అది.. భూబదలాయింపే | Trident is reported in a separate court lawyer | Sakshi
Sakshi News home page

అది.. భూబదలాయింపే

Published Fri, Nov 14 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మాకు కేటాయించిన 33 ఎకరాల భూమిని అనుబంధ సంస్థకు బదలాయింపు...

  • ప్రత్యేకకోర్టుకు నివేదించిన ట్రైడెంట్ న్యాయవాది
  • సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మాకు కేటాయించిన 33 ఎకరాల భూమిని అనుబంధ సంస్థకు బదలాయింపు మాత్రమే చేశారని, విక్రయించలేదని ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు.

    ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ  ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్.బాలయోగి గురువారం మరోసారి విచారించారు. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారమే ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్‌కు నిర్వహణ అవసరాల్లో భాగంగా ఈ బదలాయింపు జరిగిందని ఉమమహేశ్వర్‌రావు తెలిపారు.

    గతంలోనూ ఇటువంటి బదలాయింపులు జరిగాయని, అనుబంధ సంస్థకు భూబదలాయింపు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement