kukatpally
-
HYD: గాయత్రి హాస్టల్ కేసులో షాకింగ్ విషయాలు
తూర్పుగోదావరి: అశ్లీల వీడియోల పేరుతో యువతిని బెదిరిస్తూ నాలుగేళ్ల నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న గాయత్రీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్లో ఉంటున్న కాజా అనూషాదేవితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలేనికి చెందిన నీనావత్ దేవా నాయక్ అలియాస్ మధు అనే వ్యక్తిని అనూషాదేవి వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్నేహితురాలికి తన భర్తను పరిచయం చేసింది. అనూషాదేవితో ఉన్న పరిచయం, ఒకే హాస్టల్లో ఉండడంతో బాధితురాలు ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండేది. దీంతో దేవనాయక్ వేరే వ్యక్తి ఫోన్ చేసినట్లుగా బాధితురాలికి ఫోన్ చేసి తన వద్ద ఆమె న్యూడ్ వీడియోలున్నాయని, వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. విడతల వారీగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇలా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాకానిలో అపార్ట్మెంటు కోనుగోలు చేశాడు.కారు, బుల్లెట్, పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశాడు. కాగా..తనను ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని అనూషాదేవికి బాధితురాలు తెలిపింది. ఈ విషయం మళ్లీ దేవానాయక్ దృష్టికి వెళ్లింది. వేరొకరి ద్వారా సెటిల్మెంట్ చేసినట్లు బాధితురాలిని నమ్మించాడు. అలాగే పలు అవసరాల కోసం బాధితురాలి దగ్గర డబ్బులు కాజేశాడు. కాగా.. అనూషాదేవి, ఆమె భర్త దేవానాయక్లు తనను మోసం చేస్తున్నారని బాధితురాలు గుర్తించించి. దీంతో తల్లిదండ్రులతో కలిసి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. ఇలా ఆమె 2021 నుంచి 2025 వరకూ దాదాపు రూ. 2,53,76,000 మోసపోయింది. మరో రూ.14 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. మూడు రోజుల్లో కేసు ఛేదనబాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లో దేవా నాయక్ను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1,81,45,000 విలువైన 938 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.250 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.75 లక్షల నగదు, కారు, బుల్లెట్ స్వా«దీనం చేసుకున్నారు. చిన్నకాకానిలో కొనుగోలు చేసిన అపార్ట్మెంటును స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా స్వా«దీనం పర్చుకున్నారు. -
కూకట్ పల్లిలో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
కూకట్పల్లిలో భారీ చోరీ
మూసాపేట: కూకట్పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్రావు, సంధ్యారాణి దంపతులు కూకట్పల్లి జయానగర్లోని శ్రీ సీతా ప్యాలెస్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్ ఫోన్చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్మెన్ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్ డోర్ తెరిచి ఉందని గమనించి డ్రైవర్కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నటుడు శ్రీ తేజ్ పై చీటింగ్ కేసు
-
కూకట్పల్లిలో యాంకర్ సుమ సందడి (ఫొటోలు)
-
కూకట్పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం (ఫొటోలు)
-
హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య
కూకట్పల్లి (హైదరాబాద్): హైడ్రా అధికారులు తమ ఇళ్లు కూడా కూల్చివేస్తారేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవబస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (56 ).. భర్త శివయ్యతో కలిసి సొంత ఇంటిలో నివసిస్తోంది. వీరికి నల్లచెరువు సమీపంలో మరో రెండు ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచి్చన భార్యాభర్తలు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే గత ఆదివారం హైడ్రా అధికారులు నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వీటికి ఎదురుగానే రోడ్డుకు ఆవతలి వైపు బుచ్చమ్మ ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చమ్మ ఆందోళనకు గురై శుక్రవారం సాయంత్రం భర్త హాల్లో ఉండగానే బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి మా కోసం ప్లాట్లు కొని ఇళ్లు కట్టించారు. అయితే హైడ్రా వాళ్లు చుట్టుపక్కల ఇళ్లు పడగొడుతున్నారు. మా ఇళ్లూ అలాగే అవుతాయనే టెన్షన్తో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది..’ అని బుచ్చమ్మ కుమార్తె సరిత చెప్పింది. -
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్
-
కూకట్పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్లోకి కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్జోన్లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇది కూడా చదవండి: కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్ -
కూకట్పల్లిలో మట్టుబెట్టి.. అందోల్కు తరలించి..
జోగిపేట(అందోల్): భార్యపై అనుమానంతో కూకట్పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అందోల్కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా చిటు్కల్కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది. కొన్ని రోజులుగా ఇందిరకు ఫోన్కాల్స్ ఎక్కువగా రావడంపై నర్సింహులు అనుమానం పెంచుకున్నాడు. దీనివల్ల కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఆదివారం కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన అతను టవల్ను గొంతుకు చుట్టి ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కూకట్పల్లి నుంచి అందోల్కు మృతదేహం తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో గట్టిగా నిలదీస్తే తానే చంపినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మృతురాలి తల్లి మొగులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. ఇందిర మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్లో కుండపోత వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Very heavy smashing rain at Tellapur side. #Tellapur #HyderabadRains pic.twitter.com/dquYSIRmZx— Jagadish Reddy (@Jagadish_M) September 6, 2024 #06SEP 5:10PM⚠️Heavy Rain Spell ahead for West, Central, South &East #Hyderabad City.#Serilingampally, #Patancheru, #Kukatpally, #Begumpet, #Secunderabad,Abids,Khairatabad,Shaikpet, Charminar, Lb nagar Surroundings will see good Rains during the next 1hr⛈️⚠️#Hyderabadrains pic.twitter.com/vgpORYwzwg— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 Raining #Khajaguda 🌧️🌧️#Hyderabadrains pic.twitter.com/rnJ9GNbLBy— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 -
గాల్లోకి డబ్బులు.. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్లో రీల్స్ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూకట్పల్లిలో ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్ హర్ష అలియాస్ మహాదేవ్ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.‘తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx— Telangana Police (@TelanganaCOPs) August 23, 2024కాగా గురువారం కూకట్పల్లి యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు. -
గాల్లోకి కరెన్సీ నోట్లను విసురుతూ.. యూట్యూబర్ ఓవరాక్షన్
సాక్షి,హైదరాబాద్: తెలుగు యూట్యూబర్ హర్ష మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. గురువారం కూకట్ పల్లిలో రద్దీగా ఉండే ప్రాంతంలో డబ్బును గాల్లోకి విసిరి రీల్స్ చేశాడు. నోట్లు వెదజల్లడంతో వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాల్లోకి నోట్లు విసురుతున్న రీల్స్ వైరల్ కావడంపై ప్రజలు, నెటిజన్లు సదరు యూట్యూబర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా యూట్యూబర్ హర్ష ఇప్పటికే పలు మార్లు డబ్బుల్ని గాల్లోకి చల్లుతూ రీల్స్ చేసి పోస్ట్ చేశాడు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్ పై స్టంట్లు చేయడం,విసిరిన డబ్బుల్ని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించడంపై వెల్లువెత్తాయి. ఈ తరుణంలో మరోసారి డబ్బుల్ని గాల్లోకి విసరడంతో ట్రాఫిక్జామ్ కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్పై తగు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి పోలీసులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in HyderabadCyberabad police will you please take action?A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024 -
హైదరాబాద్లో మళ్లీ దంచికొట్టిన వాన.. తెలంగాణకు ఐదురోజులు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకుని జడివాన కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరించారు. ఇదే సమయంలో హెల్ప్లైన్ నెంబర్లు ఇచ్చారు.హెల్ప్లైన్ నెంబర్స్ ఇవే:040-21111111, 9000113667నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.#Hyderabadrains!!Now raining in Gachibowli 🌧️⚠️ pic.twitter.com/nLt7pXCZ3W— Telangana state Weatherman (@tharun25_t) August 16, 2024 మరోవైపు.. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, జనజీవనం అస్తవ్యస్తమైంది. Ee varsham andira eee Hyderabad laaa 🌦️⛈️🌧️☔️💧#HyderabadRains pic.twitter.com/v1bKqPSDqB— Heisenberg (@abhinayrdy) August 16, 2024 #Gachibowli#HyderabadRains pic.twitter.com/YzMEKvpkvu— Jagadish Reddy (@jagadish757) August 16, 2024 -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం కూకట్పల్లి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, చందానగర్, మియాపూర్, జగద్గిరిగుట్ల సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Hyderabadrains!!Now iosalted thunder storm rains for west Hyderabad City places like Kukatpally serilingampally nizampet miyapur Quthbullapur places see good rains 🌧️🌧️⚠️ pic.twitter.com/aJlZvA4rSg— Telangana state Weatherman (@tharun25_t) August 14, 2024 -
కూకట్పల్లిలో కాంచీపురం నారాయణి సిల్క్స్ వస్త్ర షో రూమ్ ను ప్రారంభించిన సినీనటి లావణ్య త్రిపాఠి (ఫోటోలు)
-
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
అనగనగా ఓ సాగర కన్య (ఫోటోలు)
-
హైదరాబాద్ కూకట్ పల్లి లో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ప్రారంభం
-
కూకట్పల్లి మల్లికార్జున థియేటర్లో వైఎస్ జగన్ అభిమానులు హంగామా చేశారు
-
కూకట్ పల్లిలో లారీ బీభత్సం..కారు నుజ్జు నుజ్జు
-
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్లోని బాంకా జిల్లా మోహన్మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్లోనే చాట్బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్కు చెందిన విజయ్కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్నగర్లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్గా మారింది. -
Brahmamudi Serial Actors Photos: కూకట్పల్లిలో బ్రహ్మముడి సీరియల్ నటుల గ్రాండ్ బారాత్ (ఫోటోలు)
-
జాడ లేని జనసేన.. పవర్ స్టార్ ప్రభావం ఏదీ?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన గుర్తు గ్లాస్ పగలిపోయేలా జనాలు పవన్కు పట్టించుకోలేదు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా జనసేనను ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు
-
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం
-
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన కిరణ్కుమార్ కృష్ణానగర్లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీలో జనసేన కుంపటి
హైదరాబాద్: కాషాయ పార్టీలో జనసేనతో పొత్తు చిచ్చు రేపుతోంది. నగరంలో మూడు సీట్ల కోసం జనసేన పార్టీ పట్టుబడుతోంది. కమలం పార్టీ నేతలు మాత్రం అవి వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా రవి యాదవ్ను రంగంలోకి దింపాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దలను డిమాండ్ చేశారు. ఒకవైపు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేయడం.. అదే సమయంలో కొండా అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు కారణమవుతోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కొండా పట్టుబడుతున్నారు. చివరకు శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిని మూడో జాబితాలో అయినా ప్రకటిస్తారా? మరికొన్ని రోజులు పెండింగ్లోనే ఉంచుతారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. కూకట్పల్లి సీటుపై జనసేన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ వదిలేస్తుందన్న సమాచారంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోకల్ కేడర్ ఒత్తిడికి అధినాయకత్వం తలోగ్గుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తదితరులు బీజేపీ నుంచి టికెట్ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటు జనసేనకు పొత్తులో వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా సీట్లపై క్లారిటీ? హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలపై మూడో జాబితాలో క్లారిటీ రానుంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ మూడో జాబితాకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సీఈసీ ఆమోదించిన అభ్యర్థులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ముషీరాబాద్కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ బండారు విజయలక్ష్మి, అంబర్పేటకు గౌతమ్ రావు పేర్లు ఖరారైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కీర్తి రెడ్డి, విక్రమ్ గౌడ్, దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్కు బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్కు మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత పేర్లను వివేక్ ప్రతిపాదించారు. వివేక్ పార్టీ వీడటంతో కంటోన్మెంట్ స్థానానికి తులసీ విజయ రాం పేరు తెర మీదకు వచి్చంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఎల్బీనగర్ సీటు తనకే ఇవ్వాలని సామ రంగారెడ్డి పట్టుబడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు మూడో జాబితాలో వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
జనసేన వద్దు బాబోయ్ అంటున్న బీజేపీ
-
కూకట్పల్లి బరిలో హరివర్ధన్రెడ్డి..?
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూనిన సీనియర్ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్ను దూరం చేసుకుంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జిల్లాలోని కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించి, అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. హరివర్ధన్రెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసిన నాయకుడు. గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. నగరంలోని హబ్సిగూడ నుంచి కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్గా ఎన్నికై ఐదేళ్ల పాటు పనిచేశారు. మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్రెడ్డి తాను గెలుపు గుర్రమైనా బీసీ నినాదంతో టికెట్ రాలేదని ఆయన వాదన. దీంతో తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, సర్వే రిపోర్టులను బయటపెట్టాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి నుంచి బరిలోకి.. అసమ్మతితో రగులుతున్న హరివర్ధన్రెడ్డికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను జిల్లాలోని కూకట్పల్లి నుంచి బరిలోకి దించాలని రెండవ లిస్ట్లో పేరు చేర్చినట్లు సమాచారం. హరివర్ధన్రెడ్డి నివాసముండే బోయిన్పల్లి ప్రాంతం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటం, ఆయనకు గతంలో నగరంలో పనిచేసిన అనుభవం ఉండటం, కూకట్పల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య పెద్దగా పోటీ లేకపోవడంతో ఆయనను అక్కడి నుంచి రంగంలోకి దించాలని రేవంత్రెడ్డి దూతలు మల్లు రవి యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సెకండ్ లిస్ట్లో ఆయన పేరు ఖరారు చేసి జాబితాలో నమోదైందని హరివర్ధన్రెడ్డి అనుచరులు జాబితాను చూపిస్తున్నారు. హరివర్ధన్రెడ్డి మాత్రం తాను పోటీ చేసేది.. లేనిదీ.. దసరా పండగ తర్వాత ప్రకటిస్తానని చెబుతున్నారు. -
డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి
-
నేడు ‘లులు’ మాల్ ప్రారంభం
కూకట్పల్లి: ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షాపింగ్ మాల్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు ‘లులు’ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అ్రషఫ్ అలీ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ లులు మాల్ను మొదటి విడతలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. మరో రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో లులు మాల్ను తీర్చిదిద్దుతామని అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వివరించారు. భారతదేశంలో కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో కోయంబత్తూరులలో ఇప్పటికే లులు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మాల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన షాపింగ్ ఔట్లెట్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్స్తో సినిమా హాళ్లు, ఫుడ్ కోర్టు, పిల్లల వినోద కేంద్రం ఉంటాయని తెలిపారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆనంద్ ఏవీ. నిషద్ ఎంఎ, వి.నందకుమార్, షిబు ఫిలిప్స్, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రెజిత్ రాధాకృష్ణన్, అబ్దుల్ సలీం, ఇ.అష్రన్, నౌషద్ కిజక్కుప్పరల్ తదితరులు పాల్గొన్నారు. -
కూకట్ పల్లి అడ్డగుట్టలో విషాదం
-
అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే యజమాని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే కార్మికుల ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది ఇప్పుడు. కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో గోడతో పాటు సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో.. భవనం 6వ అంతస్థు నుంచి కిందపడిపోయారు కార్మికులు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పిట్టగోడ పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పిట్టగోడతో పాటు గోవా కరలు(పిరంగి ) విరిగి కిందపడ్డారు. మృతుల్ని ఒడిశాకు చెందిన సంతోష్, సోనియాచరణ్గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అయితే భవన నిర్మాణానికి అనుమతులు ఐదు అంతస్థుల వరకే ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా ఆరో అంతస్థు నిర్మించి పనులు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్గౌడ్, పిసరి మహిపాల్రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
కాంగ్రెస్లోకి తుమ్మల.. తెరపైకి కూకట్పల్లి!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చల అనంతరం కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలోనే ఊహించని ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్న తుమ్మల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తుమ్మల పోటీ చేసే నియోజకవర్గంపైనా ఆసక్తికర ప్రచారం ఒకటి వినిపిస్తోంది. ఖమ్మం, పాలేరు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల నడుమ.. అనూహ్యాంగా కూకట్ పల్లి(హైదరాబాద్) పేరు తెర మీదకు వచ్చింది. కమ్మ ఓటర్లకు గాలం వేసేందుకు తుమ్మలను కూకట్పల్లి నుంచి పోటీ చేయించే యోచన చేస్తోంది కాంగ్రెస్. అయితే ఆ ప్రతిపాదనకు తుమ్మల అంత సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. తాను పాలేరు(ఖమ్మం) నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారట. దీంతో ఆయన పోటీచేయబోయే నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ ఇంకా మంతనాలు కొనసాగిస్తున్నట్లు భోగట్టా. బీఆర్ఎస్ తరపున పాలేరు టికెట్ దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన తుమ్మల నాగేశ్వరరావు భారీ అనుచరుగణంతో బలప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజల కోసమైనా పోటీ చేస్తానని.. తలవంచేది లేదంటూ ప్రకటన సైతం చేశారు. అయితే ఆయన పార్టీ మారతారా?.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. పాలేరు నుంచే తుమ్మల పోటీ చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో, కూకట్పల్లి నుంచి తుమ్మల పోటీ నిలిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కు ఇంకా తుమ్మల రాజీనామా చేయని సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో చేరికలపై తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్లు సైతం పీసీసీతో మంతనాలు చేస్తున్నారు. ఇది చదవండి: సాగర్లో కారు లొల్లి -
వీడియో: కూకట్పల్లిలో విషాదం.. కరెంట్ షాక్తో మహిళ మృతి
-
HYD: స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్తో మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్ స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్మెంట్లో బోర్వెల్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్తో మృతిచెందింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్లోనే ఆమె భర్త వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి -
బిర్యానీపై హైదరాబాదీలకు తరగని మోజు.. కోటిన్నర బిర్యానీల ఆర్డర్!
గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లను గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానీ ఆర్డర్లను అందుకున్నారు. బిర్యానీపై తరగని మోజుకు, నగరానికి బిర్యానీకి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది. ధమ్ బిర్యానీ చాంపియన్... గత ఐదున్నర నెలల్లో, 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని చాంపియన్గా నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్లతో సువాసనగల ఫ్లేవర్డ్ బిర్యానీ తన సత్తా చాట గా, బ్యాచిలర్స్, సింగిల్స్కి అలవాటైన మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లను అందుకుంది. బిర్యానీ ప్రియత్వం ఓ రేంజ్లో ఉండటంతో నగరంలో దాదాపు 15,000 పైగా రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని తప్పనిసరి డిష్గా అందజేస్తున్నాయి. బిర్యానీలు అందించే రెస్టారెంట్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ – దిల్సుఖ్నగర్ ఉన్నాయి, కూకట్పల్లి టాప్... హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరిగింది. వీటిలో. కూకట్పల్లి నెంబర్ వన్ కిరీటం అందుకుంటోంది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి. నగరవాసులు వేలూ లక్షల బిర్యానీలు హాంఫట్ మనిపిస్తున్నారు. ఏ యేటికాయేడు బిర్యానీ పై తమ ఇష్టాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గి నిర్వహించిన ఓ అధ్యయనం ఒక్క ఏడాదిలో.. కోటిన్నర బిర్యానీలు నగరం ఆరగించేసిందని తేల్చింది. – సాక్షి, సిటీబ్యూరో బిర్యానీ ఓ అనుభవం... నగరంలో బిర్యానీ ప్రియులతో మా ప్రయా ణం చాలా సుదీర్ఘమైనది. నగరవాసులకు బిర్యానీ అనేది కేవలం ఒక తినే వంటకం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సంతోషకరమైన అనుభవం. ఈ ప్రపంచ బిర్యానీ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని రూ.199 నుంచే ప్రారంభం అవుతున్న మా బిర్యానీ వైరెటీలను నగరవాసులకు ఆస్వాదించవచ్చు. – కుశాగ్ర గుప్తా, వైస్ప్రెసిడెంట్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ -
హైదరాబాద్ కూకట్ పల్లి లో కుంగిన భూమి
-
HYD: కూకట్పల్లిలో ఒక్కసారిగా కుంగిన భూమి..
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలోని గౌతమ్ నగర్ కాలనీలో ఓ నిర్మాణ సంస్థ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీనితో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరైన అనుమతులు భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి సెల్లార్ కోసం తవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది. కనీసం కాలనీ వాసులు బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కూలగొట్టే జీహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం -
హైదరాబాద్ కూకట్ పల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య
-
కూకట్ పల్లి అగ్నిప్రమాదం లో జయకృష్ణ సజీవ దహనం
-
HYD: డబుల్ ఓట్ ఇక ఔట్!.. ఎన్నికల సంఘం స్పెషల్ డ్రైవ్..
సొంతూరిలో ఒక ఓటు.. చదువుకున్న చోట మరో ఓటు.. ఉద్యోగం కోసం వలస వెళ్లిన చోట మరో ఓటు.. కొందరికైతే ఒకే నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల ఓట్లు.. ఇలా చాలా మందికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. దీనితో ఎన్నికల సమయంలో గందరగోళం, కొన్నిసార్లు అక్రమాలకు ఆస్కారం కలుగుతోంది. ఈ క్రమంలో మల్టిపుల్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలకుపైగా మల్టిపుల్ ఓట్లను గుర్తించి తొలగించింది. తాజాగా మరోదఫా పరిశీలనకు సిద్ధమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 మేరకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. అయితే దేశంలో ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఆ ఓటు నమోదై ఉండాలి. మరోచోటికి మారితే.. మొదట ఉన్నచోట రద్దు చేసుకుని, కొత్త ప్రాంతంలో నమోదు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో కొందరికి ఐదు నుండి పది ఓట్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్పై నాలుగైదు వందల ఓట్లు నమోదుకావడం వంటివి వెలుగుచూశాయి. హైదరాబాద్లో కేవలం 85 ఇంటి నంబర్లపై ఏకంగా 14,037 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. మేడ్చల్–మల్కాజిగిరిలో 28 ఇంటి నంబర్లలో 5,501 ఓట్లు, రంగారెడ్డి జిల్లాలో 33 ఇంటి నంబర్లలో 5,430 ఓట్లు, నల్లగొండలో 74 ఇంటి నంబర్లలో 11,126 ఓట్లు, ఖమ్మంలో 11 ఇంటి నంబర్లలో 2,678 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలోని మొత్తం ముప్పైమూడు జిల్లాల్లో కేవలం 289 ఇంటి నంబర్లలో ఏకంగా 47,325 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్టు తాజా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఒక్కో ఇంట్లో సగటున 160 మందికిపైనే ఓటర్లు ఉన్నట్టు అన్నమాట. ప్రత్యేక సాఫ్ట్వేర్తో పరిశీలన జరిపి.. ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా.. ఒకే పేరు, ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారిని గుర్తించింది. ఇలా ఇప్పటివరకు 14,09,294 ఓట్లను రద్దు చేసింది. ఇంకా ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నట్టు రాజకీయ పక్షాలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఒక ఇంటి నంబర్పై ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్నచోట ప్రత్యేక పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో సాధారణ సగటుకు మించి ఓటర్లున్న ప్రాంతాలపై ప్రత్యేక పరిశీలన మొదలుపెట్టింది. నోటీసులు ఇచ్చి.. డిక్లరేషన్ తీసుకుని.. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో గుర్తిస్తున్నారు. అలాంటి వారికి ఎక్కడో ఒకేచోట ఓటును ఎంచుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నారు. వారికి కావాల్సిన చోట ఓటుకు సంబంధించి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మిగతా చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షలకుపైగా ఓట్లను రద్దు చేశారు. అయితే.. ఇప్పటికీ 289 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో వందకు పైగా.. మరో 23,247 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో 20కిపైగా ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తంగా 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఎక్కువ నివాసాలు ఉంటే ప్రత్యేక నంబర్లు.. హైదరాబాద్ నగరంలో ఒకే ఇంటి నంబర్పై చాలా వ్యక్తిగత నివాసాలున్న ప్రాంతాలను గుర్తించి... ఆయా నివాసాలకు ప్రత్యేక నంబర్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం తాజాగా సూచించింది. ఒకే ఇంటి నంబర్తో అపార్ట్మెంట్లు ఉంటే.. అందులోని ఫ్లాట్లకు వేర్వేరు నంబర్లు కేటాయించే పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరింది. ఇది కూడా చదవండి: తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ.. -
కూకట్పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో అగ్నిప్రమాదం
-
Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల మాటున అక్రమాలు..
సాక్షి, కూకట్పల్లి: నగరంలోని కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాగా, పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు కూకట్పల్లిలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో స్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న ముఠాలను గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. స్పా, మసాజ్ సెంటర్లు ఇవే.. - స్ప్రింగ్ వెల్ స్పా, మసాజ్ సెంటర్ - అవంతి స్పా, మసాజ్ సెంటర్ - సారా వెల్నెస్ స్పా, మసాజ్ సెంటర్ - స్నో యూనిసెక్స్ స్పా, మసాజ్సెంటర్ ఇక, ఈ విషయంలో సంబంధిత యజమానులు, నిర్వాహకులు, థెరపిస్టులను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలకు అప్పగించారు. -
కూకట్పల్లి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫైర్ కేసును ఛేదించిన పోలీసులు
-
కూకట్పల్లి: ట్రావెల్స్ బస్సుల్లో మంటలు.. సూత్రధారి అతడే..
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్లో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసులు కేసును ఛేదించారు. అయితే, ఈ కేసులో డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లిలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో మూడు ప్రైవేటు టావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ట్రావెల్స్ యజమానిపై కక్షతోనే బస్సులకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి కొట్టడం వల్లే డ్రైవర్ వీరబాబు ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడు వీరబాబుతోపాటు అతనిపై దాడి చేసిన ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి, అతని బంధువుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. -
కూకట్పల్లి: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో నగరంలో కూకట్పల్లిలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోకని XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంది. రూ. లక్షకు నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించి వారిని మోసం చేసింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. దీంతో, బాధితులు.. అప్పుచేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తీరా.. కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, మంజీరా మాల్లోని ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం.. బస్సుల్లో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్లో ఉన్న మూడు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన 3 బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. భార్య శీలాన్ని శంకించి.. -
Hyderabad: వరుసబెట్టి దోచేశారు.. అర్ధరాత్రి 13 ఇళ్లలో దొంగతనాలు
సాక్షి, కూకట్పల్లి: తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఏకంగా 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఓ దొంగల ముఠా విడిపోయి కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దయార్గూడ, కేరళబస్తీ, దేవీనగర్ ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు. ఓ ఇంట్లో గల్లాపెట్టెలో ఉన్న రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లగా మరో ఇంటిలో వెండి పట్టా గొలుసులు, ఒక ఇంట్లో ల్యాప్టాప్ ఇలా దొరికిన వస్తువును ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎవరింట్లో ఎంత సొత్తు అపహరణకు గురైందో వివరాలు తెలియలేదు. యజమానులు ఊళ్ల నుంచి తిరిగి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 9 ఇళ్లల్లో తాళాలు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగానే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ పరిశీలన దయార్గూడ, కేరళబస్తీ, దేవీనగర్లలో దొంగతనా లు జరిగిన ఇళ్లను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్రావు, నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, రాము, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. -
ఏమైందో ఏమో..! పుట్టిన రోజే యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజే ఓ విద్యార్థిని మృత్యు ఒడికి చేరుకుంది... ఏమైందో ఏమో కానీ జన్మదినం రోజే బలవన్మరణం పొంది కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అప్పటి వరకు తోటి విద్యార్థినులతో ఆనందంగా గడిపిన ఆ యువతి పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లటం అందరినీ కలిచివేసింది. సీఏ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చామపాడు గ్రామానికి చెందిన కేసాని కిరణ్కుమార్ బాలాజీనగర్లో నివాసముంటూ ఓ ప్లాస్టిక్ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు హర్షిత (20) అలియాస్ హనీ. ఆన్లైన్లో సీఏ, బీకాం చదువుతోంది. సాయికిరణ్ బంధువులు చనిపోవటంతో సాయికిరణ్, భార్య నర్మదాలు బుధవారం సాయంత్రం నెల్లూరుకు వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. గడియ కొట్టడంతో ఎంతకీ తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని మూర్తి సహాయంతో గడియ పగలగొట్టి బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే చున్నీ కట్ చేసి కూతురుని కిందకు దించాడు. తనకు ఒక్కగానొక్క కూతురు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించటంతో ఆ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. అంతకు ముందు రోజు గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి వస్తున్నారా? అని అడిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సినిమా చూడడానికి కూడా వెళ్లినట్లు తలిదండ్రులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలు సేకరించారు. తన కూతురు చదువులో ఒత్తిడికి లోనయ్యేదని.. ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తండ్రి సాయికిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్పల్లిలో దారుణం: మహిళా ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో భర్త కారణంగా తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉద్యోగి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భవనం 23వ అంతస్తు నుంచి దూకి మృతిచెందింది. వివరాల ప్రకారం.. శ్రీధర్, స్వాతి ఇద్దరు దంపతులు. వీరికి అంగవైకల్యంతో ఓ కుమారుడు జన్మించాడు. దీంతో, అంగకవైకల్యంతో ఉన్న కుమారుడిని చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మెర్సీ కిల్లింగ్ కోసం తండ్రి శ్రీధర్.. భార్య స్వాతిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయమై తరచూ భార్యను వేధింపులకు గురిచేశాడు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చిన కన్న కొడుకును చంపుకోలేక మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనను స్వాతి ఒప్పుకోలేదు. కాగా, కుమారుడి విషయంలో భర్త.. ఇలా వేధించడం భరించలేక స్వాతి మనోవేదనకు గురైంది. దీంతో, వారు నివాసం ఉంటున్న మంజీర ట్రినిటి హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి స్వాతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా.. స్వాతి మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా శ్రీధర్ అందుబాటులోకి రాలేదు. కనీసం శ్రీధర్, అతడి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లలేదు. ఈ నేపథ్యంలో శ్రీధర్ను కఠినంగా శిక్షించాలని స్వాతి బంధువులు కోరుతున్నారు. -
హైదరాబాద్ కూకట్ పల్లిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
కూకట్పల్లిలో ఘోర ప్రమాదం.. భవనం శ్లాబ్ కూలీ పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో భవనం నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి ఇక్కడకు హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కిన ఎన్.ప్రవీణ్ కుమార్పై గతంలో కిడ్నాప్ కేసు ఉంది. 2015లో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు కోర్టులో వీగిపోయింది. ఇప్పటి వరకు అంతా ఆ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని అంతా భావించారు.. భావిస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న ఆసక్తికర కోణాన్ని ప్రవీణ్ ఇప్పుడు పోలీసుల ఎదుట బయటపెట్టాడు. నిజామాబాద్ మహిళ.. దుబాయ్లో సహజీవనం... నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడే ఉద్యోగం చేస్తున్న మంచిర్యాలకు చెందిన వ్యక్తితో ఈమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు అతడితో సహజీవనం చేసిన ఆమె ఆపై నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడ బతకడం కష్టసాధ్యంగా మారడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో మళ్లీ విదేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో దుబాయ్లో ఉన్న మంచిర్యాల వాసి నుంచి వీలున్నంత డబ్బు గుంజాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అతడిని పదేపదే ఫోన్లు చేసి ‘నిజామాబాద్ వచ్చాక తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని, తనకు మగ బిడ్డ పుట్టాడని, వాడికి తండ్రివి నువ్వే’ అంటూ చెప్పింది. ఆరేళ్లకు అతడు వస్తాననడంతో... తామిద్దరం బతకడానికి ప్రతి నెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసింది. అప్పటికే వివాహితుడైన అతడు తన కుటుంబాన్ని మంచిర్యాలలోనే ఉంచాడు. తాను దుబాయ్లో మరో మహిళతో సహజీవనం చేసిన విషయం భార్యకు తెలియనీయలేదు. నిజామాబాద్ మహిళను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అతగాడు ఆమెకు డబ్బు పంపుతూ వచ్చాడు. ఇది జరిగిన ఆరేళ్లకు తాను నిజామాబాద్ వస్తున్నట్లు దుబాయ్ నుంచి సమాచారం ఇచ్చాడు. అలా అతడు వచ్చి తనను కలిస్తే తన బండారం బయటపడటంతో పాటు అసలు విషయం తెలుస్తుందని ఆమె భావించింది. అదే జరిగితే తనకు ప్రతి నెలా వచ్చే డబ్బు రాకపోవడంతో పాటు ఇప్పటి వరకు పంపిందీ తిరిగి ఇమ్మంటాడని భయపడింది. దీంతో అతడు వచ్చేలోపు ఓ ఆరేళ్ల బాలుడు తన వద్ద ఉండాలని భావించింది. అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు, ప్రవీణ్ కుమార్తో సహా మొత్తం ఐదుగురు రంగంలోకి దిగారు. ఈ ఐదుగురిలో కూకట్పల్లికి చెందిన వాళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లు ఆ ప్రాంతంలో కనిపించిన ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నిజామాబాద్లో ఆమెకు అప్పగించారు. ఫ్రీగా అప్పగించడం ఇష్టంలేక... దుబాయ్ నుంచి వచ్చిన ‘బాలుడి తండ్రి’ నిజామాబాద్లో ఆ మహిళ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ చిన్నారి తమకు పుట్టిన బిడ్డగానే భావించాడు. అయితే ఓ రోజు.. ఆ బాలుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆమెను నిలదీశాడు. ఆ తరువాత వారిని వదిలి మంచిర్యాల వెళ్లిపోయాడు. దీంతో ఆమె బాలుడిని తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రవీణ్ సహా ఐదుగురికీ చెప్పింది. నిజామాబాద్ వెళ్లి బాలుడిని తీసుకువచి్చన వీళ్లు తల్లిదండ్రులకు అప్పగించడానికి వెనుకాడారు. ఊరికే ఇవ్వడం ఎందుకని భావించి ఎంతో కొంత వసూలు చేసే ప్రయత్నం చేశారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులకు ఈ విషయం తెలిసింది. డబ్బు డిమాండ్ విషయం తెలుసుకున్న పోలీసులు వలపన్ని ఐదుగురినీ అరెస్టు చేశారు. అప్పట్లో విచారణలో మాత్రం తాము కేవలం డబ్బు కోసమే ఈ పని చేశామని నిందితులు చెప్పడంతో అలానే రికార్డుల్లోకి ఎక్కింది. -
Hyderabad: హౌసింగ్బోర్డు భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ►కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ నుంచి హఫీజ్పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్ఫొటో) ►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. ►కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి.. హౌసింగ్బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి. –కిరణ్బాబు, హౌసింగ్బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈఈ -
Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, జగద్గిరిగుట్ట: ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ «ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శిరీష (22) గుంటూరులో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల కూకట్పల్లి జేఎన్టీయూలో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఆల్వీన్ కాలనీలోని తన బంధువుల (పెద్దమ్మ కూతురు) ఇంట్లో ఉంటోంది. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో శిరీష బంధువులు ఉంటుండగా మిగతా ఫ్లోర్లు అద్దెకు ఇచ్చారు. పెంట్హౌజ్ ఖాళీగా ఉంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్తో నేరుగా భవనం టాప్ ఫ్లోర్కు వెళ్లింది. అక్కడ బాటిల్లోని పెట్రోల్ను పోసుకుని నిప్పంటించుకుంది. మంటల వేడిమి భరించలేక అరవడంతో యువతి బంధువులు, స్థానికులు టెర్రస్పైకి వెళ్లి మంటలు ఆరి్పవేశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. శిరీష మృతికి కారణాలు తెలియరాలేదు. తల్లిదండ్రుల ఆర్థికక పరిస్థితి బాగానే ఉందని, కుటుంబ సభ్యులు, బంధువులతో ఎంతో ఆప్యాయంగా ఉంటుందని తెలిసింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు కనిపించడం లేదంటూ కేటీఆర్కు ట్వీట్.. తీరా చూస్తే
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీలోని లోధా అపార్టుమెంట్ వద్ద ఆరు నెలల క్రితం వరకు కనిపించిన చెరువు ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ చెరువు కనిపించకపోవడం నిజమే కాబట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. If this👇is true, I assure you that stringent action will be taken on those who are responsible @CollectorRRD and @zckukatpally please inspect and submit a report to the Govt at the earliest@KTRoffice please follow up https://t.co/2LPyfdBgun — KTR (@KTRTRS) December 4, 2022 వెంటనే సంబంధిత చెరువును సందర్శించి త్వరగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో ఉరుకులు, పరుగులు పెట్టిన మున్సిపల్ అధికారులు అసలు లోధా అపార్టుమెంట్ ప్రాంతంలో చెరువు ఎక్కడుందబ్బా అంటూ లేని చెరువు కోసం వెతుకులాడారు. ట్విట్టర్లో చెరువు కనిపించడం లేదంటూ పోస్ట్ చేసిన ఫోటోలను పరీక్షించి చూస్తే ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్లార్ గుంతలా అనిపించడంతో మూసాపేట సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. sir, above said land pertains to Telangana state housing board & the water body shown in the image is not a lake. It was dug for a construction project but due to cancellation of project it was levelled to prevent accidents & water stagnation . Present situation is as below. pic.twitter.com/5dyufrurn5— zc_kukatpally (@zckukatpally) December 4, 2022 గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించి విక్రయించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి పూడ్చిన సెల్లార్ గుంత కావడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే దాదాపు పదేళ్ల క్రితం తవ్విన సెల్లార్ గుంతలో వర్షం కారణంగా నీళ్లు నిండిపోయి చెరువులా మారింది. సెల్లార్ గుంతలో పలుమార్లు చిన్నారులు పడి మృతి చెందారు. గత సంవత్సరం ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ గుంతలో పడి మృతి చెందారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో మాట్లాడి సెల్లార్ గుంతను పూడ్చి వేయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షలు, ఎమ్మెల్యే సొంతంగా రూ.3లక్షలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎవరో ఎక్కడో అపార్టుమెంట్లో ఉంటూ గతంలో ఇక్కడ చెరువు ఉండేదని అక్కడ పక్షులను చూసేందుకు వెళ్లే వారమని ఇప్పుడు అది కనిపించడంలేదని ట్విట్టర్లో తప్పుడు ఫిర్యాదు చేయడం అధికారులతో పాటు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే -
Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్ తెలిపిన మేరకు.. మహమ్మద్ కాజా పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్నగర్లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్ కనిపించలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Bathukamma 2022: తగ్గేదెలే! భారీ బతుకమ్మల కోసం విదేశాల నుంచి పూలు
హైదరాబాద్: బతుకమ్మ అంటేనే పూల పండుగ. బతుకమ్మ పాటే ‘తీరొక్క పువ్వేసి చందమామో.. ’అంటూ మొదలవుతుంది. తంగేడు, గునుగు పూలతోపాటు రకరకాల పూలనూ బతుకమ్మను రూపొందించేందుకు వాడుతుంటారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, పట్టణాల విస్తరణ, వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో కొన్నాళ్లుగా బతుకమ్మకు వినియోగించే పూలు తగ్గిపోయాయి. మరోవైపు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి బతుకమ్మ పండుగ మరింత విస్తృతమైంది. పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి పూజించేవారు పెరిగారు. ముఖ్యంగా హైదరాబాద్లో బతుకమ్మ పూల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు కూడా దాటుతున్నారు. కొందరైతే విదేశాల నుంచీ రకరకాల పూలను తెప్పించి బతుకమ్మలను రూపొందిస్తున్నారు. కూకట్పల్లి, ఇతర ప్రాంతాల నుంచి.. హైదరాబాద్లోని కూకట్పల్లితోపాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ బతుకమ్మలను పేర్చి పండుగ జరుపుతుంటారు. కొందరు ఏకంగా పది, ఇరవై అడుగుల మేర బతుకమ్మలనూ రూపొందిస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల పూలను భారీగా తెప్పిస్తుంటారు. మొదట్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి పూలు తీసుకువచ్చేవారు. ఆ జిల్లాల్లోనూ కొరత ఏర్పడటంతో మహారాష్ట్రలోని బీదర్, నాందేడ్ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ముందుగా పూలు తెప్పించుకుంటున్నారు. గత ఏడాది కూకట్పల్లిలో 15 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన లోటస్ బతుకమ్మ కోసం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్తోపాటు సింగపూర్, స్విట్జర్లాండ్ నుంచి కూడా కొత్త రకాల పూలను తెప్పించారు. కూకట్పల్లిలో ప్రత్యేకంగా.. కూకట్పల్లి ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలకుపైగా 10 అడుగుల కన్నా ఎత్తున బతుకమ్మలను పేర్చి పూజిస్తుంటాయి. కూకట్పల్లికి చెందిన గుండాల నర్సింగరావుకు ఐదుగురూ కుమారులే. ఆ కుమారులకూ తొలుత కొడుకులే పుట్టారు. ఈ క్రమంలో మొదటిసారిగా ఓ కుమారుడికి బిడ్డ పుట్టడంతో వేడుక చేసుకు న్నారు. మనవరాలిపై ప్రేమతో ఆమె వయసుకు అనుగుణంగా బతుకమ్మ ఎత్తును పెంచుకుంటూ వెళ్లారు. అలా 20 అడుగుల వరకు చేరాక ఏటా అంతపెద్ద బతుకమ్మను పేర్చడం, నిమజ్జనానికి తీసుకెళ్లడం కష్టమైంది. దీనితో ఏటా అదే ఎత్తుతో బతుకమ్మను పేర్చి పూజిస్తున్నారు. ఆయన ఐదుగురు కుమారులు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. భారీ బతుక మ్మలను పేర్చుతున్నారు. కూకట్పల్లికే చెందిన అబ్బినేని వజ్రమ్మ కుటుంబం 40 ఏళ్లుగా భారీ బతుకమ్మలను పేరుస్తోంది. తమ ఇంట్లో కష్టాలు తీర్చిన బతుకమ్మను పెద్దగా త యారు చేయాలన్న సెంటిమెంట్ను ఆమె వారసులు కొనసాగిస్తున్నారు. వీరితోపాటు మరికొంద రూ పెద్ద బతుకమ్మలను పేర్చుతుంటారు. పెద్ద బతుకమ్మను పేర్చి పూజిస్తాం కూకట్పల్లిలో అచ్చమైన పూలతో బతుకమ్మ ను పేర్చడం మా అత్త గుండాల చంద్రమ్మ నుంచి మాకు సంప్రదాయంగా వచి్చంది. అత్తగారు మా ప్రాంతంలో రెండు దశాబ్దాల పాటు అతిపెద్ద బతుకమ్మను పేర్చి ప్రత్యేక స్థానాన్ని చాటారు. ఇప్పుడు మేం తోటి కోడ ళ్లం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ పెద్ద బతుకమ్మలను పేరుస్తున్నాం. గత సంవత్సరం ఇక్కడ పూలు లభించక ఇతర రాష్ట్రాల నుంచి పూలు తెప్పించుకున్నాం. ఈసారి కూడా పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నాం. – గుండాల అర్చన, కూకట్పల్లి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
కేజిన్నర వెండి, బంగారంతో కూకట్పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: బంతి, చామంతి పువ్వుల్లో బతుకమ్మ పసిడి కాంతులీనడం తెలిసిందే. కానీ.. బంగారంతోనే బతుకమ్మను తయారు చేశారు కూకట్పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైన. శుక్రవారం ఆటకోసం బంగారు బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వారి తాత సీహెచ్.జనార్దన్రావు ఆ అరుదైన బతుకమ్మను కానుకగా ఇచ్చినట్లు వారు తెలిపారు. సుమారు కేజీన్నర వెండికి బంగారాన్ని జోడించి పూల ఆకృతిలో బతుకమ్మను తయారు చేయించినట్లు వెల్లడించారు. బంగారంతో తయారు చేసిన మొట్టమొదటి బతుకమ్మ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. చదవండి: దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం -
Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతానికి చెందిన మహిళ(27)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్–దిడిగి గ్రామ శివారులోని ఓ వెంచర్లో శనివారం ఓ మహిళ మద్యం మత్తులో పడి ఉండగా దారిన వెళ్లే వారు చూసి ఆమెను జహీరాబాద్లోని ఆస్పత్రికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీఎస్పీ రఘును వివరణ కోరగా మహిళ మద్యం మత్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తి వివరాలు సరిగ్గా చెప్పడం లేదన్నారు. తన స్వస్థలం ఒకసారి కూకట్పల్లి అని, మరోసారి బాలానగర్ అని చెబుతోందన్నారు. జహీరాబాద్కు ఎలా వచ్చింది.. ఎవరితో వచ్చిందనే వివరాలను కూడా చెప్పడం లేదన్నారు. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుందన్నారు. విచారణలో పొంతన లేని సమాధానం ఇస్తోందన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోందన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఇందుకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టామని, విచారణ అనంతరమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే మహిళ పరిస్థితి బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం జరిపి ఉంటారనే ప్రచారం సాగుతోంది. చదవండి: అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్ -
కూకట్పల్లి లో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, కూకట్పల్లి, యూసుఫ్గూడ, అమీర్పేట, మల్కాజ్గిరి, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. Heavy Downpour In Hafeezpet ~Kondapur Road⛈️#HyderabadRains pic.twitter.com/cGDmwSrbyL — Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2022 హైదరాబాద్ లో భారీ వర్షం #HyderabadRains pic.twitter.com/K5RT6oTJm3 — Latha (@LathaReddy704) September 6, 2022 -
వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ
-
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్స్పెకర్ట్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
HYD: మందుబాబుల హల్చల్.. హోటల్లో రచ్చ రచ్చ
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్లోని కూకట్పల్లిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్లో తాగిన మత్తులో ఐదుగురు మందుబాబులు రెచ్చిపోయారు. హోటల్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి.. కూర్చీలతో దాడులు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. పాపారాయుడు నగర్లోని కేవీ టిఫిన్ సెంటర్ ఎదుట మందుబాబులు.. సతీష్ అనే వ్యక్తితో గొడవకు దిగారు. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లోకి ప్రవేశించి గొడవపడ్డారు. దీంతో, వారిని బయటకు వెళ్లాలని హోటల్ యజమాని, సిబ్బంది కోరగా.. వారితో కూడా మందుబాబులు గొడవకు దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. కాగా, మందుబాబుల వీరంగం.. హోటల్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది కూడా చదవండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. -
హైదరాబాద్ కూకట్ పల్లిలో తాగుబోతుల వీరంగం
-
Kukatpally: తొలగించిన రేషన్ కార్డులకు.. తిరిగి ధృవీకరణ!
సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు ఉందంటే వారిలో కొండంత ధీమా కలుగుతుంది. అలాంటిది ఇటీవల రద్దయిన రేషన్ కార్డులకు కొత్తగా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రీ వెరిఫికేషన్ నిర్వహిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో రేషన్ కార్డులు రద్దయిన వారిలో అర్హులుంటే గుర్తించేందుకు సర్వే చేపట్టారు. తొలగించిన కార్డుల్లో చిరునామా ఆధారంగా కాలనీలో అధికారులు సర్వే చేపట్టి ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ప్రజల్లో ఆశలు.. ► కోర్టు ఆదేశాల మేరకు అధికారులు రేషన్ కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తూ ఉండటంతో రద్దయిన తమ రేషన్ కార్డు మళ్లీ వస్తోందని, దీంతో బియ్యం, గోధుమలు ఇతర సరుకులు తెచ్చుకోవచ్చునని అసలైన లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. ► 2016 సంవత్సరంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలన జరిపి కార్డులు తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కోర్టు ఆదేశాలతో రద్దయిన కార్డులు మళ్లీ జారీ చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు మళ్లీ తిరుగుతున్నారు. ► నాటి ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ చేస్తే పేర్లు కలవడం లేదు. మరి కొందరు తెలిపిన చిరునామాలో ఉండటం లేదు. రీ వెరిఫికేషన్లో పేర్లు ఉన్నవారిలో కొందరికి కార్డులు ఉన్నాయి. మరి కొందరు చనిపోయారు. ► బాలానగర్ కేంద్రంగా సివిల్ సప్లై కార్యాలయం పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాలు ఉన్నాయి. ► ఈ మూడు మండలాల్లో 35,200 కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్డుల వెరిఫికేషన్ జరుగుతోంది. సర్వే ఇలా... ► రద్దయిన రేషన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి వారి కోసం డేటాను రేషన్ షాపుల నుంచి సేకరించాలి. ► జాబితాలను రేషన్ డీలర్ల వద్ద ప్రదర్శించాలి. ► రద్దయిన కార్డుదారులకు సంబంధించి వారి చిరునామాను గుర్తించాలి. లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలి. రీ వెరిఫికేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ► ఎవరైనా తిరిగి రేషన్ కార్డు పొందేందుకు అర్హులని తేలితే వెంటనే వారి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. అంతేకాకుండా గతంలో ఎందుకు కార్డును రద్దు చేశారో ఆ కారణాలను సైతం నమోదు చేయాలి. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా సర్వే... ► రద్దయిన రేషన్ కార్డుదారులకు మళ్లీ కార్డులను జారీ చేసేందుకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు రీ వెరిఫికేషన్ చేపట్టగా కొందరు అధికారులు మాత్రం ఈ సర్వేను అక్కడక్కడ మాత్రమే చేపడుతూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► కొందరు అయితే రేషన్ డీలర్ల దగ్గర కూర్చొని ఎన్క్వైరీ చేసి వెళ్లి పోతున్నారే తప్ప తమ దగ్గరకు అసలు కార్డు రీ వెరిఫికేషన్ అధికారులు రాలేదని ప్రజలు వాపోతున్నారు. ► అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి అర్హులైన పేద ప్రజలందరికీ రద్దయిన కార్డులు మళ్లీ వచ్చే విధంగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రతి లబ్ధిదారుకి రేషన్ కార్డు అందేలా చర్యలు మా అధికారులు కార్డుల రీ వెరిఫికేషన్ను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్కరికీ న్యా యం జరుగుతుంది. అర్హులై న వారందరికీ కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అ నుగుణంగా పనిచేస్తున్నాం. రీ వెరిఫికేషన్లో కార్డులు ఇచ్చి వారికి రేషన్ అందజేస్తాం. – డి.నందిని, ఏఎస్ఓ, బాలానగర్ -
కూకట్ పల్లి వివేకానంద్ నగర్ లోని ఓ ఫ్లాట్ లో దొంగతనం
-
హైదరాబాద్: కూకట్పల్లిలో భారీ చోరీ
-
ఫోటోలు: కూకట్పల్లిలో కొత్తగా ప్రారంభమైన ఫ్లైఓవర్ ఎలా ఉందో చూశారా..
-
ఇక కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ.. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు
Kaithalapur Flyover: నిత్యం రణగొణధ్వనులతో పారిశ్రామిక ప్రాంతం అట్టుడికేది. అదేస్థాయిలో అరగంటలోనే ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ రద్దీతో నిండి వాహనాల ధ్వనులతో రెండు దశాబ్ధాలుగా కూకట్పల్లి ప్రజలు పడ్డ వేదన ఇంతా అంతా కాదు. ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పనిచేస్తామని గతంలో అందరూ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. కానీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధినే ఎజెండాగా మార్చుకోవడంతో పాటు ట్రాఫిక్ ఫ్రీ కూకట్పల్లిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన సర్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి అధిష్టానంతో ఎదురొడ్డి పోరాడి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిలబడటం విశేషం. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు.. ► గత ఏడేళ్లలో సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టగా అంతకు మించి నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ► ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఆయన తొక్కని గడప లేదు. అన్ని శాఖల అధికారులు, మంత్రులను కలిసి తన విన్నపాన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వం బాలానగర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి అదే పనిగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు రాత్రింబవళ్లు అక్కడే ఉండి బాలానగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ► బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఫతేనగర్, కూకట్పల్లి, మూసాపేట, చందానగర్, మియాపూర్, బొల్లారం ప్రాంతాల్లో నివాసం ఉండే లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలిగింది. ► అదే విధంగా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నిజాంపేట, ప్రగతినగర్ల నుంచి జేఎన్టీయూ మీదుగా విధులకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంతో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు. ► ఇదిలా ఉండగా కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి గంటల పాటు ట్రాఫిక్ నిలిచి సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందిన మాదాపూర్కు ప్రధాన రహదారి అయిన హైటెక్ సిటీ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం విశేషం. ► ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆ ప్రాంతం ఎంతో అందాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఊరట కలిగించింది. నాలుగో బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు.. ► బాలానగర్, మూసాపేట ప్రాంతాలకు కొంగుబంగారంగా నిలిచే నాలుగో బ్రిడ్జి నిర్మాణ కై త్లాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ► ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాన్ని తలపించే మూసాపేట కైత్లాపూర్ ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు వేసినట్లైంది. ► గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలను హైటెక్ సిటీ కి నేరుగా వెళ్లే రహదారి ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. ► కూకట్పల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే కృష్ణారావు అంశాల వారీగా సమస్యలను పరిశీలించి వాటిపై అధ్యయనం చేసి తన హయాంలోనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం విశేషం. ► కైత్లాపూర్ బ్రిడ్జి నిర్మాణంతో కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకోనుంది. -
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్లో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని కూకట్పల్లి,బాచుపల్లి,నిజాంపేట, జీడిమెట్ల, షాపూర్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాహదారులు జలమయవడంతో.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చదవండి: రాష్ట్రానికి నైరుతి.. -
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్లో నిర్వహిస్తున్న క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్ అండ్ రెస్టారెంట్పై దాడి చేశారు. అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ మస్తీ యాజమానులైన శివప్రసాద్రెడ్డి, మేనేజర్ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్ ప్రదీప్కుమార్, డ్యాన్సర్ ప్రవీణ్, డీజే ఆపరేటర్ ధన్రాజ్, సాయిసంతోష్లను అదుపులోకి తీసుకున్నారు. ప బ్లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్ ఓవర్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్బీ సీఐ కిషన్కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్ అండ్ రెస్టారెంట్పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్ నిర్వాహకులపై ఉన్నాయి. -
కూకట్ పల్లి పబ్ లో చీకటి గుట్టు రట్టు