
‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం
ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే బీసీ హక్కులను సాధించుకుందామని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు.
ఓబీసీ మేధావులు మౌనంగా ఉండడం వల్లే∙జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు చట్టసభల్లోకి వెళ్లలేక పోతున్నామని, తద్వారా కాంట్రాక్టర్లు, రౌడీలు, గూండాలు, పారిశ్రామిక వేత్తలు చట్టసభల్లో అడుగుపెడుతున్నారన్నారు. ఎల్ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.