Aurobindo Pharma
-
అరబిందో ఫార్మా లాభం రూ. 846 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం రూ. 846 కోట్లుగా నమోదైంది. గత క్యూ3లో ఇది రూ. 940కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 7,352 కోట్ల నుంచి రూ. 7,979 కోట్లకు చేరింది. త్రైమాసికాలవారీగా చూస్తే అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు.కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తయారీ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోనున్నామని, స్పెషాలిటీ.. ఇంజెక్టబుల్స్ వ్యాపారాన్ని విస్తరించనున్నామని నిత్యానంద రెడ్డి వివరించారు. దీనితో లాభదాయకత చెప్పుకోతగ్గ స్థాయిలో మెరుగుపడుతుందని చెప్పారు.సమీక్షాకాలంలో అమెరికా ఫార్ములేషన్ విభాగం సుమారు రెండు శాతం క్షీణించి రూ. 3,671 కోట్లుగా, యూరప్ ఫార్ములేషన్స్ 23 శాతం పెరిగి ఆదాయం రూ. 2,121 కోట్లుగా, గ్రోత్ మార్కెట్స్ విభాగం 39 శాతం వృద్ధితో రూ. 873 కోట్లుగా నమోదైంది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 450 కోట్లు వెచ్చించింది. బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా క్షీణించి రూ. 1,184.50 వద్ద క్లోజయ్యింది. -
అరబిందో లాభం అదిరింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న అరబిందో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం ఎగసి రూ.817 కోట్లు సాధించింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లు నమోదైంది. ఎబిటా మార్జిన్ 65 బేసిస్ పాయింట్లు మెరుగై 20.1 శాతంగా ఉంది. ఈపీఎస్ 9 శాతం వృద్ధి చెంది రూ.14 ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.7,796 కోట్లకు చేరింది.మొత్తం ఫార్ములేషన్స్ ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.6,640 కోట్లు సాధించింది. మొత్తం ఏపీఐ టర్నోవర్ 0.9 శాతం క్షీణించి రూ.1,156 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్ ఫార్ములేషన్స్ వ్యాపారం 4.3 శాతం పెరిగి రూ.3,530 కోట్లు, యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19% ఎగసి రూ.2,105 కోట్లను తాకింది. వృద్ధి మార్కెట్ల నుంచి ఆదాయం 44% దూసుకెళ్లి రూ.812 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు రూ.410 కోట్లు. ఇది ఆదాయంలో 5.3 శాతానికి సమానం.సింహభాగం యూఎస్..మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 89% ఉంది. టర్నోవర్లో యూఎస్ 45.3% తో సింహభాగం వాటా కైవసం చేసుకుంది. యూరప్ 27%, ఏపీఐలు 14.8, వృద్ధి మార్కెట్లు 10.4, ఏఆర్వీ ఫార్ములేషన్స్ 2.5% వాటా దక్కించు కున్నాయి. ‘ఈ త్రైమాసికంలో కీలక వ్యాపార రంగాలలో రాబడుల నిరంతర వృద్ధితో సంతోషి స్తున్నాం. ఇది విభిన్న పోర్ట్ఫోలియో స్థితి స్థాపక తను ప్రతిబింబిస్తుంది. ప్రాథమికంగా కొన్ని వ్యా పార కార్యకలాపాల తాత్కాలిక స్వభావం కారణంగా లాభదాయకత స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్లీన పనితీరు బలంగా ఉంది. బలమైన పునాది, కొనసాగుతున్న కార్యాచరణ మెరుగు దలలతో వృద్ధి పథాన్ని కొనసాగించగలమని, ప్రస్తుత సంవత్సరానికి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగ లమని విశ్వసిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. -
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ను రీకాల్కు సిద్ధమైంది. సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్ఏఫ్డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది. -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్లో ట్రయల్ రన్కు సిద్ధం అయింది. జూన్లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
బయోఫ్యాక్చురాతో అరబిందో కంపెనీ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోనోక్లోనల్ యాంటీబాడీ ఉస్టెకినుమాబ్ బయోసిమిలర్ కోసం ప్రత్యేక హక్కులను తమ అనుబంధ కంపెనీ క్యూరాటెక్ బయాలాజిక్స్ పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. స్టెలారా (ఉస్టెకినుమాబ్) ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి యూఎస్కు చెందిన బయోఫ్యాక్చురాతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పేగుల్లో వచ్చే వ్యాధులు, సొరియాసిస్, కీళ్ల వాతం వంటి రోగాల చికిత్సకు ఈ ఔషధం వాడతారు. ఒప్పందం ప్రకారం యూఎస్, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర పాక్షిక నియంత్ర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో సహా అన్ని ప్రధాన నియంత్రిత మార్కెట్లలో బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి క్యూరాటెక్కు ప్రత్యేక లైసెన్స్ హక్కులు ఉంటాయి. -
హెచ్ఐవీ ఔషధం తయారీలో అరబిందో: ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్కేర్ రూపొందించిన హెచ్ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి. (ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?) ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్) -
క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం
సాక్షి, విశాఖపట్నం: క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విశాఖ జిల్లా బాధితులకు సహాయం అందించేందుకు ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందడుగు వేసింది. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 400 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించేందుకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.16.80 లక్షలను విరాళంగా అందజేసింది. ఆరు నెలలపాటు 400 మంది రోగులకు ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ విభాగానికి సంస్థ ఎండీ కె.నిత్యానందరెడ్డి తరఫున చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు సోమవారం అందజేశారు. ఆరు నెలలపాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం అందించేందుకు రూ.4,200 ఖర్చు చేసేందుకు వీలుగా ఈ సహాయం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో విశాఖపట్నం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. -
ఎల్లో ఎజెండాకు లిక్కర్ కిక్కు
మీడియా మారింది. జనానికి నిమిషాల్లో నిజాలు తెలుస్తున్నాయి. అయినా సరే... చంద్రబాబు ముఠాది పాత స్కీమే. తమ వ్యతిరేకులకు సంబంధించి నోటికొచ్చిన ఆరోపణలు చేయటం... అవన్నీ నిజాలైనట్లుగా పతాక శీర్షికల్లో ప్రచురించటం... వాటిని ప్రచారంలో పెట్టడం!!. అరబిందో ఫార్మా డైరెక్టరు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలో అరెస్టయిన నాటి నుంచీ ఈ ఎల్లో ముఠాలకు పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. ఆ సంఘటనకు లేని లింకులు పెడుతూ... ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చిన ఆరోపణలకు దిగుతున్నారు. ఎద్దు ఈనిందంటే... దూడను కట్టేయమన్న చందంగా... అన్ని వేలకోట్లు, ఇన్ని వేల కోట్లు అంటూ చెలరేగిపోతున్నారు. ఈ ఎల్లో అరాచకాలపై విజయసాయిరెడ్డి వాస్తవాలను వెల్లడించారు. దుష్టచతుష్టయం ఎందుకిలా చెలరేగిపోతున్నదో... విశాఖ విషయంలోనూ ఎందుకు రోజూ విషం గక్కుతోందో నిజానిజాలు ఆయన మాటల్లోనే... అరబిందో ఫార్మాది 36 ఏళ్ల చరిత్ర. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలోని ఫార్మా కంపెనీల్లో టాప్–2 స్థాయికి చేరుకుంది. ఏడాదికి 2,600 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థలు ఏ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసినా... ఇతర పెట్టుబడిదారులు ముందుకొస్తారు. అందుకే అవుకు, శింగనమల ప్రాంతాల్లో 800 మెగావాట్ల చొప్పున రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలో అరబిందోకు ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉండగా... 2000 కోట్లతో తొలిసారి భారతదేశంలో ‘పెన్సిలిన్–జి’ను ఉత్పత్తి చేసే ప్లాంటును కాకినాడ సెజ్లో ఏర్పాటు చేస్తోంది. 2024లో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కావచ్చునని సంస్థ ప్రకటించింది. ఇతర రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థకు పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులిస్తే తప్పేంటి? దీనివల్ల రాష్ట్రానికి లాభమే కదా? ప్రాజెక్టు కోసం ప్రభుత్వ స్థలమిస్తే దానికి లీజు చెల్లిస్తారు. ప్రయివేటు స్థలాలైతే కొనుక్కుంటున్నారు. పైపెచ్చు ప్రతి మెగావాట్కు ఏడాదికి లక్ష రూపాయల చొప్పున ప్రతి ఫలాన్ని ప్రభుత్వానికి కంపెనీయే చెల్లిస్తుంది. విద్యుత్కు అత్యధిక డిమాండ్ – అతి తక్కువ డిమాండ్ ఉన్నపుడు ఈ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల గ్రిడ్ స్థిరంగా ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా రాష్ట్రానికి మంచిదే కదా? ఆంధ్రప్రదేశ్కు ఏం సంబంధం? అరబిందో అనేది ప్రధానంగా వ్యాపార సంస్థ. దాదాపు ప్రపంచమంతటా దీని ఫార్మా వ్యాపారం విస్తరించి ఉంది. ఇతర వ్యాపారాల్లోనూ ఉంది. ఢిల్లీలో మద్యం సరఫరాకు టెండర్లు పిలిస్తే ఈ సంస్థ కూడా పాల్గొంది. అది తప్పేమీ కాదు కదా? టెండర్లు ఖరారయ్యాక కొన్ని నిబంధనల్లో సడలింపు ఇచ్చారనే ఆరోపణలు ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వానికి– కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. కొంత మేర తెలంగాణ ప్రభుత్వంపైనా ఆరోపణలొచ్చాయి. మరి ఆంధ్రప్రదేశ్కు ఏం సంబంధం? కనీసం ఏపీ పేరును సీబీఐ గానీ, ఈడీ గానీ ఎక్కడా మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు కదా? మరి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం? విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడిని కంపెనీ ప్రతినిధిగా అరెస్టు చేసి ఉండొచ్చు. దాంతో విజయసాయిరెడ్డికి ఏం సంబంధం? ఏ కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారైనా ఇవన్నీ ఆలోచిస్తారు కదా? అలాకాకుండా ప్రతిరోజూ తెలుగుదేశం నేతలు పనిగట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, విజయసాయిరెడ్డిని దీన్లోకి లాగుతూ... వేల కోట్లంటూ పసలేని ఆరోపణలు చేయటం సమంజసమా? దాన్నొ ఉద్యమం మాదిరి ప్రచురిస్తున్న రామోజీరావు ఇంకెంత కిందికి దిగజారిపోతారు? ఒక పత్రికగా మీ బాధ్యత మీకు ఉండక్కర్లేదా? చంద్రబాబుతో సంబంధం ఉన్నట్టేగా? ఇదే అరబిందో గ్రూపును అభ్యర్థించి వారి భాగస్వామ్యంతో చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా 2000వ సంవత్సరంలో తన కుటుంబీకుల చేత ఆంధ్రా ఆర్గానిక్స్ పెట్టించారు. మరి అరబిందో ఫార్మాతో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టేగా? ఇవెక్కడి తలతిక్క ఆరోపణలు? బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టిన చందాన ఏ వ్యవహారంలోనైనా పదేపదే అదాన్ డిస్టిలరీస్ పేరు తెరపైకి తెస్తోంది ఈ పచ్చ ముఠా. అసలు ఈ అదాన్ డిస్టిలరీస్ ఎవరిది? దీన్ని ఏర్పాటు చేసింది అయ్యన్న పాత్రుడు కాదా? అసలు రాష్ట్రంలో మద్యం సరఫరా చేయటానికి అనుమతి ఇస్తూ 20 డిస్టిలరీలను ప్యానెల్లో చేరిస్తే... అందులో ఒక్కటంటే ఒక్కటైనా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటయినది ఉందా? అందులో ఒక్క కంపెనీనైనా ఈ ప్రభుత్వం ప్యానెల్లో చేర్చిందా? అవన్నీ అప్పటికే ఏర్పాటయినవి కదా? చంద్రబాబు ప్రభుత్వమే ప్యానెల్లో చేర్చింది కదా? పెపెచ్చు ఆ 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు చంద్రబాబు హయాంలోనే ఏర్పాటయ్యాయి. అంటే వాటన్నిటి వెనకా చంద్రబాబు నాయుడి హస్తం ఉన్నట్టే కదా? తాను అధికారంలోంచి దిగిపోతూ కూడా ఈ డిస్టిలరీలపై ప్రేమ చావక బోలెడన్ని బ్రాండ్లకు అనుమతిస్తూ దిగిపోయాడు. ఇప్పుడేమో ఆ బ్రాండ్లను ఈ ప్రభుత్వానికి అంటగడుతూ తెలుగుదేశం నేతలు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం? మీడియా మీ చేతుల్లో ఉన్నంత మాత్రాన అబద్ధాలు నిజమైపోతాయా రామోజీరావు? ముడుపులన్నీ చంద్రబాబుకేగా? డిస్టిలరీలకు లైసెన్సులిచ్చి, వాటిని ఏర్పాటు చేశాక... వాటి నుంచి ప్రభుత్వం మద్యం కొనేందుకు వీలుగా వాటిని ప్యానెల్లో పెట్టిన చంద్రబాబుకు ముడుపులిస్తారా? లేకపోతే వాటినే కొనసాగిస్తున్న వై.ఎస్.జగన్ ప్రభుత్వానికి ముడుపులిస్తారా? ఇది తెలిసి కూడా తెలుగుదేశం నేతలు రోజూ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అదాన్ డిస్టిలరీస్ అనేది అయ్యన్న పాత్రుడికి సంబంధించిన సంస్థ అనే విషయాన్ని రాయరెందుకు రామోజీ? ఆ విషయాన్ని తెలుగుదేశం కూడా ఎప్పుడూ ప్రస్తావించదెందుకు? ► ఇక ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ సంస్థ ఈ మూడున్నరేళ్లలో 70,000 కోట్ల విలువైన మద్యాన్ని వివిధ డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసింది. అందులో అదాన్ వాటా 1,100 కోట్లు. అంటే దాదాపు 1.55 శాతం. నిండా 2 కూడా లేదు. వీళ్లద్వారా ఇంత తక్కువ మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్న విషయాన్ని ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరెందుకు? మొత్తం మద్యాన్ని ఈ కంపెనీ నుంచే కొన్నట్టు పదేపదే ఈ పేరు తీస్తూ చెలరేగిపోతున్నారెందుకు? అబద్ధాలతో ఎన్నాళ్లని నమ్మించగలరు? మీకు అర్థసత్యాలు, అసత్యాలు తప్ప వాస్తవాలు అక్కర్లేదా? ఎన్నాళ్లిలా జనాన్ని మోసం చేస్తారు? ‘ఈనాడు’ అంటేనే వక్రీకరణ. ఎల్లో మీడియా అంటేనే అబద్ధాల పుట్ట. ఎన్ని సార్లు రాసినా... టీడీపీ ఆరోపణల్ని ఎంత మోసినా ఇవే కదా? ఇంత వయసు మీదపడ్డా... మీరు మారరా రామోజీ? ► నిజం చెప్పాలంటే ఈ దుష్టచతుష్టయం ఒక డీపీటీ బ్యాచ్. అంటే దోచుకో–పంచుకో– తినుకో అనే సూత్రాన్ని అక్షరాలా తమ హయాంలో అమలు చేసి చూపించిన గజదొంగల ముఠా. గతంలో ఎవరి వాటా వారికి అందింది. కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. ఒక్క వార్తా రాయలేదు. ఇప్పుడు ప్రశ్నించడానికి బయలుదేరిన దత్తపుత్రుడు నాడు ఒక్క ప్రశ్నా వేయలేదు. ఇప్పుడు అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వాళ్ల వాటాలు ఆగిపోయాయి. అందుకే ఈ గజదొంగల ముఠా కడుపు మండుతోంది. అందుకే గంటకో ఆరోపణ. పూటకో వేషం. రోజుకో నాటకం!. వీటన్నిటి గురించీ ఫిలిం సిటీ కొండమీద కట్టుకున్న కోటలో రామోజీరావు– చంద్రబాబు మంతనాలు. అవేమైనా రాజకోట రహస్యాలా? రాజకీయ వ్యభిచారపుటెత్తులే కదా? విశాఖలో కబ్జాలకు కేరాఫ్ రామోజీ, టీడీపీ అంతా మీకు నచ్చినట్లే... మీరు అనుకున్నట్లే జరగాలంటే ఎలా రామోజీరావు? మీరు మహా భూ కుంభకోణానికి స్కెచ్ వేసిన అమరావతి నాటకం కొనసాగనివ్వలేదని... విశాఖపై విషం కక్కుతారా? అసలు విశాఖలో కబ్జాలకు శ్రీకారం చుట్టిందెవరు? విశాఖ నగరానికి అక్షర ఫ్యాక్షనిజాన్ని నేర్పించింది రామోజీరావు కాదా? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో స్థల యజమానుల్ని న్యాయ స్థానాలకు ఈడ్చింది రామోజీరావు కాదా? తనది కాకపోయినా లీజు స్థలాన్ని ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా వచ్చిన స్థలాన్ని తన కొడుకు కిరణ్ పేరిట కాజేసిన చరిత్ర ఆయనది కాదా? దీనికోసం ఏకంగా దొంగ సంతకాలు పెట్టి, ఇతరుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసేసిన వ్యక్తి నీతులు చెప్పటం ఎంతవరకు సమంజసం? గీతం కాలేజీ పెట్టి ఏకంగా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎంవీవీఎస్ మూర్తి తెలుగుదేశం నాయకుడు కాదా? దసపల్లా హిల్స్లో ఇరు పక్షాల మధ్య వివాదం ఉండగా... ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ముఖ్యమంత్రి హోదాలో కబ్జా చేసిందెవరు? అయ్యన్న పాత్రుడిదీ ఫోర్జరీ చరిత్రేగా? భూముల పరిహారం విషయంలో నకిలీ పట్టాలు సృష్టించి మరీ కాజేసిన ‘బండారు’ సత్యం బయటపడలేదా? ఇవన్నీ మీ ‘ఈనాడు’లో ఏనాడూ రాయరెందుకు రామోజీ? ఎందుకంటే వాళ్లు మీ భాగస్వాములనా? మరిప్పుడు ప్రతిరోజూ విశాఖపై విద్వేషం చిమ్మటమెందుకు? అక్కడకు రాజధాని రాకూడదనా? విశాఖ నగరానికున్న వెయ్యేళ్ల ఘన చరిత్రను... భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆ నగరానికున్న ప్రాధాన్యాన్ని సాక్షాత్తూ ఈ దేశ ప్రధానే చెప్పారు. అయినా మీ బుద్ధి మారదెందుకు? ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒకే ఒక్క అగ్రశ్రేణి నగరంపై మీకెందుకింత కక్ష? బౌన్సర్లను పెట్టుకుని మరీ విశాఖకు వ్యతిరేకంగా సాగించిన యాత్ర నకిలీదని న్యాయ స్థానాల సాక్షిగా తేలిపోయింది కదా!! అయినా సరే బుద్ధి లేకుండా ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ నాయకులపై ఆరోపణలెందుకు? రోజూ పనిగట్టుకుని చెబితే అబద్ధాలు నిజాలైపోతాయా? మీరే తప్పుడు వార్తలు రాసి... మీరే నానా యాగీ చేస్తే ఎలా? పేదలకు ఇంగ్లిష్ మీడియం వద్దంటూ కోర్టులకెక్కి యాగీ చేసేదీ మీరే!!. పేదలకు ఇళ్లు రాకుండా న్యాయ స్థానాలకెళ్లి అడ్డుపడ్డదీ మీరే. ప్రతి స్థలాన్నీ వివాదాస్పదం చేసిందీ మీరే. కానీ ఒక్కటి మాత్రం నిజం!. మీ ముఠా వ్యూహాలను చిత్తు చేసే సంకల్ప బలం ఈ ప్రభుత్వానికి... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది. దానికి ప్రజాశీస్సులూ మెండుగా ఉన్నాయి. -
అరబిందో ఫార్మా లాభం రూ. 576 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 576 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 801 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 28 శాతం తగ్గింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ. 5,011 కోట్ల నుంచి రూ. 5,098 కోట్లకు పెరిగాయి. పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నాలుగో త్రైమాసికంలో తాము మెరుగైన పనితీరే కనపర్చగలిగామని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే. నిత్యానంద రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన జనరిక్స్ విభాగంలో అమ్మకాలు మరింతగా పుంజుకుంటున్నాయని, బయోసిమిలర్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది. -
అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్ ఇంజెక్షన్కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్ను అరబిందో ఫార్మా రీకాల్ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్ప్రెడ్నిసొలోన్ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్ను రీకాల్ చేస్తోంది. -
అరబిందో చేతికి వెరిటాజ్ దేశీ ఫార్ములేషన్స్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తాజాగా వెరిటాజ్ హెల్త్కేర్కి చెందిన దేశీ ఫార్ములేషన్ వ్యాపారాన్ని రూ. 171 కోట్లకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. దేశీ మార్కెట్లో విస్తరించడానికి ఈ డీల్ తోడ్పడగలదని అరబిందో ఫార్మా ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను నిర్మించడంలో అరబిందోకి ఉన్న సామర్థ్యాలు, విస్తృతమైన వెరిటాజ్ నెట్వర్క్ తోడ్పాటుతో రాబోయే రోజుల్లో దేశీ ఫార్మా మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించగలమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా బయోసిమిలర్లు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్రిటికల్ కేర్ చికిత్స విభాగంలో వెరిటాజ్కు 40 పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఫెపానిల్, మెరోగ్రామ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. 50,000 మంది పైచిలుకు రిటైలర్లు సంస్థ నెట్వర్క్లో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 127 కోట్ల టర్నోవరు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ. 133 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సోమవారం అరబిందో షేరు బీఎస్ఈలో సుమారు ఒకటిన్నర శాతం క్షీణించి దాదాపు రూ. 707 వద్ద క్లోజయ్యింది. -
సిబ్బందికి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తీర్చిదిద్దుకోవడంపై ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా దృష్టి సారించింది. ఇందులో భాగంగా లీడర్షిప్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు మార్కెట్లో ట్రెండ్లపై పట్టు సాధించేలా ఉద్యోగుల కోసం శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గీతం యూనివర్సిటీతో జట్టుకట్టింది. ’ఫోర్ పిల్లర్స్ ఫర్ ఫ్యూచర్ రెడీ మేనేజర్స్’ పేరిట మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 27 మంది ఉద్యోగులకు శిక్షణ కల్పిస్తోంది. వైజాగ్ క్లస్టర్లోని మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది దీని కోసం ఎంపికయ్యారని అరబిందో ఫార్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) యూఎన్బీ రాజు తెలిపారు. నెలకు రెండు శనివారాలు చొప్పున నాలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. భవిష్యత్లో కొత్త హోదాలు, బాధ్యతలను నిర్వర్తించేందుకు కావాల్సిన సామర్థ్యాలను సంతరించుకోవడానికి ఉద్యోగులకు ఇది తోడ్పడగలదని రాజు పేర్కొన్నారు. -
ఆకట్టుకోని అరబిందో ఫార్మా
న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) పనితీరు పరంగా ఆకట్టుకోలేకపోయింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం క్షీణించి రూ.604 కోట్లకు పరిమితమైంది. రవాణా, ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం కంపెనీ లాభాలపై ప్రభావం చూపించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సంస్థ నికర లాభం రూ.777 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఒక శాతం పెరిగి రూ.6,002 కోట్లుగా నమోదైంది. ‘‘అధిక ముడి సరుకుల ధరలు, రవాణా వ్యయాలు డిసెంబర్ త్రైమాసికంలో లాభాలపై ప్రభావం చూపించాయి. కానీ స్థిరమైన ఆదాయంతో మా వ్యాపారం బలంగా పటిష్టంగానే ఉంది. కీలక ఉత్పత్తులకు ఏపీఐ డిమాండ్ బలంగా ఉండడం అనుకూలించింది’’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానందరెడ్డి తెలిపారు. తమ తయారీ యూనిట్లకు సంబంధించి నెలకొన్న నియంత్రణపరమైన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అలాగే, కాంప్లెక్స్ జనరిక్ ఉత్పత్తుల అభివృద్ధి ప్రణాళికల్లో స్థిరమైన పురోగతి ఉన్నట్టు తెలిపారు. రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుకు మూడో మధ్యంతర డివిడెండ్గా రూ.1.50 చొప్పున (150%) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. -
జిమ్నాస్ట్ అరుణా రెడ్డికి 5 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ఈజిప్ట్లో జరిగిన ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్ను అందజేశారు. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్జెయింట్స్)తో ఐపీఎల్లోకి ప్రవేశించింది. -
క్రోనస్ డీల్ రద్దు చేసుకున్న అరబిందో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రోనస్ ఫార్మా డీల్ను రద్దు చేసుకున్నట్టు అరబిందో ఫార్మా వెల్లడించింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఈ మేరకు సమ్మతి తెలిపింది. డీల్ రద్దు విషయమై ఇరు సంస్థలు పరస్పరం అంగీకరించాయని వివరించింది. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్టు ఆగస్ట్ 12న అరబిందో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. -
అరబిందో లాభం రూ.770 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా ప్రకటించింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.9 శాతం ఎగసి రూ.770 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.5,540 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్రోల్ను మినహాయించారు. యూఎస్ ఫార్ములేషన్స్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్థిరంగా ఉండి రూ.2,681 కోట్లు సాధించింది. యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19.7 శాతం వృద్ధితో రూ.1,583 కోట్లు నమోదు చేసింది. ఏపీఐల ఆదాయం రూ.780 కోట్ల నుంచి రూ.812 కోట్లకు చేరింది. ఆదాయంలో 6.3 శాతం.. పరిశోధన, అభివృద్ధికి రూ.358 కోట్లు వెచ్చించారు. ఆదాయంలో ఇది 6.3 శాతం. మూడు ఇంజెక్టేబుల్స్తో కలిపి నాలుగు ఏఎన్డీఏలకు యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతి లభించింది. 2021–22 ఏడాదికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు సమ్మతించింది. సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో త్రైమాసిక పనితీరు సంస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా తెలిపారు. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో అరబిందో 51% మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. అలాగే అనుబంధ కంపెనీలైన ఆరోనెక్సŠట్ ఫార్మా, ఎమ్వియెస్ ఫార్మా వెంచర్స్ను అరబిందో ఫార్మాలో విలీనం చేయనున్నట్టు ప్రకటించింది. అరబిందో షేరు ధర గురువారం 3.64 శాతం తగ్గి రూ.825.70 వద్ద స్థిరపడింది. -
ఇంజెక్టబుల్స్ సామర్థ్యం పెంచుతున్న అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు. -
అరబిందో లాభం డౌన్
న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 801 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 863 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,158 కోట్ల నుంచి రూ. 6,001 కోట్లకు నీరసించింది. నాట్రోల్ విక్రయం నేపథ్యంలో ఫలితాలు పోల్చి చూడతగదని అరబిందో పేర్కొంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అరబిందో నికర లాభం రూ. 5,334 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 2,844 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 23,098 కోట్ల నుంచి రూ. 24,775 కోట్లకు ఎగసింది. బోర్డు ఓకే..: పూర్తి అనుబంధ సంస్థ ఔరా క్యూర్ ప్రైవేట్లోగల మొత్తం ఈక్విటీ షేర్లను మరో సొంత అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్కు బదిలీ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అరబిందో వెల్లడించింది. ఈ బాటలో యూనిట్–16తో కూడిన బిజినెస్ను స్టెప్డౌన్ అనుబంధ సంస్థ వైటెల్స్ ఫార్మాకు బదిలీ చేసేందుకు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. కీలక విభాగాలు భేష్ కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలోనూ గతేడాది కీలక విభాగాలలో నిలకడైన వృద్ధిని చూపినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. విభిన్నమైన, సంక్షిష్టమైన జనరిక్ అవకాశాలపై మరింత దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించగలిగినట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది ప్రధాన మైలురాళ్లను చేరుకున్నట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 3% క్షీణించి రూ. 993 వద్ద ముగిసింది. -
మూడు ప్లాంట్లు స్థాపించనున్న అరబిందో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా క్లిష్టమైన ఔషధాల తయారీని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత పథకం (పీఎల్ఐ) కింద అరబిందో ఫార్మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కర్ణాటక యాంటీబయాటిక్స్, ఫార్మాస్యూటికల్స్కు (కేఏపీఎల్), కిన్వన్ అనే ప్రైవేటు కంపెనీకి సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. పీఎల్ఐ కింద ఏర్పాటు చేయనున్న ప్లాంట్లకు ఈ మూడు సంస్థలు రూ.3,761 కోట్ల పెట్టుబడి చేయనున్నాయి. అలాగే 3,827 ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాలుగు విభాగాల్లో.. ప్రతిపాదిత ప్లాంట్లలో 2023 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్యపర ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2030–31 మధ్య పెన్సిలిన్–జి, 7–ఏసీఏ, ఎరిథ్రోమైసిన్ థియోసైనేట్, క్లావులానిక్ యాసిడ్ విభాగాల్లో రూ.6,940 కోట్లు ఖర్చు చేయనుంది. తయారీ కేంద్రాల రాకతో ఈ కీలక ముడిపదార్థాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. అరబిందో ప్లాంట్లు ఇవే.. పెన్సిలిన్–జి, 7–అమైనోసెఫలోస్పోరానిక్ యాసిడ్ (7–ఏసీఏ) తయారీకై లైఫియస్ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా దరఖాస్తు చేసింది. రూ.1,392 కోట్లతో 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పెన్సిలిన్–జి ప్లాంటుతోపాటు రూ.813 కోట్లతో 2,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 7–ఏసీఏ యూనిట్ స్థాపించనున్నారు. అలాగే క్యూల్ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా ఎరిథ్రోమైసిన్ థియోసైనేట్ తయారీకై రూ.834 కోట్లతో 1,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. మూడు కేంద్రాలకు సంస్థ రూ.3,039 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
కోవాక్స్ వ్యాక్సిన్ తయారీకి అరబిందో ఓకే
బెంగళూరు, సాక్షి: యూఎస్కు చెందిన కోవాక్స్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, సరఫరాలకు హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా యూబీ-612 పేరుతో అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్ తయారీ, పంపణీలను చేపట్టనున్నట్లు అరబిందో పేర్కొంది. దీనిలో భాగంగా యునిసెఫ్కు భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయంగానూ కరోనా కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల తయారీ, పంపిణీకి వీలుగా ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే ఇతర వర్ధమాన దేశాలకు సంబంధించి నాన్ఎక్స్క్లూజివ్ హక్కులు లభించినట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా యూబీ-612 వ్యాక్సిన్ క్లినికల్ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్లను దేశీయంగా అరబిందో చేపట్టనుంది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం తొలి దశల క్లినికల్ పరీక్షలలో ఉన్నట్లు తెలుస్తోంది. (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు) 2021లో.. యునైటెడ్ బయోమెడికల్ ఇంక్కు చెందిన కోవాక్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో చివరి దశ క్లినికల్ పరీక్షలను చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తొట్టతొలి మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత ఈ వ్యాక్సిన్ను సాధారణ రిఫ్రిజిరేషన్లలో భద్రపరిచేందుకు వీలుంటుందని అరబిందో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ 22 కోట్ల డోసేజీల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలియజేసింది. 2021 జూన్కల్లా 48 కోట్ల డోసేజీల తయారీకి విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల కొనుగోలు ఆర్డర్లు లభించినట్లు కోవాక్స్ వెల్లడించింది. తద్వారా బ్రెజిల్, పెరూ, ఈక్వడార్ తదితర వర్ధమాన మార్కెట్లకు 14 కోట్ల డోసేజీలకుపైగా సరఫరా చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. -
అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ
ముంబై: ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ల 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 292 పాయింట్లు పతనమై 43,301కుచేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు క్షీణించి 12,687 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెల్త్కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్బీఎఫ్సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అరబిందో ఫార్మా నికర లాభం 26 శాతం ఎగసి రూ. 806 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6,483 కోట్లను అధిగమించాయి. వాటాదారులకు సైతం షేరుకి రూ. 1.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం దూసుకెళ్లి రూ. 864ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్చేసి రూ. 854 వద్ద ట్రేడవుతోంది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐబీ హౌసింగ్ నికర లాభం 54 శాతం క్షీణించి రూ. 323 కోట్లకు పరిమితమైంది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే 18.5 శాతం పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 26 శాతం తక్కువగా రూ. 2,581 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్చేసి రూ. 174కు చేరింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 171 వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్ డౌన్- పాలీక్యాబ్- అరబిందో జోరు
తొలుత బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాలు పెరగడంతో కుదేలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 490 పాయింట్లు పతనమై 40,195కు చేరింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 11,780 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎఫ్ఎంఈజీ కంపెనీ పాలీక్యాబ్ ఇండియా కౌంటర్కు డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థ ఆస్తులను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో హెల్త్కేర్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పాలీక్యాబ్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో పాలీక్యాబ్ ఇండియా నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 222 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 2,114 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 25 శాతం పెరిగి రూ. 288 కోట్లను తాకగా.. ఇబిటా మార్జిన్లు 2.72 శాతం బలపడి రూ. 14.76 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాలీక్యాబ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.5 శాతం దూసుకెళ్లి రూ. 955 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 968 వరకూ ఎగసింది. అరబిందో ఫార్మా న్యూ మౌంటెయిన్ క్యాపిటల్, జారో ఫార్ములాస్తో బిజినెస్ యూనిట్ల విక్రయానికి యూఎస్ అనుబంధ సంస్థ నాట్రోల్ ఎల్ఎల్సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరబిందో ఫార్మా తాజాగా పేర్కొంది. పూర్తి నగదు రూపంలో 55 కోట్ల డాలర్ల(రూ. 4048 కోట్లు)కు డీల్ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2021 జనవరికల్లా డీల్ పూర్తికావచ్చని వివరించింది. నిధులను రుణభార తగ్గింపు, ఇతర వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనున్నట్లు అరబిందో వెల్లడించింది. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం లాభంతో రూ. 790 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 4 శాతం జంప్చేసి రూ. 815కు చేరింది. -
అరబిందో ఫార్మా- హెమిస్ఫియర్.. బోర్లా
నాలుగు రోజుల వరుస లాభాలకు చెక్ చెబుతూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 40,555కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 11,883 వద్ద ట్రేడవుతోంది. కాగా.. న్యూజెర్సీ ప్లాంటుపై యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ కంపెనీ అరబిందో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క పీఎస్యూ వీఎస్ఎన్ఎల్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన తొలి రోజే హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా న్యూజెర్సీ, డేటన్లోని ఓరల్ సాలిడ్ తయారీ కేంద్రంపై యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో అరబిందో ఫార్మా కౌంటర్ డీలా పడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అరబిందో షేరు 5.5 శాతం పతనమై రూ. 762 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.5 శాతం నీరసించి రూ. 754 దిగువకు చేరింది. డేటన్ ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది జనవరి 13- ఫిబ్రవరి 12న తనఖీలు చేపట్టింది. 9 లోపాలను గుర్తిస్తూ జూన్ 4న ఓఏఐతో కూడిన ఫామ్ 483ను జారీ చేసింది. కాగా.. అరబిందో ఫార్మా మొత్తం టర్నోవర్లో ఈ ప్లాంటు వాటా 2 శాతమేనని.. కంపెనీ కార్యకలాపాలపై ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఫార్మా వర్గాలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాయి. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ పీఎస్యూ వీఎస్ఎన్ఎల్(ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్) నుంచి ప్రత్యేక కంపెనీగా విడదీసిన హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్(హెచ్పీఐఎల్) నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. అయితే అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈలలలో అమ్మకాలు ఊపందుకోవడంతో 5 శాతం లోయర్ సర్క్యూట్లను తాకింది. బీఎస్ఈలో రూ. 106 వద్ద లిస్టయిన షేరు రూ. 5.3 కోల్పయి రూ. 101 దిగువన ఫ్రీజయ్యింది. ఇక ఎన్ఎస్ఈలో రూ. 97 వద్ద ప్రారంభమై దాదాపు రూ. 5 నష్టంతో రూ. 92 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హెచ్పీఐఎల్ చేతిలో దాదాపు 740 ఎకరాల భూమిని కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 26 శాతానికిపైగా వాటా ఉంది. ఇదే విధంగా టాటా గ్రూప్ కంపెనీలకు దాదాపు 49 శాతం వాటా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఈక్లర్క్స్ హైజంప్- అరబిందో డీలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ హెల్త్కేర్ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈక్లర్క్స్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. అరబిందో అమ్మకాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. ఈక్లర్క్స్ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఈక్లర్క్స్ సర్వీసెస్ నికర లాభం 30 శాతం ఎగసి రూ. 52 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం తక్కువగా రూ. 348 కోట్లను తాకింది. డాలర్ల రూపేణా ఆదాయం 12 శాతం నీరసించి దాదాపు 45 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఈక్లర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 104 జమ చేసుకుని రూ. 623 వద్ద ఫ్రీజయ్యింది. అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అరబిందో ఫార్మా నికర లాభం 23 శాతం వృద్ధితో రూ. 781 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 5925 కోట్లను తాకింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 1.25 డివిడెండ్ను ప్రకటించింది. మొత్తం ఆదాయంలో యూఎస్ వాటా 16 శాతం ఎగసి రూ. 3107 కోట్లను అధిగమించినట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్-19 కాలంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించగలిగినట్లు తెలియజేసింది. అయితే ఎన్ఎస్ఈలో ప్రస్తుతం అరబిందో షేరు 3.2 శాతం క్షీణించి రూ. 904 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4.7 శాతం పతనమై రూ. 890 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చేరింది. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. -
సీఎం జగన్పై అరబిందో సీఓఓ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అరబిందో ఫార్మా ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సాయిరామ్ స్వరూప్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 104, 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో 108 లు ఏర్పాటు చేశామని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2015లో స్థాపించిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో అంబులెన్స్ సేవలు అందేలా ఏర్పాటు చేశామన్నారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) 108 ద్వారా 3558 మందికి అంబులెన్స్లో ఉద్యోగాలు ముఖ్యమంత్రి కల్పించారని సాయిరామ్ స్వరూప్ అన్నారు. జిల్లాలలో శిశు మరణాలు తగించడానికి ప్రణాళిక కూడ పెట్టామని, అత్యాధునిక పరిజ్ఞానంతో అంబులెన్సు ద్వారా అందరికి మెరుగైన వైద్యం అందిచవచ్చన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరోనాకు ప్రత్యేక అంబులెన్స్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 108,104 సర్వీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యపరంగా కొత్త విప్లవాన్ని చూస్తారన్నారు.(‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’) -
హెచ్డీఎఫ్సీ లైఫ్- అరబిందో జోరు
ఆటుపోట్ల మధ్య వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఉదయం 10.40 ప్రాంతంలో సెన్సెక్స్ 69 పాయింట్లు పుంజుకుని 34,179కు చేరగా.. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,081 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ 1.28 శాతం ఈక్విటీ వాటాను విక్రయించిన వార్తలతో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్ బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం జంప్చేసి రూ. 520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 524 వరకూ ఎగసింది. గత రెండు వారాలలో ఈ కౌంటర్ 9 శాతం పుంజుకోవడం గమనార్హం! షేరుకి రూ. 490.22 ధరలో హెచ్డీఎఫ్సీ బల్క్డీల్ ద్వారా 2.6 కోట్ల హెచ్డీఎఫ్సీ లైఫ్ ఈక్విటీ షేర్లను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 1275 కోట్లు. కాగా.. భాగస్వామ్య సంస్థ స్టాండర్డ్ లైఫ్ సైతం హెచ్డీఎఫ్సీ లైఫ్లో 2 శాతం వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అరబిందో ఫార్మా నికర లాభం 45 శాతం ఎగసి రూ. 850 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6158 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో అరబిందో కౌంటర్కు న్యూట్రల్ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ పేర్కొంది. రూ. 665 టార్గెట్ను ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అరబిందో షేరు 2.7 శాతం లాభపడి రూ. 770 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 791 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. క్యూ4లో అరబిందో మంచి పనితీరును చూపినట్లు క్రెడిట్ స్వీస్ తెలియజేసింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన అమెరికాలో ఇంజక్టబుల్స్ అమ్మకాలు 23 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. -
అరబిందో లాభం 45% జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో అరబిందో ఫార్మా ఉత్తమ పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45.2% వృద్ధితో రూ.850 కోట్లకు చేరింది. టర్నోవర్ 16.4% వృద్ధితో రూ.5,292 కోట్ల నుంచి రూ.6,158 కోట్లకు ఎగసింది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 20.5% పెరిగి రూ.2,990 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 26% హెచ్చి రూ.1,652 కోట్లు, వృద్ధి మార్కెట్లు 30% పెరిగి రూ.376 కోట్లు సాధించాయి. ఏపీఐల అమ్మకాలు రూ.917 కోట్ల నుంచి రూ.755 కోట్లకు దిగొ చ్చాయి. పరిశోధన, అభివృద్ధికి రూ.239 కోట్లు వ్యయం చేశారు. ఏఎన్డీఏల విషయంలో యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈ త్రైమాసికంలో ఆరు తుది, రెండు తాత్కాలిక అనుమతులను కంపెనీ దక్కించుకుంది. టర్నోవర్ రూ.23 వేల కోట్లు.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.7% పెరిగి రూ.2,831 కోట్లు సాధించింది. టర్నోవర్ 18 శాతం అధికమై రూ.23,098 కోట్లకు ఎగసింది. ఈపీఎస్ రూ.48.32 నమోదైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 27% హెచ్చి రూ.11,483 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 19.4% పెరిగి రూ.5,922 కోట్లు, వృద్ధి మార్కెట్లు 13.5% అధికమై రూ.1,355 కోట్లు నమోదయ్యాయి. పరిశోధన, అభివృద్ధికి ఆదాయంలో 4.1% (రూ.958 కోట్లు) వెచ్చించారు. విభిన్న ఉత్పత్తుల కారణంగా యూఎస్ఏ, యూరప్ మార్కెట్లలో వృద్ధిని కొనసాగించామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపారాలను పటిష్టం చేయడం, వినూత్న, ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధి, నిబంధనలకు లోబడి పనిచేయడంపై దృష్టిసారించామని చెప్పారు. -
శాండోజ్ కొనుగోలు ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ జనరిక్ ఫార్మా కంపెనీ శాండోజ్ను కొనుగోలు చేసే ఒప్పందాన్ని అరబిందో ఫార్మా రద్దు చేసుకుంది. అనుకున్న సమయంలోగా యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో ఇరు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. నోవార్టిస్ కంపెనీకి చెందిన శాండోజ్ అమెరికాలో జనరిక్ ఔషధాలు, బయోసిమిలర్ ఔషధాల్లో దిగ్గజ కంపెనీగా ఉంది. నోవార్టిస్ డివిజన్గా ఉన్న శాండోజ్ ఐఎన్సీ వాణిజ్య కార్యకలాపాలను, మూడు తయారీ కేంద్రాలను 900 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకునేందుకు అరబిందో ఫార్మా 2018 సెప్టెంబర్లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అమెరికాలో తన సొంత సబ్సిడరీ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఐఎన్సీ ద్వారా శాండోజ్ను సొంతం చేసుకోవాలనుకుంది. ఇది సఫలమై ఉంటే అమెరికాలో ప్రిస్క్రిప్షన్ ఔషధాల పరంగా రెండో అతిపెద్ద జనరిక్ ఔషధ కంపెనీగా అరబిందో అవతరించి ఉండేది. -
కరోనా.. ఏపీకి అరబిందో ఫార్మా భారీ విరాళం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసకుంటున్న చర్యలకు పలు సంస్థలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ. 7.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. దీనికి అదనంగా రూ. 3.5 కోట్ల విలువైన శానిటైజర్లు, హై ఎండ్ మెడికల్ కిట్స్, మాస్కులతో పాటు ఇతర వైద్యసామాగ్రిని పంపిణీ చేయనున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కుశరత్ చంద్రారెడ్డి విరాళానికి సంబంధించిన చెక్ను అందజేశారు. -
నిమ్మల, అనురాధలకు లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ డిమాండ్ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు లీగల్ నోటీసులు పంపింది. (చదవండి: మిమ్మల్ని ఫినిష్ చేసే రోజు వస్తుంది) -
అమెరికా తరహాలో ‘108’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో ‘108’అత్యవసర వైద్య సేవలను రాష్ట్రంలోని ప్రజలకు అందజేస్తామని అరబిందో ఫార్మా ఫౌండేషన్ వెల్లడించింది. తమకు ‘108’అత్యవసర వైద్య సేవలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసింది. జీవీకే–ఈఎంఆర్ఐల కాలపరిమితి ముగిసినందున ఈ విన్నపం చేసింది. నామినేషన్ పద్ధతిలో తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ‘108’సేవలను నిర్వహించే సత్తా తమకుందని తెలిపింది. తమకు ఈ రంగంలో ఎంతో అనుభవం ఉందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది. దాంతోపాటు ‘108’సేవలను ఏవిధంగా అత్యంత మెరుగ్గా అందజేస్తామన్న వివరాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనా నివేదికను వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. అమెరికాలో అత్యవసర వైద్య సేవలు అందించే ‘911’మాదిరిగానే తెలంగాణలోనూ నిర్వహిస్తామని, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేసింది. దాంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ)లను కూడా మెరుగుపరుస్తామని తెలిపింది. ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేలా కృషిచేసి మాతాశిశు మరణాల రేటును తగ్గిస్తామని పేర్కొంది. ప్రాంతాల వారీగా జబ్బులను సూక్ష్మంగా పరిశీలించి సమగ్ర డేటా సేకరిస్తామని తెలిపింది. ప్రస్తుతమున్న అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచే నూతన మోడల్ ఏవిధంగా ఉంటుందో ఆ నివేదికలో తెలిపింది. ఇదిలావుండగా గతంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అరబిందోకు ‘108’ను ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖకు, నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘108’ను జీవీకే నుంచి అరబిందోకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్ రూపకల్పన.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, అత్యంత సమర్థవంతంగా, నాణ్యమైన సేవలు అందిస్తా మని అరబిందో ముఖ్యమంత్రికి పంపిన లేఖలో నూ, వైద్య ఆరోగ్య శాఖకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. వాటిల్లో ఇంకా ఏముందంటే.. ప్రస్తుతమున్న ‘108’అత్యవసర అంబులెన్సులను ఉప యోగించుకుంటూ, వాటిల్లో అనేక మార్పులు చేర్పులూ చేస్తారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమేటిక్గా నడిపిస్తారు. ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోని ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్వర్క్లను రూపొందిస్తారు. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అప్లికేషన్ను రూపొందిస్తారు. ఇది ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆలోచన. అంతేకాదు ఈ అప్లికేషన్ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సర్వీసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. అత్యంత సమర్థులైన శిక్షణ కలిగిన సిబ్బందిని నియమిస్తారు. మెడికల్, పోలీస్, ఫైర్ ఎమర్జెన్సీలకు సంబంధించి కీలకమైన ఏరియాలు, సంఘటనలు పరిశోధించి సమగ్ర డేటా సేకరిస్తారు. అత్యవసర సంఘటనలకు సంబంధించిన అంశాలను విశ్లేషిస్తారు. ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్జీవోలతోనూ అనుసంధానం చేయనున్నారు. పారదర్శకంగా సేవలు... అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ‘108’అత్యవసర సేవలను అందిస్తామని అరబిందో హామీ ఇచ్చింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని అత్యంత వేగంగా (ర్యాపిడ్) గుర్తించి, తక్కువ సమయంలో బాధితుడిని చేరుకుంటామని తెలిపింది. అలాగే బాధితుడిని తీసుకెళ్లే ఆస్పత్రికి ముందస్తు సమాచారం ఇస్తామని వివరించింది. భవిష్యత్లో అన్ని గ్రామాల్లో ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అన్ని కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తారు. శాటిలైట్ ట్రామా సెంటర్లను రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేస్తారని ఆ నివేదికలో అరబిందో వెల్లడించింది. -
మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో
హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్ డీల్తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్ కంపెనీ అయిన సాండోజ్ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050–1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్వో సంతానం సుబ్రమణియన్ తెలిపారు. గత మూడు త్రైమాసిక ఫలితాలనుబట్టి మూడేళ్లలో రుణ రహిత కంపెనీ అవుతుందని చెప్పారు. 2019 జూన్తో పోలిస్తే సెప్టెంబర్ నాటికి సంస్థ నికర రుణాలు రూ.497 కోట్లు తగ్గి రూ.3,654 కోట్లకు వచ్చి చేరాయి. -
4.6% పెరిగిన అరబిందో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా నికరలాభం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.611.4 కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగి రూ.639.5 కోట్లుగా నమోదయింది. టర్నోవర్ రూ.4,751.4 నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,600.6 కోట్లకు ఎగసింది. ‘‘అమెరికా, యూరప్ మార్కెట్లలో చక్కని వృద్ధి నమోదు కావటంతో ఈ త్రైమాసికంలోనూ ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించాం.మా తొలి బయో సిమిలర్ ఉత్పాదనకు సంబంధించి వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడతాం’’ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గోవిందరాజన్ చెప్పారు. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. -
అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మధ్యంతర డివిడెండు రూ.1.25 చెల్లించేందుకు బోర్డు సమ్మతించింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21.7 శాతం తగ్గి రూ.611 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు 7 శాతం అధికమై రూ.4,751 కోట్లకు చేరింది. ఏప్రిల్– సెప్టెంబరు కాలంలో రూ.9,001 కోట్ల టర్నోవరుపై రూ.1,067 కోట్ల లాభం నమోదైంది. ఎబిటా 21.6 శాతంగా ఉంది. ఫార్ములేషన్స్ విక్రయాల్లో యూఎస్ 6 శాతం, యూరప్ మార్కెట్ 4 శాతం వృద్ధి చెందాయి. అభివృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో ఆదాయం 26 శాతం పెరిగి రూ.307 కోట్లు నమోదు చేసింది. యాంటీ రెట్రోవైరల్ సేల్స్ 17 శాతం అధికమై రూ.244 కోట్లు, ఏపీఐ అమ్మకాలు 6 శాతం పెరిగి రూ.816 కోట్లకు చేరాయి. పరిశోధన, అభివృద్ధికి ఈ త్రైమాసికంలో రూ.217 కోట్లు ఖర్చు చేశారు. కాగా, సంస్థ అనుబంధ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్ఏ... అభివృద్ధి దశ లో ఉన్న ఓ ఉత్పాదన, దాని అనుబంధ ఆస్తుల కొనుగోలుకు ఆస్ట్రేలియాకు చెందిన అడ్వెంట్ ఫార్మాస్యూటికల్స్తో ఒప్పందం చేసుకుంది. డీల్ విలువ సుమారు రూ.91 కోట్లు. -
12 శాతం తగ్గిన అరబిందో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12% తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3%గా ఉంది. యూఎస్, యూరప్ మార్కెట్ జోష్ కంపెనీకి తోడైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199 కోట్లు నమోదైంది. ఏపీఐల విక్రయం ద్వారా రూ.748 కోట్లు సమకూరింది. పరిశోధన, అభివృద్ధికి రూ.169 కోట్లు వ్యయం చేశారు. యూఎస్ఎఫ్డీఏ నుంచి 13 ఏఎన్డీఏలకు తుది, 3 ఏఎన్డీఏలకు తాత్కాలిక అనుమతులు దక్కించుకుంది. కొన్ని రకాల ఉత్పాదన సంబంధ నిబంధనల మూలంగా లాభంపై ప్రభావం చూపిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ వ్యాఖ్యానించారు. -
అరబిందో ఫార్మా లాభం రూ.528 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా నికర లాభం 2017–18 నాలుగో త్రైమాసిక కాలంలో స్వల్పంగా తగ్గింది. 2016–17 క్యూ4లో రూ.533 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.529 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం రూ.3,642 కోట్ల నుంచి రూ.4,049 కోట్లకు పెరిగిందని అరబిందో ఫార్మా తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,302 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధితో రూ.2,423 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.15,090 కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు ఎగసిందని కంపెనీ తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం, లాభదాయకతల్లో ఆరోగ్యకరమైన వృద్ధినే సాధించామని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అరబిందో ఫార్మా షేర్ 1.8% లాభంతో రూ.605 వద్ద ముగిసింది. -
అరబిందో లాభం రూ.595 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో స్వల్ప వృద్ధి నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 2.8 శాతం పెరిగి రూ.595 కోట్లకు చేరింది. టర్నోవర్ 11 శాతం పెరిగి రూ.4,336 కోట్లకు ఎగసింది. 2017–18 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ.12,450 కోట్ల టర్నోవరుపై సంస్థ రూ.1,894 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఫార్ములేషన్ అమ్మకాల్లో యూఎస్ 9.4 శాతం, యూరప్ 37 శాతం వృద్ధిని కనబరిచాయి. కీలక మార్కెట్లు చక్కని పనితీరు కొనసాగిస్తున్నాయని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1 రెండవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. మూడింతలైన గాయత్రి లాభం డిసెంబర్ క్వార్టరు స్టాండలోన్ ఫలితాల్లో గాయత్రి ప్రాజెక్ట్స్ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా పెరిగి రూ.46.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.521 కోట్ల నుంచి రూ.908 కోట్లకు ఎగసింది. 2017–18 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ.1,992 కోట్ల టర్నోవరుపై రూ.115 కోట్ల నికరలాభం నమోదైంది. స్వల్పంగా తగ్గిన హెచ్బీఎల్ లాభం.. డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.9.6 కోట్ల నుంచి రూ.8.8 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.385 కోట్ల నుంచి రూ.417 కోట్లకు ఎగసింది. కావేరీ లాభం రూ.6.9 కోట్లు.. గడచిన త్రైమాసికంలో కావేరీ సీడ్ కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాదితో పోలిస్తే రూ.5.2 కోట్ల నుంచి రూ.6.9 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.78 కోట్ల నుంచి రూ.72 కోట్లకు వచ్చి చేరింది. ఓల్టాస్ లాభం రూ.100 కోట్లు న్యూఢిల్లీ: టాటా గ్రూప్నకు చెందిన ఓల్టాస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.100 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం రూ.82 కోట్లతో పోలిస్తే నికర లాభం ఈ క్యూ3లో 23 శాతం వృద్ధి చెందిందని ఓల్టాస్ తెలిపింది. ఆదాయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,375 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 43 శాతం వృద్ధితో రూ.119 కోట్లకు, ఇబిటా మార్జిన్ 1.5 శాతం వృద్ధితో 8.6 శాతానికి పెరిగాయి. ఆర్థిక ఫలితాలు బాగుండటంతో స్టాక్ మార్కెట్ నష్టపోయినా, బీఎస్ఈలో ఓల్టాస్ షేర్ 2.4 శాతం లాభపడి రూ.600 వద్ద ముగిసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లాభం రెట్టింపు న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో వంద శాతం వృద్ధి చెందింది. గత క్యూ3లో రూ.23 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం ఈ క్యూ3లో రూ.46 కోట్లకు పెరిగిందని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగినట్లు కంపెనీ ఈడీ, సీఈఓ రవీంద్ర సుధాల్కర్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.270 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.421 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ 1 శాతం లాభంతో రూ.69 వద్ద ముగిసింది. -
అరబిందో లాభం 29% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం దాదాపు 29 శాతం వృద్ధితో రూ. 781 కోట్లకు పెరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్లో అమ్మకాలు భారీగా పెరగడం ఇందుకు తోడ్పడింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 606 కోట్లు. మరోవైపు మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 3,775 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు ఎగిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.50 మేర మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ‘అమెరికా, యూరప్తో పాటు ఇతర మార్కెట్లలో పటిష్టమైన వృద్ధి.. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుకు దోహదపడింది‘ అని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. గడ్డు పరిస్థితుల్లో కూడా తమ అమెరికా వ్యాపార విభాగం 21 శాతం మేర వృద్ధి నమోదు చేసిందని, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుత ఉత్పత్తుల అమ్మకాలు పెరగడం ఇందుకు తోడ్పడ్డాయని ఆయన వివరించారు. స్పెషాలిటీ ఉత్పత్తుల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతుండటం భవిష్యత్లో కంపెనీ వృద్ధి బాటలో కొనసాగడానికి ఉపయోగపడగలదని గోవిందరాజన్ చెప్పారు. అనుబంధ సంస్థ రాయదుర్గం డెవలపర్స్లో అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 96 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో అందులో తమ వాటా 40 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. -
అరబిందోకు యుఎస్ఎఫ్డీఏ బూస్ట్
న్యూఢిల్లీ: అమెరికాకు ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అందించిన కిక్తో పార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు స్టాక్మార్కెట్లో మంచి బూస్ట్ లభించింది. అమెరికా మార్కెట్లలో సవెల్మర్ కార్బొనేట్ మాత్రలను విడుదల చేసేందుకు తుది ఆమోదం లభించింది. కీలకమైన జనరిక్ డ్రగ్కు అనుమతి లభించడంతో బుధివారంనాటి మార్కెట్లో 8 శాతం ఎగిసి భారీ లాభాలను సాధించింది. మార్కెట్ ఆరంభంలోనే అరబిందో ఫార్మా కంపెనీ షేర్లు 8 శాతం పెరిగాయి. ఈ జంప్తో షేరు ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఇలో కంపెనీ షేర్లు 8.22 శాతం పెరిగి 794.70 కి చేరుకున్నాయి. వాల్యూమ్ విషయంలో, కంపెనీలో 4.63 లక్షల షేర్లను బిఎస్ఇలో వర్తకం చేశాయి, ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈ వద్ద 81 లక్షల షేర్లు చేతులుమారాయి. కిడ్నీల పనితీరును దెబ్బతీసే తీవ్ర వ్యాధుల చికిత్సకు సెవిలామిర్ ట్యాబ్లెట్ల విక్రయానికి తుది ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుంచి సవెల్మర్ కార్బొనేట్ టాబ్లెట్లను 800 మి.గ్రా. తయారీకి తుది ఆమోదం లభించిందని బీఎస్ఈ ఫైలింగ్లో అరబిందో ఫార్మా పేర్కొంది. డయాలిసిస్పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సీరం ఫాస్ఫరస్ నియంత్రణ కోసం ఈ మాత్రలు ఉపయోపడనున్నాయి. కాగా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో హైదరాబాద్ ఫార్మా సంస్థ అరబిందో కౌంటర్ జోరందుకోవడంతో పాటు ఇతర లుపిన్, క్యాడిల్లా హెల్త్కేర్, దివీస్లాంటి ఫార్మా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
అరబిందో ఫార్మా లాభం రూ. 578 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 578 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం క్యూ3లో నమోదైన రూ. 544 కోట్లతో పోలిస్తే సుమారు 6 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు ఆదాయం రూ. 3,442 కోట్ల నుంచి రూ. 3,844 కోట్లకు పెరిగింది. నిర్దిష్ట ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. మెరుగైన పనితీరు కనపర్చగలిగామని గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ఎండీ ఎన్. గోవిందరాజన్ తెలిపారు. స్పెషాలిటీ ఉత్పత్తులపై మరింతగా దృష్టి సారించనున్నట్లు ఆయన వివరించారు. సమీక్షాకాలంలో ఫార్ములేషన్స్ వ్యాపార విభాగం 11 శాతం వృద్ధితో మొత్తం ఆదాయాల్లో 80 శాతం వాటా ఆక్రమించింది. అమెరికా, ఇతర మార్కెట్లు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. అమెరికాలో ఫార్ములేషన్స్ ఆదాయాలు రూ. 1,558 కోట్ల నుంచి రూ. 1,745 కోట్లకు పెరిగాయి. అటు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) విభాగం ఆదాయం సుమారు 12 శాతం వృద్ధితో రూ. 695 కోట్ల నుంచి రూ. 776 కోట్లకు పెరిగింది. క్యూ3లో అమెరికా మార్కెట్లో 11 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. బయోసిమిలర్స్ మార్కెట్లోకి..: టీఎల్ బయోఫార్మాస్యూటికల్స్ సంస్థకి చెందిన నాలుగు ఉత్పత్తుల కొనుగోలు ద్వారా బయోసిమిలర్స్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. నాలుగు మాలిక్యూల్స్కి సంబంధించిన డేటాను టీఎల్ అందిస్తుందని, తాము వాటిని అభివృద్ధి చేసి, అంతర్జాతీయంగా విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. బయోలాజిక్స్ తయారీ కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ప్లాంటు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని వివరించింది. సంక్లిష్టమైన ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగానే ఈ కొనుగోళ్లు జరిపినట్లు గోవిందరాజన్ వివరించారు. -
ఒత్తిడిలో ఐటీ స్టాక్స్: అటూఇటుగా మార్కెట్లు
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఐటీ స్టాక్స్లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకుల్లో సాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభనష్టాల ఊగిసలాటలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ స్వల్పంగా 4.49 పాయింట్ల లాభంలో 26,763 వద్ద, నిఫ్టీ 4.72 లాభంలో 8,248 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 93.34 పాయింట్ల లాభంలో, నిఫ్టీ 15.65 పాయింట్ల లాభంలో ఎంట్రీ ఇచ్చాయి. కానీ వరుసగా రెండో రోజు కూడా ఐటీ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగుతుండటంతో మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ కంపెనీలు 0.5 శాతం నుంచి 1 శాతం మేర పడిపోతున్నాయి. హెచ్-1బీ వీసీ ప్రొగ్రామ్లో కీలక మార్పులను ఉద్దేశిస్తూ రూపొందిన బిల్లును యూఎస్ కాంగ్రెస్లో మళ్లీ ప్రవేశపెడటంతో, వీసా భయాందోళనతో ఐటీ కంపెనీలు నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత అవుట్సోర్సర్ల ఆపరేటింగ్ మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపనుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. నిఫ్టీ అన్నీ స్టాక్స్లో అరబిందో ఫార్మా మంచి లాభాలనార్జిస్తూ 3 శాతం పైకి ఎగిసింది. పోర్చుగల్ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్ ఔషధ కంపెనీ జనరిస్ ఫార్మాస్యూటికాను అరబిందో సొంతం చేసుకోవడంతో కంపెనీపై సానుకూల ప్రభావం వ్యక్తమవుతోంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.20 పైసల నష్టంతో 68.20గా ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 55 రూపాయల నష్టంతో 27,893గా ఉంది. -
అరబిందో ఫార్మా లాభం 606 కోట్లు
33 శాతం అప్ రూ. 1.25 మధ్యంతర డివిడెండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం దాదాపు 33 శాతం ఎగిసి సుమారు రూ. 606 కోట్లకు (కన్సాలిడేటెడ్) చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ లాభం సుమారు రూ. 454 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,365 కోట్ల నుంచి రూ. 3,775 కోట్లకు పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.25 (సుమారు 125 శాతం) కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అధునాతన సాంకేతికత ఊతంతో వైవిధ్యమైన ఉత్పత్తులను రూపొందించడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధి సాధించే దిశగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. ఫార్ములేషన్స వాటా 80%..: మొత్తం ఆదాయాల్లో ఫార్ములేషన్స విభాగం వాటా 80 శాతంగా ఉంది. వివిధ వ్యాపార విభాగాల పనితీరు పరంగా చూస్తే.. ఫార్ములేషన్స విభాగం ఆదాయాలు 12 శాతం వృద్ధితో రూ. 3,004 కోట్లకు పెరగ్గా, ఏపీఐ విభా గం ఆదాయం దాదాపు 11% పెరుగుదలతో రూ. 769 కోట్లకు చేరింది. ఫార్ములేన్సకి సంబంధించి కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాలు సుమారు 18 శాతం పెరిగి రూ. 1,735 కోట్లుగా నమోదైంది. అమ్మకాల్లో సుమారు 3.9 శాతాన్ని పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం వ్యయం చేసినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. విదేశీ మారక రుణ భారం ఈ ఏడాది మార్చిలో 640 మిలియన్ డాలర్లుగా ఉండగా.. సెప్టెంబర్ ఆఖరు నాటికి 484 మిలియన్ డాలర్లకు తగ్గినట్లు పేర్కొంది. సమీక్షాకాలంలో కొత్తగా 9 జనరిక్ ఔషధాల తయారీకి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ వివరించింది. 17 ఉత్పత్తులకు అనుమతులు లభించినట్లు, 11 కొత్త ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. -
ఆస్పత్రికి రూ.50 లక్షల పరికరాల వితరణ
నెల్లూరు(అర్బన్): స్థానిక శంకరాగ్రహారంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు హైదరాబాద్కి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షల విలువైన మానిటర్లు, అత్యవసర వైద్య సాయమందించటానికి ఉపయోగపడే పరికరాలు, రోగుల కోసం లిఫ్ట్ను గురువారం వితరణగా ఇచ్చారు. కంపెనీ యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల కింద ఈ పరికరాలను అందచేసింది. వీటిని స్వీకరించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.అజయ్కుమార్ మాట్లాడారు. ఆధునిక వైద్యాన్ని సామాన్య మానవుడికి వీలైనంత తక్కువ ధరకే అందించేందుకు ట్రస్ట్ తరపున ఆస్పత్రిని నిర్వహిస్తున్నామని తెలిపారు. -
అరబిందో హెచ్ఐవీ-1 డ్రగ్ కు తాత్కాలిక అనుమతి
ముంబై: డ్రగ్ మేజర్ అరబిందో ఫార్మాకు హెచ్ఐవీ చికిత్స లో ఉపయోగించే మందుకు తాత్కాలిక అనుమతి లభించింది. 'డొల్యూట్గ్రేవిర్ 50 ఎంజీ' పేరుతో ఉత్పత్తి అవుతున్న తమ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) టెంటేవివ్ అప్రూవల్ లభించి నట్లు అరబిందో ఫార్మా బీఎస్ ఈ ఫైలింగ్ లో పేర్కొంది. అనుమతి పొందిన ఈ ఏఎన్డీఏ... హెచ్ఐవీ-1 చికిత్సకు వినియోగించే టివికే ఔషధానికి సమానస్థాయిదని కంపెనీ పేర్కొంది. ఇతర వైరల్ ఏజెంట్లతో దీన్ని వాడతారని తెలిపింది. వివ్ హెల్త్కేర్తో 92 లైసెన్స్ డ్ దేశాల్లో ఈ డ్రగ్ ను సరఫరా చేసేందుకు గాను 2014 లో లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అరబిందో తెలిపింది. దీనికి స్థానిక రెగ్యులేటరీ అనుమతి అవసరం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అరబిందో షేర్లు దాదాపు 5 శాతం లాభపడ్డాయి. -
ఈ ఏడాది పెట్టుబడులురూ. 1,200 కోట్లు
♦ ఆర్అండ్డీకి ఆదాయంలో 4.5 శాతం ♦ అరబిందో ఫార్మా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల విస్తరణపై సుమారు రూ. 1,200 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు అరబిందో ఫార్మా ఎండీ గోవిందరాజన్ వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఆదాయంలో 4-4.5 శాతం మేర వెచ్చించనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆయన వివరించారు. రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలో ఇంజెక్టబుల్స్ విభాగంలో లెవోఫ్లోక్సాసిన్, ఎసిటిల్సిస్టీన్ వంటి దాదాపు తొమ్మిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని గోవిందరాజన్ చెప్పారు. మరోవైపు, వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న ఫినిష్డ్ డోసేజీ ప్లాంటుకు జీఎంపీ అనుమతులు వచ్చాయని, ఉత్పత్తులకు ఒక్కొక్కటిగా అనుమతులు వస్తున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఎగుమతులు ప్రారంభం కాగలవని గోవింద రాజన్ పేర్కొన్నారు. ఇక, నాయుడుపేట ప్లాంటు కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. దాదాపు 6.8 బిలియన్ డాలర్ల విలువ చేసే మార్కెట్కు సంబంధించి 19 ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నామని.. వీటిలో కీలకమైన నెక్సియం ఔషధం మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని వివరించారు. ప్రస్తుతం యూరప్లో 200 పైగా ఉత్పత్తులు అభివృద్ధి దశల్లో ఉన్నాయని.. రాబోయే మూడు నాలుగేళ్లలో వీటిని మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని గోవిందరాజన్ తెలిపారు. జూన్ ఆఖరు నాటికి మొత్తం 403 జనరిక్ ఔషధాల తయారీకి దరఖాస్తులు (ఏఎన్డీఏ) చేయగా.. 228 ఔషధాలకు తుది అనుమతులు, 41 జనరిక్స్కు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు పేర్కొన్నారు. గత త్రైమాసికంలో మూడు ఔషధాలకు అనుమతులు వచ్చాయని, మిగతా వ్యవధిలో మరిన్నింటికి అనుమతులు రాగలవని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అరబిందో ఫార్మా లాభాలు సుమారు 24 శాతం వృద్ధితో రూ. 585 కోట్లకు, ఆదాయాలు రూ. 3,299 కోట్ల నుంచి రూ. 3,726 కోట్లకు చేరాయి. -
స్వల్ప లాభాల్లో నడుస్తున్న మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో దేశీయ సూచీలు బుధవారం ట్రేడింగ్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 38.37 పాయింట్ల లాభంలో 28,028 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ తన కీలకమార్కు 8,650 దిగువకు పడిపోయింది. 10.65 పాయింట్ల స్వల్ప లాభంతో 8,643 వద్ద ట్రేడ్ అవుతోంది. అరబిందో ఫార్మా కంపెనీ క్యూ1 ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించడంతో మార్కెట్లో కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి. 5 శాతం మేర లాభాలను నమోదుచేస్తూ..నిఫ్టీలో టాప్ గెయినర్గా నిలుస్తున్నాయి..ఐడియా సెల్యులార్ నిఫ్టీలో టాప్ లూజర్గా 4 శాతం మేర డౌన్ అయింది. వెల్సపన్ ఇండియా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. గత సెషన్లలో 36 శాతం మేర క్రాష్ అయిన ఆ కంపెనీ షేర్లు, నేటి ట్రేడింగ్లో 10 శాతం పతనమయ్యాయి. మారుతీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ లాభాల బాటలో నడుస్తుండగా.. లుపిన్, టీసీఎస్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్పొ, టాటా స్టీల్లు సెన్సెక్స్లో నష్టాలను గడిస్తున్నాయి. ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు రేపటితో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నేడు కూడా మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడిచే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. కాగ నిన్నటి ట్రేడింగ్లో కూడా మార్కెట్లు ఒడిదుడుకులమయంగా నడిచాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.03 పైసలు బలహీనపడి 67.08గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 87 రూపాయల నష్టంతో 31,283గా ట్రేడ్ అవుతోంది. -
అరబిందో ఫార్మా ‘కొలెస్టరాల్’ ఔషధానికి ఎఫ్డీఏ అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా రూపొందించిన రోసూవాస్టాటిన్ కాల్షియం ట్యాబ్లెట్లకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ నుంచి తుది అనుమతులు లభించాయి. గుండె జబ్బులను నిరోధించే దిశగా.. రక్తంలో కొలెస్టరాల్ను తగ్గించే చికిత్సలో ఈ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. ఐపీఆర్ ఫార్మాకి చెందిన క్రెస్టర్ ట్యాబ్లెట్లకు ఇవి జనరిక్ వెర్షన్. ఈ ఔషధ వార్షిక అమ్మకాలు దాదాపు 6.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అరబిందో ఫార్మాకి ప్రస్తుతం మొత్తం 274 జనరిక్ ఔషధాల అనుమతులు ఉన్నాయి. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 5 శాతం లాభంతో రూ. 797.95 వద్ద ముగిసింది. -
ఎంపీపీతో అరబిందో, హెటిరో ఒప్పందాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెచ్ఐవీ, హెపటైటిస్ సీ ఔషధాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో భాగమైన మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ తదితర ఆరు సంస్థలు సబ్లెసైన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అల్పాదాయ దేశాల ప్రజలకు అందుబాటు ధరలో మరిన్ని ఔషధాలను సరఫరా చేసేందుకు ఇవి ఉపయోగపడగలవని ఎంపీపీ ఈడీ గ్రెగ్ పెరీ తెలిపారు. ఇప్పటికే ఎంపీపీ భాగస్వామిగా ఉన్న అరబిందో కొత్తగా రెండు సబ్-లెసైన్సులు కుదుర్చుకుంది. మొదటి దాని కింద ఆఫ్రికా కోసం లొపినావిర్, రిటోనావిర్ ఉత్పత్తి చేయనుండగా, రెండో దాని కింద ఇతర కంపెనీలతో కలిసి బీఎంఎస్కి చెందిన హెపటైటిస్ సీ ఔషధం అభివృద్ధిలో పాలుపంచుకోనుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. అటాజాన్విర్, రాల్టెగ్రావిర్ చౌక వెర్షన్లు తయారు చేసేందుకు సబ్-లెసైన్స్లు తోడ్పడనున్నట్లు హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ భవేష్ షా వివరించారు. మరికొన్ని ఔషధాల కోసం లారస్, లుపిన్, జైడస్ తదితర సంస్థలు సబ్-లెసైన్సులు దక్కించుకున్నాయి. -
అరబిందో ఫార్మా లాభం రూ. 563 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 563 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 404 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 39 శాతం అధికం. ఇక ఆదాయం రూ. 3,162 కోట్ల నుంచి రూ. 3,747 కోట్లకు ఎగిసింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఆదాయం రూ. 12,121 కోట్ల నుంచి రూ. 13,896 కోట్లకు ఎగియగా.. లాభం రూ. 1,576 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ. 1,982 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ షేరు ఒక్కింటిపై రూ.0.70 మేర మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీంతో పూర్తి సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరుపై రూ. 2.50 మేర డివిడెండ్ ప్రకటించినట్లవుతుందని ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. క్యూ4 ఆదాయాల్లో 80 శాతం భాగం ఫార్ములేషన్స్ విభాగం నుంచే వచ్చింది. అమెరికాలో మరిన్ని కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, యూరోపియన్ యూనియన్ మార్కెట్లో వ్యయాలను నియంత్రించుకోవడంపై దృష్టి సారిస్తామని గోవిందరాజన్ పేర్కొన్నారు. అమెరికాలో ఇంజెక్టబుల్స్ వ్యాపారం పటిష్టంగా ఉండటం, ఎబిలిఫై.. ఎన్టెకావిర్ వంటి ఔషధాలకు అనుమతులతో కంపెనీ లాభాలు సుమారు 36 శాతం వృద్ధి చెందగలవని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. సోమవారం బీఎస్ఈలో సంస్థ షేరు 1.24 శాతం క్షీణించి రూ. 754.45 వద్ద ముగిసింది. -
అరబిందో ‘బీపీ’ ఔషధానికి ఎఫ్డీఏ అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్లోడిపైన్, వల్సార్టన్ ఔషధ జనరిక్ వెర్షన్ల తయారీ, విక్రయాలకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు లభించినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. రక్తపోటు చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. నొవార్టిస్ ఫార్మాకు చెందిన ఎక్స్ఫోర్జ్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. 2016-17 తొలి త్రైమాసికంలోనే ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అరబిందో ఫార్మా వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు దాకా 12 నెలల కాలం లో దీని మార్కెట్ పరిమాణం 123 మిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. -
అరబిందో ఫార్మాలో కార్మికుడి మృతి
బొల్లారం: నగరంలోని బాచుపల్లి సమీపంలోని అరబిందో ఫార్మాలో ఓ కార్మికుడు శుక్రవారం ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. బ్రహ్మానందం (25) అనే కార్మికుడు కంటెయినర్ శుభ్రం చేస్తుండగా అందులో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
అరబిందో ఫార్మా రికార్డు లాభాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 39 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడా ది ఇదే కాలానికి రూ. 384 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 535 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను నమోదు చేయడం ఇదే ప్రథమం. ఇదే సమయంలో అమ్మకాలు 10 శాతం వృద్ధితో రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,455 కోట్లకు పెరిగింది. అమెరికా కంపెనీ నాట్రోల్ని కొనుగోలు చేయడంతో ఈ ఫలితాలను గతేడాదితో పోల్చి చూడలేమని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాటాదారులకు 70 శాతం మధ్యంతర డివిడెండ్ను బోర్డు ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 70 పైసలు డివిడెండ్గా ఇవ్వాలన్న నిర్ణయానికి వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది. -
అరబిందో ఫార్మాకి యూఎస్ మరో అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సకు వినియోగించే వొరికోనజోల్ జెనరిక్ ట్యాబ్లెట్లను తయారు చేసి విక్రయించడానికి యూఎస్ ఎఫ్డీఏ అనుమతి లభించింది. 50 ఎంజీ, 200 ఎంజీ ట్యాబ్లెట్లను తయారు చేసి విక్రయించడానికి అనుమతులు వచ్చినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతేడాది అమెరికాలో ఈ మార్కెట్ పరిమాణం రూ. 700 కోట్లుగా ఉంది. -
త్వరలో అరబిందో క్విప్ ఇష్యూ!
రూ. 2,000 కోట్ల నిధుల సమీకరణ యోచన రూ. 900 కోట్లతో కొత్త యూనిట్ల ఏర్పాటు రెండేళ్లలో రూ. 20,000 కోట్ల ఆదాయ లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో త్వరలోనే క్విప్ ఇష్యూకి రావాలని అరబిందో ఫార్మా యోచిస్తున్నట్లు సమాచారం. ఇండిగో ఎయిర్లైన్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతం కావడంతో మార్కెట్ నుంచి నిధులు సమీకరించడానికి ఇదే సరైన తరుణమని కంపెనీ భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలోనే రావాలని ఆశించినా మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) విధానంలో సుమారు రూ. 2,000 కోట్ల నిధులను సమీకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నిధుల సేకరణ గురించి నవంబర్ 6న జరిగే బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అరబిందో ఫార్మా మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. లక్ష్యం మూడు బిలియన్ డాలర్ల క్లబ్ వచ్చే రెండేళ్లలో మూడు బిలియన్ డాలర్ల క్లబ్లో (సుమారు రూ. 20,000 కోట్ల ఆదాయం) చేరాలని అరబిందో ఫార్మా లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.12,120 కోట్లుగా ఉంటే 2017-18 నాటికి రూ.20,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా భారీ విస్తరణ ప్రణాళికలను కూడా కంపెనీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ఒక్క ఏడాదిలోనే తెలుగు రాష్ట్రాల్లో యూనిట్ల విస్తరణ కోసం రూ.900 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించింది. రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టిన తెలంగాణలోని మెదక్ జిల్లా యూనిట్ విస్తరణకు ఇప్పటికే అన్ని అనుమతులూ వచ్చాయి. ఈ విస్తరణ పూర్తయితే ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 96 టన్నుల నుంచి 421 టన్నులకు పెరుగుతుంది. వీటితోపాటు జడ్చర్లలో పెన్సిలిన్ యూనిట్, విశాఖపట్నం నాయుడిపేటలో ఫినిష్డ్ డోసేజ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. క్విప్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను ఈ విస్తరణ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ ఏడాది రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధపడింది. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్పై తుది నిర్ణయం తీసుకోనుంది. తొలి త్రైమాసికంలో 50 శాతం మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో రూ.2,220 కోట్ల ఆదాయంపై రూ. 406 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ద్వితీయ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడంతో కంపెనీ లాభాలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయికి సమీపంలో రూ. 841 వద్ద కదులుతోంది. -
అరబిందో ట్రమడాల్కు యూఎస్ఎఫ్డీఏ ఓకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మాకు చెందిన ట్రమడాల్ టాబ్లెట్స్ను అమెరికాలో విక్రయించడానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. 2015-16 ఆర్థిక ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఈ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ను 100, 200, 300 ఎంజీలలో విక్రయించనుంది. హైదరాబాద్ యూనిట్ నుంచి యూఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన 50వ ఔషధంగా ట్రమడాల్ రికార్డులకు ఎక్కింది. అమెరికాలో ఈ ఔషధం మార్కెట్ పరిమాణం ఏడాదికి రూ. 360 కోట్లుగా ఉంది. -
అరబిందో ఆస్టియోపోరోసిస్ జనరిక్కు అమెరికా ఓకే
న్యూఢిల్లీ: ఇలీ లిల్లీ ఫార్మా సంస్థ ఇవెస్తా ట్యాబ్లెట్ల జనరిక్ వెర్షన్ ట్యాబ్లెట్ల తయారీ, మార్కెటింగ్కు అరబిందో ఫార్మాకు అమెరికా ఎఫ్డీఏ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అరబిందో ఒక ప్రకటన చేసింది. వయస్సు మళ్లిన మహిళల్లో వచ్చే ఎముకల బలహీనత చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. అరబిందో 60 ఎంజీ రిలాక్సిఫీన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్- ఇవెస్తా 60 ఎంజీ ట్యాబ్లెట్కు సమానమైన సామర్థ్యం కలిగి ఉన్నదని సంస్థ తెలిపింది. 2015 జూన్తో ముగిసిన 12 నెలల కాలంలో ఈ ఔషధం మార్కెట్ పరిమాణం 40.4 కోట్ల డాలర్లు. -
ఓబులేసుకు హైకోర్టులో చుక్కెదురు
బెయిల్ పిటిషన్ కొట్టివేత సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డిపై గతేడాది నవంబర్ 19న కాల్పులు జరిపిన గ్రేహౌండ్స్ మాజీ కానిస్టేబుల్ పి.ఓబులేసుకు హైకోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 19న హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వద్ద వాకింగ్ చేస్తున్న నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో ఓబులేసు ఆయనపై ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టైన ఓబులేసు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. ఈ బెయిల్ పిటిషన్ను తెలంగాణ రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. -
అరబిందో ఫార్మా బోనస్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నికరలాభం 20 శాతం క్షీణించి రూ. 404 కోట్లకు పరిమితమయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 502 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,306 కోట్ల నుంచి రూ. 3,142 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద అరబిందో ఫార్మా రూ. 12,043 కోట్ల ఆదాయంపై రూ. 1,576 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకు అదనంగా మరో షేరును బోనస్గా జారీ చేయాలని గురువారం సమావేశమైన బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఈ బోనస్ షేర్లకు ఇంకా రికార్డు తేదీని నిర్ణయించలేదు. ఈ నిర్ణయానికి జూలై 9న జరిగే అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2014-15 ఏడాదికి మూడో మధ్యంతర డివిడెండ్ కింద రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు రూపాయి ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. అరబిందో షేర్ బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ.1,304 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. -
అరబిందో అనుబంధ కంపెనీ ఎరిస్ ఫార్మా చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా.. అనుబంధ కంపెనీ అయిన అరబిందో ఫార్మా (ఆస్ట్రేలియా) ప్రొప్రైటరీ లిమిటెడ్లో ఉన్న మొత్తం వాటాను ఎరిస్ ఫార్మా ఆస్ట్రేలియాకు విక్రయించింది. ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందీ వెల్లడించలేదు. అనుబంధ కంపెనీ ఎటువంటి లాభాలను అరబిందోకు అందించడం లేదు. ఎస్, ఈయూతోపాటు అభివృద్ధి చెందుతున్న ముఖ్యమైన దేశాలవైపు దృష్టిసారించేందుకే వ్యూహాత్మకంగా వాటా విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లకై ఎరిస్ కోసం ఔషధాల తయారీ, సరఫరాను కొన్నేళ్లపాటు అరబిందో కొనసాగిస్తుంది. -
ఇన్వెస్టర్లకు లాభాల ఔషధం..!
ఏడాదిలో 71% పెరిగిన ఫార్మా ఇండెక్స్ ఇదే సమయంలో సెన్సెక్స్ పెరిగింది 25% లాభాలు కురిపించడంలో ముందున్న తెలుగు ఫార్మా కంపెనీలు ఏడేళ్లలో 60 రెట్లు పెరిగిన నాట్కో, అరబిందో ఫార్మా షేర్లు దేశంలో అత్యంత ధనవంతుడిగా మారిన సన్ఫార్మా అధినేత సంఘ్వీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడేళ్ల క్రితం అరబిందో లేదా నాట్కో ఫార్మా షేర్లలో రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ చేతికి ఎంత వస్తాయో తెలుసా.. అక్షరాలా ఆరు లక్షల పైమాటే... కేవలం ఎనిమిదేళ్ళలో మీ ఇన్వెస్ట్మెంట్ 60 రెట్లకు పైగా పెరిగినట్లే. ప్రస్తుత స్టాక్ మార్కెట్లో ఫార్మా రంగం ఎలా దూసుకుపోతోందో అని చెప్పడానికి ఈ రెండు షేర్లు ఒక చక్కటి ఉదాహరణ.దేశీయ స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్లు దూసుకుపోతున్నాయి. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీకి ఫార్మా షేర్లు నాయకత్వం వహిస్తున్నాయి. గత ఐటీ బూమ్ సమయంలో ఐటీ రంగ షేర్ల కదలికలను ఇప్పుడు ఫార్మా షేర్లు గుర్తు చేస్తున్నాయి. ఈ షేర్ల పెరుగుదలతో దేశీయ కుబేర్ల జాబితానే మారిపోతోంది. ఫోర్బ్స్ జాబితాలో దీర్ఘకాలంగా దేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీని తోసిరాజని సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ వచ్చి చేరారంటే షేర్ల విలువలు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. గత ఐటీ బూమ్ సమయంలో దేశీయ కుబేరుల జాబితాలో విప్రో ప్రేమ్జీతో పాటు అత్యధిక మంది ఐటీ కంపెనీ అధినేతలే ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫార్మా రంగం భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకు పెరుగుతున్నాయి?.. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీలను రక్షణాత్మక (డిఫెన్సివ్) రంగాలుగా పేర్కొంటారు. మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు ఈ రంగానికి చెందిన షేర్లు పెరుగుతుంటాయి.. అదే స్టాక్ మార్కెట్ ర్యాలీ సమయంలో ఈ షేర్లు నష్టాలు అందించకపోయినా.. అంత పెద్దగా పెరగవు. కానీ ఈసారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీలో ఫార్మా షేర్లే ముందంజలో ఉండటం విశేషం. గడచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ కేవలం 25 శాతం లాభాలను అందిస్తే ఇదే సమయంలో ఫార్మా ఇండెక్స్ 71 శాతానికిపైగా లాభాలను అందించాయి. అంతే కాదు కొన్ని షేర్లు అయితే ఏకంగా రెండు నుంచి మూడు రెట్ల లాభాలను కూడా అందించాయి. వకార్డ్ ఫార్మా ఏడాది కాలంలో రూ. 457 నుంచి 308 శాతం పెరిగి రూ. 1,871కి చేరుకుంది. అలాగే ఈ ఏడాది కాలంలో సువెన్ లైఫ్ 303 శాతం, అజంతా ఫార్మా 206 శాతం, స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్ 200 శాతం, నాట్కో ఫార్మా 172 శాతం చొప్పున లాభాలు అందించాయి. దీనికి ప్రధాన కారణం దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయం గణనీయంగా పెరుగుతుండటమే. గత కొంతకాలంగా ఇతర రంగాల ఆదాయాల్లో నెగటివ్ వృద్ధి లేక స్థిరంగా ఉంటే, ఫార్మా కంపెనీల ఆదాయాల్లో మాత్రం 20 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇదే సమయంలో ఫార్మా రంగానికి అప్పులు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ కోలుకోకపోవడంతో ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కలిసొస్తున్న జెనరిక్ పేటెంట్లు రాష్ట్ర ఫార్మా కంపెనీల ఆదాయంలో సుమారు 50 శాతం జెనరిక్ ఔషధాల నుంచే సమకూరుతోంది. గత రెండేళ్ల నుంచి అమెరికాలో చాలా ఔషధాలకు పేటెంట్ హక్కులు అయిపోతుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ఫార్మా కంపెనీలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. 2010-12లో అమెరికా మార్కెట్లో పేటెంట్లు అయిపోయిన ఔషధాల మార్కెట్ విలువ రూ. 4 లక్షల కోట్లుగా ఉంటే, 2014-16లో ఈ విలువ రూ. 6 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్రానికి చెందిన డాక్టర్ రెడ్డీస్, నాట్కో, అరబిందో, సువెన్లైఫ్ వంటి కంపెనీలు ఈ పేటెంట్లను దక్కించుకోవడంలో ముందంజలో ఉంటున్నాయి. నాట్కో ఫార్మా కొపాగ్జోన్, నెక్సావర్ వంటి కీలకమైన పేటెంట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
అరబిందో ఫార్మా లాభాల్లో క్షీణత
క్యూ3 ఫలితాలు.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభాల్లో అరబిందో ఫార్మా స్వల్ప క్షీణతను నమోదు చేసింది. అంతకుముందు ఏడాది రూ. 417 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది 8 శాతం తగ్గి రూ. 384 కోట్లకు పరిమితమయ్యింది. ఇదే సమయంలో ఆదాయం 48 శాతం పెరిగి రూ. 2,140 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరింది. ముడిపదార్థాల వినియోగం, సిబ్బంది జీతాల వ్యయం పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో ప్రధానమైన ఫార్ములేషన్స్ వ్యాపారం 76 శాతం పెరిగి రూ. 1,436 కోట్ల నుంచి రూ. 2,530 కోట్లకు చేరింది. అదే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్(ఏపీఐ) వ్యాపారంలో మాత్రం 9% క్షీణించింది. ఏపీఐ వ్యాపారంలో రూ. 744 కోట్ల నుంచి రూ. 674 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాలపై అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు లాభాల్లో నిలకడ స్థాయిని కొనసాగించగలిగామన్నారు. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరుపై 200% మధ్యంతర డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేసింది. -
అరబిందో చేతికి అమెరికా కంపెనీ
రూ. 810 కోట్లతో నాట్రోల్ కొనుగోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. నాట్రోల్కు చెందిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ పూర్తయినట్లు అరబిందో ఫార్మా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత నెలలో నాట్రోల్ అమ్మకానికి జరిగిన బిడ్డింగ్లో రూ. 810 కోట్లు (13.25 బిలియన్ డాలర్లు) కోట్ చేయడం ద్వారా అరబిందో ఫార్మా మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం కంపెనీ ఆస్తులు, బ్రాండ్తో పాటు కొన్ని రుణాలు కూడా అరబిందో పరం కానున్నాయి. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌష్టికాహార మార్కెట్లో వేగంగా విస్తరించే అవకాశం లభిస్తుందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. -
కాల్పుల ఘటన నిందితుని ఉహాచిత్రం విడుదల
-
అది.. భూబదలాయింపే
ప్రత్యేకకోర్టుకు నివేదించిన ట్రైడెంట్ న్యాయవాది సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మాకు కేటాయించిన 33 ఎకరాల భూమిని అనుబంధ సంస్థకు బదలాయింపు మాత్రమే చేశారని, విక్రయించలేదని ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ ట్రైడెంట్ లైఫ్సెన్సైస్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్.బాలయోగి గురువారం మరోసారి విచారించారు. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారమే ట్రైడెంట్ లైఫ్సెన్సైస్కు నిర్వహణ అవసరాల్లో భాగంగా ఈ బదలాయింపు జరిగిందని ఉమమహేశ్వర్రావు తెలిపారు. గతంలోనూ ఇటువంటి బదలాయింపులు జరిగాయని, అనుబంధ సంస్థకు భూబదలాయింపు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
అరబిందో ఫార్మా చేతికి అమెరికా కంపెనీ!
హైదరబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ దిగ్గజం అరబిందో ఫార్మా యూఎస్కు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్ను సొంతం చేసుకోనుంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న నాట్రోల్ కొనుగోలుకి 13.25 కోట్ల డాలర్ల(రూ. 810 కోట్లు) ఆఫర్తో గరిష్ట బిడ్డర్గా అరబిందో నిలిచింది. అమెరికాలోని అనుబంధ సంస్థ ద్వారా బిడ్డింగ్ను దాఖలు చేసింది. నాట్రోల్ కంపెనీ విక్రయానికి దివాళా సంబంధిత కేసులు చూసే అమెరికా డెలావేర్ జిల్లా కోర్టు తుది అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది. నాట్రోల్ ఆస్తులను సొంతం చేసుకునేందుకు వేలం విధానంలో ఉత్తమ బిడ్డర్గా నిలిచినట్లు అరబిందో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో నాట్రోల్కు చెందిన కొన్ని రుణాలు సైతం అరబిందోకు సంక్రమించనున్నాయి. సమీకృత ఓటీసీకి చాన్స్ నాట్రోల్ కొనుగోలు ద్వారా అమెరికా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ఓటీసీ విభాగం పూర్తి స్థాయిలో పటిష్టం అవుతుందని అరబిందో పేర్కొంది. నాట్రోల్ అమెరికా, తదితర అంతర్జాతీయ మార్కెట్లకు పౌష్టికాహార ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నదని తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలు ద్వారా అరబిందో బ్రాండ్కు మంచి గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించింది. కాగా, నాట్రోల్ కొనుగోలు వార్తలతో బీఎస్ఈలో అరబిందో షేరు 3% పుంజుకుని రూ. 1,060 వద్ద ముగిసింది. -
అరబిందో ఫార్మా లాభం రూ. 501 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 501 కోట్ల నికర లాభం నమోదు చేసింది. క్రితం క్యూ4లో లాభం రూ. 109 కోట్లతో పోలిస్తే ఇది సుమారు అయిదు రెట్లు అధికం. మరోవైపు, ఆదాయం రూ. 1,570 కోట్ల నుంచి రూ. 2,330 కోట్లకు పెరిగింది. షేరుకి రూ. 1.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. అరబిందో ఫార్మాలో షేర్లు విక్రయించిన మోర్గాన్ స్టాన్లీ కాగా అరబిందో ఫార్మాలో 17.32 లక్షల షేర్లను మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింపూర్ సంస్థ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. షేరుకి రూ. 670 చొప్పున వీటి విలువ సుమారు రూ. 116 కోట్లు. 2014 మార్చి 31 నాటికి అరబిందో ఫార్మాలో మోర్గాన్ స్టాన్లీకి 46.16 లక్షల షేర్లు ఉన్నాయి. ఇవి సుమారు 1.58 శాతం వాటాకు సమానం. ఇంకో వైపు, మరో లావాదేవీలో అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అరబిందోలో 14.75 లక్షల షేర్లను దాదాపు రూ. 99 కోట్లకు కొనుగోలు చేసింది. శుక్రవారం బీఎస్ఈలో సంస్థ షేరు సుమారు 4.76 శాతం ఎగిసి రూ. 667.70 వద్ద ముగిసింది. -
దేశీ ఫార్మా కంపెనీలకు భలే చాన్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒత్తిడి నివారణకు వినియోగించే సింబల్టా ఔషధానికి జనరిక్ వెర్షన్ తయారు చేసి విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మాతో సహా ఐదు దేశీయ కంపెనీలకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడికి గురయ్యే వారి చికిత్సకు వినియోగించే ఈ ఔషధానికి అమెరికాలో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ ఉన్నట్లు అంచనా. దీంతో ఎఫ్డీఏ అనుమతులు పొందిన దేశీయ కంపెనీలు అరబిందో, డాక్టర్ రెడ్డీస్తో సహా లుపిన్, సన్ఫార్మా గ్లోబల్ ఎఫ్జెడ్ఈ, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఆదాయాలు రానున్న కాలంలో గణనీయంగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఊరిస్తున్న భారీ మార్కెట్... ఇప్పటివరకు సింబల్టా ఔషధంపై ప్రత్యేక హక్కులు కలిగి ఉన్న ఎలి లిల్లీ చెప్పిన ప్రకారం గడిచిన తొమ్మిది నెలల్లో 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ ఔషధం నుంచే సమకూరింది. కాని ఎలీ లిల్లీకి సింబల్టా పైన ఉన్న ప్రత్యేక హక్కులకు కాలపరిమితి డిసెంబర్ 11తో ముగిసిపోవడంతో దేశీయ కంపెనీలకు జనరిక్ వెర్షన్తో అమెరికాలో విక్రయించడానికి అనుమతి లభించింది. -
అరబిందో ఫార్మా లాభం 6 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం (కన్సాలిడేటెడ్) 5.7 శాతం పెరిగి రూ. 235 కోట్లుగా నమోదైంది. ఆదాయం 27.6 శాతం పెరిగి రూ. 1,913.9 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో ఆదాయం రూ. 1,500.4 కోట్లు కాగా లాభం రూ. 222.4 కోట్లు. జనరిక్ ఫార్ములేషన్స్ విభాగం తోడ్పాటుతో కంపెనీ మెరుగైన పనితీరు కనబర్చగలిగిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆంకాలజీ, హార్మోన్స్ తదితర అంశాల్లో కొత్త ఉత్పత్తుల రూపకల్పనతో వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వివరించారు. గురువారం కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో 1.42% క్షీణించి రూ. 238.45 వద్ద, బీఎస్ఈలో 1.71% తగ్గి రూ. 238.35 వద్ద ముగిసింది.