్వరరావు, మెండెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంతో సంపూర్ణ విజయం
మంత్రి ఈటల వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ విజయం సంపూర్ణమైందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలుపుతో టీఆర్ఎస్ 99 శాతం విజయం సాధించినట్లయిందని.. వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలలో పాగా వేయడంతో నూటికి నూరు శాతం తమ విజయ లక్ష్యం నెరవేరిందని ఈటల అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో కరీంనగర్, వరంగల్లో తప్ప టీఆర్ఎస్కు బలమే లేదనే అభిప్రాయాలు ఉండేవని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తమ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం ఉందని ఇప్పుడు రుజువైందన్నారు. -
రోడ్లు ఊడ్వరు.. చెత్త తీయరు..
గ్రేటర్లో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ గల్లీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు పట్టింపులేని కార్పొరేషన్ అధికారులు గాడిన పడని ప్రజారోగ్యం వరంగల్ అర్బన్ : మునిసిపల్ కార్పొరేషన్ స్థారుు నుంచి గ్రేటర్ వరంగల్గా రూపాంతరం చెందిన ఓరుగల్లు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. క్లీన్సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది న వరంగల్ బల్దియా జాతీయస్థాయి అవార్డు లు, సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుంది. అరుుతే ఇంతటి ప్రఖ్యాతిగాంచిన మహా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడకపోవ డంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణకు ఏటా కోట్లు వెచ్చించి వాహనా లు కొనుగోలు చేస్తున్నా సమస్య గాడిలో పడ డం లేదు. దీంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అలాగే మురికి కాల్వలు కంపు కొడుతున్నాయి. వీటితోపాటు రోడ్లను శుభ్ర ం చేయకపోవడం తో దుమ్ముధూళితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రీసైక్లింగ్కు నోచుకోక డంపింగ్ యార్డులో చెత్త గు ట్టలుగా పేరుకుపోతుంది. దీంతో బయోగ్యాస్ విద్యుత్ నామమాత్రంగా సాగుతోంది. డంపింగ్ యార్డులుగా ఖాళీ స్థలాలు.. నగరంలోని పలు డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోరుు రోడ్ల వెంట మురుగునీరు ప్రవహిస్తుంది. డంపర్ బిన్లు, కాంఫ్యాక్టర్ బిన్లు చెత్తతో నిండిపోతున్నా పట్టించుకునేనాథుడే లేడు. ఫలితంగా నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా మారి మురికికూపాలను తలపిస్తున్నాయి. కాగా, మరుగుదొడ్ల నుంచి మల, మూత్రాలను నేరుగా డ్రెయినేజీల్లోకి వదలడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇదిలా ఉండగా, బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం ఇంటిం టా చెత్త సేకరణలో పాల్గొనడంతో కాల్వలు శుభ్రం చేసే వారే కరువయ్యారు. దీంతో కాల్వలు చెత్తాచెదారంతో నిండి పోయి ముక్కు పుటాలను అదరగొడుతున్నా యి. పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వ్యాప్తిచెంది ప్రజలు డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. కార్యరూపం దాల్చని ప్రణాళికలు.. ట్రైసిటీలో మొత్తం 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. 2012లోనే క్లిన్సిటీ చాంపియన్ షిప్ కార్యక్రమం మొదలుపెట్టారు. దేశంలో మొదటిసారిగా వరంగల్లోనే ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు బా గానే కొనసాగినా తర్వాత తగ్గింది. ప్రస్తుతం 60 శాతం ఇళ్లలో నుంచి ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. కాగా, పలు కారణాలతో తోపుడు బండ్ల మరమ్మతులను నిలిపివేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు.. జవాన్ల పనితీరును పట్టించుకోవడం లేదు. బల్దియా డిప్యూటీ కమిషనర్ మినహా ఇతర అధికారులు తనిఖీలు చేపట్టడంలేదు. పేరుకుపోతున్న డంపింగ్ యార్డు మడికొండ శివారులోని డంపింగ్ యార్డులో చెత్త గుట్టల్లా పేరుకుపోతుంది. మహా నగరం నుంచి రోజు 145 మెట్రిక్ టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తున్నారు. దీంతో దశాబ్దకాలంగా యార్డులో చెత్త కుప్పులు గుట్టలుగా మారుతున్నాయి. చెత్త రీసైక్లింగ్పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టకపోవడంతో భవిష్యత్లో అనర్థాలు చోటు చేసుకోనున్నాయి. రీ సైక్లింగ్.. రీయూజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల్లో భాగంగా 2012 అక్టోబర్లో హన్మకొండ బాలసముద్రంలో తడి చెత్త ద్వారా బయో విద్యుత్ ఆధారిత ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో తయారవుతున్న 15 కేడబ్ల్యూ కరెంట్ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షలతో 24 కేడబ్ల్యూ విద్యుత్ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, బాలసముద్రంలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా 4 నుంచి 5 మెట్రిక్ టన్నుల చెత్త రీ సైక్లింగ్ జరుగుతోంది. అంతేకాకుండా ఐటీసీ కంపెనీ పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటా సేకరిస్తున్న పొడి చెత్తను కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా రోజు 10 మెట్రిక్ టన్నుల చెత్తను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఈ పదిహేను మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే రీసైక్లింగ్, రీయూజ్ జరుగుతోంది. ఏడాదికి రూ.30 కోట్లు మహా నగర పాలక సంస్థ పరిధిలో శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు మినహా 2621 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరి వేతనాలు, వాహనాల మరమ్మతులు, డీజిల్ కోసం ప్రతి నెల రూ. 2.50 కోట్లు వెచ్చిస్తోంది. అంటే ఏడాదికి రూ.30 కోట్లు వెచ్చిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవచూపి నగరంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. -
ఢిల్లీలోనే ప్రపంచకప్ టి20 మ్యాచ్లు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్లో భాగంగా ఫిరోజ్షా కోట్ల మైదానంలో జరగాల్సిన మ్యాచ్లపై ఉత్కంఠ వీడింది. జస్టిస్ (రిటైర్డ్) ముకుల్ ముద్గల్ పర్యవేక్షణలో ఇవి జరుగుతాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మ్యాచ్ల ఏర్పాటుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తుందని, అయితే కార్పొరేషన్ అధికారుల నుంచి ఢిల్లీ క్రికెట్ సంఘం అన్ని క్లియరెన్స్లను పొందాలని సూచించింది. ముద్గల్ లేకుంటే ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదరక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని జస్టిస్ మురళీధర్, విభు బక్రూలతో కూడిన బెంచ్ తేల్చింది. -
టీడీపీలో రగిలిన విభేదాల అగ్గి
మేయర్పై స్టాండింగ్ కమిటీ సభ్యుల ఫిర్యాదు డమ్మీలను చేసి ఆడుకుంటున్నారని ఆవేదన మ్యూటేషన్లో కాసుల వేట విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో విభేదాల అగ్గి రగిలింది. మేయర్ కోనేరు శ్రీధర్ స్టాం డింగ్ కమిటీ సభ్యుల మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న కోల్డ్వార్ బ్లో అవుట్గా మారిం ది. మేయర్ తమను అడుగడుగునా అవమానపరుస్తారని, ప్రతిపక్ష సభ్యుల్లా చూస్తున్నారంటే స్టాండింగ్ కమిటీ సభ్యులు కాకు మల్లికార్జునయాదవ్, పిరియా జగదాంబ, షేక్ సహేరాభాను, కొరకాని అనూరాధ, నాగోతు నాగమణి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నానీకి సోమవారం ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మేయర్ సీవీ ఆర్ కాంప్లెక్స్లో ఒకే వ్యక్తికి 34 షాపుల లీజు రెన్యువల్, మొబైల్ యాప్ నిర్ణయాల్లో తమ ను సంప్రదించలేదన్నారు. టీ, సమోసాలకు స్టాండింగ్ కమిటీ పరిమితమని మేయర్ తమతో వెటకారంగా మాట్లాడుతున్నారని, దీంతో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే స్టాండింగ్ కమిటీ పదవుల్లో కొనసాగడం అనవసరం అనే అభిప్రాయాన్ని పార్టీ నేతల వద్ద సభ్యులు వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. పంపకాల్లో తేడాలు కార్పొరేషన్ షాపుల మ్యూటేషన్ (పేరుమార్పు) పంపకాల్లో తేడాలు రావడం వల్లే అధికారపార్టీలోవిభేదాలు బహిర్గతం అయ్యాయని తెలుస్తోంది. కార్పొరేషన్కు చెందిన 547 షాపుల పేరు మార్చాలని రెండునెలల క్రితం స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ నియోజక వర్గానికి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ ప్రోద్భలంతో ఎస్టేట్ అధికారులు మామూళ్ల వసూలుకు తెరతీశారని, ఇందుకు ఎమ్మెల్సీ పేరు వాడుతున్నారని సమాచారం. ఒక్కో షాపునకు రూ.10 వేల నుంచి రూ.25 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మ్యూటేషన్ ఫైళ్లు సిద్ధమవుతున్న తరుణంలో విధివిధానాలను పునఃపరిశీలించాలంటూ మేయర్ బ్రేక్ వేశారు. స్టాండింగ్ కమిటీ పేరుచెప్పి ఎస్టేట్ అధికారులు భారీగా మామూళ్లు వసూలు చేయడంతో వివాదం రగిలింది. అడుగడుగునా అల్లరి నగరపాలక సంస్థలో టీడీపీ అడుగడుగునా అల్లరవుతోంది. మహ్మదీయ కోపరేటివ్ సొసైటీ తీర్మానాన్ని మార్చేయడం, శ్రీకనకదుర్గ సొసైటీ లేవుట్ వ్యవహరాల్లో భారీగా ముడుపులు చేతులు మారాయన్న అప్రది ష్టను టీడీపీ పాలకులు మూటగట్టుకున్నా రు. తాజాగా మ్యూటేషన్లో కాసుల వేట సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కౌన్సిలో 59 మందికి గాను 38 మంది సభ్యుల బలమున్న టీడీపీలో వర్గ విభేదాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. శ్రీకనకదుర్గ లే అవుట్ వ్యవహారంలో మేయర్ చైర్ను ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. తాజాగా స్టాం డింగ్ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా మే యర్ శ్రీధర్పై ఫిర్యాదు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
డ్రోన్ సర్వేపై గందరగోళం
విజయవాడ : నగర గగనతలంపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలోని వీధులు మొదలుకొని ఇళ్ల లెక్కింపు వరకు అన్నింటిని డ్రోన్లలో అమర్చిన కెమెరాల్లో నగరపాలక సంస్థ అధికారులు బంధిస్తున్నారు. వాటి ఆధారంగా భారీగా సొమ్ము చేసుకునే యత్నాల్లో ఉన్నారు. దీని కోసం ముందస్తుగా రూ.5.60 కోట్లు ఖర్చు పెట్టడానికి అంగీకారం కుదుర్చుకోవటంఇప్పుడచర్చనీయాంశమైంది. నగర సగటు జీవికి డ్రోన్లపై కనీస అవగాహన లేదు. కానీ నగరపాలక సంస్థ అధికారులు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దీనిని నిర్వహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే విషయం హాట్ టాపిక్గా మారి ప్రతిపక్షాలు, అధికారుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంద అసెస్మెంట్ నంబర్ల నూరు శాతం గుర్తింపే లక్ష్యం... విజయవాడ రాష్ట్ర రాజధాని నగరంగా మారింది.ఈ క్రమంలో నగరంలో జనాభా రోజురోజుకీ పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఉన్న ఇళ్ల సంఖ్యకు, ఇంటి పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యకు కొంత వ్యత్యాసం ఉందనేది నగరపాలక సంస్థ అధికారుల అభిప్రాయం. దీంతో అన్ని ఇళ్లను గుర్తించి, అసెస్మెంట్లు సమగ్రంగా పరిశీలిస్తే ఇళ్ల సంఖ్య, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరిగే అవకాశముందనేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా నగరంలో డ్రోన్ సర్వేకు గత ఏడాది అక్టోబర్లో తెర తీశారు. అసెస్మెంట్ నంబర్లను నూరు శాతం గుర్తించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దీనిపై అధ్యయనం చేసి డ్రోన్ సర్వే ఫలితాలు తెలుసుకున్న నగర కమిషనర్ వీరపాండియన్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే అంతా సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. సింగపూర్కు చెందిన పేజ్ యూఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ చేయటానికి ముందుకొచ్చి రూ.5.60 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు అందించగా, బీవోటీ ప్రాతిపదికన సదరు కంపెనీతో గత ఏడాది నవంబర్ 23న ఒప్పందం చేసుకున్నారు -
గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలన
⇒ గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలన ⇒ పట్టాలెక్కని నగరాభివృద్ధి పథకాలు ⇒ పెండింగ్లో భవన నిర్మాణ దరఖాస్తులు ⇒ కాంపౌండ్ జరిమానాలతో యజమానుల బెంబేలు ⇒ అవినీతి మత్తులో రెవెన్యూ విభాగం ⇒ పన్నుల పెంపు పేరిట అక్రమ వసూళ్లు ⇒ మరో వైపు ముంచుకొస్తున్న తాగునీటి గండం గుంటూరు : నగరపాలక సంస్థలో అత్యంత ప్రధానమైనది పట్టణ ప్రణాళికా విభాగం. రాజధాని జిల్లా కేంద్రం గుంటూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటే నిర్మాణాలు సైతం వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఆరు నెలల క్రితం అప్పటి కమిషనర్లు నిర్మాణ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించినా ఇప్పటి వరకు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. కొత్త కమిషనర్ రావడంతో ఆమె మరోసారి నిర్మాణ దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించారు. కమిషనర్గా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తున్నా సిటీప్లానర్కు రెండురోజుల ముందు వరకు డెలిగేషన్ పవర్స్ ఇవ్వలేదు. గత కమిషనర్లు ఆమోదం తెలిపిన భవన నిర్మాణాలను యజమానులు ప్రారంభించారు. దీంతో ఆయా యజమానులకు కాంపౌండ్ జరిమానా కింద రూ.10 వేల నుంచి రూ. 15వేల వరకు విధిస్తున్నారు. దీంతో బిల్డర్లు, భవన యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే భవన నిర్మాణ దరఖాస్తులతోపాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీలో సైతం ఇదే విధానం కొనసాగిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన భవనాలకు పన్ను విధింపులో అవినీతి ... ఇక రెవెన్యూ విభాగంలో ఇంతకు ముందు లేని విధంగా దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగు తోంది. నూతనంగా విలీనమైన గ్రామాల్లోని గృహాలకు పన్నులు పెంచే అంశంపై సర్వే చేస్తున్నారు. ఇదే అదనుగా సిబ్బంది పన్నులు పెంచుతామంటూ ప్రజలను బెదిరిస్తూ పెద్ద ఎత్తున డబ్బు గుంజుతున్నారు. నగరంలో నూతనంగా నిర్మించిన భవనాలకు పన్ను విధింపులో సైతం పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నిర్మించిన భవనాలతో పాటు అండర్ అసెస్మెంట్ల విషయంలో ఇది తార స్థాయికి చేరింది. కమిషనర్ని సైతం రెవెన్యూ ఉన్నతాధికారులు తప్పదారి పట్టిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయలోపం... ఇదే సమయంలో నగరానికి మంచినీటిని తెచ్చే కృష్ణానదిలో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో గుంటూరు చానల్కు ఆనకట్ట వేసి నీటిని నిల్వ చేసుకోవాల్సిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. మరో పది, పదిహేను రోజుల కంటే కృష్ణానీరు నగరానికి అందే అవకాశం లేదు. ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారు ల మధ్య సమన్వయలేమి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించేలా ఉంది. కమిషనర్ సైతం దీనిపై ఇప్పటి వరకు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇంజినీరింగ్ విభాగంలో నెలకొన్న ఆధిపత్య పోరు నగరాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, సూపరింటెండెంట్ ఇంజినీర్ల మధ్య వర్గ పోరు చినికి చినికి గాలి వానలా మారింది. అభివృద్ధిలో 20 ఏళ్ల వెనక్కు... గతంలో కమిషనర్లుగా పనిచేసిన కన్నబాబు, అనురాధలు నగరాభివృద్ధిలో భాగంగా చెరువుల అభివృద్ధి, కార్పొరేషన్కు నూతన భవన నిర్మాణం, మానస సరోవరం, గాంధీపార్కు అభివృద్ధి, నగరంలో 12 రోడ్ల విస్తరణ, కూడళ్లు అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటిని పట్టాలెక్కించే సమయానికి బదిలీ అయ్యారు. తర్వాత అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు కమిషనర్లు మారడంతో పాటు అభివృద్ధిని 20 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారన్న విమర్శలు వస్తున్నాయి. పనిచేసే అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వానికి త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. -
తెలుగు తమ్ముళ్లకు ప్రేమతో..
► అప్సెట్ వాల్యూకు ‘టెండర్’ ► స్పందన లేదన్న సాకుతో పదిశాతం తగ్గింపునకు ప్రతిపాదన ► స్టాండింగ్ కమిటీదే తుది నిర్ణయం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధీనంలోని పార్కింగ్ ప్రాంతాలకు నిర్ణయించిన అప్సెట్ వాల్యూకు ‘టెండర్’ పెట్టేందుకు రంగం సిద్ధంమైంది. గతంలో నిర్ణయించిన ధరలో పదిశాతం తగ్గించాలంటూ ఎస్టేట్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే ఈరకమైన వ్యూహాన్ని రూపొందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆశీస్సులతో గతంలో ఎన్టీఆర్ పార్కింగ్ స్థలాన్ని దక్కించుకొని లీజు సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టిన తెలుగుతమ్ముళ్లే దీనికి స్క్రీన్ప్లే రూపొందించారని సమాచారం. విచిత్రం ఎన్టీఆర్, కేబీఎన్ పార్కింగ్ సెల్లారు, గోవిందరాజులు, బీవీఆర్ కాంప్లెక్స్,బ్రహ్మానందరెడ్డి సెల్లార్ పార్కింగ్లకు సంబంధించి ఏడాదికి రూ.66,10,161 అప్సెట్ వ్యాల్యూగా నిర్ణయించారు. గతంలో లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్లు డబ్బు సక్రమంగా చెల్లించని కారణంగా ఈ పార్కింగ్ ప్రాంతాలను ప్రస్తుతం కార్పొరేషనే నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏడాదికి రూ.38,30,400 ఆదాయం వస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోజువారీ పార్కింగ్ ఫీజులను సిబ్బంది నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్సెట్ వాల్యూకు వసూలు అవుతున్న మొత్తానికి రూ.27,79,761 వ్యత్సాసం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ కారణంగా పదిశాతం అప్సెట్వాల్యూ తగ్గించాలనే ప్రతిపాదన తెచ్చారు. అప్సెట్ వాల్యూలో ఏటా పెరుగుదలే కానీ తగ్గుదల ఉండదు. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం విడ్డూరం. అంతా అప్సెట్ ఏలూరు రోడ్డులోని హోటల్ రాజ్టవర్స్ ముందుభాగం, హోటల్ రాజ్టవర్స్ తూర్పువైపు పెట్రోల్ బంకుకు ఎడమ, కుడి మార్జిన్, ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం వద్ద, లిబర్టీ హెయిర్స్టైల్ వద్ద, స్వగృహ ఫుడ్స్, శ్రీరామ చిట్ఫండ్స్, ఎస్బీఐ ఏటీఎం వద్ద, ఏవీ ఆప్టికల్స్, పాజిటివ్ హోమియోపతి హాస్పటల్ వద్ద, రవిమెడికల్స్ వద్ద పార్కింగ్ ప్రాంతాలకు సంబంధించి అప్సెట్ వాల్యూను రూ.11,49,506గా నిర్ణయిం చారు. దీన్ని పదిశాతం మేర తగ్గించాలని ప్రతిపాదన చేశారు. బ్రహ్మానందరెడ్డి పార్కింగ్ సెల్లార్కు సంబంధించి అప్సెట్ వాల్యూ రూ.2,43,000 నిర్ణయించి గతేడాది సెప్టెంబర్ 11న టెండర్ పిలిచారు. రూ.2,49,999కి ఎం.నరేంద్ర టెండర్ దాఖలు చేశారు. అంటే అప్సెట్ వ్యాల్యూకంటే ఎక్కువే. సింగిల్ టెండర్ కావడంతో దీన్ని ఆమోదించలేదు. దీన్నిబట్టి చూస్తే అప్సెట్ వాల్యూ కంటే అధికంగా టెండర్లు దాఖలు అవుతున్నాయన్న విషయం అర్థమవుతోంది. అప్సెట్ వ్యాల్యూకు టెండర్ ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతానికి సంబంధించి రూ.45,67,731 అప్సెట్ వాల్యూ కాగా ఏదాడికి రూ.25,56,000 వసూలవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది మినహా మిగిలిన పార్కింగ్ ప్రాంతాల అప్సెట్ వ్యాల్యూలో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అయినప్పటికీ అన్నింటికీ పదిశాతం మినహా యింపు ఇవ్వాలనడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు రింగ్ అవ్వడం, ఎస్టేట్ అధికారులు చేతి వాటాన్ని ప్రదర్శించడం వల్లే ఆశించిన స్థాయిలో పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆదాయం రావడం లేదన్నది బహిరంగ రహస్యం. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అప్సెట్ వాల్యూకు టెండర్ పెట్టాలనుకోవడం వివాదాస్పదమైంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
ఆదాయానికి కేసుల గండం
వివిధ కోర్టుల్లో 902 కేసులు పెండింగ్ నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పరిష్కారమైతే కాసుల పంటే అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. సకాలంలో కోర్టు కేసులను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. దీంతో కోర్టులో కేసులు పేరుకుపోతున్నాయి. విజయవాడ సెంట్రల్ : కార్పొరేషన్లో రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ప్రజారోగ్యశాఖలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 902 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించగలితే రూ.50 కోట్లపైనే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తోందని అంచనా. హైకోర్టులో 556, స్థానిక కోర్టులో 269, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో 31, ఏపీ వినియోగదారుల ఫోరంలో 2, సుప్రీం కోర్టులో ఒకటి, లోకాయుక్తాలో 19, ప్రీలిటిగేషన్ కౌన్సిల్ (పీఎల్సీ)లో 22, హ్యూమన్ రైట్స్ కమిషన్ వద్ద 2 చొప్పున వెరసి 902 కేసులు ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో లీగల్సెల్ శ్రద్ధ చూపడం లేదనే వాదనలు ఉన్నాయి. కొనసా..గుతున్నాయి కార్పొరేషన్కు దండిగా ఆదాయం తెచ్చిపెట్టే టౌన్ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్స్, ప్రజారోగ్యశాఖలకు సంబంధించిన కేసులే ఎక్కువ పెండింగ్లో ఉంటున్నాయి. వస్త్రలత నుంచి రూ.11 కోట్లు, ఐవీ ప్యాలెస్ నుంచి రూ.7 కోట్లు రాబట్టాల్సి ఉంది. షాపుల, పార్కింగ్స్టాండ్ల అద్దెలకు సంబంధించి ఆయా యజమానులు ఇస్తున్న చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ప్రతినెలా సుమారు రెండు వందల చెక్కులు బౌన్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు బాధ్యులపై పోలీసు కేసులు పెట్టకపోవడంతో ఇదో ప్రహసనంలా మారింది. వస్త్రలత బకాయిల పరిష్కారానికి సంబంధించి వ్యాపారులతో ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ పలుమార్లు చర్చలు జరిపారు. బకాయిల్లో పది శాతం కంటే మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేయడంతో కేసులు కొనసా..గుతున్నాయి. దృష్టిపెడతాం నగరపాలక సంస్థకు సంబంధించి పెండింగ్ కేసులపై దృష్టిసారిస్తాం. హైకోర్టులో కేసులు వాదించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆర్. సుధీర్ను నియమించింది. పెండింగ్ కేసుల విషయమై త్వరలోనే ఆయనతో చర్చిస్తాం. వివిధ శాఖల అధికారులు సహకరించాలి. పెండింగ్లో ఉన్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించినట్లైతే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. -కోనేరు శ్రీధర్, మేయర్, నగరపాలక సంస్థ -
అక్రమాల రెవెన్యూ
ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో చేతివాటం ఇరిగేషన్ స్థలం ప్రైవేటు పరం వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఫిర్యాదుతో వెలుగులోకి విచారణకు ఆదేశించిన కమిషనర్ నగరపాలక సంస్థ రికార్డుల ప్రకారం ఖాళీ స్థలాల పన్ను బకాయి రూ.50 కోట్ల పైనే ఉంది. పన్ను వసూళ్లలో అలసత్వం వహించే అధికారులు రికార్డుల్లో లేని స్థలాలకు వీఎల్టీ వసూలు చేస్తున్నారు. దొడ్డిదారిన స్థలాన్ని దోచిపెట్టేందుకు హడావుడిగా డిమాండ్ నోటీసులు ఇచ్చి పన్ను వసూలు చేశారు. ఒకే అసెస్మెంట్ నంబర్లో ఉన్న మూడు స్థలాలకు నాలుగేళ్ల తేడాతో పన్ను వసూలు చేయడమే ఇక్కడ ట్విస్ట్. ఫిర్యాదు అందడంతో కమిషనర్ విచారణకు ఆదేశించారు. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. పన్ను వసూళ్లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండికొడతున్నారు. సర్కిల్-2 పరిధిలోని పూర్ణానందంపేటలోని భూపతి సెస్మిక్ కంపెనీకి సంబంధించి ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో రెవెన్యూ అధికారులు మాయాజాలం చూపారు. అసెస్మెంట్ నంబర్ 12054లోని 2,500 గజాలకు రూ.3.25 లక్షలు, 12054ఏ లోని 2,500 గజాలకు రూ.3.25 లక్షలు చొప్పున 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాళీ స్థలాల పన్ను వసూలు చేశారు. 12054పీ లోని 888 గజాలకు రూ.1,99,800లు 2010 నుంచి వసూలు చేశారు. అదే స్థల యజమానికి సంబంధించి మరో 2,100 గజాల స్థలానికి ఖాళీ స్థలాల పన్ను వసూలు చేయలేదు. డాక్యుమెంట్లో మొత్తం 7,988 గజాలు ఉండగా 5,888 గజాలకు వేర్వేరు సంవత్సరాల్లో పన్నులు వసూలు చేయడంతో అనుమానం రెకెత్తింది. వెలుగులోకి వచ్చింది ఇలా.. అసెస్మెంట్ నంబర్ 12054/పి లోని 888 గజాల స్థలం ఇరిగేషన్శాఖకు సంబంధించింది కాగా పన్ను ఎలా వసూలు చేశారంటూ 41వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పైడిమాల సుభాషిణి రెవెన్యూ అధికారులను నిలదీశారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో కమిషనర్ జి.వీరపాండియన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా సర్కిల్-2 ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ను ఆదేశించారు. గతంలో నాగకుమారి సర్కిల్-2 ఏసీగా విధులు నిర్వర్తించిన సమయంలోనే ఈ అసెస్మెంట్లకు సంబంధించి పన్నులు వసూలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. సుమారు రూ.20 లక్షలు ఖాళీస్థలాల పన్ను రూపంలో రావాల్సి ఉండగా రూ.8,49,800 మాత్రమే వసూలు చేసినట్లు భోగట్టా. ఇరిగేషన్ స్థలానికి సంబంధించి పన్ను విధింపునకు భారీగానే ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్-2 పరిధిలో పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ చోటుచేసుకుందనే విమర్శలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. అంతా అడ్డగోలే రెవెన్యూ అధికారులు 888 గజాలకు సంబంధించి అడ్డగోలుగా పన్ను విధించారు. దీనివల్ల ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరమైంది. డాక్యుమెంట్లో ఉన్న స్థల విస్తీర్ణానికి వసూలు చేసిన పన్నుకు భారీగా వ్యత్యాసం ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. సర్కిల్-2లో ఇలాంటి అక్రమాలు చాలానే జరిగినట్లు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -పైడిమాల సుభాషిణి 41వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ విచారణ చేస్తున్నాం.. కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నా. త్వరలోనే నివేదిక అందజేస్తా. పన్ను వసూళ్లలో తేడాల విషయం ఇప్పుడే చెప్పలేను. ఎవరైనా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. అక్రమాలు రుజువైతే బాధ్యులపై చర్యలు ఉంటాయి. -సుధాకర్ అసిస్టెంట్ కమిషనర్ సర్కిల్-2 ఇన్చార్జి