హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం బుధవారమిక్కడ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో ఓటుకు నోటు వ్యవహారంతో పాటు, ఏసీబీ కేసులుతో పాటు పలు కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడతారు.
అదే విధంగా ఏపీ కేబినెట్ తీర్మానాలపై కౌంటర్ కూడా సిద్ధం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్ అధికారాల అంశంపైనా చర్చించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, పాలమూరు ఎత్తిపోతలు, నిరుద్యోగ యువత కోసం నియామకాలపై చర్చిస్తారు. నిరుద్యోగ యువతికి వయోపరిమితి సడలింపుపై నిర్ణయాన్ని కూడా ఈ కేబినెట్లోనే తీసుకుంటారు.
ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం
Published Wed, Jun 10 2015 6:16 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement