మెదక్ జిల్లా కంకోల్ గ్రామ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై కారు - లారీ ఢీ కొన్నాయి.
మెదక్ : మెదక్ జిల్లా కంకోల్ గ్రామ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై కారు - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.