కూకట్పల్లి (హైదరాబాద్) : ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని కూకట్పల్లి మైత్రి నగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మైత్రి నగర్లో నివాసముంటున్న ప్రసన్న(28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అయితే ప్రసన్నది ఆత్మహత్య కాదని, భర్త మనోహర్ రెడ్డి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా భర్త, అత్తమామలు ఆమెను వేధిస్తున్నారంటూ మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రసన్నకు మనోహర్ రెడ్డితో రెండు సంవత్సరాల క్రితం పెళ్లయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Published Fri, Nov 27 2015 3:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement