గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
హయత్ నగర్ లో రూ.19 లక్షలు పట్టివేత
Published Wed, Jan 20 2016 2:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని భాగ్యలత సెంటర్ వద్ద బుధవారం మధ్యాహ్నం చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.19 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement