ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో | under MRPS strike | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

Published Sun, Jul 31 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

చిలుకూరు: ఎస్సీ వర్గీకరణ చేయాలని  డిమాండ్‌ చేస్తూ ఆదివారం చిలుకూరుకు  చెందిన దళితవాడ సమీపంలో కోదాడ – హుజూర్‌నగర్‌ రోడ్డుపై ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాస్తారోకో చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన  100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు బిల్లు ప్రవేశ పెట్టలేదని అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కోటేష్, మండల కార్యదర్శి కందుకూరి ఎల్లయ్య, నాయకులు సిద్దెల శ్రీను, జిల్లా శ్రీను, మల్లేపంగు ఉపేందర్, వీరబాబు, రాంబాబు, ప్రవీణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement