ట్రాక్టర్ బైక్ ఢీ.. ఒకరి మృతి | tractor hits bike, one killed | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బైక్ ఢీ.. ఒకరి మృతి

May 6 2015 12:21 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని కీసరగుట్ట సమీపంలో బుధవారం జరిగింది.

రంగారెడ్డి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని కీసరగుట్ట సమీపంలో బుధవారం జరిగింది. మేడ్చల్ మండలం గొల్లపోచంపల్లి గ్రామానికి చెందిన రమేష్(24) అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి అంకినేనిపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో కీసరగుట్ట సమీపంలో ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న రమేష్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని స్నేహితునికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement