ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మోత్కూర్లోని కళాశాలల విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.