18 నుంచి ఎడ్‌సెట్‌ దరఖాస్తులు | TS Edcet Notification Released | Sakshi

18 నుంచి ఎడ్‌సెట్‌ దరఖాస్తులు

Mar 13 2018 2:58 AM | Updated on Mar 13 2018 2:58 AM

TS Edcet Notification Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సులో ప్రవేశానికి నిర్వహించనున్న ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఎడ్‌సెట్‌–2018) షెడ్యూల్‌ను సెట్‌ కమిటీ ఖరారు చేసింది. ఈ నెల 15న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 18 నుంచి వచ్చే నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎడ్‌సెట్‌ను ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్ష ఫీజును సెట్‌ కమిటీ పెంచింది. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.200, బీసీ, ఇతరులకు రూ.400గా ఉన్న ఫీజును.. ఈ సారి ఎస్సీ, ఎస్టీలకు రూ.450, బీసీ, ఇతరులకు రూ.650గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌ పరీక్షలతో నిర్వహణ వ్యయం పెరగనుండటంతో కొంత ఫీజు పెంచాల్సి వచ్చిందని పాపిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement