అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చినబోయినపల్లి పంచాయతి పరిధిలోని గొట్టికాయగూడెంలో మంగళవారం జరిగింది.
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చినబోయినపల్లి పంచాయతి పరిధిలోని గొట్టికాయగూడెంలో మంగళవారం జరిగింది. గూడానికి చెందిన దేవయ్య(32) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగా లేకపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే దారికనపడక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.