కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : కందుకూరు మండలకేంద్రానికి సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.