
సాక్షి, వరంగల్ : వైద్యుడు లేక ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం పోస్టుమార్టం సేవలు నిలిచిపోయాయి. దీంతో మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సిన డెడ్బాడీలు నాలుగు ఉన్నాయి. నిబంధనల మేరకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపు పోస్టుమార్టం చేయాల్సి ఉండగా, ఉదయం నుంచి డాక్టరు అందుబాటులో లేకుండా పోయారు. రేపు ఆదివారం కావడంతో పోస్టుమార్టం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డెడ్బాడీలకు అంత్యక్రియల కోసం మృతుల ఇళ్ల దగ్గర బంధవులు వేచి చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment