'19లోగా విచారణకు రావాలి' | you should attend enquiry evening 5 pm: acb | Sakshi
Sakshi News home page

'19లోగా విచారణకు రావాలి'

Published Wed, Jun 17 2015 1:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

'19లోగా విచారణకు రావాలి' - Sakshi

'19లోగా విచారణకు రావాలి'

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సాయంత్రం అయిదు గంటల లోపు ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ సూచించింది. సండ్ర వెంకట వీరయ్యకు నిన్నరాత్రే ఏసీబీ సెక్షన్ 160 కింద  నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా  ఆదేశించింది.

తొలుత హైదరాబాద్‌లో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్ట్స్‌లోని 208వ నంబర్ క్వార్టర్‌లో ఉన్న సండ్ర నివాసానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆసమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నోటీసులను క్వార్టర్ తలుపునకు అంటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరిగిన కొనుగోళ్ల వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో సండ్ర వెంకట వీరయ్య బేరసారాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement