BC Welfare Association
-
బీసీల రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: ‘‘జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో... ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 5 నుంచి 10 శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారు. రా జ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరగాలి. కానీ ప్రతి పార్టీ బీసీలకు అత్తెసరు స్థానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఓట్లు రాబట్టేందుకు సంక్షేమ ఫలాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీసీలు బాగు పడాలంటే సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు. కేవలం రాజకీ య పదవులు, పాలనలో కీలక బాధ్యతలు దక్కితే నే చట్టాలు చేసే అధికారం వస్తుంది. ఆ ఆలోచన తోనే ఈసారి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాం’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన సరూర్నగర్ స్టేడియంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న బీసీల సింహగర్జన బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచు కున్నారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి పార్టీ 60 సీట్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రతి రాజకీయ పార్టీ కనీసం 60 సీట్లు కేటాయించాలి. అన్ని ప్రధాన కులాలను కలుపుకుంటూ టికెట్లు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థి తులతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్ని కల్లో బీఆర్ఎస్ బీసీలకు 26 సీట్లు కేటాయించ గా... తాజాగా ప్రకటించిన జాబితాలో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చింది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు ఈ దఫా సీటు కేటాయించకపోవ డం గమనార్హం. ఇక కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి. మా నినాదం మాత్రం ఒక్కటే. ‘కులానికో సీటు, అలాంటి పార్టీలకే బీసీల ఓటు’. సంక్షేమ పథకాల అమలంటూ బీసీలకు భిక్ష వేసినట్లు చేస్తూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. నిధుల కేటాయింపు అనేది బీసీల హక్కు. ప్రతి పార్టీ బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలి త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నా యి. వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలి. ఈమేరకు బీసీల సింహగర్జన సభలో తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ మనిషి... ప్రతి ఊరి నుంచి ఓ బండి... నినాదంతో సింహగర్జన నిర్వ హిస్తున్నాం. రాజకీయ పార్టీలకతీతంగా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నా. దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం ఈ సభకు రాను న్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పలు సంఘాల ప్రతినిధులు రానున్నారు. ఈ బహిరంగ సభకు దివంగత గద్దర్ పేరు పెడుతున్నాం. -
ప్రధానితో ఆర్.కృష్ణయ్య, బీసీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం జరు గుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రధానమంత్రి హోదాలో జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, డా.మారేష్, డా.పద్మలత, రమేశ్ ప్రధానమంత్రితో కలిసి చర్చలు జరిపారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించి ఒక వినతిపత్రాన్ని అందించారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. బీసీలకు ఏ రంగంలో కూడా ఇంతవరకు జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని ప్రధానికి వివరించారు. అందుకోసం బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అదేవిధంగా జనాభా గణనలో కులాల వారీగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ నేతల బృందం ప్రధానిని కోరింది. బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారని సమావేశం అనంతరం ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
బీసీల పక్షాన కాంగ్రెస్కు మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు. బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్కు రాహుల్గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను కోరారు. ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి, ఇంటికి ఠాక్రే, వీహెచ్ వెళ్లారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య ఠాక్రే, వీహెచ్లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం: ఠాక్రే ఆర్.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకే కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. -
బీసీ కుల గణనకు వైఎస్ జగన్ సర్కార్ జై
సాక్షి, అమరావతి : కుల గణన చేపట్టాలన్న బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైకొట్టింది. వెనుకబడిన వర్గాల ఆశల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. వీరి న్యాయమైన డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సీఎం వారికి నైతిక మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ తాజా నిర్ణయంపట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణలో బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చేపట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. పైగా ఇప్పుడు రాష్ట్ర పరిధిలో కుల గణనకు సన్నద్ధమైంది. దీనిపై అధ్యయనానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. త్వరలో మంత్రి వేణు నేతృత్వంలో కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తద్వారా జనాభా లెక్కల సేకరణలో కులం కాలమ్ చేర్పి కుల గణన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కుల జనగణనతో ఎంతో మేలు.. నిజానికి.. దేశ జనాభాలో 52శాతం కంటే అధికంగా ఉన్న ఓబీసీల లెక్కలు తేలాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుతం కొన్ని బీజేపీ మిత్రపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీని సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం కులాల వారీగా జనాభా గణనను చేపట్టలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పలుమార్లు ప్రకటించింది. కులాల వారీ లెక్కలు తేలితే జనాభా ప్రాతిపదికన (దామాషా ప్రకారం) వారికి నిధులు, విద్య, ఉద్యోగం, పదవులు రిజర్వేషన్ ప్రకారం దక్కుతాయని, తద్వారా ఆయా కులాలకు ఎంతో మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. నామి¯óట్ పదవులు, బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సైతం జనాభా వారీగా అందించి సామాజిక న్యాయం చేయవచ్చన్నది వాటి వాదన. 20 ఏళ్లుగా ఉద్యమాలు.. సీఎంకు కృతజ్ఞతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కలు–2022లో కులం కాలమ్ ఏర్పాటుచేసి బీసీ జనాభా లెక్కలు తేల్చాలని ఇటీవల జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం. కోవిడ్తో ఇప్పటికే ఆలస్యమైన జనాభా లెక్కల సేకరణ ఈ ఏడాది చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ అంటూ అనేక సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నాలు చేశాం. 20 ఏళ్లుగా చేస్తున్న ఈ డిమాండ్ను ఏ జాతీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ, ఏపీలో చేపట్టేందుకు నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. – ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇది చరిత్రాత్మకం అవుతుంది కులాల వారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది. అది ఓబీసీల్లోని పేదలకు వరంగా మారుతుంది. ఓబీసీ జనాభాను లెక్కించడంవల్ల ప్రభుత్వ పథకాలను ఇంకా సమర్థంగా అమలుచేయవచ్చు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ బాధలను అర్థం చేసుకుని రాష్ట్రంలో కుల గణనకు సీఎం వైఎస్ జగన్ ముందుకురావడం అభినందనీయం. దీని ద్వారా తాను బీసీల పక్షపాతినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. – కేశన శంకరరావు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం -
దద్దరిల్లిన జంతర్మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లింది. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ బీసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కనీ్వనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేశ్, రాజ్కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ నాయకత్వం వహించిన మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ను పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 129 బీసీ కులాలకుగాను 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత 35 సంవత్సరాల్లో 70సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు– ప్రదర్శనలు నిర్వహించామని... శాంతియుతంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: కేకే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే పథకాలు వేగంగా అమలు జరుగుతాయని అన్నారు. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని కేకే తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్న డిమాండ్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని లింగయ్య యాదవ్ అన్నారు. -
బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్ జగనే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, అమరావతి: లోకేశ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు బీసీ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదనే విషయం అర్థమవుతోందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని, సీఎం వైఎస్ జగన్ తగ్గించారంటూ లోకేశ్ పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాస్తవంగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తే సీఎం వైఎస్ జగన్ న్యాయం చేశారని వివరించారు. ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపని చంద్రబాబు.. బీసీలకు 34% రిజర్వేషన్లు ఎలా అమలు చేశారని లోకేశ్ను ప్రశ్నించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లకు మించి పార్టీ పరంగా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని స్పష్టం చేశారు. 25 మంది ఉండే మంత్రివర్గంలో సైతం ఏకంగా 11 మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, పనుల్లోనూ 50 శాతంపైగా బీసీలకు కట్టబెట్టారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని, దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని న్పష్టం చేశారు. -
మహిళా సాధికారతపై గుణాత్మక చర్చ జరగాలి
అంబర్పేట (హైదరాబాద్): మహిళా సాధికారతపై దేశవ్యాప్తంగా గుణాత్మక చర్చ జరగాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. గురువారం అంబర్పేట జైస్వాల్ గార్డెన్లో బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల కిందట పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవే పెట్టి అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని తెలిపారు. సమావేశంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్ మాట్లాడుతూ అవకాశం వస్తే రాబోయే ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
27న విజయవాడలో బీసీ ఆత్మగౌరవ సభ
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): ఈ నెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హైదరాబాద్లో నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆత్మగౌరవ సభ పోస్టర్ను కృష్ణయ్య విడుదల చేశారు. ఈ సమావేశ వివరాలను ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించి బీసీల సత్తా చాటేలా ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కృష్ణయ్య సూచించారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలంతా ఏకమై పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి పాల్గొన్నారు. అనంతరం బీసీ సంఘ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా మల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర కన్వీనర్గా సనపాల లక్ష్మీనరసింహ, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా అనిల్కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వెంకటాచార్యులు, రాష్ట్ర కన్వీనర్గా తన్నీరు సుబ్బారావు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా మాధవికి కృష్ణయ్య నియామకపత్రాలు అందించారు. -
9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి: కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సేన జాతీయ సమావేశం సేన జాతీ య అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్ సీపీ పార్లమెంట్లో బిల్లు పెడితే అధికార బీజేపీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు సాధన కోసం బీసీ ఎంపీలందరూ పార్లమెంట్లో డిమాండ్ చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బర్క కృష్ణయాదవ్ మాట్లాడుతూ బీసీల డిమాండ్లను ఆమోదించేంత వరకు ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాదప్ప, నాగరాజు, రాములుయాదవ్, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
భూ బకాసురులను వదిలి గుడిసెల మీదా దాడి చేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, గుడులు, బడులను దర్జాగా కబ్జా చేసి తిరుగుతున్న భూ బకాసురులను వదిలి ఆకలి కోసం అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేటలోని స్థానిక ఆదివాసీలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి వేసుకున్న గుడిసెలను వందలాది మంది ఫారెస్టు పోలీసులతో ఏకదాటిగా దాడి చేసి కూల్చివేయడం అన్యాయమని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా వ్యహరించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆదివాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజనులపై ఆకృత్యాలకు పాల్పడిన ఫారెస్టు, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఆదివాసి గిరిజనులకు దేశంలో బతికే హక్కులేదా అని నిలదీశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల వస్త్రాలను చిందరవందర చేస్తూ ఘోరంగా లాక్కెడం రజకార్ల పాలనను తలపించిందని ఆరోపించారు. గిరిజనుల పోరాటానికి బీసీ సమాజం పూర్తి మద్దతు ఇస్తుందని జాజుల ప్రకటించారు. -
‘బడుగుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర బడ్జెట్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు 74 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం లోక్సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన బీసీ భవన్లో జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలు మార్లు ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమకుట్టినట్లుకూడా లేదని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తన బీసీ వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బీసీలమంతా ఏకమై పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని తాము అనుకున్నప్పటికీ మోదీ పాలనలో నేటికీ అన్యాయం, వివక్ష కొనసాగుతున్నాయని ఆరోపించారు. సురేశ్ మాట్లాడుతూ దేశంలోని 6 వేల బీసీ కులాలను ఆదుకునేలా బడ్జెట్ను పునఃసమీక్షించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య, అంజి, జయం తిగౌడ్, హరీశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు పోరాడి సాధించుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్తో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, కేశ న శంకర్రావు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రెడ్డప్ప, టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రకుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ బీసీల కులగణనతో మాత్రమే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నచిన్న కులాలకు సైతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతికి ఏపీ ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి, వారికి దశదిశ చూపించే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలు బలమైన సామాజికవర్గమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అగ్రకులాల వారిని పల్లకిలో మోసిమోసి బీసీల భుజాలు అరిగిపోయాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి, జనగణన చేపట్టేవరకు ఏమాత్రం విశ్రమించకుండా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీసీబంధు పథకంపై కేసీఆర్ స్పందించాలి
కవాడిగూడ (హైదరాబాద్): బీసీ కులాలకు బీసీబంధు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీక్షను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి అనేక కులాలు రోడ్డునపడ్డాయని, వీటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఉపాధిలేక 46 మంది మనోవేదనకు గురై చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు మధుయాష్కీ, కోదండరాం, దాసోజు శ్రావణ్, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అజీజ్పాషా సంఘీభావం తెలిపారు. బీసీబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లాల్కృష్ణ, అరుణ్కుమార్, జనార్దన్, నీల వెంకటేశ్, సత్యనారాయణ, అంజి పాల్గొన్నారు. -
బార్ల నుంచి రాని కరోనా బడిలో వస్తుందా?
సాక్షి, పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్రంలో బార్లు ఆఫ్లైన్ నడుస్తుండగా విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్లో నడుస్తున్నాయని, బార్లో రాని కరోనా బడిలో ఎలా వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆన్లైన్ విద్య వల్ల సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు లేక గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో ఆన్లైన్ విద్య–బడుగు విద్యార్థుల అవస్థలు భవిష్యత్ కార్యాచరణ’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్రకమిటీ సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాజుల మాట్లాడారు. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నారని వారికి ఏడాది కాలంగా మిడ్డే మీల్స్ ఇవ్వడంలేదని, ఆ డబ్బుతో విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు ఇప్పించవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థలు తెరవని పక్షంలో 24 గంటల దీక్ష, చలో హైదరాబాద్ అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని జాజుల హెచ్చరించారు. -
తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ ఆయా కులాల మధ్య రిజర్వేషన్లను దామాషా ప్రకారం పంచేందుకు వాటిని నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదిస్తూ ముసాయిదా నివేదిక రూపొందించింది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా మార్చి నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ.. వరుసగా 2, 6, 9, 10 శాతం రిజర్వే షన్లను పంపిణీ చేస్తూ కమిషన్ ప్రతిపాదించి నట్టు సమాచారం. రిజర్వేషన్ ఫలాలు పొందని, అత్యంత వెనబడిన కులాలను మొదటి కేటగిరీలో పొందు పరిచినట్టు తెలుస్తోంది. నాలుగో కేటగిరీలో 97 కులాలు మాత్రమే ఉన్నప్పటికీ... జనాభా పరంగా చూస్తే సింహభాగం వారే ఉన్నారు. కాబట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లలో జనాభా ప్రాతిప దికన అత్యధికంగా 10% వారికే దక్కనుందని సమా చారం. 4వ కేటగిరీలో సామాజికంగా బలమైన, అత్యంత ప్రభావవంతమైన కులాలున్నాయి. గతం లోనూ ఈ కులాలే రిజర్వేషన్ల ఫలాలు అధికంగా పొందినప్పటికీ... జనాభా నిష్పత్తికి మించి వీరికి ప్రయోజనం కలిగిందనేది ఇతరుల అభ్యంతరం. మొదటి కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328, నాలుగో కేటగిరీలో 97 కులాలు పొందుపరిచినట్టు సమాచారం. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాలకు ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, ఓబీసీల్లో అత్యంత వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదంటూ బీసీ సంక్షేమ సంఘాల డిమాండ్లు, జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు, స్థాయీ సంఘాల సిఫారసుల నేపథ్యంలో 2017 అక్టోబరు 2వ తేదీన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ అదే ఏడాది అక్టోబరు 10 నుంచి తన పని ప్రారంభించింది. ఈ కమిషన్ 12 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు కేంద్ర మంత్రిమండలి ఈ కమిషన్ గడువు పొడిగించింది. ప్రస్తుతం 2021 జూలై 31కి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కమిషన్ నాలుగు విధి విధానాల ఆధారంగా నివేదిక సమ ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితాలో చేర్చిన ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీలో అసమానతలు పరిశీలించడం, ఓబీసీ కులాల ఉప వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో నిబంధనలు రూపొందించడం, కేంద్ర జాబితాలో ఓబీసీలను ఉపకులాల వారీగా వర్గీకరించడం, కేంద్ర జాబితాలోని వివిధ ఎంట్రీలను అధ్యయనం చేసి అక్షర దోషాలు, పునరావృతులు, అస్పష్టతలు, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం.. తదితరæ నాలుగు విధివిధానాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాల్లో... రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందని ఓబీసీ కులాలకు.. ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఓబీసీ జాబితాలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కమిషన్ సిఫారసులు చేస్తుంది. సున్నితమైన అంశం... రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్లలో కొన్ని కులాలకే లబ్ధి చేకూరినట్టు కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన వాటిలో 97% మేర విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకే దక్కాయని, ఇందులో 24.95% ఉద్యోగాలు కేవలం 10 ఓబీసీ కులాలకే దక్కాయని, దాదాపు 983 కులాలకు (అంటే 37%) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిందని కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. 994 ఓబీసీ కులాలకు 2.68% మేర కోర్సుల్లో సీట్లు, ఉద్యోగాలు దక్కినట్టు సమాచారం. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ తనకు అప్పగించిన విధివిధానాల మేరకు ఆయా అసమానతలను తొలగించాల్సి ఉన్నందున.. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందిన కులాలను చివరి కేటగిరీలో చేర్చాల్సి వస్తుందని అంచనా. దేశంలో రాజకీయా లపై కులాల ప్రభావం ఎక్కువ ఉంటున్నందున.. రిజర్వేషన్లు తగ్గితే అధిక ప్రాబల్యం ఉన్న కులాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు ఉండనున్నందున అలాంటి సమస్య తలె త్తదని, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, తాము లేవనెత్తిన అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు. సమాచారాన్ని విశ్లేషించిన కమిషన్ 11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ అమలవుతోంది. అయితే ఆ వర్గీకరణ రాష్ట్ర జాబితాలోని కులాలకు రాష్ట్రస్థాయిలో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ జాతీయస్థాయి కమిషన్ కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలతో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో ఈ కమిషన్ చర్చించింది. ఉన్నత విద్య కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన సమాచా రాన్ని, ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీలకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటివరకు రిజర్వేషన్ పంపిణీలో చోటు చేసుకున్న అసమానతలను విశ్లేషించింది. సంబంధిత సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దానిని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు సమయం అవసరమైంది. అలాగే లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడం ఆలస్యమైంది. వీటన్నింటినీ విశ్లేషించి, ముసాయిదాను రూపొందించిన కమిషన్ తన ప్రతిపాదనలపై వచ్చే నెల నుంచి రాష్ట్రాలు, ఓబీసీ కులాలు, సంబంధిత అంశంలో భాగస్వాములందరితో చర్చించనుంది. -
ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలసి వినతిపత్రం సమరి్పంచారు. కోవిడ్–19 నేపథ్యంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కోవిడ్తో పాటు ఇతర చికిత్సలకూ అనవసర పరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు
నెహ్రూనగర్(గుంటూరు)/చిలకలూరిపేట: రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, బీసీ కులాలన్నీ ఆయనకు రుణపడి ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీల సమస్యలపై తాను వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నానని, అయితే ఏపీలో బీసీల సమస్యలపై పోరాడేందుకు ఎలాంటి అవకాశం కలగట్లేదని, సంస్కరణవాది అయిన వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు, చిలకలూరిపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఈనాడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఇచి్చన మాటకు కట్టుబడి సీఎం జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడం గర్వకారణమన్నారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్పొరేషన్ చైర్మన్లకు జరిగిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజని అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమే‹Ù, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మద్దాళి గిరిధర్, మద్యపాన విమోచన సమితి అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, పలువురు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు
తెనాలి: ఈఎస్ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హత్యానేరంలో జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ బీసీలకు సంబంధం లేదని తెలిపారు. బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు మినహా బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని పేర్కొన్నారు. -
జగన్ను ఆదర్శంగా తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా జనాభా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతేడాది పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దేశంలో 14 బీసీ పార్టీలు ఉన్నాయని, వాటికి రాని ఆలోచన వైఎస్సార్సీపీకి రావడం గొప్ప విషయమని అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
అప్పులు బీసీలకు.. సంపద అగ్రవర్ణాలకా?
నాంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు కోత విధించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో 48 శాతం కోత విధించడం బాధాకరమని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో బీసీలకు రూ.5,960 కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,672 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. బడ్జెట్లో బీసీ సబ్ప్లాన్ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. అప్పులు బీసీలకు, ఆర్థిక సంపద అగ్రవర్ణాలకా? అని నిలదీశారు. జోగు రామన్న ఏ పాపం చేశారని మంత్రివర్గంలోకి తీసుకోలేదు? సకల జనుల సమ్మెను నడిపిన స్వామిగౌడ్ ఎక్కడికి పోయారు? ఆత్మబలిదానం చేసుకున్న దాసోజు కుటుంబం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. మంగళవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో జాజుల మాట్లాడారు. తెలంగాణ, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలను గవర్నర్లుగా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని అన్నారు. ఈ నెల 14న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు హిమాచల్ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లకు ఆత్మీయ సత్కార అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంబీసీ అధ్యక్షుడు బంగారు నర్సింహ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు పోల శ్రీనివాస్, వెంకటనారాయణ, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు బండి సాయన్న, వీర భద్రయ్య సంఘం అధ్యక్షులు వీరస్వామి, ప్రొఫెసర్ ఆలెదాసు జానయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రంగాచారి, దూదేకుల సంఘం అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీహరి యాదవ్, కురుమ సంఘం నాయకులు సదానందం, కనకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఐకమత్యం పెరిగింది’ వెనుకబడిన తరగతుల్లో ఐకమత్యం వచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఐకమ త్యం పెరగడంతోనే మంత్రివర్గంలోని మం త్రులకు ఉద్వాసన పలకడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్నారు. బీసీలపై చర్య తీసుకుంటే పీఠాలకే ఎసరు పెట్టినట్లు అవుతుందనే భయం పాలకవర్గంలో ఉందన్నారు. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రానికి రావడం కొత్త రాజకీయ నాందికి ఆరంభమని అన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గవర్నర్గా తెలంగాణకు రావడం అదృష్టంగా భావించాలని అన్నారు. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి
హైదరాబాద్: బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని పార్టీలకతీతంగా బీసీలందరూ పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో ఆంధ్రపదేశ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీల సమావేశం ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ అధ్యక్షతన జరిగింది. ఆర్.కృష్ణ య్య మాట్లాడుతూ.. 71 ఏళ్ల స్వతంత్ర భార తంలో పాలకులు బీసీలను అభివృద్ధి చేయకుండా గొర్రెలు, బర్రెలు ఇచ్చి, అడుక్కుతినే బిక్షగాళ్లను చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలోగానీ ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలేడని ఆవేదన వ్యక్తం చేశా రు. 545 మంది లోక్సభ సభ్యుల్లో 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మందే ఉన్నారన్నారు. తెలంగాణలో 112 బీసీ కులాలు ఉండగా ఇంతవరకు 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.శ్రీనివాసులు, రమ్యశ్రీ (సినీ నటీ) తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా, బద్వేల్కు చెందిన జి.శ్రీనివాసులుకు నియమాక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు. తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా అల్లి లక్ష్మి, సభ్యులుగా సుమన్బాబు, దేవి మంజిరాలను ఎన్నుకుంది. -
వసతి గృహాల్లో సమస్యలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది. -
ఫ్యాన్కు ఓటేస్తేనే ఏపీ అభివృద్ధి: కృష్ణయ్య
సాక్షి, మైలవరం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏప్రిల్ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్కు ఓటేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మైలవరంలో కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో బిల్లు పెట్టకుండా చంద్రబాబు బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదుగురు ఎంపీలతో పోరాడిన వ్యక్తి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయో, బీసీలకు కూడా ఆ ప్రకారమే ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన శాసనసభ్యులతో బీసీలకు ప్రైవేటు బిల్లు పెట్టేవిధంగా తీర్మానం చేశాడని ప్రశంసించారు. మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ కూడా బీసీల బిల్లు కోసం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు. -
బీసీలను మోసం చేసిన కేసీఆర్
హైదరాబాద్: ఎంపీ టికెట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బీసీలను మరోసారి మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్న బీసీలకు మొండి చేయి చూపి అగ్రకులాల వారికే పెద్ద పీట వేశారన్నారు. చిక్కడపల్లిలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐదు శాతం ఉన్న రెడ్లకు ఐదు టికెట్లు కేటాయించి 56% ఉన్న బీసీలకు మూడు టికెట్లే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యను వ్యాపారం చేసే వారికి, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్లకు టికెట్లు కేటాయించి, సామాజికవేత్తలను విస్మరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ను తెలంగాణ రెడ్ల సమితిగా మార్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ మలిఉద్యమకారులను విస్మరించటం సరికాదన్నారు. కేసీఆర్ సైతం పోటీ చేస్తే ఓడిపోయే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించి అవమానించారన్నారు. రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, దీనికి బీసీలంతా ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.దుర్గయ్య, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలి’
హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలోని బీసీలకు 50% టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీభవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీసీ నాయకుల కోర్ కమిటీ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. గతంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో బీసీలకు బిచ్చమేసినట్లు టీడీపీ అతితక్కువ ప్రాతినిథ్యం కల్పించిందని విమర్శించారు. పార్టీలు బీసీల ను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయన్నారు. -
బీసీలు కోరినవన్నీ చేసిన వైఎస్
హైదరాబాద్: ‘‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. చరిత్రాత్మకమైనది. బీసీలు ఏది కోరితే అది చేసిన మహోన్నత వ్యక్తి. విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరైన వైఎఎస్సార్ మాదిరిగానే.. ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందుకే ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ నెల 17న ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ గర్జనకు హాజరవుతాను’’ అని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్ విద్యానగర్లో ఆర్.కృష్ణయ్యను కలసి బీసీ గర్జన సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఇందుకు కృష్ణయ్య అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనపై కృషి చేయాలని పార్లమెంటులోని 36 రాజకీయ పార్టీల్ని కోరితే వైఎస్సార్సీపీ తప్ప ఇతర ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని గుర్తు చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటూ వైఎస్సార్సీపీ చర్చకు పట్టుపట్టిందని, అయినా ఫలితం లేకపోవడంతో పార్టీపరంగా ప్రైవేటుబిల్లు పెట్టి చర్చకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్ అని ప్రశంసించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి, మాట్లాడడానికి అన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్న సమయంలో జగన్ మాత్రం జనాభా ప్రకారం సీట్లు ఇస్తామని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ధైర్యంగా ముందుకొచ్చారని అభినందించారు. గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు కలిసి బీసీ అభ్యర్థులనే నిలబెడదామని జగన్ ఓపెన్ చాలెంజ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణయ్యను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ రాయలసీమ రీజియన్ బీసీ విభాగం కోఆర్డినేటర్ తొండమల్ల పుల్లయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు లీలాకృష్ణ, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా వెంకటకోటయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులున్నారు. -
ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం బీసీ భవన్లో జరిగిన సమావేశానికి సంఘం బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. క్లాస్–వన్ ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగుల శాతం ఎనిమిది దాటలేదని, కేంద్ర స్థాయి ఉద్యోగుల్లో 16% దాటలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 71 ఏళ్ల తర్వాత కూడా 56%జనాభా గల బీసీలకు ఇంత తక్కువ ప్రాధాన్యం ఉండటం చూస్తే ఈ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టం అవుతోందన్నారు. అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. అగ్రకులాల్లోని పేదలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలలో 80 % పదవులు అగ్రకులాల వారే అనుభవిస్తున్నారని ఆరోపించారు. 15% జనాభా ఉండి 80% పదవులు పొందుతున్న అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడంలో శాస్త్రీయత లేదన్నారు. ఈబీసీలకు రిజర్వేషన్లు సిద్ధాంత వ్యతిరేకమని, అధికారం కోసం పాలకులు అడ్డదారులు తొక్కే ప్రయత్నమని మండిపడ్డారు. ఈ సమావేశంలో గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్,ఎం. వెంకటేశ్,జి.రామకృష్ణ,్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కోర్టు ధిక్కార పిటిషన్పై కోర్టు స్పందించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, గణాంకాల డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సైదా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ధర్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ జానాభా కోసం పలు పిటిషన్లు బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్కుమార్, బి.రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన లెక్కల్లో బీసీ జనాభా ఎంత ఉందో బహిర్గతం చేసి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్ రాజు సంయుక్త మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ తరువాత ఆ వివరాలను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, ఇవన్నీ పూర్తి చేసిన తరువాతనే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ ఏడాది జూన్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానిది కోర్టు ధిక్కారమే... ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బీసీ జనాభా గణనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బీసీ జనాభాను తేల్చకుండానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోందంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం విచారించారు. బీసీ జనాభాను తేల్చకుండా ఎన్నికలు నిర్వహించడం కోర్టు ధిక్కారమే అవుతుందని జాజుల తరఫు న్యాయవాది రామచంద్రగౌడ్ కోర్టుకు నివేదించారు. అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అధికారులందరికీ నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు. -
‘బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ అణచివేతకు నిరసనగా ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 105 మందిలో 21 మంది బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వడంపై మండి పడ్డారు. బీజేపీ 66 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 14 మంది బీసీలకే అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు కలిపి 40 నుంచి 50 సీట్లే కేటాయించడాన్ని వ్యతిరేకించారు. 11న టీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు ఇస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ తో అదే రోజు నిరసనలకు పిలుపునిచ్చారు. -
‘రేపు బీసీ బహిరంగసభ దద్దరిల్లాలి’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సమగ్రాభివృద్ధిని కోరుతూ ఈ నెల 4న సరూర్నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీ బహిరంగసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు 112 బీసీ కులసంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీసభప్లాన్, బీసీ అట్రాసిటీ యాక్ట్ లాంటి అంశాలపై సభలో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. -
4న విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ సభ
హైదరాబాద్: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సాధనకు వచ్చేనెల 4న నాగోల్లోని శుభం కన్వెన్షన్లో లక్షన్నర మందితో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సభ పోస్టర్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే విశ్వబ్రాహ్మణుల సమస్యలు తీరుతాయనుకుని ఉద్యమంలో ముందుండి పోరాడామని, రాష్ట్రం వచ్చాక కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి పాలకమండలి నియమించాలని, యాభై ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు రూ. 5 వేల పింఛను ఇవ్వాలని, నిరుపేద విద్యార్థులకు విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటుగా ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ ‘బీ’నుంచి బీసీ ‘ఏ’కు మార్చాలని కోరారు. తమ డిమాండ్లు ఏ పార్టీ నెరవేరుస్తుందో వారికే తమ పూర్తి మద్దతిస్తామన్నారు. సభకు అన్ని పార్టీల నాయకులకు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డె సుదర్శనాచారి, ప్రధానకార్యదర్శి బచ్చల పద్మాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుపూరి వీరాచారి, కోశాధికారి మోత్కూరి వీరభద్రాచారి, గోపాలచారి, శ్రీనివాస్, బాలాచారి, బ్రహ్మంతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును ఆయన కలిశారు. బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన ‘బీసీ పాలసీ’ పుస్తకాన్ని కేశవరావుకు అందజేశారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచటంతోపాటు గత డిసెంబర్లో రూపొందించిన ‘బీసీ నివేదిక’అమలు అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరచాలని కేకేను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన.. ‘బీసీ పాలసీ’ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, మేనిఫెస్టోలో పొందుపరిచేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ శక్తిగా ఎదగాలి ఖమ్మం మామిళ్లగూడెం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయ శక్తిగా ఎదగాలని జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమ్మేళన సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీసీలను వివక్ష, అణచివేతకు గురిచేస్తున్న పార్టీలకు జెండాలను మోసేవారు వాస్తవాలను గ్రహించాలని కోరారు. కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన మారోజు వీరన్నను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 57 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్నో వేలాది మంది అమర విద్యార్థుల త్యాగాల పోరాట పునాదులపై ఏర్పడిన తెలంగాణ నేడు దొరల పాలైందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్బాబు, కళాకారుడు సోమన్న, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పాపారావు పాల్గొన్నారు. -
దుర్మార్గ పాలన ఇక చాలు
నాలుగున్నరేళ్ల పాలనతో అన్ని వర్గాలకూ అన్యాయమే.. ఒక్క హామీ కూడా అమలు చేసింది లేదు. పూటకో మాట చెబుతున్న చంద్రబాబు.. బీసీల ఓట్లతో గద్దెనెక్కి వారిని అణగదొక్కుతున్నారు. ఈ నిరంకుశ వైఖరిపై ఆదివారం గుంటూరు వేదికగా యాదవులు గళమెత్తారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ సమావేశమై దుర్మార్గపాలనను అంతమొందిస్తామని నినదించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే యాదవుల సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశానికి యాదవ సంఘ నాయకులు, పెద్దలు, ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బాబు పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ దుష్టపాలనను భరించడం ఇక సాధ్యం కాదని పేర్కొన్నారు. గుంటూరు రూరల్, పాతగుంటూరు, పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ అధ్యయన కమిటీ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదవ ప్రతిని«ధులు, వివిధ సంఘనేతలు, మేధావులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు వారి సమస్యలు తెలియజేయటంతోపాటు వారి సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు బీసీలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతి ఒక్క వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి, వైఎస్సార్సీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, సమన్వయకర్త కిలారి రోశయ్య, గుంటూరు వెస్ట్ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు మందపాటి శేషగిరిరావు, నిమ్మకాయల రాజనారాయణయాదవ్, గోళ్ళ శివశంకర్యాదవ్, తాళ్ళ వీరయ్య యాదవ్, కర్నాటి ప్రభాకర్రెడ్డి, దాది శివబాబు యాదవ్, కూరాకుల కోటేశ్వరరావు, చిల్లపల్లి మోహనరావు, తోట మణికంఠ, సంకూరి శ్రీను, అజయ్యాదవ్, లలిత్ప్రజాపతి, మర్రి సత్యనారాయణ, పల్లా శ్రీను, పాణ్యం మురళీకృష్ణ, మండేపూడి పురుషోత్తం, శ్రీకాంత్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్యాదవ్ పాల్గొన్నారు. విదేశీ విద్యకు రుణాలు ఇవ్వాలి యాదవ యువతకు విదేశీ విద్యకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలి. నిరుద్యోగ యువతకు మీట్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ప్రమాదవశాత్తూ మరణించిన గొర్రెలకు రూ. 5 వేల చొప్పున ఇన్సూరెన్స్ ఇవ్వాలి. రూ 2 వేల కోట్లతో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లును కేటాయించాలి. – గోళ్ల శివశంకర్యాదవ్, బీసీ యూత్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు ఏపీపీ పదవులను కేటాయించాలి రిజర్వేషన్ల ప్రకారం న్యాయస్థానాల్లో ఏపీపీ పదవులను యాదవులకు కేటాయించాలి. బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం సక్రమమైన న్యాయం జరగటం లేదు. ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయి. ఈ అణచివేతకు చరమగీతం పాడాలి. చట్టసభలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమన్యాయం జరగాలి. – జీవీ యాదవ్, లాయర్, మాచర్ల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి యాదవ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపాలి. వ్యాపారాలకు రూ. 10 నుంచి 25 లక్షల వరకూ రుణాలు ఇవ్వాలి. సబ్సిడీలు 50 శాతం ఇవ్వాలి. 13 జిల్లాల్లో 13 ఎమ్మెల్యే సీట్లు, రాష్ట్రంలో 2–3 పార్లమెంటు సీట్లను కేటాయించాలి. రాష్ట్రంలో మూడు మంత్రి పదవులు కేటా యించాలి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను కల్పించాలి. బీసీలలో అ«త్యధిక జనాభా కలిగిన యాదవ వర్గానికి ప్రత్యేక కార్పోరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. – నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సన్నిధి గొల్లను వంశపారపర్యంగా కేటాయించాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్ల పదవిని యాదవులకు వంశపారపర్యంగా కేటాయించాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదవిపై మార్పులతో జీవో జారీ చేసింది. ఇది యాదవుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది.అదేవిధంగా వృత్తివిద్యకు ప్రాధాన్యం ఇస్తూ వృత్తి విద్యా ప్లాంట్ యూనిట్లను ప్రభుత్వం పూర్తి రాయితీతో ఏర్పాటు చేయించాలి. – ఆలా రవికుమార్యాదవ్,అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు, గుంటూరు వివక్షకు గురవుతున్నారు యాదవులు నేటికీ గ్రామాల్లో వివక్షకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నుంచి రూ. లక్ష వంతున నిధులు కేటాయించాలి. సబ్సిడీలు, పశు, గొర్రెల యూనిట్లను కేటాయించాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. – బోయిన సుబ్బారావు యాదవ్, సీనియర్ యాదవ సంఘం నాయకుడు యాదవుల అభివృద్ధి శూన్యం గత నాలుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో యాదవుల అభివృద్ధి శూన్యంగా మారింది. బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రభుత్వం మోసగించింది. బీసీలలో ప్రధానంగా యాదవులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అందక పేద ప్రజలు ఎలాంటి అభివృద్ధి చెందక వెనకబడి పోతున్నారు. యాదవులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో తమ సంక్షేమాన్ని కాంక్షించే పాలకులనే గద్దె నెక్కించాల్సిన అవసరముంది. – దూళ్ల హరియాదవ్ ఐక్యంగా సాధించుకోవాలి బీసీలలో అత్యధికంగా ఉన్నటు వంటి యాదవులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమం కోసం అందించిన సంక్షేమ పథకాలను అందిస్తానని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడం అభినందనీయం. యాదవులకు ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు, అమరావతిలో 20 ఎకరాల భూమిని కేటాయించాలి. – యర్రాకుల తులసీరామ్ యాదవ్,అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూ.1000 కోట్ల నిధులు దారి మళ్లించారు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటు బ్యాంకుగా వినియోగించుకుని నట్టేట ముంచాడు. బీసీలకు మేనిఫెస్టోలో 110 పథకాలు చూపి మోసం చేశాడు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. బీసీలలో 104 కులాలు ఉండగా ఒక్క కులానికి గుర్తింపు ఇవ్వలేదు. బీసీలకు రూ. 270 కోట్లు కేటాయించామని చెప్పిన చంద్రబాబు ఎవరికి ఇచ్చారంటే సమాధానం లేదు. బీసీ డిక్లరేషన్ ప్రకారం రూ. 1000 కోట్లు ఇచ్చామంటున్న చంద్రబాబు వాటిని దారి మళ్లించారు. బీసీలకు పెద్దపీటను వేసి వారి అభివృద్ధికి పాటుపడుతున్న జననేత జగనన్నకు మనమంతా అండగా ఉండి ఆయనను ముఖ్యమంత్రిని చేసుకుందా. తద్వారా ఆయన ప్రకటించిన విధంగా బీసీలకు డిక్లరేషన్ వస్తుంది. మన ఆర్థిక స్వావలంబనకు ఎంతో దోహదపడుతుంది. – విడదల రజని, చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
నేడు బీసీ రాజకీయ యుద్ధభేరి: జాజుల
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలు బీసీలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీసీ రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బీసీల రాజకీయ నిర్మాణం కోసం ‘ఓటు మాదే.. సీటు మాదే’నినాదంతో బీసీ రాజకీయ సమితి (బీఆర్ఎస్)ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాయితీలు, సబ్సిడీలు పేరుతో ప్రభుత్వాలు బీసీలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాధికారం దిశగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో బీఆర్ఎస్ పని చేస్తుందని వెల్లడించారు. సభకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
‘పోటీ పరీక్షల తేదీలు మార్చాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. పరీక్షలు బుధవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఆయన వినతిపత్రం అందజేశారు. రానున్న రెండు నెలల పాటు వరుసగా పోటీ పరీక్షలున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు వాయిదా వేసే పరిస్థితి లేనందున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష తేదీలను మార్చాలని కోరారు. రైల్వే పరీక్షలు వచ్చే నెలాఖరు వరకు ప్రతి రోజు మూడు షిప్టుల్లో ఉన్నాయని, ఇదే సమయంలో కానిస్టేబుల్, గురుకుల, ట్రాన్స్కో, గ్రూప్–4 పరీక్షలున్నాయన్నారు. ఈ నెల 30న కానిస్టేబుల్ పరీక్ష ఉండగా.. అదేరోజు ట్రాన్స్కో జేఏ పోస్టుకు సంబంధించిన పరీక్షలున్నాయని పేర్కొన్నారు. పరీక్షల తేదీలను పూర్తిస్థాయిలో పరిశీలించి పరస్పర విరుద్ధం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత విభాగాలకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. -
గొర్రెలు, బర్రెలు మాకు.. అసెంబ్లీ టికెట్లు వారికా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో బీసీ కులాలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చారని.. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మాత్రం అగ్రకులాల వారికే ఎక్కువ సీట్లిచ్చారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతానికిపైగా సీట్లు దక్కాలని.. బీసీలకు ప్రాధాన్యతనివ్వని పార్టీలకు ఇకపై గడ్డుకాలమేనని హెచ్చరించారు. సోమవారం సిద్ధార్థ హోటల్లో ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన 112 బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు బీసీ కులాలకు కేటాయించే సీట్ల అంశంపై విస్తృతంగా చర్చించారు. బీసీలకు ఎక్కువ సీట్లిచ్చిన రాజకీయ పార్టీలకే తమ కులాలు మద్దతు పలుకుతాయని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో బీసీలున్నప్పటికీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బీసీ కులాలతో ప్రత్యేక పార్టీ పెట్టాలనే డిమాండ్ వస్తుందని, త్వరలో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించనున్నట్లు స్పష్టంచేశారు. ఆ బాధ్యత కేంద్రానిదే.. జనాభాలో వెనుకబడిన వర్గాలు 50 శాతానికి పైగా ఉన్నారని, ఆ ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పనకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆర్.కృష్ణయ్య చెప్పారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు బీసీలకు కేటాయించకుంటే ఆయా పార్టీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నేతలు గుజ్జ కృష్ణ, కె.జనార్దన్, వి.వెంకటేశ్, సత్యనారాయణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బున్న కులాలకే ప్రధాన పార్టీల టికెట్లు: కృష్ణయ్య
సాక్షి,హైదరాబాద్: డబ్బున్న కులాలు, అభ్యర్థులకే ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు ప్రాధాన్యత దక్కలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు సైతం బీసీల్లో బాగా వెనుకబడిన కులాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా వృద్ధి చెందాలంటే బీసీ రిజర్వేషన్లే ఏకైక మార్గమన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈమేరకు బీసీ కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అబిడ్స్లోని ఓ ప్రైవేటు హోటల్లో బీసీ మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, భూపేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి పోరాడండి: కృష్ణయ్య
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఓ హాల్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు, ఏపీలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. ఖాళీల భర్తీలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలు, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 12 లక్షల ఉద్యోగాలు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. రిటైర్ అయిన వారిని వోఎస్డీలు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగులుగా ఇప్పటివరకు 2 వేల మందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది రోడ్డు మీద తిరుగుతుంటే.. రిటైర్ అయిన వారిని కొనసాగించడం న్యాయం కాదన్నారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, అంజి, రామలింగం, రామకృష్ణ, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. -
రాజకీయ సంస్కరణలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకువచ్చి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాష్ట్రపతిని కోరారు. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతితో వారు 35 నిమిషాలపాటు చర్చించారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా దక్కలేదని వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు రాజకీయ రంగంలో 14 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం, వ్యాపార రంగంలో కేవలం ఒక శాతం వాటా మాత్రమే బీసీలకు ఉందని, రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం మౌళికమైన మార్పులకోసం చర్యలు తీసుకోవాలని నేతలు రాష్ట్రపతిని కోరారు. పార్లమెంటు, శాసనసభలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని, పారిశ్రామిక పాలసీలో బీసీలకు 50 శాతం వాటా కల్పించాలనే తదితర 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పిం చారు. 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై తన వంతు ప్రయత్నం చేస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య మీడియాకు తెలిపారు. రాష్ట్రపతిని కలిసినవారిలో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ జేఏసీ నేత నౌడు వెంకటరమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయకార్యదర్శి గుజ్జ కృష్ణ, భూపేశ్కుమార్, హరికిషన్ ఉన్నారు. -
ఆ గురుకులాలను తక్షణమే ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు 119 బీసీ గురుకుల పాఠశాలలను తక్షణమే ప్రారంభించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేబినెట్ బీసీ సబ్కమిటీ సమావేశంలో భాగంగా 119 గురుకులాలను ప్రారంభిస్తామని గతేడాది డిసెంబర్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు వచ్చే విద్యాసంవత్సరం వాటిని ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. జనాభా సంఖ్యకు తగినన్ని గురుకులాలు లేకపోవడంతో వేలాది బీసీ విద్యార్థులు అడ్మిషన్ల కోసం కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్కు రూ.500 కోట్లే సీఎం ఇస్తామనడం అన్యాయమన్నారు. దరఖాస్తుల సంఖ్యను పట్టించుకోకుండా అరకొర నిధులిస్తే ఎలాగని ప్రశ్నించారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాలని కృష్ణయ్య కోరారు. -
‘పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం’
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధం గా రావాల్సిన 34% రిజర్వేషన్లను తగ్గించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం విద్యానగర్లోని బీసీభవన్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామపంచాయతీల్లో బీసీలకు 4,335 స్థానాలు కేటాయించాలని, కానీ ఎస్టీలకు కేటాయించిన స్థానాలు తీసేసి మిగిలిన 10,117 గ్రామపంచాయతీలకు గానూ 34% రిజర్వేషన్తో కేవలం 3,440 స్థానాలనే బీసీలకు కేటాయించారన్నారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 56 శాతానికి పెంచుతామన్న కేసీఆర్.. సీఎం అయ్యాక ఉన్న రిజర్వేషన్లను 27 శాతానికి తగ్గించాలని చూడటం సిగ్గు చేటన్నారు. రిజర్వేషన్లను తగ్గించకుండా బీసీలకు తగిన స్థానాలను కేటాయించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
‘పంచాయతీల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 31 జిల్లాల్లో బీసీ గణన నిర్వహించిందని, వారి లెక్కల ప్రకారం బీసీ జనాభా 54% ఉందని గుర్తుచేశారు. ఈ ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోకుండా బీసీలకు ఇష్టానుసారం రిజర్వేషన్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్లను నీరుగార్చే వారి ఆటలు సాగనివ్వమని, బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని తెలిపారు. దామాషా పద్ధతిన పాలనలో భాగస్వామ్యం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. 2014 సమగ్ర సర్వే లెక్కలను అధికారికంగా వెల్లడించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. -
బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: కృష్ణయ్య
మహేశ్వరం: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన కురుమ మహాసభలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయవాటా ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గంలో ఉన్న బీసీ నేతలకు పార్టీలు సీట్లు ఇచ్చి గెలిపించాలన్నారు. బీసీలను విస్మరిస్తే తెలంగాణ, ఏపీలో బీసీ పార్టీలు పుట్టుకొస్తాయని స్పష్టం చేశారు. సంబరాలు తప్ప ఉద్యోగాలేవీ..? సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా రాష్ట్రంలో సంబరాలు తప్ప ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. నాలుగేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకుంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అయితే ఆచరణలో మాత్రం అవేవీ కనిపించడం లేదన్నారు. -
ఓబీసీలను ఐదు గ్రూపులుగా విభజించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ కులాలను ఐదు గ్రూపులుగా విభజించి, గ్రూపుల వారీగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ కులాల వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, భూపేశ్ సాగర్ బుధవారం ఢిల్లీలో జస్టిస్ రోహిణిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వర్గీకరణ శాస్త్రీయంగా సమన్యాయం జరిగేలా చేయాలని, ఒక్కో రాష్ట్రాన్ని యూనిట్గా పరిగణించి ఓబీసీల స్థితిగతులను విశ్లేషించాలని నేతలు కోరారు. 2011 జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కలు సేకరించారని, కేంద్రం వీటిని ప్రకటిస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాంతో సమావేశమైన నేతలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. -
ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా ఇంటర్మీడియెట్ అడ్మిషన్లను ఆన్లైన్లో ప్రభుత్వమే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. శనివారం బీసీ భవన్లో బీసీ విద్యార్థి సంఘం కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన బీసీ విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను దోచుకున్నాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని కృష్ణానది అవతలికి తరిమికొడతానన్న కేసీఆర్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల్లో బట్టీ్ట చదువుల వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, మల్లేశ్ యాదవ్, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీపై నిర్ణయం తీసుకోలేదు: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బీసీల హక్కుల సాధనకు రాజకీయ వేదిక అవసరమని, అయితే పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...బీసీలలో ఉన్న మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా తనను రావాలని అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని ఇటీవల కాంగ్రెస్ పెద్దలు కూడా తనతో చర్చించారని, కానీ తాను ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు. -
భూముల వేలాన్ని వెంటనే ఆపాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని వెంటనే ఆపాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అడ్డగోలుగా భూములను వేలం వేస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఎలా చేపడతారని బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అందుబాటు లో ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ జాగాలు కనిపించవని, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యంకాదన్నారు. వారం రోజులుగా హెచ్ఎండీఏ యంత్రాంగం వేలం పాట ద్వారా రూ.400 కోట్ల రియల్ వ్యాపారం సాగించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చితే భూముల ఆవశ్యకత ఉంటుందని, రియల్ ఎస్టేట్ చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. -
బీసీలకు ప్రత్యేక పార్టీ అవసరం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగభాగం ఉన్న వెనుకబడిన తరగతులకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. బీసీలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీ అవసరమని అభిప్రాయపడింది. ప్రత్యేక పార్టీలో బీసీలే ప్రతినిధులుగా ఉంటారని సూచించింది. దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉందని, త్వరలో ఎజెండా ప్రకటించనున్నట్లు రాజకీయ తీర్మానం చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం సెంట్రల్ కోర్ట్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రాజ్యాంగం చెబుతున్నా.. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ర్యాగ అరుణ్, వినయ్ శివశంకర్, సూర్యప్రకాశ్, ప్రభంజన్, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జ్లు తదితరులు పాల్గొన్నారు. -
కుమ్మరులను బీసీ–ఏ లో చేర్చాలి
హైదరాబాద్: కుమ్మర కులస్తులను బీసీ–బి నుంచి ఏ లోకి మార్చాలని, ఇందుకు చట్టసభల్లో ఏకగ్రీవ తీర్మానం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ భవన్లో శుక్రవారం జరిగిన రాష్ట్ర కుమ్మర సంఘం సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుమ్మరులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కులవృత్తిని కాపాడటంలో భాగంగా వారు చేసిన కుండలు, పూల కుండీలను ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు కొనుగోలు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాకతీయ పనుల్లో వెలువడిన మట్టిని వారికి ఉచితంగా కేటాయించాలని, సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. 50 ఏళ్లు పైబడిన వారికి రూ. 2 వేల పింఛను ఇవ్వాలని, నామినేటెడ్ పదవుల్లో వారికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ: కుమ్మరుల డిమాండ్లపై శనివారం ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. సభకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సభకు మంత్రులు ఈటల, జోగు రామన్న, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ రాములుతో పాటుగా కమిషన్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావు, బీసీ సంఘం నాయకులు గుజ్జకృష్ణ, భూపేశ్సాగర్ పాల్గొన్నారు. -
రాజ్యాధికారంలో సగం వాటా ఇవ్వాలి
హైదరాబాద్: దేశ జనాభాలో సగమున్న బీసీలకు రాజ్యాధికారంలో సగం వాటా కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నర్సింహయాదవ్ హాజరయ్యారు. పొన్నాల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో బీసీలు రాజీ పడవద్దని, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం దక్కేవరకు పోరాడాలని పిలుపిచ్చారు. సమాజంలో బీసీలకు ఆత్మ గౌరవం దక్కాలంటే రాజకీయ అధికారమే పరిష్కారమన్నారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. బీసీ కమిషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదింపజేసి, క్రీమీలేయర్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని వీహెచ్ కోరారు. బీసీ కమిషన్ బిల్లు పెడితే మొదటి ఓటు తానే వేస్తానని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్లో పోరాడుతానని తెలిపారు. రాజకీయ పార్టీల రంగులు బయటపెట్టేందుకు 20వేల మంది బీసీ ప్రతినిధులతో మార్చి చివరి వారంలో బీసీ రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. త్వరలోనే బీసీ కుల సంఘాలతో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న 32 రాజకీయ పార్టీలను కలసి బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీడీపీ యువజన విభాగం నాయకుడు వీరేందర్ గౌడ్, సీపీఐ నేత రంగాచారి, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
6న నిరాహార దీక్షలు: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల సంస్థాగత నిర్మాణ సమీక్ష జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, శారద గౌడ్, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య సంఘ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జి. రాధాకృష్ణారావు, మంచిర్యాల జిల్లా చైర్మన్గా చిట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కర్రె లచ్చన్న, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్గా భేరి సత్యనారాయణలను నియమించారు. -
29న కాంట్రాక్టు ఉద్యోగుల మహా సభ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల ను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని కోరుతూ ఈ నెల 29న హైదరాబాద్లో మహా సభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు రాష్ట్రంలో 2.20లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని అర్హతల ఆధారంగా క్రమబద్ధీకరించాలన్నారు. ఔట్సోర్సింగ్ వారి పరిస్థితి దారుణమన్నారు.. ప్రభుత్వం నెలవారీగా వేతనాలు ఇసున్నా ఔట్సోర్సింగ్ సంస్థలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.కృష్ణ, అంజి, ఎస్.రామలింగం, భూపేశ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ప్లాన్తోనే బీసీలకు సరైన న్యాయం
సాక్షి, హైదరాబాద్: బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ప్రత్యేక ఉపప్రణాళిక అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు.. బీసీ కమిటీ సభ్యులు మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనాచారిలకు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ పాలసీ అవసరమని, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ లేదా బీసీ ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన వర్తింపజేయాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు 50శాతం వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు.. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని తెలు గు రాష్ట్రాల సీఎంలను కోరామని కృష్ణయ్య చెప్పారు. దీనికి ఇద్దరు సీఎంలు అంగీకరించారని, ప్రధాని అపా యింట్మెంట్ దొరకగానే వెళ్దామని చెప్పారన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు పోరాటం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇచ్చేవరకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని చైతన్యపురిలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అయితే 6 నెలల్లోపు భర్తీ చేసినట్లే ఉద్యోగ ఖాళీలు ఏర్పడితే 3 నెలల్లోపు భర్తీ చేసేలా రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని ప్రతి సభలో కేసీఆర్ చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా 10 వేల మందికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో నీల వెంకటేశ్, గుజ్జ కృష్ణ, నందగోపాల్, రామలింగం, వేముల రామకృష్ణ, రావుల కోల్ నరేశ్, గంగనబోయిన రాంబాబు, పి.సతీశ్, సుమారు 5 వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. -
వాటాలో సగం దక్కాల్సిందే..!
హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగ భాగం వాటా దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలు–బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బీసీ డిమాండ్లపై చర్చించి నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 65 బీసీ కుల సంఘాల అధ్యక్షులు, 20 బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా మంజూరు చేయాలని, బ్యాంకులతో నిమిత్తం లేకుండా వంద శాతం సబ్సిడీతో ప్రతి బీసీ కుటుంబానికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ను ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడానికి వెంటనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్లో బీసీ భవన్కు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మించాలని, బీసీ ఫెడరేషన్లను కొనసాగించి ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయించిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మార్చిలో బహిరంగ సభ బీసీల శక్తిని ప్రదర్శించడానికి మార్చిలో పది లక్షల మందితో హైదరాబాద్లో బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం తీర్మానించినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మొల్ల జయంతి, భగీర«థ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని, మొల్ల, సర్దార్ సర్వాయి పాపన్న, భగీరథ మహర్షి, జ్యోతిబాపూలే, దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాలను ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నేతలు గణేష్చారి, ఏఎల్ మల్లయ్య, అయిలి వెంకన్న, గోగికార్ సుధాకర్, బంగారు నర్సింహ్మ సగర, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వాటాలో సగం దక్కాల్సిందే..!
హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగ భాగం వాటా దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలు–బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బీసీ డిమాండ్లపై చర్చించి నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 65 బీసీ కుల సంఘాల అధ్యక్షులు, 20 బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా మంజూరు చేయాలని, బ్యాంకులతో నిమిత్తం లేకుండా వంద శాతం సబ్సిడీతో ప్రతి బీసీ కుటుంబానికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ను ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడానికి వెంటనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్లో బీసీ భవన్కు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మించాలని, బీసీ ఫెడరేషన్లను కొనసాగించి ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయించిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మార్చిలో బహిరంగ సభ బీసీల శక్తిని ప్రదర్శించడానికి మార్చిలో పది లక్షల మందితో హైదరాబాద్లో బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం తీర్మానించినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మొల్ల జయంతి, భగీర«థ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని, మొల్ల, సర్దార్ సర్వాయి పాపన్న, భగీరథ మహర్షి, జ్యోతిబాపూలే, దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాలను ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నేతలు గణేష్చారి, ఏఎల్ మల్లయ్య, అయిలి వెంకన్న, గోగికార్ సుధాకర్, బంగారు నర్సింహ్మ సగర, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధికే బీసీల్లో చేర్చారు: కృష్ణయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బీసీల్లో చేర్చడం హేయమైన చర్య అని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. దీనిపై బీసీలంతా టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. శనివారం ఆయన హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేరుస్తారనే వార్తలు వెలువడ్డ నాటి నుంచి బీసీలంతా తీవ్ర ఆందోళనతో ఉన్నారని చెప్పారు. గతంలో కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా ప్రయత్నిస్తే తాను హైకోర్టులో పిల్ వేసి అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీల కోసం త్వరలో పార్టీ బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాజకీయ పార్టీ స్థాపించే దిశగా యోచిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామానికి వెళ్లినా బీసీల కోసం పార్టీ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారన్నారు. వారందరి మేలు కోసమే పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని దేశోద్ధారక భవన్లో 72 బీసీ కులాల సభలో కృష్ణయ్య మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఇచ్చే వరకు పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇలా ప్రకటించడం సీఎంకు కొత్తకాదు. నిరుద్యోగులను మోసం చేయడానికే ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోంది. ఇంటికో ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడాలి’ అని నిరుద్యోగులకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం వివిధ సాకులతో ఉద్యోగాలను భర్తీ చేయకుండా జాప్యం చేసిందని, ఇప్పుడు కొత్త జోన్ల పేరుతో మరోసారి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. మంగళవారం బీసీ భవన్లో రాష్ట్ర నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 30 వేల ఉద్యోగాలు అదనం గా వచ్చాయని, అందులో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. సచివాలయంలో ఏ శాఖకు వెళ్లినా అరకొర సిబ్బంది ఉన్నారన్నారు. కొత్తగా 21 జిల్లాలు, 125 మండలాలు, 25 ఆర్డీవో ఆఫీసులు, పోలీసుస్టేషన్లను ప్రారంభించినా ఇందులో అరకొర సిబ్బందితో పని నెట్టుకొస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏర్పడ్డ ఖాళీల ఆధారంగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్సిటీల విద్యార్థులు, సంఘం నేతలు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 50 శాతం డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం వాటా ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దామాషా ప్రకారం ఇస్తుండగా.. బీసీలకూఅదే నిబంధన వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించి సాధించుకుంటామన్నారు. -
బీసీలకు పూర్తి ఫీజు ఇవ్వాలి ఆర్. కృష్ణయ్య డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. పదివేల ర్యాంకు నిబంధనను వెంటనే తొలగించాలని కోరింది. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ సందర్భంగా టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లో ఐదు గ్రూపులుండగా... బీ కేటగిరీలోని దూదేకుల, లద్దాప్, నూర్బాష, జైన్, జొరాస్ట్రియన్, సీ కేటగిరీలోని క్రిస్టియన్లు, ఈ కేటగిరీలోని ముస్లింలకు పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తున్నారన్నారు. హిందువులుగా ఉన్న బీసీలకు మాత్రం రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులిస్తున్నారన్నారు. అరకొరగా ఫీజులు ఇవ్వడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలతో పాటు బీసీలకు పూర్తిస్థాయిలో నిధులివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ర్యాగ అరుణ్, గుజ్జ కృష్ణ, సత్యనారాయణ, కొప్పుల జగన్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలపై 12న కలెక్టరేట్ల ముట్టడి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం చొరవ చూపడం లేదని, దీనికి నిరసనగా ఈ నెల 12న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆదివారం తెలిపారు. గతేడాది ఫీజు బకాయిలు రూ.1,600 కోట్ల మేర పేరుకుపోయినా, ప్రభుత్వం చోద్యం చూస్తోందని వి మర్శించారు. బ్యాంకుల తో సంబంధం లేకుండా దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాదిరి విద్యార్థుల ఫీజులు చెల్లించాలని కోరారు. ఫీజులు చెల్లించకపోవడంతో హాల్టికెట్లు, సర్టిఫికెట్ల జారీలో యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. -
ఆదివాసీలకు అండగా ఉంటాం
సాక్షి, ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటుందని అటవీ, పర్యాటక, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. 2014 కంటే ముందు పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకునే గిరిజనులకు తప్పకుండా పట్టాలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో జరిగిన కుమురం భీం 77వ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమురం భీం సమాధి వద్ద మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా గిరిజనులంతా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల పట్టాల విషయంలో అక్కడక్కడ సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లోని బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణ చేయాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ భవన్లో సోమవారం జరిగిన బీసీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలన్నారు. -
‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హన్మకొండ: ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే బీసీ హక్కులను సాధించుకుందామని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ఎల్ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని, ఉద్యోగాల నియామకం చేపట్టాలని, క్రిమిలేయర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఇటీవల ప్రధానిని కలసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మేధావులు మౌనంగా ఉండడం వల్లే∙జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు చట్టసభల్లోకి వెళ్లలేక పోతున్నామని, తద్వారా కాంట్రాక్టర్లు, రౌడీలు, గూండాలు, పారిశ్రామిక వేత్తలు చట్టసభల్లో అడుగుపెడుతున్నారన్నారు. ఎల్ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఏజీ పదవికి బీసీలు అనర్హులా?: జాజుల
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పదవికి బీసీలు అర్హులు కాదా అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రశ్నిం చారు. హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి బీసీలకు ఇప్పటికీ ఈ పదవి దక్కలేదన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఇప్పటికీ వివక్షకు గురవుతు న్నారని, పలు రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగలేకపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. -
అధికారంతోనే పేద కులాలకు గౌరవం: కృష్ణయ్య
హైదరాబాద్: పేద కులాలకు అధికారంతోనే గౌరవం పెరుగుతుందని, ఆ దిశగా బీసీ సంక్షేమ సంఘం ఉద్యమిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్లో జరిగింది. 4,689 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని సమా వేశంలో కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లోని 2 లక్షల ఉద్యోగాలతో పాటు 40 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు క్రీమీలేయర్ను ఎత్తివేయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల న్నారు. ఏకీకృత సర్వీసుల్లో జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు, పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కృష్ణుడు, కోటేశ్వర్రావు, గురుప్రసాద్, సురేశ్, నర్సింహాచారి, విజయ్కుమార్, రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్యాదవ్, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ ప్రెసిడెంట్ రాజేందర్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమ సంఘంలో చీలిక
తెలంగాణ సంఘ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్గౌడ్ - సంఘంలో కృష్ణయ్య కొడుకు అరుణ్ జోక్యం పెరిగింది - ఇకపైనా కృష్ణయ్య నేతృత్వంలోనే పనిచేస్తాం: జాజుల సాక్షి, హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు బాసటగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం నిట్టనిలువునా చీలింది. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్యా నెలకొన్న అసంతృప్తులు తారస్థాయికి చేరుకుని మంగళ వారం భగ్గుమన్నాయి. బీసీ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్యకు కుడి భుజంగా నిలిచిన ఆ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో.. కొత్త కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 31 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన, మహిళా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలకు చెందిన 400 మంది ప్రతినిధులు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శ్రీనివాస్గౌడ్ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆర్.కృష్ణయ్యే మా నాయకుడు: జాజుల ఆర్.కృష్ణయ్య తమ నాయకుడని, ఆయనతో విభేదించే పరిస్థితే లేదని, ఆయన నేతృత్వం లోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పని చేస్తుందని జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశా రు. సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘంలో కృష్ణయ్య కొడుకు డాక్టర్ అరుణ్ జోక్యం బాగా పెరిగిందని, తమకు నచ్చిన వాళ్లకు ఏకపక్షంగా పదవులు కట్ట బెడుతూ ఉద్యమ సంస్థలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే ఎర్ర సత్య నారాయణను తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సంఘంలో గందరగోళం చెలరేగిందన్నారు. దీనిపై ఆర్.కృష్ణయ్య నుంచి స్పష్టత లేకపోవ డంతో తాము విడిగా సమావేశమైనట్లు చెప్పారు. దశాబ్దాల ఉద్యమంలో చీలిక.. సామాజికంగా వెనుకబడిన కులాల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా 1986లో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భవించింది. బీసీల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాల్లో అగ్ర భాగాన నిలిచింది. బీసీ విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్షిప్పుల కోసం.. అలాగే నిరుద్యోగుల కోసం పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘మన రాష్ట్రంలో మన రాజ్యం’ నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీకి శంకర్రావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కొంతకాలంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎర్ర సత్యనారాయణ పేరు ప్రచారంలోకి రావడం, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకపక్షంగా మార్చేయడం తాజా చీలికకు దారితీసింది. అరుణ్ జోక్యం లేదు: ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘంలో చీలికపై ఆర్.కృష్ణయ్య స్పందించారు. తమది ఉద్యమ సంస్థ అని, ఇందులో తన కొడు కు అరుణ్ జోక్యం ఏమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పదవుల విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని చెప్పారు. అరుణ డాక్టర్ అని, బీసీ సంక్షేమ సంఘంలో అతని పాత్ర పరిమితమన్నారు. ‘ఇది ఉద్యమ సంస్థ. పోరాడిన వాళ్లే ముందు నిలుస్తారు. శ్రీనివాస్గౌడ్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా’అని కృష్ణయ్య చెప్పారు. -
టీఆర్ఎస్ ప్లీనరీలో బీసీ డిమాండ్లపై తీర్మానం
ప్లీనరీ తీర్మానాల కమిటీకి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చించి, తీర్మానం చేయాలని ప్లీనరీ సమావేశాల తీర్మానాల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు (కేకే)కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఆదివారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం కేకేను కలసి బీసీల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసింది. బీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో బీసీలకు 50 శాతం పదవులు, హైదరాబాద్లో 10 ఎకరాల స్థలంలో బీసీభవన్ నిర్మించాలని విజ్ఞప్తి చేసింది. -
బీసీ రిజర్వేషన్లపై పోరాడదాం
కేరళ సీఎంని కోరిన కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేష న్లు కల్పించేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కోరారు. ఆది వారం గ్రాండ్ కాకతీయ హోటల్లో కేరళ సీఎంను కలసి 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బీసీ రిజర్వేషన్లపై కేరళ అసెంబ్లీ లోనూ తీర్మానం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు దక్కుతాయని తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిం చాలని, ప్రైవేటు రంగంలోనూ బీసీ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామన్నారు. -
స్ఫూర్తి ప్రదాత..సావిత్రిబాయి పూలే
ఘనంగా పూలే జయంతి వేడుకలు. సిరిసిల్ల టౌన్ : బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే భావితరాలకు స్ఫూర్తి ప్రధాతగా ప్రజల మదిలో నిలిచారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపెల్లి రమేశ్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కేక్కట్ చేసి మాట్లాడారు. జనవరి 3న ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, యూత్విభాగం అధ్యక్షుడు సామల రాజుగౌడ్, ఏలూరు చంద్రకాంత్, శ్రీరాం వెంకటేశం, కాసర్ల రాజు, గాజుల విద్యాసాగర్, యెనగంటి ఆంజనేయులు, కారంపురి సాయన్న తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్ల ో పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి చాకలి రమేశ్, వేములవాడ ఇన్ చార్జి పొత్తూరి మల్లేశం, పట్టణ అద్యక్షుడు టి.భాను, దుంపేట జలేందర్, మేర్గు రాజు, జింక రాజు, గొల్లపెల్లి దావీదు తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో యంగ్మెన్ప్ అంబేద్కరిస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకునూరి శంకరయ్య, అసోసియేషన చైర్మన్ సిరిగిరి కిషోర్, పట్టణ అద్యక్షుడు సిరిగిరి అనీల్కుమార్, ప్రేమ్కుమార్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో పట్టణంలో స్వీట్లు పంపిణీ చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సాయికుమార్, లచ్చన్న, రాకేశ్, అరుణ్, నాగరాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయకపోతే తిరుగుబాటే
విజయవాడ(గాంధీనగర్) : బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోతిన వెంకటమహేష్ హెచ్చరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. బీసీ కులవృత్తిదారులు ధర్నాలో పాల్గొన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం వంటి కుల వృత్తుల చిహ్నాలను ధర్నాలో ప్రదర్శించారు. కుల వృత్తిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తిచాటారు. గంగిరెద్దులను ప్రదర్శించారు. వెంకటమహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదరణ లేక బీసీల కులవృత్తులు కనుమరుగైపోయాయన్నారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్కై పార్లమెంట్లో బిల్లుపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలని డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. ధర్నాలో బీసీ సంఘం నాయకులు తట్టి అర్జునరావు(యాదవసంఘం), పేరం శివనాగేశ్వరరావు (గౌడసంఘం), కర్రి వేణుమాధవ్ (స్వర్ణకార సంఘం), షేక్ గౌస్మొహిద్దీన్ (వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం), బాయన శేఖరరాబు (బీసీఐక్యవేదిక), కామరాజ్ హరీష్ (విద్యార్థి విభాగం), దాసరి సత్యం(బుడబుక్కల సంఘం), నాగేంద్ర (సూర్యబలిజ సంఘం), వివిధ కులవృత్తిదారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
హాలియా : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 126వ వర్ధంతిని సోమవారం హాలియాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమసమాజ స్థాపనకు, నిరక్ష్యరాస్యత, మూఢాచారాల నిర్మూలన, సాంఘీక దురాచారాలు తదితర అంశాల్లో ప్రజలను చైతన్యవంతంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జవ్వాజి వెంకటేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకట్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, చెరుపల్లి ముత్యాలు, గౌని రాజారమేష్ యాదవ్, అనుముల ఏడుకొండల్, మాకమళ్ల జంగయ్య, కూన్రెడ్డి నాగిరెడ్డి, పొదిల శ్రీనివాస్, సత్యం, కిలారి కృష్ణ, కూరాకుల రవి, నసీర్, అన్వర్, పోశం శ్రీనివాస్ గౌడ్, రావుల వెంకటేశం గౌడ్, నామని సుధాకర్, చెరుపల్లి వెంకటేశ్వర్లు, మోటముర్రి సురేందర్ పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో.. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం హాలియా బీసీ సంక్షేమ వసతి గృహంలో జ్యోతిబాపూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల రాంబాబు, సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురభి రాంబాబు, సూర్యనారాయణ, వసతి గృహ అధికారి వెంకటేశ్వర్లు, ఎడారి నరేష్, నారందాసు అంజయ్య, నాగిళ్ల నరేందర్, నంద్యాల ప్రవీణ్, దివాకర్, సైదులు వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చల్మారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో.. మండలంలోని చల్మారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జ్యోతిబా పూలే వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కరుముల వెంకట్మ్రణారెడ్డి, ఉపాధ్యాయులు చీదళ్ల శ్రీనివాస్లు, అరవింద్కుమార్, సైదుల్రావ్ గౌతమ్, లిల్లీథెరిస్సా, సత్తయ్య, సునీత, సుధాకర్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో.. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 126వ వర్ధంతిని సోమవారం హాలియాలో ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు యడవల్లి సోమశేఖర్, మామిడి శంకర్, మందా గౌతమ్, చింత వెంకటేశ్వర్లు, వర్కాల శ్రీనివాసరెడ్డి, పాల నాగేందర్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, బాబొద్దీన్ పాల్గొన్నారు. గుర్రంపూడ్ : మండలంలని కొప్పోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జ్యోతిరావ్ పూలే వర్ధంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామ సర్పంచ్ పోలా సరోజినమ్మ పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు. సమసమాజ సాప్థనకు, పూలే ఆశయాలకు సాధనకు కృషి చేయలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట యాదయ్య, నర్ర రవి తదితరులున్నారు. పెద్దవూర : యువత జ్యోతిరావు పూలే అశయాలకు అనుగుణంగా నడుచుకుని ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పూలే వర్థంతినిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వస్తపురి మల్లిక, నాయకులు పులిమాల కృష్ణారావు, కర్ణ బ్రహ్మారెడ్డి, హైమద్అలీ, వస్తపురి నర్సింహ, వెంకటేశ్వర్లు, దేవయ్య, పరమేష్, సులోచన, వెంకటయ్య, కొండయ్య, నడ్డి లక్ష్మయ్య, శ్రీనివాస్చారి పాల్గొన్నారు. -
మెస్ చార్జీలు,స్కాలర్షిప్లు పెంచాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్ : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెస్చార్జీలు, స్కాలర్షిప్లు పెంచే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమ దుస్థితి తెలియజేస్తూ విద్యార్థులు ఖాళీ ప్లేట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. ధర్నానుద్దేశించి కృష్ణయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్చార్జీలు, స్కాలర్షిప్లను పెంచాలని ఎన్నిమార్లు విన్నవించినా, ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాలను 3 నుంచి 10 రెట్లు పెంచారని, అందరికి తెలంగాణను బహుమతిగా ఇచ్చి తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులను మాత్రం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు.అరుుదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల మెస్చార్జీలను తక్షణం పెంచాలని కోరారు.సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 24 వందల వార్డెన్ల, వాచ్మెన్, కామాటి, కుక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. హాస్టళ్లలో ప్రతీ ఆదివారం మాంసాహార భోజనం పెట్టాలన్నారు. బీసీ నేతలు నీల వెంకటేష్, కుల్కచర్ల శ్రీనివాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నరిసింహగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ రాములు అధ్యక్షతన బీసీ కమిషన్
సభ్యులుగా వకుళాభరణం, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లో వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం కోసం ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములు చైర్మన్గా బీసీ కమిషన్ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయగౌడ్, ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ ఇందులో సభ్యులు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కమిషన్ పదవీ కాలా న్ని మూడేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం అనంతరం బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో అత్యవసరంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయా ల్సిన పరిస్థితులుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కమిషన్ విధులివి: బీసీల జాబితాలో కొత్త కులాలు, వర్గాలు చేర్పుల అభ్యర్థనలు, తొల గింపులపై ఫిర్యాదులను కమిషన్ పరిశీలించి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. బీసీలకు సంబంధించి ఇతర అంశంపై పరిశీలించి, ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. అధికారాలివి..: సివిల్ కోర్టుకు ఉండే పలు ప్రత్యేకాధికారాలు బీసీ కమిషన్కు ఉంటాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా వ్యక్తుల హాజ రును కోరుతూ సమన్ల జారీకి, ఏదైన డాక్యుమెంట్ను కోరడానికి, అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాల స్వీకరణకు, ఏదైన కోర్టు నుంచి పబ్లిక్ రికార్డుకు సంబంధించినకాపీని కోరడానికి, సాక్షుల, డాక్యుమెంట్లు పరిశీలించే అధికారాలు కమిషన్కు ఉంటాయని తెలిపింది. ఇప్పుడెందుకు..?: నిబంధన ప్రకారం మూడేళ్లకోసారి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయాలి. పదేళ్లకోసారి బీసీల జాబితాపై సమీక్ష జరపాలి. చివరిసారిగా, ఉమ్మడి రాష్ట్రంలో సుబ్రమణ్యం నేతృత్వంలో ఏర్పాటైన బీసీ కమిషన్ గడువు 2011 సెప్టెంబర్తో ముగిసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 26 బీసీ కులాలు ఇక్కడి రాష్ట్రంలో లేవని బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించడంపై వివాదం రేకెత్తించింది. వీటిని మళ్లీ జాబితాలో చేర్చడం, ఇతర కొత్త డిమాండ్లపై పరి శీలన కోసం ఈ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. బీసీ-ఈ కేటగిరీలో ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచే అంశంపై కమిషన్ సిఫారసులు కీలకం కానున్నాయి. బీసీ కమిషన్ వద్దు: బీసీ సంక్షేమ సంఘం సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్పై టీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నరేందర్గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ న్యాయమూర్తితో ఏర్పాటు చేయాల్సిన కమీషన్ను సామాజిక ఉద్యమకారులతో ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులకు గతంలోనే విన్నవించినా పట్టించుకోలేదన్నారు. బీఎస్ రాములు, చైర్మన్: ప్రసిద్ధ రచయిత, బహుగ్రంథ కర్త. ప్రస్తుతం జగిత్యాల జిల్లావాసి. పద్మశాలి సామాజికవర్గం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు. డాక్టర్ వి.కృష్ణమోహన్రావు, సభ్యులు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్వాస్తవ్యులు. దాసరి సామాజికవర్గం. ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు 2004-09 వరకు బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. ఓయూ నుంచి ఎంఏ(తెలుగు) పీహెచ్డీ చేశారు. డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్, సభ్యులు: జోగుళాంబ గద్వాల జిల్లా వాసి. విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు. ఓయూ నుంచి న్యాయ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. -
రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కాపులను బీసీలలో చేర్చేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తామని ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీ బీసీల ఓట్లతో గెలిచిందన్నారు. గద్దెనెక్కిన తరువాత కాపులను బీసీల జాబితాలో చేరుస్తామనే నిర్ణయంతో బీసీలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జిల్లాకు ఈ నెల 17న జస్టిస్ మంజునాథన్ కమిషన్ బందం విచ్చేస్తోందని, ఈ సందర్భంగా తమ అభ్యంతరాన్ని తెలియచేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 12న స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి బీసీ కుల, ఉద్యోగ, సంక్షేమ సంఘాల నాయకులు, యువజన, విద్యార్థి సంఘాలవారు, కార్మికులు, కర్షకులు, మేథావులు హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్బాబు, రజకాభివధ్ది సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమన్, జిల్లా సహాయ కార్యదర్శి కోట మల్లేష్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లుకు చొరవ తీసుకోవాలి
రాజకీయ పార్టీలను కోరిన బీసీ సంక్షేమ సంఘం సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. గురువారం ఇక్కడ పలువురు నేతలను కలిశారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎస్.పి.సింగ్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తదితరులను కలసి వినతిపత్రాన్నిచ్చారు. బీసీ డిమాండ్లకు మద్దతు కూడగట్టేందుకు త్వరలోనే కర్ణాటక, బిహార్, యూపీ, మహారాష్ట్ర, హరియాణాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. బృందంలో శ్రీనివాస్గౌడ్, శివనాగేశ్వరరావు, అనిల్, ప్రొఫెసర్ ఎం.బాగయ్య, రాజుగౌడ్ ఉన్నారు. -
30న ఏపీ, తెలంగాణల్లో కలెక్టరేట్ల ముట్టడి
ప్రకటించిన బీసీ సంక్షేమసంఘం సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఏపీ, తెలంగాణల్లో కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమసంఘం ప్రకటించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభ ల్లో రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం ఎందుకు కల్పించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే, సంఘ నేత ఆర్.కృష్ణయ్య, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ అధ్యక్షుడు కె.శంకరరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
ప్రజాస్వామ్యం కాదు.. అగ్రకులాల స్వామ్యం
నిజామాబాద్ నాగారం, వినాయక్నగర్ : దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను ఓట్ల కోసం వాడుకొని ప్రజాస్వామ్యాన్ని అగ్రకులాల స్వామ్యంగా మారుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. సాంస్కృతిక విప్లవం రావాలని, బీసీలు రాజ్యాధికార స్థాపన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో శుక్రవారం బీసీ కుల సంఘాల జిల్లా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అర, ఒక్క శాతం ఉన్న అగ్రకులాల వారు బీసీలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా సుమారు 70 దశాబ్దాలు పాలించారని అన్నారు. బీసీల ఓట్లతో అధికారం చేపట్టి బీసీల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. క్షేత్రస్థాయి నుంచి బీసీలంతా ఏకమై ఉద్యమాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇ. శ్రీనివాస్గౌడ్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్లు పాల్గొన్నారు. బడ్జెట్లో రూ. 150 కోట్లు కేటాయిస్తే బీసీలకు సరిపోతాయా.. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చిన ప్రకారం రూ.18 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని, 500 గురుకుల పాఠశాలలు నిర్మించాలన్నారు. -
‘ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలి’
కామారెడ్డి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ సమన్వయ కర్త డాక్టర్ రిషి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కామారెడ్డిలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే అర్హులందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెంచుకున్నామన్నారు. కానీ రాష్ట్రం వచ్చి రెండేళ్లు గడిచినా ఫలితం కనిపించడం లేదన్నారు. ఉద్యోగాల నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఇంటర్ ఆపై స్థాయి విద్యార్థులకు స్కాలర్షిప్లను నెలకు రూ. 2 వేల చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కోర్సుల విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి, కెరీర్ గైడెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్గౌడ్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు నీల నాగరాజు, ప్రతినిధులు దత్తు, శేఖర్, మహేశ్, నితిన్, గంగాధర్, విజయ్కుమార్, యాదగిరి, నాందేవ్, సంజీవ్, సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు నిజాంపట్నం : జాస్మిన్, శ్రీసాయి కుటుంబాలకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. బుధవారం గ్రామస్తులు, శ్రీసాయి స్నేహితుల ఆధ్వర్యంలో అడవులదీవిలోని గరువు గ్రామం నుంచి మెయిన్ సెంటర్ వరకూ నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, హిందువులు సోదరుల్లా కలసిమెలసి ఉంటారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘటనను తప్పుదోవ పట్టించడం వల్లే శ్రీసాయి మృతి చెందాడన్నారు. దీనివెనుక ఏదో తెలియని కుట్ర దాగిఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తొలుత జాస్మిన్, శ్రీసాయి మృతికి మౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.