రామన్నపేట మండలం పైడిపల్లి వద్ద జాతీయరహదారిపై బైక్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది.
బైక్ను ఢీకొన్న లారీ: యువకుడు మృతి
Apr 8 2016 4:37 PM | Updated on Apr 3 2019 7:53 PM
భువనగిరి (నల్గొండ జిల్లా) : భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద జాతీయరహదారిపై బైక్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో రామన్న పేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన మందాడి ప్రమోద్కుమార్(27) అనే యువకుడు మృతిచెందాడు.
బైక్పై హైదరాబాద్ నుంచి రామన్నపేట వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమోద్ హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులకు ప్రమోద్ ఒక్కడే కుమారుడు. దీంతో పండగపూట ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement