అర్ధరాత్రి మృతదేహాన్ని దహనం చేస్తూ దొరికిపోయాడు | Patient dies due to medical mistakes | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి మృతదేహాన్ని దహనం చేస్తూ దొరికిపోయాడు

Published Sun, Nov 22 2015 12:59 PM | Last Updated on Thu, Aug 30 2018 6:04 PM

Patient dies due to medical mistakes

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అర్ధరాత్రి సమయంలో రహస్యంగా మృతదేహాన్ని దహనం చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం..  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం రామాలయం వద్ద సబ్‌రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి నిప్పంటించాడు. చెత్త తగులబడుతుందని స్థానికులు అనుకున్నారు.

అయితే సరిగ్గా అదే సమయంలో అటువైపు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఆర్‌ఎంపీ వైద్యుడని, వైద్యం వికటించి మృతి చెందిన రోగి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన బైక్ పై ఎక్కించుకుని శంషాబాద్లో దహనం చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement