అమెరికాలో రోడ్డు ప్రమాదం | Woman died in Road accident at American | Sakshi

అమెరికాలో రోడ్డు ప్రమాదం

Jul 12 2017 12:53 AM | Updated on Aug 30 2018 4:10 PM

అమెరికాలో రోడ్డు ప్రమాదం - Sakshi

అమెరికాలో రోడ్డు ప్రమాదం

అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన గోపాలం రత్న జ్యోతి మరణిం చారు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ మృతి
డిచ్‌పల్లి (నిజామాబాద్‌ రూరల్‌): అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన గోపాలం రత్న జ్యోతి మరణిం చారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త సునీల్‌ సాగర్, కుమారుడు దైవిక్‌ సాగర్‌ (21 నెలలు)కు తీవ్ర గాయాలయ్యాయి. ధర్మారం(బి)కి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ప్రొఫెసర్‌ గోపాలం విద్యాసాగర్‌ కుమారుడు సునీల్‌ సాగర్‌ న్యూయార్క్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ట్రైజరీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.  

ఆదివారం రాత్రి సునీల్‌ కుటుంబంతో షాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో రత్నజ్యోతి మృతి చెందగా, సునీల్, దైవిక్‌సాగర్‌లు గాయపడ్డారు. న్యూయార్క్‌లో ఉంటున్న బంధువులు ప్రమాద విషయాన్ని ఫోన్‌ ద్వారా ఇక్కడికి చేరవేశారు. గతంలో దంపతులు గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో మూడేళ్లు ఉద్యోగాలు చేశా రు. మృతదేహాన్ని త్వరగా రప్పించడానికి ఆటా, ఇతర సంఘాలతో మాట్లాడు తున్న ట్లు గోపాలం విద్యాసాగర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement