bhuvanagiri
-
ప్రతిపక్ష పార్టీలపై వివక్ష తగదు: కాంగ్రెస్ ఎంపీ లేఖ
ఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలపై చూపెడుతున్న వివక్షపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు లేఖ రాశారాయన. లోక్సభ స్పీకర్కు ఆయన రాసిన లేఖలో సారాంశం ఇలా ఉంది.. లోక్సభలో ఉపసభాపతి నియామకం జరగకపోవడం2019 నుండి ఉపసభాపతి పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉండగా ఉపసభాపతి లేకపోవడం ఒక ప్రమాదకరమైన దృష్టాంతాన్ని ఏర్పరుస్తోంది, ఇది సభ నిష్పక్షపాతతను మరియు పనితీరును ప్రభావితం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడంప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత వేదికపై నిలబడినప్పుడు వారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని పదేపదే పట్టించుకోవడం లేదు. ఇది గత పార్లమెంటరీ ప్రవర్తనలకు భిన్నంగా ఉండటమే కాకుండా, సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తగ్గిస్తుంది. ప్రతిపక్ష నేతలు మరియు ఎంపీల మైక్రోఫోన్లు ఆఫ్ చేయడంప్రతిపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం ఒక సాధారణ ఘటనగా మారిపోయింది, అయితే అధికార పక్ష సభ్యులు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుంది. సభానిర్వహణ సలహా కమిటీ (BAC) నిర్ణయాలను పట్టించుకోకపోవడంప్రభుత్వం BACలోని ఇతర పక్షాలతో సంప్రదించకుండా, వారికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత వారం గౌరవ ప్రధానమంత్రి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సభలో ప్రవేశపెట్టడం ఇందులో భాగమే.5)బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించడం: ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను బడ్జెట్ కేటాయింపులు మరియు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చల నుండి మినహాయిస్తున్నారు. ఇది ఆర్థిక నిర్ణయాలపై పార్లమెంటరీ పర్యవేక్షణను తగ్గిస్తోంది.193వ నియమం ప్రకారం చర్చల్లో కోతఅత్యవసరమైన ప్రజా సమస్యలపై ఓటింగ్ లేకుండా చర్చించేందుకు అనుమతించే 193వ నియమాన్ని ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలపై బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారు.పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో జోక్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు స్వతంత్రంగా పనిచేసి నిపుణులకు చట్టపరమైన పర్యవేక్షణను అందించాలి. అయితే, స్పీకర్ కార్యాలయం కమిటీ నివేదికల్లో సవరణలు సూచించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల వాటి స్వతంత్రత దెబ్బతింటోంది.వాయిదా తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం మరియు తిరస్కరించడంగతంలో జీరో అవర్ లో చర్చకు అనుమతించే వాయిదా తీర్మానాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాటిని తక్షణమే తిరస్కరిస్తున్నారు. ఇది అత్యవసరమైన జాతీయ సమస్యలను ప్రస్తావించే ఎంపీల హక్కులను పరిమితం చేస్తోంది.ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలను నిర్లక్ష్యం చేయడంప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. కార్యనిర్వాహక అధికారానికి బయట ఉన్న ఎంపీలు చట్టాలను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే, వీటిపై తగినంత చర్చకు సమయం ఇవ్వకపోవడ వల్ల చట్టసభలో చర్చలు కుదించబడుతున్నాయి.సంసద్ టీవీప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు మరియు ఎంపీలు మాట్లాడినప్పుడు లోక్ సభ అధికారిక టీవీ ఛానల్ సంసద్ టీవీ వారి ముఖాలను చూపకుండా కెమెరా యాంగిల్ను మార్చడం ఒక సర్వసాధారణ ఘటనగా మారింది. ఇది పార్లమెంటరీ కార్యకలాపాల పారదర్శకతను దెబ్బతీస్తుంది. సభా కమిటీకమిటీల ఏర్పాటు మరియు ఛైర్మన్ నియామకంపై ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.సంప్రదింపుల కమిటీ సమావేశాలు: సంప్రదింపుల కమిటీ సమావేశాలు క్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే, అనేక కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా క్రమం తప్పకుండా సమావేశం కావడం లేదు.ఈ పరిణామాలు తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యాయి మరియు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ సవరణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. పార్లమెంటరీ న్యాయం, పారదర్శకత, పార్లమెంటరీ ప్రమాణాలకు కట్టుబడటాన్ని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేము తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. -
హైదరాబాద్కు దగ్గరలో అద్భుతమైన కోట
భువనగిరి: హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా అనేక పోరాటాలకు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ చెక్కు చెదరని నిర్మాణంగా ఉంది. సముద్ర మట్టానికి 610 మీటర్ల ఎత్తులో ఏకశిలా రాతిగుట్టపై నాటి రాజులు కోట నిర్మించారు. కోట కింది భాగంలో గుర్రాల కోసం కొట్టాలు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ధాన్యాగారాలు, సైనికుల కోసం సైనిక గారాలున్నాయి. రాజ భవనాల కింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలున్నాయని స్థానికులు చెబుతుంటారు. చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రసాదాలు, కాకతీయ శైలిలో అనేక శిలాకృతులను చెక్కారు.త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరుతో.. కాకతీయుల కాలంలో భువనగిరి కోట (Bhuvanagiri Fort) ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య ఖిల్లాపై కోట నిర్మించారు. అతని పేరుమీదుగా దీనికి త్రిభవనగిరి (Tribhavanagiri) అనే పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరిగా మార్పు చెందింది. అలాగే త్రిభువనమల్లుకి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారని అరణ్యంలో తీగలతో కప్పబడి ఉన్న ఈ కొండ కోట నిర్మాణానికి అనుకూలంగా ఉందని భావించి దర్గం నిర్మించారు. దీంతో స్థానికులైన బోనయ్య గిరమ్మ దంపతుల పేరుగానే ఈ పట్టణానికి భువనగిరిగా పేరు వచ్చిందని మరో కథనం కూడా ఉంది.ఈ కోట పరిసర ప్రాంతాల్లో మధ్యరాతియుగం, నవీన శిలాయుగం, మధ్య పాతరాతియుగం నాటికి చెందిన బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. భువనగిరి కోట కొంతకాలం కుతబ్షాహీల పరిపాలనతో కూడా ఉంది. 1687లో మొఘలులు (Mughal Empire) గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట కొంత కాలం మొఘలుల పాలనలోకి వెళ్లింది. అనంతరం కల్లు గీత కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvayi Papanna) 1708లో ఓరుగల్లును గెలుచుకొని తర్వాత భువనగిరి కోటను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఖిల్లాపై చెక్కుచెదరని నిర్మాణాలు భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇది గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. అండాకారపు ఏకశిలాపర్వతం గల కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలుగా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది.ఏనుగుల మోట వాగులు, బైరవకొలను, సప్త కన్యలు అనే పేరుతో నీటి కొలనులు ఉన్నాయి. దిగుడు మెట్ల బావులు, వంట గదులు, అశ్వ శాలలు, ఎనిమిది దిక్కుల్లో ఫిరంగులున్నాయి. ఖిల్లాపైన మూడు అత్యవసర ద్వారాలున్నాయి. ఇందులో రెండు మూసుకుపోగా ఒకటి మాత్రం నామమాత్రంగా ఉంది. శిలాశాసనాలు, దేవాలయాలకు చెందిన శిథిలాలు కూడా ఉన్నాయి. కొండ మధ్య భాగంలో మండపంతో పాటు ఖిల్లా చుట్టూ రక్షణ గోడలలో మూడు అంచెలలో ఎలాంటి మట్టి లేకుండా పూర్తిగా రాతితోనే నిర్మించారు. సందర్శకుల సందడి.. భువనగిరి ఖిల్లాను సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఇందులో ప్రధానంగా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఖిల్లాలో సందర్శకులతో సందడి కనిపిస్తుంది. భువనగిరి ఖిల్లాను అ మెరికా, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, బ్రిటన్, దేశాలకు చెందిన వారితో పాటు దేశంలోనే అన్ని రాష్టాలకు చెందిన వారు కూడా సందర్శిస్తుంటారు. చారిత్రక చరిత్ర కలిగిన ఖిల్లాపై ఎన్నో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించారు. ఖిల్లా అభివృద్ధికి చర్యలు భువనగిరి ఖిల్లా అభివృద్ధికి 2024లో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద రూ.118 కోట్లు కేటాయించింది. ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చిన కేంద్రం ప్రభుత్వం తిరిగి ఖిల్లా అభివృద్ధికి మొదటి విడత కింద రూ.58 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఖిల్లాపై రోప్ వేతో పాటు కింది భాగంగా బీటీ రోడ్డు, ఖిల్లాపై విశ్రాంతి ప్రదేశాలు, పార్కులు, ఆట సామగ్రి, కింది భాగంలో పార్కింగ్ కోసం ప్రదేశాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ కాంతులు వెదజల్లేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం వంటి వాటిని ప్రణాళిక కింద తీసుకున్నారు. ఈ అభివృద్ధి పనులను చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి చేపట్టేందుకు టెండర్లు దశలో ఉన్నాయి.చదవండి: అద్భుతం కోరుట్ల మెట్లబావి.. రాతి స్తంభాల కింద సొరంగం -
యాదగిరిగుట్టలో బైక్పై వెళ్తున్న భక్తుడికి తగిలిన మాంజా దారం
-
భువనగిరిలో బీఆర్ఎస్ ధర్నా ఉద్రిక్తం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేకువజాము నుంచే పోలీసులు పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్లో రాత్రి పొద్దుపోయే వరకు నిర్బంధించారు. సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేత కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్, ఎస్ఎస్యూఐ కార్యకర్తలు.. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ భువనగిరిలోని వినాయక చౌరస్తా వద్ద ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి బీఆర్ఎస్ నేతలు భువనగిరికి చేరుకుని మూడు చోట్ల ధర్నాలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పైళ్ల శేఖర్రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు ఒక్కసారిగా ధర్నాకు దిగారు.దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించాయి. అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అశ్వికదళంతో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో గస్తీ నిర్వహించారు. పోలీసుల తీరుపై పైళ్ల శేఖర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు భువనగిరిలో వినాయక చౌరస్తా వద్ద నిర సన తెలుపుతున్న వల్లపు విజయ్ను పో లీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు చెప్పారని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. -
బీఆర్ఎస్ కార్యాలయంపై NSUI కార్యకర్తల దాడి
-
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది’
యాదాద్రి: భువనగిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాడిగా ఆమె ఆరోపించారు. ‘ కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేస్తున్నారు. ఏఐసీసీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్కి దుకాన్ ఒక బూటకం. కాంగ్రెస్ది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణం. కాంగ్రెస్ యువజన విభాగం గూండాల విభాగంగా మారింది. కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనం. కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి.భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరు’ అని కవిత హెచ్చరించారు.కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా తీవ్రంగా మారింది. . భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే: కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు: కేసీఆర్ -
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
-
భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
సాక్షి, భువనగిరి: బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.కాగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కార్యాలయం భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామంటున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి దుర్మరణం
భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చంపాపేట్కు చెందిన బైగళ్ల జగన్ భార్య పావని(30), కుమార్తె సాత్విక, కుమారుడు ప్రణయ్(2)తో కలిసి శుక్రవారం ఉదయం బైక్పై యాదగిరిగుట్ల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి యాదగిరిగుట్ట నుంచి నగరానికి తిరిగి వస్తుండగా భువనగిరి మండల పరిధిలోని హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై దీప్తి హోటల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణయ్తో పాటు స్వల్పంగా గాయపడిన జగన్, సాతి్వకను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సెలవు రోజు కావడంతో.. జగన్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నాడు. వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరిలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం రాయగిరి చెరువు వద్ద సంతోషంగా గడిపిన వారు భోజనం చేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.భక్తులతో కిటకిట.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు... – అలంపూర్ జోగులాంబ దేవాలయం – బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం – వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం – కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం – యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం – చిలుకూరు బాలాజీ దేవాలయం – ఖర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం – ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిరుపతి ఫీల్ ఉంది..కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ -
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
సాక్షి, యాదాద్రి: ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, తొలిసారి పాగా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపు కోసం పోరాడుతోంది. సీపీఎం మాత్రం లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యేరసవత్తర పోరు సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున చామల కిరణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లే‹Ù, సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పోటీలో ఉన్నారు. బూర నర్సయ్యగౌడ్ బీజేపీబీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి బూరభువనగిరిలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో బీజేపీలో చేరారు. తొలి విడతలోనే బీజేపీ టికెట్ సంపాదించారు. ప్రధాని మోదీ చరిష్మాతోపాటు తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చెప్పుకోదగ్గ ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో రాబట్టుకోలేకపోయింది. గౌడ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, బీసీ నినాదం, బీఆర్ఎస్ లోని పాత పరిచయాలతో క్రాస్ ఓటింగ్, మాదిగ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్సామాజికవర్గ సమీకరణలో క్యామ మల్లేష్రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్ బీఆర్ఎస్లో చేరారు. క్యామ మల్లేష్ది గొల్లకుర్మ సామాజికవర్గం. కేసీఆర్ చరిష్మా, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రచారాన్ని సాగిస్తున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జనగామలో తప్ప, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలను ఎండగడు తూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై అధికంగా ఆధారపడ్డారు. దీనికితోడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసివస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. గులాబీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్కోమటిరెడ్డి ఆధ్వర్యంలో చామల కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపు బాధ్యతలను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. కోమటిరెడ్డి సోదరులను గెలిపించిన భువనగిరి ప్రజలు తన సోదరుడులాంటి చామలను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. తన సామాజికవర్గ ఓట్లు, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఇస్తోంది. సెమీ అర్బన్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ స్థానం పరిధి సెమీ అర్బన్గా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, ఆలేరులోని కొంతప్రాంతం హెచ్ఎండీఏలో ఉంది. జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంతంగా మాత్రంగానే ఉంది. హైదరాబాద్కు ఈస్ట్కు శివారులో ఉన్నా, ప్రగతి మాత్రం వెనుకబడి ఉంది. పోటీలో సీపీఎం రాష్ట్రం మొత్తంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక లోక్సభ నియోజకవర్గం భువనగిరి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వివిధ వర్గాల కారి్మకుల ఓట్లపై కన్నేసింది. ప్రభావితం చేసే అంశాలు పెండింగ్ రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారుల విస్తరణ జాప్యం కాళేశ్వరం భూసేకరణలో కోల్పోయిన భూములకు పరిహారం చేనేత కార్మికుల, ఐటీ కారిడార్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు టూరిజం, డ్రైపోర్టు, ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం గౌడ, గొల్లకుర్మ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు 2019 లోక్సభ ఎన్నికల ప్రధానపార్టీల అభ్యర్థుల ఓట్లు ఇలా... కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్) 5,32,795 (44.37 శాతం) బూరనర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) 5,27,576 (43.94 శాతం) పీవీ శ్యాంసుందర్రావు (బీజేపీ) 65,451 (5.45 శాతం) -
స్వర్ణగిరి : తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.... ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినిలు వారు ఉండే హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా.. -
మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం
బీబీనగర్: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జెడ్పీ చైర్మన్తో వాగ్వాదం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్రెడ్డి డౌన్డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు. -
భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం
భువనగిరిటౌన్/నేరేడుచర్ల: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు నెగ్గాయి. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కోల్పోయింది. భువనగిరి మున్సిపాలిటీలో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులతో కలిసి సొంత పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 36 మంది సభ్యులుండగా మంగళవారం నిర్వహించిన అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి 31 మంది హాజరయ్యారు. 16 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. వీరంతా చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం కూడా నెగ్గింది. ఈ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. మొదట బీఆర్ఎస్కు ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా.. వైస్ చైర్పర్సన్ రాజీనామా చేయడంతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు చైర్మన్తో కలిసి ముగ్గురు, సీపీఎంకు ఒకరు, కాంగ్రెస్కు పది మంది సభ్యులున్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాస సమావేశానికి చైర్మన్ మినహా అందరూ హాజరయ్యారు. చైర్మన్పై అవిశ్వాసానికి మద్దతుగా 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. -
‘కారు’ వెళ్లింది.. సర్వీసింగ్కే..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు ఓటమి కొత్తకాదని, ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు విరామమెరుగకుండా పనిచేసిన కారు మరింత స్పీడ్గా పనిచేసేందుకు సరీ్వసింగ్కు మాత్రమే పోయిందని, షెడ్డులోకి పోలేదంటూ బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదనీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడానికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం జరగలేదని, ఇతర పార్టీల నుంచి వ న వారికి సరైన గుర్తింపును ఇవ్వలేకపోయామనీ, అందుకు కూడా తనదే పూర్తి బాధ్యతన్నారు. పది రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా జరిగిన సమీక్షల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా గుర్తించిన కారణాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన భువనగిరి లోక్సభ సెగ్మెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఓటరుకు, కార్యకర్తకు మధ్య లింకు తెగింది ‘నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, గత పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆరి్ధక పరిస్థితిని కూడా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి పథకాలకు నడుమ కార్యకర్తల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికే ప్రయోజనం చేకూరడంతో ఓటరుకు, కార్యకర్తకు నడుమ లింకు తెగిందని పలువురు నేతలు చెప్పారు. ‘ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చి నా, ప్రతీ నియోజకవర్గంలో 15వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేక పోయాం. వందలో ఒకరికి రేషన్కార్డు రాకున్నా నెగెటివ్ ప్రచారం జరిగింది. దళితబంధు కొందరికే రావడంతో అర్హత కలిగిన ఇతరులు అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారు. దళితబంధు ఇవ్వడంపై ఇతర కులాల్లో వ్యతిరేకత ఏర్పడింది’ అని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. ‘రైతుబంధు అందరికీ వర్తింప చేసినా ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూస్వాములకు లబ్ధి జరగడాన్ని సామాన్య రైతు ఒప్పుకోలేదని తేలింది. పార్టీ పట్ల ప్రజల్ల నెలకొన్న వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే అధికారానికి దూరమైనట్లు విశ్లేషణలో తేలింది’ అని కేటీఆర్ వెల్లడించారు. సమీక్షల్లో భాగంగా వస్తున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్కు నివేదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు బీఆర్ఎస్ను ఓడించడం ద్వారా ప్రజలు తప్పు చేశారంటూ అక్కడక్కడా పార్టీ నాయకులు అంటున్నారు. రెండు పర్యాయాలు మనల్ని గెలిపించింది ప్రజలే. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’అని కేటీఆర్ పార్టీ నేతలకు హితవు పలికారు. ’’సంయమనం పాటించాలని కేసీఆర్ సూచించినా కాంగ్రెస్ బీఆర్ఎస్ను రెచ్చగొట్టి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ వేదికగా మన నేతలు కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరు.ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, నష్టపోతున్న ఆటో డ్రైవర్ల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలి.’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు ‘‘బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశాయి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారు. అమిత్ షాతో రేవంత్ భేటీ తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ పద్ధతి మారింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా నిరాశ తప్పలేదు. రాజకీయం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోంది. మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిలో పంచితే గెలిచే వాళ్లమేమో. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘనలు సీరియస్గా తీసుకుంటూ తప్పుడు కేసులు ఎదుర్కొంటాం’ అని కేటీఆర్ వెల్లడించారు. -
భువనగిరి మున్సిపాలిటీలో కుంభం అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం
-
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
-
భువనగిరిలో కాంగ్రెస్ ప్రచారం
-
Sridevi Ashala: స్వానుభవమే పెట్టుబడి
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్లోని హయత్నగర్లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్గా రాణిస్తున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్, ఫాస్ట్ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం. పరిశోధన అంతా ఇంట్లోనే.. అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను. అడిగినవారికి తయారీ.. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది. వేరే రాష్ట్రం కావడంతో.. సాప్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను. నెలకు 20 లక్షల టర్నోవర్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్ను రన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి. – నిర్మలారెడ్డి -
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్లో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
3 కోట్ల విలువైన భూమి.. మేము బ్రతికి కూడా వేస్ట్.. ఎమోషనల్ అయిన రైతులు
-
భువనగిరి ఖిలాను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
భువనగిరి: భువనగిరి ఖిలాను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఖిలాపై చారిత్రాత్మాక కట్టడాలు, నీటి కొలనులు, నిర్మాణాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఏకశిలపై నిర్మించిన కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని, భావితరాలకు తెలియజేసేందుకు శిథిలం కాకుండా పరిరక్షించుకోవాలని సూచించారు. ఖిలా రాక్ క్లైలైంబింగ్కు అనువుగా ఉందని, ఇక్కడ శిక్షణ పొందినవారు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతారోహణ చేయడం మంచి పరిణామం అన్నారు. అనంతరం న్యాయమూర్తి కుమార్తెలు రాక్ క్లైలైంబింగ్, జిప్లైన్ చేశారు. జస్టిస్ రాధారాణి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత ఉన్నారు. -
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. అక్కడ మాత్రం!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూర్తయింది. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మించటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అధికారులు సర్వే పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ ప్రకారం హద్దులు నిర్ధారించారు. అలైన్మెంట్ ప్రకారం జెండాలు కట్టిన కర్రలు పాతారు. సర్వే నంబర్ల వారీగా రైతుల సమక్షంలో వారి వివరాలను రికార్డు చేశారు. ఆ రెండు చోట్ల తీవ్ర నిరసనలు.. రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియకు కోసం ఎనిమిది ‘కాలా’ (కాంపిటెంట్ అథారి టీస్ ఫర్ లాండ్ అక్విజిషన్) లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారులు అన్ని విభాగాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే భువనగిరి కాలాకు సంబంధించి సర్వే అసలు జరగలేదు. ఇక్కడ రైతులు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పలు ప్రాజెక్టులకు భూమి ఇచ్చినందున మరోసారి భూమిని కోల్పేయే ప్రసక్తే లేదంటూ ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అలాగే సంగారెడ్డి పట్టణం సమీపంలోని గ్రామాల రైతులు కూడా అధికారులను సర్వే చేయనివ్వలేదు. సంగారెడ్డిని దాదాపు ఆనుకుని ఉన్నందున తమ భూములకు ఎక్కువ ధర ఉందని, అయితే పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భూములు ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్నారు. భువనగిరి కాలా పరిధిలో 22 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే జరగలేదు. సంగారెడ్డి కాలా పరిధిలో 8 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులతో చర్చించి, సర్వే జరపాలని అధికారులు భావిస్తున్నారు. కుదరని పక్షంలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. -
Anvitha Reddy: ‘మనాస్లు’ పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో రికార్డ్ సృష్టించారు. నేపాల్లోని ఎత్తయిన మనాస్లు పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణ కోసం ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ నుంచి నేపాల్ బయలుదేరి వెళ్లిన అన్వితారెడ్డి... సెప్టెంబర్ 11న మనాస్లూ బేస్ క్యాంప్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత పైభాగానికి 28వ తేదీ రాత్రి చేరుకొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా అన్వితారెడ్డి చరిత్ర సృస్టించారు. మనాస్లు... ప్రపంచంలోనే ఎనిమిదో ఎత్తయిన పర్వతం కావడం విశేషం. ఇప్పటికే పలు పర్వతాలను అధిరోహించిన అన్వితారెడ్డి.. మేలో ఎవరెస్టును, 2021 జనవరిలో ఆఫ్రికాలోని కిలిమంజారోను, ఫిబ్రవరిలో ఖడే, డిసెంబర్లో యూరప్లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో అన్వితారెడ్డి పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. పట్టణంలోని పడమటి మధుసూదన్రెడ్డి, చంద్రకళ దంపతుల కుమార్తె అయిన అన్విత... ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. -
మటన్ ముక్కలు.. డీజే పాటలు!.. రెండు పెళ్లిళ్లు.. రెండు వివాదాలు
సాక్షి, భువనగిరి క్రైం: ఒకచోట పెళ్లి విందులో మటన్ ముక్కల విషయమై గొడవ.., మరొకచోట వివాహానంతరం బారాత్ సమయంలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం కడీలబాయి తండాకు చెందిన యువతితో చండూరు మండలం సర్వయితండాకు చెందిన యువకుడి వివాహం గురువారం ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. కాగా పెళ్లి తర్వాత ఇచ్చిన విందులో మాంసం కూర వడ్డించే క్రమంలో వివాదం మొద లైంది. అదికాస్తా ముదరడంతో అమ్మాయి, అబ్బా యి తరఫు వారు ఘర్షణకు దిగి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండువర్గాల బంధువులు ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్స్టేషన్ వద్ద కూడా గొడ వపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిలో ఉన్న ఓ సర్పంచ్పై ఎస్ఐ వెంకటేశ్ అనుచితంగా ప్రవర్తించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏసీపీ ఉమామహేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇక హైదరాబాద్కు చెందిన ఓ అబ్బా యి వివాహం భువనగిరికి చెందిన అమ్మాయితో పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. పెళ్లి అనంతరం బారాత్లో డీజే పాటలతో డ్యాన్స్ చేస్తున్న క్రమంలో వివాదం తలెత్తింది. ఇరువర్గాల బంధువులు తమకు నచ్చిన పాటే పెట్టాలని ఒకరినొకరు తోసుకున్నారు. కాసే పటి తర్వాత అబ్బాయి తరఫు వారు బస్సులోకి ఎక్కేందుకు వెళ్లగా అక్కడ వేచి ఉన్న అమ్మాయి తరఫు వారు ఇటుకలతో దాడి చేశారు. దీంతో కూరడి ఈశ్వర్, దొంతరబోయిన స్వామిశేఖర్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కర్రలతో దాడి చేయడంతో అబ్బాయి తరఫు వారి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. చదవండి: Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్పై వెళ్తుండగా -
భువనగిరిలో కిడ్నాప్.. సింగరాయకొండలో పట్టివేత
సింగరాయకొండ: తెలంగాణలోని భువనగిరిలో కిడ్నాప్ అయిన బాలుడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దాల మహేష్ తెలంగాణలోని జనగాం మండలం భువనగిరి పట్టణానికి బేల్దారి పని కోసం వెళ్లాడు. 10 రోజుల క్రితం మహేష్ స్వగ్రామానికి వచ్చేప్పుడు మూడేళ్ల బాలుడిని వెంట తీసుకొచ్చాడు. బుధవారం మహేష్ బాలుడిని తన తమ్ముడు రమేష్ వద్ద వదిలి ఊరికి వెళ్లటానికి ప్రయత్నించగా.. అందుకు రమేష్ నిరాకరించడంతో వీరిద్దరి మధ్య వాదులాట జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. మహేష్ తను పనిచేస్తున్న చోట బాలుడిని కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తరువాత స్వగ్రామానికి తీసుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు. -
రామకృష్ణ హత్య కేసులో మరో ఏడుగురి రిమాండ్
భువనగిరి క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో మిగిలిన ఏడుగురు నిందితులను మంగళవారం రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ప్రమేయంఉందని భావిస్తున్న మొత్తం 11మందిలో సోమవారం నలుగురిని రిమాండ్కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న మిగతా ఏడుగురు ఏ1 పల్లెపాటి వెంకటేశం, ఏ2 దోర్నాల యాదగిరి(బీబీనగర్ పీఎస్లో హోంగార్డు), ఏ3 దంతూరి రాములు, ఏ8 మహ్మద్ సిద్దిఖీ, ఏ9 తోట్ల ధనలక్ష్మి, ఏ10 తోట్ల నరేందర్, ఏ11 తోట్ల భానుప్రకాశ్లను విచారించారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు. -
రామకృష్ణది పరువు హత్య కాదు
భువనగిరి క్రైం/గజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణది పరువు హత్య కాదని, ఆస్తి తగాదాల హత్యగానే భావిస్తున్నట్లు భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. హత్య కేసులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏ1గా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం, ఏ2గా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల యాదగిరి (బీబీనగర్ పీఎస్లో హోంగార్డు), ఏ3గా వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన దంతూరి రాములు, ఏ4గా మోత్కూర్కు చెందిన సయ్యద్ లతీఫ్, ఏ5గా సిద్దిపేట జిల్లా యెల్లారెడ్డి నగర్కు చెందిన గోలి దివ్య, ఏ6గా సిద్దిపేట జిల్లా ఇందిరా నగర్ కు చెందిన మహ్మద్ అప్సర్, ఏ7గా సిద్దిపేట జిల్లా నర్సాపూర్కు చెందిన పొలసం మహేశ్, ఏ8గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మహ్మద్ సిద్దిఖీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్లను ఏ9, ఏ10, ఏ11 నిందితులుగా పేర్కొన్నారు. సోమవారం సయ్యద్ లతీఫ్, గోలి దివ్య, మహ్మద్ అప్సర్, పొలసం మహేశ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగతా ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ చెప్పా రు. నిందితుల నుంచి ఓ బొమ్మ పిస్టల్, రెండు కొడవళ్లు, సుత్తి, రూ.లక్ష నగదు, ఇండికా కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జమ్మపురం సర్పంచ్ అమృతరావును సాక్షిగా పేర్కొన్నారు. నిమ్మతోటలోకి తీసుకెళ్లి.. భూమిని చూపించడానికి జమ్మపురం సర్పంచ్ అమృతరావు ఈ నెల 15న రామకృష్ణను భువనగిరి పట్టణంలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లారు. అమృతరావుతో వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో భార్గవి 16న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమృతరావును పోలీసులు విచారించగా లతీఫ్ అతని అనుచరులు రామకృష్ణను గుండాల మండలం రామారంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లి తాడుతో కట్టి సుత్తి, బండ రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారని చెప్పినట్టు ఏసీపీ తెలిపారు. శవాన్ని గోనె సంచిలో కట్టి టాటాబోల్ట్ కారులో పెట్టి అమృతరావును కూడా ఎక్కించుకుని బయలుదేరారని, కిలోమీటరు దూరం వచ్చాక అతన్ని అక్కడే వదిలేశారని, ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు సిద్దిపేటకు వెళ్లినట్లు తెలిపారు. అమృతరావు సమాచారం మేరకు లతీఫ్, అతని భార్య దివ్య, మహేశ్, అప్సర్ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు చెప్పారు. ఆస్తి కోసం మామను బెదిరించడంతో.. కొంతకాలం కిందట రామకృష్ణ ఉద్యోగం పోవడంతో మామ వెంకటేశంను ఆస్తిలో భాగం ఇవ్వాలని, లేకపోతే కోర్టులో కేసు వేస్తానని రామకృష్ణ బెదిరించాడని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశం రామకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడని ఏసీపీ తెలిపారు.హోంగార్డు యాదగిరి ద్వారా రూ.10 లక్షలకు లతీఫ్తో సుపారీ మాట్లాడుకుని రూ.6 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారన్నారు. గుండాల మండలం రామారంలో దారుణంగా హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం గ్రామంలోని కొండపోచమ్మ దేవాలయం దగ్గరలోని గోతిలో పాతిపెట్టారన్నారు. విచారణలో ఈ విషయాన్ని పోలీసులకు లతీఫ్ తెలపగా వెంటనే అక్కడికెళ్లి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు. తల, మెడ భాగాల్లో తీవ్రగాయాలు రామకృష్ణ తలకు తీవ్ర గాయమైందని, మెడ చుట్టూ ఉరేసినట్టు స్పష్టమైన గాయం కనిపిస్తోందని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించారు. నుదుటిపై, తల వెనుకభాగంలో గాయాలున్నాయన్నారు. చెవులు, ముక్కులోంచి రక్తం వచ్చిందని.. వీపు వెనుక కూడా గాయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మూత్రం పోసే నాళం వద్ద కూడా బలమైన గాయం కనిపించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి తీసుకెళ్లారు. 6 నెలల పసికందు, భార్గవికి అన్యాయం చేశారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
20 మంది టీంలో ఐదుగురు చనిపోయారు.. అయినా..
సాక్షి, హైదరాబాద్: శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి నిలిచింది. పర్వతారోహణ పూర్తిచేసి నగరానికి చేరుకున్న ఆమెను గూడూరి నారాయణరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణరెడ్డి సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తున్నానని, ఇప్పటివరకు కిలిమంజారోతో పాటు మరో నాలుగు పర్వతాలు అధిరోహించానని తెలిపింది. నవంబర్లో యూకే నుంచి వచ్చిన 20 మంది ఉన్న టీంలో ఐదుగురు చనిపోయారని అయినా పట్టుదల వీడక తాను, తన గైడ్ చతుర్ ముందుకు వెళ్లామన్నారు. తనతో పాటు వచ్చిన చాలామంది వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. (చదవండి: జూబ్లీహిల్స్వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని..
భువనగిరి: మనస్తాపానికి గురై చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని రాయగిరి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లోని లాలాపేటకు చెందిన బసవరాజు, భారతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో గీతారాణి (34) ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చదవండి: ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’ వరంగల్ కాజీపేటకు చెందిన టి. విజయ్కుమార్తో గీతారాణికి గతంలో నిశ్చితార్ధం అయ్యింది. డిసెంబర్ 9, 2020న పెళ్లి తేదీ నిర్ణయించారు. కాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అబ్బాయి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి గీతారాణి డిప్రెషన్లోకి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం బ్యాంక్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుల్దేరిన గీతారాణి సాయంత్రం 4 గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చదవండి: రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి కాగా రాత్రి భువనగిరిలోని రాయగిరి చెరువు కట్ట మీద యువతి చెప్పులు, ఆధార్కార్డు పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధార్కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. గురువారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టగా, చివరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహయంతో మధ్యాహ్నం చెరువులో నుంచి గీతారాణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు. -
మాకొక అండర్ పాస్ కావాలి
-
కేసీఆర్ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని పాలించాలని, ప్రజలను ఇబ్బందులు పెడుతే చూస్తూ ఉరుకొమని, గాడిల పాలనను బద్దలు కొడుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా పిచ్చి తుగ్లక్ పాలనకు స్వస్తి పలకాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్పైన ప్రజల పక్షాన కోర్టులో ఫీల్ దాఖలు చేశానని, ఎల్ఆర్ఎస్ రద్దు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం కాదు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం నీకు(కేసీఆర్) సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. శ్వాశతంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చెయాలి లేకపోతే కేసీఆర్, టీఆర్ఎస్ను శాశ్వంతంగా ప్రజలు రద్దు చేస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టవద్దన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్నారు. కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్లు అని దాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నావని ఫైర్ అయ్యారు. మూడు నెలలు రిజిస్ట్రేషన్ల్ అపీ ప్రజలను ఇబ్బంది పెట్టవని విరుచుకుపడ్డారు. నియంత్రణ వ్యవసాయం అని మళ్లీ రద్దు చేశామని, కేసీఆర్ నిర్ణయలను చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారని అన్నారు. బుర్ర దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకో అని హితవు పలికారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులపైన ప్రేమ పుట్టుకచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తావు, ఇక కేసీఆర్ అబద్దాలకు స్వస్తి పలకాలన్నారు. రైతులకు ఉచిత ఎరువులు అని రైతులకు శుభవార్త వారం రోజుల్లో చెబుతానన్నది ఏం అయిందని ప్రశ్నించారు. సకల జనులను ఏకం చేసి తెలంగాణ కోసం చేసిన ఉద్యమం కంటేని పెద్ద ఉద్యమం చేస్తామని కేసీఆర్ నియంత పాలనకు చరమగితం పాడుతామని, కేసీఆర్ను గద్దెదించుతామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. -
దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ
సాక్షి, భువనగిరి: దుబ్బాక ఉప ఎన్నికలు స్వేచ్చగా.. పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను పంపాల్సిందిగా కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు శుక్రవారం లేఖ రాశారు. టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని... మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని, ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని కూడా పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. అంతేగాక రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. అదే విధంగా ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి -
యాదాద్రి: భువనగిరిలో విషాదం
-
'మొబైల్ యాప్స్ ఆరోగ్యస్థితిని గుర్తించలేవు'
సాక్షి, భువనగిరి : ' మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, హార్ట్ బీట్ మొదలైనవి చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగకరంగా ఉంది అంటూ నమ్మిస్తున్నారు. అయితే మొబైల్ యాప్స్ ఎలాంటి ఆరోగ్య స్థితి, ఆనారోగ్యం, బీపీ , పల్స్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించలేవు' అంటూ జిల్లా ఎస్పీ బాస్కరన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కరోనా సంక్షేమ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ చూపుడు వేలు వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించగలగాలి. గూగుల్ పే వంటి యాప్స్ డౌన్లోడ్ చేయగానే ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి.అయితే మన వేలిముద్రలను హ్యకర్లు దొంగలించే అవకాశం ఉంది. బ్యాంక్ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది హ్యాకర్లు ఇట్టే పసిగడతారు.ఇలాంటి యాప్స్తో జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్లోడ్ చేయవద్దు.' అంటూ పేర్కొన్నారు. -
అమ్మను రోడ్డున పడేశారు
భువనగిరి: వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి నిర్దయగా రోడ్డున పడేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడం సమీపంలో నివాసం ఉంటున్న 77 ఏళ్ల కిష్టమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆదివారం ఆమె కుమారుడు, కోడలు కలసి వృద్ధురాలి వద్ద ఉన్న రూ.40 వేలు తీసుకొని ఆమెను భువనగిరి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వదిలివెళ్లారు. దిక్కుతోచక బస్టాండ్ సమీపం లో రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలికి భోజనం అందజేశారు. ప్రస్తుతం వృద్ధురాలు బస్టాండ్ వద్దనే నాలుగు చక్రాల బండి కింద ఉంది. వృద్ధురాలిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్తో విషెస్
సాక్షి, హైదరాబాద్: నూతన వధూవరులను వీడియో కాలింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ శుక్రవారం ఉమారాణిని పెళ్లి చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్కుమార్ విజ్ఞప్తి చేశారు. (ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకు వచ్చాం..) -
జార్జియా దేశంలో చిక్కుకున్న భువనగిరి వాసి
-
లాటరీలో వరించిన విజయం..
సాక్షి, మోత్కూరు : భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన మోత్కూరు మున్సిపాటిటీ ఓట్ల లెక్కింపులో 7వ వార్డు ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపింది. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్కు వచ్చాయి. 7వ వార్డు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చి టై అయ్యింది. 7వ వార్డులో అత్యధికంగా 8మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నాగార్జునరెడ్డి మధ్యే పోటీ జరిగింది. 1,104 ఓట్లకు గాను 1,001 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒక పోస్టల్ బ్యాలెట్, 2 ఓట్లు నోటాకు పోలయ్యా యి. లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సావిత్రికి 378 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జునరెడ్డికి 377 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కాంగ్రెస్కు పడటంతో ఇద్దరికి సమానంగా 378 ఓట్లు రావడంతో టై అయ్యింది. దీంతో అభ్యర్థులు మళ్లీ కౌంటింగ్ చేయాలని కోరడంతో అధికారులు లెక్కించగా అవే ఓట్లు వచ్చాయి. సుమారు రెండు గంటలకు పైగా ఫలితం ఎటూ తేలకపోవడంతో కౌంటింగ్ హాల్ లోపల ఉన్న అభ్యర్థులతో పాటు బయట ఉన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చివరికి అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతను ప్రకటించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు అంగీకరించారు. దీంతో ఒక్కో అభ్యర్థి పేరుతో 5 చీటీలు మొత్తం 10 చీటీలు రాసి లాటరీ తీశారు. లాటరీలో తీపిరెడ్డి సావిత్రి పేరు రావడంతో అధికారులు ఆమెను విజేతగా ప్రకటించారు. -
ఈ ఫలితాలు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ
సాక్షి, నల్గొండ: అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలివితో ఓటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: నల్గొండ ఎమ్మెల్యే పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని, కేసీఆర్ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు అంటూ విమర్శించారు. కాగా నల్గొండలో కాంగ్రెస్ నాలుగవ సారి జెండా ఎగరవేసిందని, హైదరాబాదుకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సోదరులు కాంగ్రెస్ను అక్కున చేర్చుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. -
పుర పోరులో ‘రియల్ ఎస్టేట్’ దూకుడు!
సాక్షి, యాదాద్రి : డబ్బుంది.. పలుకుబడి ఉంది.. కావాల్సిందల్లా అధికారమే..! అందుకోసమే ఎంతఖర్చయినా సిద్ధమే.!! మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూకుడు పెంచారు. ఎలాగైనా పార్టీ టికెట్ దక్కించుకొని చైర్మన్గిరి పట్టాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో హెచ్ఎండీఏ పరిధిలో భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, వైటీడీఏ పరిధిలో యాదగిరిగుట్ట, భువనగిరి, జాతీయ రహదారి వెంట ఆలేరు మున్సిపాలిటీ ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అనుకూలంగా రిజర్వేషన్ రాని వారు పక్క వార్డుల నుంచి నామినేషన్ వేశారు. అంతేకాకుండా చైర్మన్ గిరిపై కన్నేసి ఇతర వార్డుల్లోనూ తమ అనుకూల వ్యక్తులను పోటీలో దింపేందుకు వారితో నామినేషన్లు వేయించారు. ఖర్చు కూడా వారే భరించనున్నారు. డబ్బుల సంచులతో సిద్ధం వివిధ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టికెట్ కోసం చూస్తున్నారు. తమకు పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నవారు చైర్మన్ గిరిపై కన్నేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ బీసీ జనరల్, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి బీసీ మహిళ, మోత్కూర్ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. అయితే రియల్టర్లు పెద్ద సంఖ్యలో పోటీలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎక్కువ మంది రియల్టర్లు రంగంలోకి దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగడంతో జిల్లాలో పలువురు కోట్ల రూపాయలు గడించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని రూ.2కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈవిషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద చెబుతూ చైర్మన్గిరి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పోటీ తీవ్రం కావడంతో అధికార పార్టీలో చైర్మన్ అభ్యర్థుల పేరు ముందుగా ప్రకటించడం లేదు. గెలిచిన తర్వాత చైర్మన్ పేరు ప్రకటిస్తామని చెప్పడంతో ఎవరికి వారు రేసులో దూసుకుపోతున్నారు. బీసీలకు చైర్మన్ సీటు రిజర్వ్ కావడంతో పోటీదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్లో ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు ముందుకుసాగుతున్నారు. కౌన్సిలర్ స్థానాలకు సైతం.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలవడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగారు. భువనగిరి మున్సి పాలిటీలో అధికార పార్టీ మెజార్టీ సీట్లను కొత్తవారికి కేటాయించడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీలో సైతం డబ్బు సంచులతో వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు చే యడానికి వెనుకాడేది లేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు మొండిచేయి చూపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బు లేదన్న కారణంతో చైర్మన్ అభ్యర్థులతో పాటు కౌన్సిలర్లుగా పోటీపడే వారికి కూడా టికెట్లు దక్కడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అందని బీఫారాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులకు ఇంకా ఖరారు చేయలేదు. అధికార పార్టీలో పెద్ద ఎత్తున రెబెల్స్ బెడద ఉండడంతో బీఫారాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. మోత్కూరులో టీఆర్ఎస్ పూర్తి జాబితా ప్రకటించగా.. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో కొందరికి బీఫారాలు ఇచ్చింది. మిగతా వారికి ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. ఎక్కువ మంది పోటీ ఉండటం వల్లే బీ ఫారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అభ్యర్థులు నామినేషన్లు వేసి బీఫారాల కోసం నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా డబ్బు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమేనంటూ టికెట్లు ఆశించే అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నారు. కొందరు పార్టీ పేరుతో నామినేషన్లు వేసినప్పటికీ టికెట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్న ఆశావహులకు అవకాశం కల్పించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. డబ్బు ప్రభావం అన్ని పార్టీల్లో స్పష్టంగా కనిపించడం వెనక రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీకి దిగడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ టికెట్ రాకున్న పోటీ నుంచి తప్పుకునేది లేదని, పోటీలో ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేసి విజయం సాధిస్తామని పలువురు రాజకీయ రియల్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగాలని బావిస్తున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో వరదలా డబ్బు ఖర్చు చేయడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చిన భార్య, కుమారులు -
భార్యే సూత్రధారి..!
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టించుకుంది.. అతడితో జీవితం పంచుకుని నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. క్షణిక సుఖం కోసం మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం కాస్తా భర్తకు తెలియడంతో తాగుబోతు అంటూ నింద వేసి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.అక్కడ యథేచ్ఛగా తన ప్రియుడితో సఖ్యతగా మెలిగింది. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని వెళ్లిన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది. ఇదీ.. ఇటీవల రాజాపేట మండలం దూదివెంకటాపురంలో వెలుగుచూసిన నరేష్ హత్యోదంతం వెనుక ఉన్న కారణాలు. భువనగిరిఅర్బన్ : ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శనివారం తన కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొల్లూరు నరేష్(35)కు రాజపేట మండలం దుదివెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల భాగ్యతో పదిహేడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వీరికి నలుగురు సంతానం. వీరు 13 సంవత్సరాలు కలిసి జీవించారు. ఈ సమయంలో భాగ్యతో మోటకొండూరు గ్రామాని చెందిన వంగపల్లి అయిలయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం నరేష్కు తెలియడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలకు దారితీసిందర్థా క్రమంలో నరేష్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో భాగ్య భర్త తాగుబోతు అంటే నింద వేసి నాలుగేళ్ల క్రితం మోటకొండూరు నుంచి తన తల్లిగారి గ్రామమైన దుదివెంకటపురానికి పిల్లలతో కలిసి వచ్చి ఉంటోంది. వంగపల్లి అయిలయ్యతో వివాహేతర సంబంధం అలానే కొనసాగిస్తోంది. పిల్లలను చూసేందుకు వెళ్లగా.. నరేష్ తన పిల్లలను చూడటానికి ఈ నెల 9వ తేదీన దుదివెంకటాపురం గ్రామానికి వెళ్లాడు. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని భార్యను కోరాడు. అందుకు భాగ్య ఒప్పుకోకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. తదనంతరం రాత్రి సమయంలో ఎక్కవగా మద్యం సేవించిన నరేష్ తన అత్తవారి ఇంటిముందున్న మంచంపై నిద్రపోయాడు. పథకం ప్రకారం.. తన సఖ్యతకు అడ్డొస్తున్నాడనే నెపంతో భాగ్య భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం వెంటనే విషయాన్ని ప్రియుడు అయిలయ్యకు ఫోన్ చేసి తెలిపింది. భర్త మద్యం మత్తులో నిద్రపోయిన విషయాన్ని తెలిపి దూదివెంకటాపురం రావాలని కోరింది. అయిలయ్య గ్రామానికి చేరుకోవడంతో ఇద్దరు కలిసి ఆదమరచి నిద్రపోయిన నరేష్ ముఖంపై భాగ్య దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేయగా అయిలయ్య కాళ్లు, చేతులు పట్టుకున్నాడు. కాసేపటికి నరేష్ ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. తదనంతరం అతడి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. కొల్లూరి నరేష్ను హత్య చేసిన వెంటనే భాగ్య అయిలయ్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారి పోయారు. మృతుడు నరేష్ తల్లి కొల్లూరి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే శనివారం భువనగిరి పట్టణ శివారులో ఉన్న బొమ్మాయిపల్లిలో భాగ్యలక్ష్మి, అయిలయ్య ఇద్దరు ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తామే నరేష్ను హత్య చేసినట్టు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీసీపీ వివరించారు. సమావేశంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, రూరల్ సీఐ అంజనేయులు, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ను బ్రాందీ నగరంగా మార్చారు
భువనగిరి అర్బన్: హైదరాబాద్ను రాష్ట్ర ప్రభుత్వం బ్రాందీ నగరంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో బీజేపీ జిల్లా కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంకారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, మరోవైపు బార్లను తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్రెడ్డి, పోతంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి..
పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ సన్మార్గంలో పయనించాలనే మంచిమాటలు చెప్పాల్సిన వయసులో ఆ వృద్ధుడి బుద్ధి పెడదోవపట్టింది.. వివాహేతర సంబంధాలు పెట్టుకుని కుటుంబంలో చిచ్చురేపాడు.. చివరకు వావి వరసలు కూడా మరిచి పశువులా ప్రవర్తించాడు.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా అతడి తీరులో మార్పు రాలేదు సరికదా ఆగడాలు ఇంకా శృతిమించిపోయాయి. ఈ వయసులో ఇదేం పని నాన్నా అంటూ నిలదీసిన కుమారుడిపైనే కయ్యానికి కాలుదువ్వాడు.. ఆ పెనుగులాటలో కుమారుడు తోసేయగా బండమీద పడడంతో తల పగిలి తండ్రి ప్రాణాలు విడిచాడు.. ఇవీ.. భువనగిరి మండలం బండసోమారంలో వృద్ధుడి హత్యోదంతానికి దారితీసిన కారణాలు. ఉద్దేశపూర్వకంగా చేసినా.. అనుకోకుండా జరిగిన నేరం నేరమే అన్నట్టు చివరకు ఆ వృద్ధుడి కుమారుడు కటకటాలపాలయ్యాడు. భువనగిరి అర్బన్ : వృద్ధుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుమారుడే అతడి మృతికి కారణమని విచారణలో తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన యామల్ల లక్ష్మారెడ్డి(65), రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెం దాడు. కుమార్తె వివాహం చేశాడు. తండ్రి, కుమారులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మాధవరెడ్డికి వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మాధవరెడ్డికి సిరివేణికుంటకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. అందరూ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి.. లక్ష్మారెడ్డి కొన్నేళ్లుగా చెడు తిరుగుళ్లు తిరుగుతూ గ్రామంలో కొందరు మహిళలలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా అతని బుద్ధి మారకపోగా ఇంట్లో ఉన్న కోడలిపైనే కన్నేశాడు. ఈ విషయం కుమారుడు మాధవరెడ్డికి తెలియడంతో తండ్రి కొడుకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తండ్రి వేధింపులు భరించలేక మాధవరెడ్డి గ్రామంలోనే వేరు కాపురం పెట్టాడు. ఆయన తీరుపై గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. దీంతో ఇక నుంచి కోడలిని వేధించనని పెద్ద మనుషుల సమక్షంలో లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. వడ్లు ఆరబోసేందుకు వెళ్లి.. లక్ష్మారెడ్డి గత శుక్రవారం ఉదయం వడ్లు ఆరబోసి వస్తానని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో మాధవరెడ్డి కూడా బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో వడ్లు ఆరబోసిన రామస్వామిగుట్టపై లక్ష్మారెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో సఖ్యతగా ఉండడాన్ని చూశాడు. మాధవరెడ్డిని చూసిన ఆ మహిళ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మాధవరెడ్డి ఈ వయసులో ఇదేం పని ఇక నీవు మారవా అంటూ నిలదీశాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు. ఇద్దరు ఘర్షణ పడగా మాధవరెడ్డి తండ్రిని నెట్టివేశాడు. దీంతో లక్ష్మారెడ్డి వెల్లకిలా బండపై పడడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి మరణించాడని మాధవరెడ్డి అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి వద్దకు వెళ్లి నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడని నమ్మించాడు. తల్లిని ట్రాక్టర్పై ఎక్కించుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. నాన్న ఫోన్ చేయడం లేదని అటూ ఇటూ తిరిగారు. చివరకు బండపై మూలుగు వినిపిస్తోందని అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మారెడ్డి రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. స్థానికుల సాయంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మారెడ్డి మృతిచెందాడు. కేసును ఛేదించారు ఇలా.. బాట విషయంలో భూ పంచాయితీ ఉన్న వారే తన తండ్రిని హత్య చేసి ఉంటారని మాధవరెడ్డి పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేశాడు. అయితే భర్త గురించి బాగా తెలిసిన రాధమ్మ భూ పంచాయితీ ఉన్న వారిపై, కుమారుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మాధవరెడ్డి తండ్రి మరణానికి తానే కారణమని, ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని పెనుగులాటలో కింద పడడంతో మృత్యువాత పడ్డాడని నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటలలోగా ఛేదించిన సీఐ సురేందర్రెడ్డి, ఎస్ఐలు రాఘవేందర్గౌడ్, మధు, ఏఎస్ఐలు పీఎస్ఎన్ ప్రసాద్, వి.సాగర్రావు, కానిస్టేబుల్ ఎం. జాన్, యాకుబ్ఖాన్, కొండారెడ్డి, వేణును డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు సిబ్బంది పాల్గొన్నారు. -
కి‘లేడి’ అరెస్టు
సాక్షి భువనగిరిఅర్బన్(నల్గొండ) : బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా భూదవారిపేటకు చెందిన అక్షింతల సంధ్య అలియాస్ దివ్య టైలరింగ్ పనిచేస్తు జీవనం సాగిచేంది. టైలరింగ్లో డబ్బులు అనుకున్నంతగా రాకోపోవడంతో సంతృప్తి చెందలేదు. అనంతపూర్ జిల్లాకు చెందిన గంట రామస్వామి బ్యాచ్లో చేరి 2010 నుంచి 2016 వరకు చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికురాలిగా నటిస్తు అసలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు అభరణాలను అపహరించేది. ఆమె తన ముఠా సభ్యులతో కలిసి భువనగిరిటౌన్, రూరల్, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆలేరు ములుగు, దేవరకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడింది. గతంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేసి నల్లగొండ జైలు పంపారు. బెయిల్పై తిరిగి బయటికి వచ్చింది. తన గ్రామంలో ఉన్న లలితతో స్నేహం చేసింది. ఇద్దరు కలిసి రద్దీగా ఉండే బస్సుల్లో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకుని హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 21న హైదరాబాద్లోని ఉప్పల్ నుంచి హన్మకొండకు వెళ్తున్న రద్దీగా ఉన్న బస్సును ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్న జి.సూర్యమ్మ, టి. కృష్ణవేణిల పక్కన ప్రయాణికులుగా కూర్చున్నారు. బస్సు భువనగిరి దాటిన తర్వాత బస్సులో రద్దీగా ఉండటంతో సంధ్య సూర్యమ్మ బ్యాగులో ఉన్న 4 గ్రాముల బంగారు చెవి దిద్దులు, లలిత జి.కృష్ణవేణికి చెందిన బ్యాగులో నుంచి నగదును అపహరించారు. వెంటనే బస్సును రాయగిరి వద్ద హడవీడిగా నిలిపి వేసి దిగారు. గమనించిన సూర్యమ్మ, కృష్ణవేణిలు తమ బ్యాగులను చెక్ చేసుకోగా బంగారం, నగదు కనబడలేదు. వెంటనే వారిని పట్టుకోమని తోటి ప్రయాణికులకు చెప్పడంతో సంధ్యను పట్టుకొగా, లలిత పారిపోయింది. అనంతరం సంధ్యను ప్రయాణికులు రూరల్ పోలీస్లకు అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారణ చేపట్టగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించింది. ఆమెనుంచి చెవి దిమ్మెలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కోర్టుకు రిమాండ్కు పంపినట్లు చెప్పారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ సురేందర్రెడ్డిని, ఎస్ఐ రాఘవేందర్గౌడ్ను, సిబ్బందిని అభినందించారు. -
గ్యాంగ్స్టర్ నయీమ్ సోదరి అరెస్ట్
సాక్షి, భువనగిరి: భూ ఆక్రమణలకు పాల్పడిందని అభియోగం మేరకు గ్యాంగ్స్టర్ నయీమ్ సోదరి సలీమాబేగంను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎం.సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పరిధిలోని సర్వే నంబర్ 590, 586లలో భూయాజమాని కె.అభినందన్ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందు విక్రయించాడు. వి.శంకర్చారి ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. 2007 తర్వాత అభినందన్కు చెందిన ఐదెకరాల భూమిని సలీమాబేగం, గ్యాంగ్స్టర్ నయీమ్, అతని గ్యాంగ్ సభ్యుల పేరిట ఎక్కరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎడ్ల వెంకట్రెడ్డికి విక్రయించారు.. ఆ భూమిని వెంకట్రెడ్డి లండన్ టౌన్షిప్ పేరుతో వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించాడు. మొదట కొన్న ప్లాట్ల యాజమానులను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. అదే విధంగా 2006 సంవత్సరంలో భూమి యాజమాని అయిన కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాస్లను బెదిరించి వారికి చెందిన 9 ఎకరాల భూమిని సలీమాబేగం కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆభూమిని కూడా ఎడ్ల వెంకట్రెడ్డికి విక్రయించారు. ఇందులో భాగంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు. భువనగిరి పరిధిలో 14 కేసులు ఆమెపై నమోదైనట్లు చెప్పారు. భువనగిరి డీసీపీ, ఏసీపీ ఆదేశాల మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సలీమాబేగంపై భువనగిరితోపాటు శంషాబాద్, షాద్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోరుట్ల, ఆలేరు, నర్సింగి, ఆదిభట్ల, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో భూములు, ప్లాట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
సాక్షి, భువనగిరి : యాద్రాద్రి జిల్లా భువనగి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరకాల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలు దేరిన బస్సు.. భువనగిరి బైపాస్ రోడ్డు దగ్గరకు రాగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కొంత మంది ప్రయాణికులు కాల్వలో పడిపోయారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..
సాక్షి, భువనగిరి: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బండసోమవారం గ్రామశివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన సుధీర్కుమార్(22) మండల పరిధిలోని బండసోమవారం గ్రామంలో ఓ కోళ్లపారంలో ఏడాదినుంచి పని చేస్తున్నాడు. ఇదే కోళ్లఫారంలో బీహార్కు చెందిన డోలి కుమారి, జ్యోతి, రాజులు బతుకు దెరువు నిమిత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. స్థా నికంగా నివాసం ఉన్నారు. ఒకే కుటుం బానికి చెందిన డోలి కుమార్, జ్యోతి, వారి సొదరుడు రాజు ఒకే గదిలో ఉంటున్నారు. అ గదికి సమీపంలోనే సుధీర్కుమార్ నివా సం ఉండే వాడు. సుధీర్కుమార్, జ్యోతిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా జ్యోతి, ఆమె సొదరుడు రాజు 25 రోజుల క్రితం సొంత గ్రామం ఉన్న బీహార్కు బయాలుదేరి వెళ్లారు. డోలి మాత్రం ఇక్కడే ఉండి పోయింది. బీహర్కు వెళ్లిన జ్యోతికి 10 రోజుల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఇ వివాహానికి సంబంధించిన ఫొటోలను డోలికుమారికి పంపింది. అ ఫొటోలను చూసిన సుధీర్కుమార్ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోయాడు. తను ప్రేమించిన యువ తి మారొకరితో వివాహం చేసుకోవాడాన్ని భరించలేక మానస్తాపం చెంది తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోళ్లఫారం సూపర్ వైజర్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపారు. -
కోమటిరెడ్డి అరెస్ట్.. భువనగిరిలో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆందోళన చేస్తుండగా.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా.. భువనగిరి మండలం వడపర్తి గ్రామ సర్పంచ్ కాలు విరిగింది. ఉద్రిక్తతల నడుమ కోమటిరెడ్డిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గత ఐదేళ్ల నుంచి స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూ.. స్థానిక ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధులు-విధులు కోసం పోరాటాల గడ్డ అయిన భువనగిరి నుంచి పోరాటం మొదలు పెట్టామన్నారు. స్థానిక సంస్థల నిధులు-విధులు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులందరు ఈ పోరాటంలో కలసి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం, మైనింగ్, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు కేటాయించకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. గ్రామ పంచాయతీలకు చెక్ పవర్ కల్పించి సర్పంచ్, ఉప సర్పంచ్లకు మధ్య కొట్లాట పెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు. హరితహారంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సర్పంచ్ మీద వేటు వేయడం సబబు కాదన్నారు. -
సహకార ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, భువనగిరి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. జిల్లాలో 110 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాలక వర్గాలకు జూలై నెలాఖరుకు పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత పాలకమండళ్లకే పర్సన్ ఇన్చార్జ్లుగా.. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. గతంలోనే ఓటరు జాబితా సిద్ధం ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలకు 2018డిసెంబర్లోనే రాష్ట్ర సహకార కమిషనర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. సంఘం నిర్మాణం ఇలా.. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13మంది పాలకవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ 01, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, బీసీ మహిళ 01, ఓసీ 7మంది సభ్యులుగా కొనసాగుతారు. వీరి లో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు. వాయిదాపడే అవకాశం ఉంది 2013జూన్ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్ జాబితా సిద్ధం చేసి పంపాం. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. –వెంకట్రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జ్ అధికారి -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే
సాక్షి, భువనగిరి: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. మంగళవారం భువనగిరిలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మురళీధర్రావు మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష చూడకుండా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6న వారణాసిలో, అలాగే తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్లో అమిత్షా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో 11 కోట్ల సభ్యత్వాలు ఉంటే ఈసంవత్సరం అదనంగా మరో 10 కోట్ల సభ్యత్వాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పతనమవుతోందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేది శక్తి బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎల్బీనగర్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు మంజూరు చేస్తాం.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమైన ఆయుష్మాన్భవ పథకం ద్వా రా రూ.5లక్షలు మంజూరు చేస్తోందని మురళీధర్రావు తెలిపారు. స్థానిక ఎల్బీనగర్ కాలనీ లో చేపట్టిన ఇంటింటి సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ఈ నిధులను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. సభ్యత్వాలు పొందిన వారి పేరు, వివరాలు ఢిల్లీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉంటాయన్నారు. తమ కుటుంబ సభ్యుల అందరి చేత సభ్యత్వాలు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయ ఇన్చార్జి దాసరి మల్లేషం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, జిల్లా ఇన్చార్జ్ వేముల నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నర్ల నర్సింగరావు, పడమ టి జగన్మోహన్రెడ్డి, జిల్లా కార్యదర్శి నీలం రమేష్, ఎండీ.మహమూద్, జిల్లా ఉపాధ్యక్షుడు మాయ దశరథ, అసెంబ్లీ కన్వీనర్ బలరాం, పట్టణశాఖ అధ్యక్షుడు చందా మహేందర్గుప్తా, మాజీ కౌన్సిలర్లు పట్నం రోజా, చిట్టిప్రోలు సువర్ణ, నాయకులు సుర్వి శ్రీనివాస్, చిట్టిప్రోలు శ్రీధర్, జనగాం నర్సింహాచారి, రత్నపురం శ్రీశైలం, రత్నపురం బలరాం, మేడి కోటేష్ పాల్గొన్నారు. -
గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడి అరెస్ట్
సాక్షి, భువనగిరి: గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు కత్తుల జంగయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని నారాయణగూడకు చెందిన డీఎస్ ప్రాన్సిస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ వెంచర్లో 1993, 1996 మధ్యలో జీపీఏ హోల్డర్ పక్కిర్ బాల్రెడ్డి వద్ద నాలుగు ప్లాట్లను ఒక్కొక్కటి 300 గజాల చొప్పున మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2006 సంవత్సరంలో నయీం తన అనుచరులైన పాశం శ్రీను, నాజర్, కత్తుల జంగయ్యతో కలిసి ఎలాగైనా మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి సర్వే నంబర్ 721, 733లో ఉన్న మొత్తం 154 ఎకరాల భూమిని పక్కిరు బాల్రెడ్డికి జీపీఏ చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కబ్జాలోకి తీసుకున్నారు. బాధితులు ప్లాట్లలోకి వెళ్లినపుడు ఇక్కడికి వస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. తమ ప్లాట్లను అన్యాయంగా అక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా పట్టణంలోని స్థానిక సంజీవనగర్లో కత్తుల జంగయ్య ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్కు పంపినట్లు చెప్పారు. గతంలో కత్తుల జంగయ్యను మొత్తం 91కేసులలో అరెస్టు చేసినట్లు, పీడీ యాక్టును కూడా నమోదు చేయగా సంవత్సరం జైలు శిక్ష పడినట్లు తెలిపారు. -
ప్రభావం.. ఏ మేరకు!
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనల ప్రకంపనలు ఇంకా ఆగలేదు. ఆయన పార్టీ మారుతున్నారని ఇప్పటికే నిర్ధారణ కాగా, ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీని వీడి పోయేవారెందరు..? కాంగ్రెస్లో కొనసాగే వారెందరు..? ఆయన పార్టీ మారడం వల్ల ఏ నియోజకవర్గాల్లో పడే ప్రభావం ఎంత..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పార్టీ కేడర్లోనూ ఈ అయోమయం కొంత గందరగోళానికి దారితీస్తోందని చెబుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భువనగిరి లోక్సభస్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా ఆయన మొదట జనగామ, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకుడిగా ప్రచారమయ్యారు. ఐదేళ్ల పాటు తెలంగాణ నినాదాన్ని మోయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువమంది అభిమానులనే సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఆయన భువనగిరి నుంచే రెండోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీపడి ఓడిపోయారు. కానీ, కొన్నాళ్లకే వచ్చిన నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సంబంధాలు నెలకొల్పుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సొంత కేడర్ను తయారు చేసుకున్నారు. మొన్నటి 2018 ముందస్తు ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, పీసీసీ నాయకత్వాన్ని ఆశించిన ఆయనకు ఆశాభంగం కావడం వల్లే పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ప్రకట నలు పార్టీ శ్రేణుల్లో సంచలనం కలిగించాయి. ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు ఈ నెల 24వ తేదీని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని చెబుతుండడంతో పార్టీపై పడే ప్రభావం, ఎందరు పార్టీని వీడి బయటకు వెళతారు అన్న చర్చ మొదలైంది. ఉండే వాళ్లెందరు... పోయే వాళ్లెందరు? మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్రెడ్డి కేవలం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కానందున, ఆయనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పరిచయాలు, అనుచరవర్గం ఉన్నందున, ఆయన పార్టీ మారితే పడే ప్రభావంపై నాయకత్వం అంచనావేస్తోంది. ప్రధానంగా భువనగిరి లోక్సభనియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనతో వెళ్లే కేడర్, లీడర్లు ఎంతమంది ఉంటారన్న అంచనాల్లో కాంగ్రెస్ నాయకత్వం మునిగిపోయింది. మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి తదితర నియోజకవర్గాలనుంచి ఎవరైనా పార్టీ మారుతున్నారా అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రధానంగా మునుగోడు నుంచి ఆయన వెంట వెళ్లేవారెందరు..? పార్టీలోనే ఉండిపోయే వారెందరు..? అన్న అంచనాలు వేస్తున్నారు. అయితే, ముందునుంచీ కాంగ్రెస్లో కొనసాగుతున్న సీనియర్లు, ముఖ్య కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతారని, ఆయనతోపాటు వెళ్లే వారి సంఖ్య పెద్దగా ఉండదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు తమ కేడర్ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఒక వైపు ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నారని తెలిసిన తర్వాత ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్న కొందరు నాయకులు అప్పుడే ఇన్చార్జ్ బాధ్యతలు దక్కించుకునే రేసులో మునిగిపోయారని, కేడర్ను కాపాడుకునే ప్రయత్నాలను పక్కనపెట్టి ఇన్చార్జి పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ మార్పిడిపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతుండగా, స్వల్ప సంఖ్యలోనే ఆయన వెంట వెళ్తారన్న అంచనాలో పార్టీ నాయకత్వం ఉంది. మొత్తంగా ఈ నెల 24వ తేదీ తర్వాత కానీ, మునుగోడు, ఇతర నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పార్టీ మారుతారు? ఎవరు మిగిలిపోతారు ? అన్న ప్రశ్నలకు సమాధానం లభించేలా లేదు. -
‘అమ్మకు’పరీక్ష
భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్లు ఆలస్యంగా రావడంతో సోమవారం పరీక్షలకు వచ్చిన గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఆస్పత్రి లోని ఓపీ విభాగంలో గర్భిణులకు పరీక్షలు నిర్వహించేందుకు నలుగురు గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. ప్రతి సోమవారం వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వస్తారు. ఇదే క్రమంలో ఆస్పత్రికి ఉదయమే వందల సం ఖ్యలో గర్భిణులు తరలివచ్చారు. నిబంధనల ప్ర కారం డాక్టర్లు ఉదయం 9నుంచి 12గంటల వరకు వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఉద యం 9గంటలకు రావాల్సిన డాక్టర్లు 11గంటల కైనా రాలేదు. దీంతో అప్పటికే చికిత్స కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గర్భిణులు లైన్లో నిల్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా 11 గంటల తర్వాత డాక్టర్ రావడంతో గర్భిణులం దరూ ఒక్కసారిగా తోసుకువచ్చి గుంపులుగా చేరారు. గర్భిణులతోపాటు వారి వెంట వచ్చిన బంధువులతో ఓపీ హాల్ నిండిపోయి ఆస్పత్రి ఆవరణలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుర్చీలు సరిపడా లేకపోవడంతో గర్భిణులు గంటల తరబడి నిలబడక తప్పలేదు. ప్రతి సోమ, గురువారం రోజుల్లో గర్భిణుల తాకిడి ఓపీ విభాగంలో అధికంగా ఉంటుంది. 250 మందికి పైగా.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి 250కు పైగా గర్భి ణులు వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండగా సోమవారం ఇదరే అం దుబాటులో ఉన్నారు. వారు కూడా ఆలస్యంగా వచ్చారు. దీంతో గంటల తరబడి గర్భిణులు డా క్టర్ల కోసం ఎదురుచూడక తప్పలేదు. అందరికీ పరీక్షలు నిర్వహించాం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. ఇందులో ఒకరు సెలవులో ఉన్నారు. మరొకరు చౌటుప్పల్ ఏరియా ఆ స్పత్రిలోని ఓపీ విభాగంలో పని చేసే గైనకాలజిస్టు రాకపోవడంతో అక్కడికి వెళ్లాడు. మిగి లిన ఇద్దరు గైనకాలజిస్టులు ఉదయం లేబర్ రూమ్లో మహిళ ప్రసవం కోసం సమయాన్ని కేటాయించారు. దీంతో ఓపీ విభాగానికి వచ్చేసారికి ఆలస్యమైంది. అయినప్పటికీ గర్భిణులందరికీ పరీక్షలు నిర్వహించారు.–కోట్యానాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భువనగిరిలో ప్రచారానికి గులాబీ అధినేత
సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు రానున్నారు. ఏప్రిల్ 2వ తేదీన భువనగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. తమ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కేసీఆర్ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. మార్చి 29న మిర్యాలగూడలో, ఏప్రిల్ 2న భువనగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో గులాబీ బాస్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లోనూ పని చేయాలని ఇప్పటికే అధినేత నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి. అంతేకాకుండా ఈనెల 7వ తేదీన భువనగిరిలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాస్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో వారు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెజార్టీపై టీఆర్ఎస్ దృష్టి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఐదుచోట్ల టీఆర్ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయి. మునుగోడు, నకిరేకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజాయం సాధించారు. అయితే టీఆర్ఎస్ గెలిచిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,95,280 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు గెలిచిన రెండుస్థానాలతోపాటు ఓడిన ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 5,36,893 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్కు 58,387 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆధిక్యం స్వల్పంగా ఉండడంతో అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భువనగిరి పార్లమెంట్పై ప్రత్యేక దృష్టిసారించి జిల్లా నాయకత్వానికి బాధ్యతలను అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిక్యం పెంచుకోవడానికి నాయకత్వం ఆపరేష్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసను ప్రోత్సహిస్తోంది. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్పార్టీకీ బలమైన దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్యూహాత్మక ఎత్తుగడ కాంగ్రెస్లోని బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించడం ద్వారా వారి ఓటు బ్యాంకుతో మెజార్టీని భారీగా పెంచుకోవాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 2న భువనగిరిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణీనాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నూతన దంపతుల మృతి
గుండాల : యాదాద్రిభువనగిరి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నూతన దంపతులు మృతి చెందారు. గుండాల మం డలం బ్రాహ్మణపల్లికి చెంది న బెజాడి కుమార్ కుమారుడు బెజాడి నరేశ్కు (27) గత నెల 22న భువనగిరి మండలం కేసారం గ్రామా నికి చెందిన దివ్య (24)తో వివాహం జరిగింది. నరేశ్ తండ్రి కుమార్ ఉద్యోగ రీత్యా ఆర్టీసీ డ్రైవర్. కుటుంబంతో మేడిపల్లిలో నివాసం ఉంటున్నారు. నరేశ్ హైదరాబాద్లో వైకుంఠ రథం డ్రైవర్గా పనిచేస్తూ భార్యతో అక్కడే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం నరేశ్ భార్యతో కలసి తన పెద్దమ్మ స్వగ్రామం ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లిలో శుభకార్యానికి వచ్చాడు. తిరిగి సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై తన అత్తగారి ఊరు కేసారం గ్రామానికి వెళ్లే క్రమంలో స్థానిక బస్టాప్ వద్ద ఆగి ఉన్న ట్రాన్స్పోర్టు లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా అనంతరం మృతదేహాలను వారికి అప్పగించారు. -
మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
సాక్షి, ఆలేరు: టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఇటీవల టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకు వచ్చారు. పలు సందర్భాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చంద్రబాబు మోసకారి, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని, తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
టికెట్ ఇవ్వకపోయినా భువనగిరి నుంచి పోటీ చేస్తా!
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి నుంచి తనకు టికెట్ వచ్చినా, రాకపోయినా భువనగిరిలో తాను పోటీ చేయడం ఖాయమని యువతెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికి యువతెలంగాణ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతానని ఆయన చెప్పారు. కేసీఆర్ చెప్పిన మాటలకు, ఆయన చేస్తున్న చేతలకు పొంతనలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మేల్కొకపోతే మరోసారి ఒక రజాకార్ను సీఎం చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. భువనగిరి అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. దివంగత నేత మాధవరెడ్డి కాలంలో జరిగిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉమా మాధవరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఓట్ల కోసం గ్రామాల్లో డబ్బులు ఎందుకు డబ్బులు పంచుతున్నారని ప్రశ్నించారు. -
ఆస్తి కోసం తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి
-
నో స్టాప్..!
భువనగిరి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్నుంచి వందలాది మంది హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్లు ఆగకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ప్రయాణం రద్దు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన టికెట్లతో నష్టపోవాల్సి వస్తోంది. పద్మావతి, శాతవాహన, షిరిడీ, ఎల్టీడీ ఎక్స్ప్రెస్ రైళ్లను భువనగిరి రైల్వే స్టేషన్లో నిలపాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ఆ శాఖ అధికారులనుంచి స్పందన కరువైంది. భువనగిరి మీదుగా వెళ్లే రైళ్లు.. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్), కృష్ణా, కొలహాపూర్ ఎక్స్ప్రెస్, ప్యాసిం జర్(ఫలక్నమా నుంచి భువనగిరి), ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(సికింద్రాబాద్ నుంచి గుంటూరు), కాగజ్నగర్ ఎక్స్ప్రెస్(సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్), ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(హైదరాబాద్ నుంచి హౌరా), పుష్పుల్ ప్యాసింజర్ (హైదరా బాద్ నుంచి వరంగల్), గోల్కొండ ఎక్స్ప్రెస్ (సికింద్రాబాద్నుంచి గుంటూరు), ప్యాసిం జర్(ఫలక్నామానుంచి జనగాం), భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (సికింద్రాబాద్ నుంచి బల్హార్షా), కాకతీయ ప్యాసింజర్(సికింద్రాబాద్ నుంచి మ ణుగూరు), పుష్ పుల్(హైదరాబాద్ నుంచి కాజీ పే ట), గౌతమి(లింగంపల్లి నుంచి కాకినాడ), దక్షిణ ఎక్స్ప్రెస్(హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్) రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట వైపు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆగని రైళ్లు.. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం సుమారు 2,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో సుమారు 500 మంది ప్రతి రోజూ హైదరాబాద్లో ఉద్యోగ నిమిత్తం వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం భువనగిరి మీదగా వివిధ రకాల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో శాతవాహన, పద్మావతి, షిరిడీ, ఎల్టీడీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఆగడం లేదు. కాజీపేట వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్లేటప్పడు గానీ ఈ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వ్యవధిలో రైళ్లు లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన వస్తుంది. ఉదయం కాజీపేట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉదయం 9.17 నిమిషాలకు ఉంటే ఆ తర్వాత గోల్కొండ ఎక్స్ప్రెస్ 12.04 గంటలకు, ఆ తర్వాత ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ 3.57 గంటలకు రైలు ఉంది. దీంతో ఈ రైళ్ల రాకపోకల మధ్య సుమారు 3నుంచి 4 గంటలు çసమయం పడుతుంది.ఈ సమయంలో వచ్చిన రైళ్లు రద్దీగా రావడంతో ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్ల బుక్ చేసుకున్న టికెట్లను నిత్యం 50నుంచి 70 వరకు రద్దు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో టికెట్లు రద్దు చేసుకున్న సమయం దాటిపోవడంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. భువనగిరి స్టేషన్ నుంచి షిరిడీ, తిరుపతికి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో షిరిడీ, పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. కేంద్ర మంత్రిని కోరాం భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లతో పాటు పద్మావ తి, శాతవాహన ఎక్స్ప్రెస్లను నిలపాలని సంబంధిత కేంద్ర మంత్రిని కోరాం. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే జీఎం కూడా శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వే స్టేషన్లో నిలపటానికి సంబంధించిన నివేధిక కూ డా ఉన్నతాధికారులకు పంపించారు. రైల్వే స్టేషన్లో కనీసం రెండు రైళ్లన్న నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. –డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎంపీ -
భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు లైన్ క్లియర్
-
వేపకాయలతో ఉపాధి
జూన్ మొదటి వారంలో ఓ మాదిరి వర్షాలు పడటంతో చాలా గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో గ్రామాల్లో కూలీ పనులు దొరకక నిరుపేద కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు గ్రామాల్లోని మహిళలు వేపకాయల సేకరణ చక్కటి ఉపాధిగా ఎంచుకున్నారు. మహిళలు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల వెంట ఉన్న వేపచెట్లు, వ్యవసాయ భూములు, అడవుల్లో ఉన్న వేప చెట్ల వద్దకు వెళ్లి వేపకాయలు ఏరుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భువనగిరి/పెద్దవూర : భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూరు(ఎం), బీబీనగర్, పోచంపల్లి మండలాలతోపాటు భువనగిరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు వేపగింజలను విక్రయించేందుకు భువనగిరి మార్కెట్కు తీసుకువస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన వేపగింజలను విజయవాడ, ముంబాయి, బెంగళూరు, పుణె, మద్రాస్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన మహిళలు ఆటో కిరాయికి తీసుకుని వేకువజామునే ఆంధ్రా ప్రాంతాలైన మాచర్ల, గురజాల, దుర్గి, రెంటచింతల పరిసర ప్రాంతాలకు వెళ్లి పొద్దంతా వేపకాయలు ఏరుకుని ఉపాధి పొందుతున్నారు. భువనగిరి మార్కెట్ భారీగా వేపకాయల రాక భువనగిరి గంజ్ మార్కెట్యార్డ్లో వేపగింజల కొనుగోళ్ల సందడి మొదలైంది. గత వారం రోజుల నుంచి కొనుగోళ్లు జరుగుతుండటంతో మార్కెట్కు భారీగా వేపగింజలను తీసుకువస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్ల అనంతరం తిరిగి మార్కెట్లో వేపగింజల కొనుగోళ్లతో రద్దీ కనిపిస్తోంది. సుమారు 20 రోజుల పాటు కొనసాగే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం క్వింటాళ్కు రూ.600ను చెల్లిస్తున్నారు. దిగుబడి ఎక్కువ ధర తక్కువ.. గత సంవత్సరంలో వర్షాభావం వల్ల వేపగింజల దిగుబడి తక్కువగా ఉండటంతో క్వింటాళ్కు రూ.750 నుంచి రూ.850వరకు చెల్లించారు. ఈ సీజన్కుగాను వేపగింజల దిగుబడి ఎక్కువగా ఉండటంతో క్వింటాళ్కు రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి క్వింటాళ్కు రెండు కిలోల చొప్పున తరుగుదల కింద తీసుకుంటుండగా వాహనాల కిరాయి పోను వేపగింజలను వేరే వారికి రోజుకూ కూలీ రేటు కూడా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేపకాయలతో ఉపయోగాలు వేప గింజల నుంచి యంత్రాల సహయంతో నూ నెను తీస్తే నూనెతో పాటు వేప పిండి వస్తుంది. ఈ వేపనూనె, పిండి పంట తెగుళ్లకు, వ్యాధి నిరోధకంగా, క్రిమిసంహారక మందులలో వాడుతున్నారు. వేప పిండిలో నత్రజని, భాస్వరం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషక పదార్థాలే కాకుండా గంధకం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఉంటాయి. వేపపిండిని వాడటం ద్వారా పంట ఏపుగా పెరగటంతో పాటు వేర్లను ఆశించే పురుగులు, నులి పురుగులు, చీడపీడల సమస్య తగ్గుతుంది. దీంతో బత్తాయి తోటల రైతులు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ఎరువులుగా వాడుతున్నారు. దీంతో వేపకాయలకు ఏడాదికేడాది డిమాండ్ పెరుగుతుంది. -
మీరాకుమార్కు ఘన స్వాగతం
భువనగిరి : లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ టీఎస్పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఆది వారం భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్కుమార్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. వరంగల్లో జరిగిన సింహగర్జనకు హాజరయ్యే ందుకు వెళ్తూ మార్గమధ్యలో బైపాస్ రోడ్డులోని వివేరా హోటల్లో అరగంట పాటు ఆగి భోజ నాలు చేశారు. హోటల్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వరంగల్కు వెళ్లిపోయారు. వీరివెంట లోక్సభ కాంగ్రెస్ ప్రతిపక్షనేత మల్లికార్జున్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి బలరాంనాయక్, నాయకులు కొప్పుల రాజు, తడక కల్పన, తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, పొత్నక్ ప్రమోద్కుమార్, బీసుకుంట్ల సత్యనారా యణ, చల్లగురుగుల రఘుబాబు ఉన్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
భువనగిరి అర్బన్ : భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రావి ఉమాదేవి (73) భర్త శంకర్రెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందాడు. ఉమాదేవికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నర్సింహారెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు, కుమార్తె స్మీతారెడ్డి ఆమెరికాలో ఉంటున్నారు. ఉమాదేవి తన భర్త చనిపోయినప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్న పెద్దకుమారుడు నర్సింహారెడ్డి వద్దకు వెళ్లి వస్తూ ఉంటుంది. రైతుబంధు చెక్కు తీసుకునేందుకు.. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు చెక్కు తీసుకోవడానికి ఉమాదేవి శుక్రవారం ఉదయం తన కొడుకు నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి నందనం గ్రామానికి వచ్చింది. ఉమాదేవి తనకు రావల్సిన చెక్కులు, పట్టాదారు పాస్బుక్లను తీసుకుంది.4ఎకరాల భూమికి గాను రూ.16 వేల విలువ గల చెక్కు, పాస్పుస్తకాన్ని తీసుకుని గ్రామంలోని ఇంటికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కుమారుడిని హైదరాబాద్ వెళ్లి ఉదయం రమ్మని పంపించి ఇంట్లో ఒంటరిగానే ఉంది. ఇంట్లో ఒంటరిగా.. ఉమాదేవి గ్రామానికి వచ్చినప్పుడు ఆమెకు తోడుగా అదే గ్రామానికి చెందిన పొట్ట లక్ష్మమ్మ సహాయంగా ఉంటుంది. అయితే ఇటీవల తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు లక్ష్మమ్మ కొద్ది రోజుల క్రితం ఊరికి వెళ్లింది. దీంతో ఉమాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంది. 10.30 గంటల సమయంలో.. ఉమాదేవి ఇంటి తలుపులను మూసి టీవీ చూస్తోంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో దుండగులు ఉమాదేవి ఇంటి వెనుక నుంచి గోడ దూకి లోనికి ప్రవేశించారు. మేడ పైనుంచి వెనుక భాగంలో ఉన్న పెంకుటింట్లోకి చొరబడ్డారు. ఎవరో ఇంట్లోకి వచ్చినట్లు అనుమానం వచ్చి పరిశీలిస్తుండగా దుండగులు ఆమెపై దాడికి తెగబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె చాలా సేపటి వరకు దుండగులతో ప్రతిఘటింటినట్టు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. దుండగులు ఆమె చీరకొంగును మెడకు ఉరివేసి అంతమొందించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, రెండు ఉంగరాలు, కాళ్ల కడియాలు, చేతి గాజులు మొత్తం 12 తులాల గల బంగారు ఆభరణాలను, ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి రూ.20 నగదును అపహరించుకపోయారు. మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ నందనం గ్రామంలో జరిగిన హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కుమారుడి రాకతో.. ఉమాదేవి కుమారుడు ఉదయం 7గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో డ్రైవర్ను ఇంటిపైకి వెళ్లి చూడమని చెప్పాడు. అప్పటికే ఉమాదేవి విగతజీవిగా పడి ఉండడంతో గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. డీసీపీ రామచంద్రారెడ్డి స్థానికులను, కుటుంబ సభ్యులను, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాచకొండ కమిషనరేట్ క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు. ఉమాదేవిని తెలిసిన వ్యక్తులే అంతమొందించి ఉంటారని గ్రామంలో చర్చ జరుగుతోంది. ఎక్కడ తమను గుర్తుపడుతుం దన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
పట్టపగలే యువకుడిపై హత్యయత్నం
-
నిరుపేదను ఆదుకోరూ..!
భూదాన్పోచంపల్లి(భువనగిరి) : కలిసిరాని వ్యాపారంతో ఆర్థిక పరిస్థితులు కుంగదీశాయి.. మరోవైపు వెంటాడిన అప్పులు చేనేత కార్మికుడి గుండె ఆగేలా చేశాయి. ఇంటి యజమాని చనిపోవడంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ కళ్లముందు కదలాడుతుంటే కడు దుఃఖంతో బతుకీడుతున్న చేనేత కార్మికురాలి ధీనగాథ ఇది.. మండలకేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన జెల్ల కిరణ్(38) మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకునేది. ఆయనకు భార్య చందన, కుమార్తె అనూష(11), అజయ్స్వామి(8) ఉన్నారు. గతంలో పోచంపల్లిలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లా చర్లపల్లికి వెళ్లి అక్కడ అప్పులు చేసి మరమగ్గాలపై తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్ చేయడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేశాడు. కాని ఆ వ్యాపారం కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తిరిగి గత ఏడాది పోచంపల్లికి వచ్చి భార్య, భర్తలు కలిసి కూలీ మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వేధించిన అప్పులు.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇతనిపై చేయి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర మనోవ్యధకు గురైన జెల్ల కిరణ్ ఈ నెల 3న ఇంట్లో మగ్గం నేస్తూనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దయనీయస్థితిలో అంతిమ సంస్కారాలు... ఇతనికి సొంత ఇల్లు లేదు. మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సదరు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని చెప్పడంతో రెండు గంటల పాటు రోడ్డుపైనే శవాన్ని ఉంచారు. చివరకు బంధువులకు చెందిన ఖాళీ స్థలంలో టెంట్వేసుకొని అక్కడే చాలా ధీనస్థితిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలైతే పూర్తయ్యాయి కాని, ఆ తరువాత తాను, పిల్లలతో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు మండల కేంద్రానికి చెందిన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తమ కేవీటీ స్టోర్ట్స్ క్లబ్ భవనంలో తాత్కాలికంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చాడు. వెక్కిరిస్తున్న కడు పేదరికం, భర్త మరణం, పిల్లల భవిష్యత్ వీటినంటిని దిగమింగుకొంటుంది చందన. అయితే కొందరు దాతలు ముందుకు వచ్చి బియ్యం, సరుకులు, నగదు రూపంలో సహాయాన్ని అందజేశారు. నిరుపేద జెల్ల చందన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు చేనేత నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలంటే ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్ (నల్లగొండ మైత్రి ఉమెన్స్ కాలేజ్ బ్రాంచ్)62296665320 ఆర్థిక సహాయాన్ని అందించాలని బాధితురాలు వేడుకుంటుంది. -
సంగీతకు మంత్రి సన్మానం
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అర్బన్ ప్లానర్ పుల్లూరి సంగీతను మంత్రి హరీశ్రావు ఘనంగా సన్మానించారు. పుల్లూరి సంగీత 11 స్మార్ట్ సిటీలకు అర్బన్ ప్లానర్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల ఇండియాలో మొదటి ఉత్తమ మున్సిపాలిటీగా సిద్ధిపేటను తీర్చిదిద్దటం, స్వచ్ఛభారత్ తోపాటు, ఐఎస్ఓ గుర్తింపు తేవడం కోసం సంగీత పాటుపడ్డారని తెలిపారు. ఇందుకు శనివారం రాత్రి సిద్ధిపేటలోని కొమటిచెర్వు కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్వచ్ఛత ఎక్సెలెన్స్ ఆవార్డు–2018లో భాగంగా అవార్డులు, సన్మాన కార్యక్రమం నిర్వహంచారు. కాగా మంత్రి హరీశ్రావు పుల్లూరి సంగీతను శాలువా, గుర్తింపు జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాపేటకు చెందిన పుల్లూరి వెంకటేశం కుమార్తె పుల్లూరి సంగీతకు పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. -
రైలు కింద పడి టీఆర్ఎస్ నాయకుడి మృతి
భూదాన్పోచంపల్లి(భువనగిరి) : రైలుకింద పడి మండల కేంద్రానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బొంగు శంకరయ్య(68) గురువారం హైదరాబాద్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి వెళ్తూ మలక్పేట వద్ద మెట్రోరైల్ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారికింద పడి అక్కడక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాత్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బొంగు శంకరయ్య 10 ఏళ్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అన్న తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరో 10 ఏళ్లు పనిచేశారు. అలాగే సింగిల్విండో చైర్మన్గా రైతులకు సేవలందించారు. పలువురి సంతాపం... ఈయన మృతి పట్ల ఎంపీపీ సార సరస్వతీబాలయ్య, వైఎస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రం, నాయకులు కె. భూపాల్రెడ్డి, కోట మల్లారెడ్డి, రామాంజనేయులు, పొనమోని శ్రీశైలం, బొంగు అయిలయ్య, మైసగోని వెంకటేశం, కొంక లక్ష్మినారాయణ, దారెడ్డి మల్లారెడ్డి, సోమలింగం, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు బడుగు దానయ్య, పట్టణ అధ్యక్షుడు గుండ్ల రాంచంద్రం, రామేశ్వర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
నేరస్తుల కట్టడికే కార్డన్ సెర్
భువనగిరిఅర్బన్ : నేరస్తులను కట్టడి చేసేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తాతానగర్, పహాడీనగర్ కాలనీల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్లు, నాలుగు కార్లు, ఐదు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ముగ్గురు రౌడిషీటర్లు, మరో ముగ్గురు అనుమానితులు, ఇద్దరు ఎక్స్కాన్వెర్స్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా బెల్టుషాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ కోరారు. కాగా, తెల్లవారుజామునే పోలీసులు తనిఖీ చేపట్టడంతో ప్రజలు ఒకింత భయాందోళన చెందారు. కార్డన్సర్చ్లో భువనగిరి ఏసీపీ జితేందర్రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 6 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 130 మంది కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు. సీజ్ చేసిన వాహనాలు ధృవపత్రాలను పరిశీలిస్తున్న డీసీపీ -
జోరుగా మాస్ కాపీయింగ్
భువనగిరి : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉండగా కొందరూ ఎగ్జామినర్లు మందులు, విందులు స్వీకరిస్తూ మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో మాస్కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్న ఇ ద్దరు ఎగ్జామినర్లను అధికారులు తొలగించారు. దీనిని బట్టి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్లో మాస్ కాపీయింగ్ ఏవిధంగా జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేది నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. 34 పరీక్ష కేంద్రాల్లో నాలుగు విడుతల్లో ఈ ప్రాక్టికల్స్ను నిర్వహిస్తున్నారు. మొదటి విడుత 1వ తేది నుంచి 5, రెండో విడుత 6 నుంచి 10, మూడో విడుత 11 నుంచి 16, నా లుగో విడుత 17నుంచి 21వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,010 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ 1,421, బైపీసీ 1,589మంది విద్యార్థులు ఉ న్నారు. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు 1,313మంది విద్యార్థులు ఉన్నారు. పర్యవేక్షణ ఏదీ..? ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్లో పర్యవేక్షణ లేక మాస్కాపీయింగ్ జరుగుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను నియమించారు. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి ఆయా కోర్సులను బట్టి నిర్ణిత ల్యాబ్ ఫీజు కంటే అదనంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కళాశాల యాజమాన్యాలు వసూలు చేశారు. దీంతో ఆయా కళా శాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్ కోసం వచ్చే ఎగ్జామినర్లకు మందు, విందు, తాయిలాల సౌకర్యాలు కల్పిస్తూ మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు మాత్రమే సీసీ కెమెరాల ఎదుట ప్రశ్నాపత్రం తీసినప్పటికీ పరీక్ష గదిలో మాత్రం మాస్కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాస్ కాపీయింగ్ మా దృష్టికి రాలేదు మాస్కాపీయింగ్ జరుగుతున్నట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేస్తున్నాం. ఆలేరులో విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించాం. మాస్ కాపీయింగ్కు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రవీంద్రప్రసాద్, డీఐఈఓ -
దొడ్డు అన్నం తినేదెట్లా..?
సాక్షి, యాదాద్రి : వివిధ వర్గాలు, అధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సివిల్సప్లై కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో రెండు రోజులుగా జిల్లాలో రాష్ట్ర టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో వరుస దాడులు జరిగాయి. గురువారం సివిల్సప్లై టాస్క్ పోర్స్ ఎస్పీ నాగోబారావు ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని భువనగిరి సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పాఠశాలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థులు మెనూ విషయంలో పలు ఫిర్యాదులు చేశారు. దొడ్డు బియ్యం అన్నం, నీళ్లచారుతో కడుపునిండా తినలేకపోతున్నామని అధికారుల ముందు వారు వాపోయారు. మెనూ పాటిం చడం లేదని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సన్నబియ్యంతో నాణ్యమైన కూరగాయలతో మంచి భోజనం పెట్టించాలని విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులను వేడుకున్నారు. అలాగే పాఠశాల రికార్డుల్లో ఉన్న విధంగా 577 మంది విద్యార్థుల్లో 16 మంది విద్యార్థులు రావడం లేదని తేలింది. వారందరిని రప్పించాలని ప్రిన్సిపాల్ను అదేశించారు. ఆత్మకూర్ఎం మండలం ముత్తిరెడ్డిగూడెంలో పీవీఎన్రెడ్డికి చెందిన హెచ్పీ పెట్రోల్ బంక్లో తనిఖీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రేషన్దుకాణంలో తనిఖీ నిర్వహించారు. అలాగే బుధవారం బీబీనగర్ మండలం భట్టుగూడెం కాదంబరి రైస్ మిల్పై 6 ఏ కేసు నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న స్టాక్కు తేడాను గుర్తించి మిల్లుపై కేసు నమోదు చేశారు. భువనగిరిలోని యాదాద్రి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీనివాసరావు, అధికారులు జనార్ధన్రెడ్డి, కాశప్ప, వెంకట్రెడ్డిలు ఉన్నారు. -
భువనగిరిలో కార్డన్ సెర్చ్
భువనగిరిఅర్బన్ : నేరాల నియంత్రణలో భాగంగా రాచకొండ సీపీ మహేష్భగవత్ ఆదేశాల మేరకు డీసీసీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మూకుమ్మడిగా కార్డన్ సెర్చ్కు దిగారు. సుమారు 250 మంది పోలీసులు 2,3 వార్డుల్లోని ఇళ్లలో విస్తృ తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భం గా డీసీపీ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్తులు, పలు కేసుల్లో నిందితులుగా ఉండి పరారీ లో ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితులను వదిలిపెట్టేది లేదన్నారు. ఈ తనిఖీ ల్లో ఎనిమిది మంది అనుమానితులను, ఇద్దరు రౌడీషీటర్లను గుర్తించినట్లు డీసీపీ చెప్పారు. అలాగే అనుమతి లేకుండా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న, ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు కలిగిన ఉన్న, ఇంట్లో మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించామని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.2, 3వ వార్డులోని సంతోష్నగర్, సంజీ వనగర్ కాలనీల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపటట్టామని అనుమతి, సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రెండు ట్రాక్టర్లు, రెండు ప్యాసింజర్ ఆటోలు, ఒక కారు, 43 బైకులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఆధారాలు చూపితే వాహనాలు ఇస్తామన్నారు. పోలీసులకు రెండు కాలనీల ప్రజలు సహకరించాలని తెలిపారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇక ముందు అన్ని కాలనీల్లో కార్డెన్ సెర్చ్లు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, భువనగిరి ఏసీపీ జితేందర్రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 7 మంది సీఐలు ఎం. శంకర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, అంజనేయులు, 20 మంది ఎస్ఐలు, 250 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
భువనగిరి అర్బన్ (తెలంగాణ) : ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణలోని భువనగిరి రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన యువకుడు ధనుంజయ్, మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద రూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి భువనగిరికి బస్సులో వచ్చారు. భువనగిరి రైల్వేస్టేషన్కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడాలని భావించారు. ధైర్యం చాలకపోవడంతో.. పురుగుల మందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ముందే బాలిక తన బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దీంతో బంధువులు వెంటనే బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలోని పౌల్ట్రీఫామ్లో పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారికి సమాచారం అందించారు. వారు వెంటనే భువనగిరి రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫామ్ కింద పడిపోయి ఉన్న వీరిద్దరినీ గుర్తించారు. వెంటనే చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రికి తరలింపు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష యం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాం ధీ ఆస్పత్రికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కాళ్ల: మండలంలోని కోపల్లె గ్రామానికి చెందిన పంపురెడ్డి ధనుంజయ్, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక వ్యవసాయ పనులు చేస్తుంటారు. ధనుంజయ్ అత్తిలికి చెందినవాడు కాగా తల్లిదండ్రులు మరణించడంతో కోపల్లెలో తాత ఇం టి వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ప్రేమికులిద్దరూ భువనగిరిలో ఆ త్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని కాళ్ల పోలీసులు చెప్పారు. -
భువనగిరి పెద్ద చెరువుకు గండి
-
బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం
►బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి ►చీరలు కాల్చి బతుకమ్మ ఆడిన మహిళలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామన్న ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం...తీరా డామేజ్ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు. కేవలం వంద రూపాయల విలువచేసే సాధారణ చీరలు పంపిణీ చేసిందని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో మహిళలు.. చీరలు కాల్చేసి బతుకమ్మ ఆడారు. జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఆందోళనకు దిగారు. 50రూపాయలు విలువ కూడా చేయని చీరలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవ పరుస్తున్న అని ఎద్దేవా చేశారు. ఆ చీరలు బతుకమ్మకు కట్టుకోమని మహిళలు వాటిని అక్కడే పడేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 22, 23వ వార్డులో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అయితే వాటిని అందుతున్న మహిళలు చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప్పగా వేసి నిప్పు పెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ్మ ఆడారు. పోచంపల్లి చేనేత చీరెలు పంపిణీ చేస్తానని కేవలం 50 రూపాయలు విలువచేసే పాలిస్టర్ చీరెలు పంపుతారా అని కోపోద్రుక్తులయ్యారు. జగిత్యాల జిల్లా జిల్లా మండలం చల్గల్, లింగంపేటలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల ధర్నాకు దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి మహిళలు తమ నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోనూ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వాలీబాల్ కోర్టులోని నెట్కు చీరలను కట్టి తమ అసంతృప్తిని వెల్లడించారు. పంట చేళ్లల్లో పక్షుల కోసం బెదురుగా కట్టే చీరల కంటే హీనంగా బతుకమ్మ చీరలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలో భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్ కాలనీవాసులు బతకమ్మ చీరలను కుప్పగా పోసి నిప్పంటించారు. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలను ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మళ్లీ మంచి చీరల్ని పంపిణీ చేయాలని కోరారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వ ధనాన్ని నాశనం చేస్తున్నారని, డబ్బులిస్తే తామే మంచి చీరల్ని కొనుక్కుంటామని మహిళలు తెలిపారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
రూ. 62 లక్షల పాతనోట్లు స్వాధీనం
భువనగిరి: రద్దైన పెద్ద నోట్లను తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 62 లక్షల విలువైన పాత రూ. 500, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ప్లాజా వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు పెద్ద నోట్లు తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ తరుణ్జోషి వివరాలు వెల్లడించారు. -
భువనగిరిలో పేలిన్ గ్యాస్ సిలిండర్
భువనగిరి: వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రెండిళ్లతో పాటు మూడు బైకులు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి సిలిండర్ పేలడంతో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే పక్కనే ఉన్న పూరిళ్లుకు మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
భువనగిరిలోనూ అద్దె గర్భాల దందా
-
గుప్త నిధుల తవ్వకాల కేసులో..
► ఎనిమిది మంది అరెస్ట్.. ► పరారీలో మరో ముగ్గురు.. భువనగిరి, అర్బన్ :గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం భువనగిరిలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏసీపీ ఎస్.మోహన్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడిం చారు. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రా మ శివారులో ఉన్న మైసమ్మ ఆలయం పక్కనే ఉన్న దానంబండను స్థానికులు పవిత్రంగా కొలుస్తు పూజ లను నిర్వహిస్తారు. దానంబండ కింద గుప్త నిధులు ఉన్నట్లు ఈ నెల 24న అదే గ్రామానికి చెందిన కురిమండ్ల శ్రీనివాస్గౌడ్, ఈదులకంటి సంజీవరెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, ఉప్పునుతల రామ్దాస్, సంగి సుదర్శన్, చౌదరపల్లి గ్రామానికి చెందిన పక్కీరు ధర్మారెడ్డి, గుండెబొయిన కృష్ణ(జేసీబీ డ్రైవర్), పక్కీర్గూడునికి చెందిన గంగదేవి నర్సింహ్మ, కరీంనగర్ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు రాజు, సోమయ్య, గుర్తు తెలియని మరో వ్యక్తి జేసీబీ సాయంతో దానంబండ కింది భాగంలో తవ్వకాలు జరిపారు. వీరికి ఎలాంటి గుప్త నిధులు లభించ లేదు. అదే గ్రామానికి చెందిన తూంకుంట విఠల్ 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో గుర్తించిన 11 మంది నిందితులలో 8 మందిని అరెస్టు చేసినట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీ, బైకును వారి నుంచి స్వాధీనం చేసుకునట్లు తెలి పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో భువనగిరి రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ కె. వెంకటేష్ పాల్గొన్నారు. 3 -
హత్య చేసి.. ఆపై కాల్చేసి..
► వీడిన నరేశ్ మిస్సింగ్ మిస్టరీ ► దారుణంగా హతమార్చిన స్వాతి తండ్రి సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: ‘మిస్సింగ్’మిస్టరీ వీడింది.. ప్రేమ పెళ్లి విషాదాంతమైంది.. యాదాద్రి జిల్లా భువనగిరిలో అదృశ్యమైన అంబోజు నరేశ్ దారుణ హత్యకు గురైనట్లు తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రే ఆయన్ను అత్యంత దారు ణంగా హతమార్చాడు. సమీప బంధువుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు రాచకొండ పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్రెడ్డి, అతడి భార్య సోదరి కొడుకు నల్ల సత్తిరెడ్డిలను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శనివారం వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఎల్బీనగర్ డీసీపీ ఎంవీ రావు నేతృత్వంలో దర్యాప్తు చేశామని, తన 21 ఏళ్ల సర్వీసులో ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదని మహేశ్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... ఫేస్బుక్.. ప్రేమ.. పెళ్లి.. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం లింగ రాజుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మండల నాయకుడు తుమ్మల శ్రీనివాస్రెడ్డి కూతురు స్వాతితో ఇదే మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేశ్కు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. నరేశ్ తల్లిదం డ్రులు ముంబైలో ఉంటున్నారు. పల్లెర్లలో తాత వద్ద ఉంటూ నరేశ్ భువనగిరిలో డిగ్రీ చదివాడు. స్వాతి వలిగొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదివింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మార్చి 24న ముంబై వెళ్లిన వీరు మరుసటి రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో తన కూతురు అదృశ్యమైందంటూ నరేశ్పై అనుమానం వ్యక్తం చేస్తూ స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డి ఆత్మకూరు (ఎం) పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. రామన్నపేట ఇన్స్పెక్టర్ కోరడంతో ముంబై నుంచి నరేశ్, స్వాతి మార్చి 27న రామన్నపేట వచ్చారు. అదే రోజు స్వాతి తన తండ్రితో వెళ్లిపోగా.. నరేశ్ ముంబై వెళ్లాడు. స్వాతిని కుటుంబీకులు ఉప్పల్లో ఉన్న ఆమె సోదరి వద్ద ఉంచారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న స్వాతి మళ్లీ ముంబైలో ఉన్న భర్త నరేశ్ వద్దకు వెళ్లింది. మే 2న తిరిగి వచ్చిన దంపతులు.. స్వాతి అత్తారింటికి వెళ్లిన తర్వాత పలుమార్లు తన తండ్రితో మాట్లాడింది. అక్కడ తన పరిస్థితులు బాగోలేదంటూ పలుమార్లు చెప్పుకుంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ఈ నెల 2న నరేశ్, స్వాతి ముంబై నుంచి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం స్వాతి తన తండ్రికి చెప్పింది. దీంతో ఆ రోజు రాత్రి సత్తిరెడ్డితో కలసి అతడి కారులోనే శ్రీని వాస్రెడ్డి భువనగిరి వెళ్లాడు. తర్వాత స్వాతిని తీసు కొని శ్రీనివాస్రెడ్డి, సత్తిరెడ్డి లింగరాజుపల్లికి వచ్చారు. బైక్ను వెంబడించగా... ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో సిగరెట్ కాల్చుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్రెడ్డి తన ఇంటి ముందు తెల్లరంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సంచరిస్తు న్నట్లు గమనించాడు. మరో గంట తర్వాత కూడా అలాగే జరగడంతో అతడెవరో చూద్దామన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్న సత్తిరెడ్డితో కలసి శ్రీనివాస్రెడ్డి మరో బైక్పై వెంబడించారు. శ్రీనివాస్రెడ్డి వెళ్తూ తన వెంట ట్రాక్టర్ రాడ్ కూడా తీసుకువెళ్లాడు. దాదాపు 1.5 కి.మీ. వెంటపడినా ద్విచక్ర వాహనదారుడిని అందుకోలేకపోయారు. అయితే శ్రీనివాస్రెడ్డి పొలా నికి సమీపంలో మరో వ్యక్తి.. తమ ముందు వెళ్తున్న బైక్ను ఆపడానికి యత్నించాడు. కానీ బైక్ ఆగకుండా వెళ్లిపోయింది. ఆ బైక్ను అపేందుకు యత్నించిన వ్యక్తి ఎవరా అని దగ్గరకు వెళ్లి చూడగా అతడిని నరేశ్గా గుర్తించారు. పొలంలోనే చంపి కాల్చేశారు... తమ కంటపడ్డ నరేశ్ను.. ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? అంటూ శ్రీనివాస్రెడ్డి, సత్తిరెడ్డి ప్రశ్నించారు. అనంతరం బైక్పై మధ్యలో కూర్చోబెట్టుకొని సమీపంలో ఉన్న తమ కంది చేను వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నరేశ్, సత్తిరెడ్డి కూర్చు ని మాట్లాడుకుంటుండగా.. వెనుక నుంచి వచ్చిన శ్రీనివాస్రెడ్డి ట్రాక్టర్ రాడ్తో మెడ భాగంలో బలంగా కొట్టాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత సమీపంలో ఉన్న కందికట్టలో మృతదేహాన్ని పడేసి నిప్పుపెట్టారు. శవం సగమే కాలడంతో ఆత్మ కూరు(ఎం)లోని పెట్రోల్బంక్కు వెళ్లిన శ్రీనివాస్రెడ్డి, సత్తిరెడ్డి ఐదు లీటర్ల పెట్రోల్ తెచ్చారు. తమ పొలంలో ఉన్న టైర్ల మధ్యలో మృతదేహాన్ని ఉంచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. తర్వాత శ్రీనివాస్రెడ్డి తన ఇంటికి, నరేశ్ సెల్ఫోన్ తీసుకున్న సత్తిరెడ్డి బోడుప్పల్లోని తన ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు(మే3) సాయంత్రం మౌలాలీ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన సత్తిరెడ్డి నరేశ్ సెల్ఫోన్ ధ్వంసం చేశాడు. పొలం వద్దకు వెళ్లిన శ్రీనివాస్రెడ్డి గన్నీ బ్యాగ్లో నరేశ్ అస్థికలను తీసుకెళ్లి వేములకొండ– లక్ష్మాపూర్ మధ్యలో మూసీలో కలిపేశాడు. గన్నీబ్యా గ్ను సమీపంలో పొదల్లోకి విసిరేసి ఇంటికి వెళ్లిపో యాడు. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీపీఎం డిమాండ్ చేసింది. బాత్రూంలో ఉరేసుకున్న స్వాతి.. నరేశ్ మిస్సింగ్పై అతడి తల్లిదండ్రులు మే 6న భువనగిరి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరుసటి రోజు విచారణ కోసం శ్రీనివాస్రెడ్డిని పోలీసుస్టేషన్కు పిలిచారు. దీంతో పోలీసులు తనను, తన తండ్రిని వేధిస్తున్నా రంటూ స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత 12న మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతి.. 16న బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో తన తండ్రి సెల్ఫోన్లో అత్తారింటి వేధింపులు అంటూ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ నెల 18న నరేశ్ తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేయడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు 22న ఎల్బీనగర్ డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. అనుమా నంతో శ్రీనివాస్రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిం చగా.. నరేశ్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తదుపరి దర్యాప్తు, ఆధారాల సేకరణ కోసం శ్రీనివాస్రెడ్డి, సత్తిరెడ్డిని న్యాయస్థానం అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. చిక్కుముడులు ఇంకా ఉన్నాయి ఈ కేసులో ఇంకా కొన్ని చిక్కుముడులున్నాయి. ఆత్మహత్య చేసుకునేప్పటికి స్వాతి నెల రోజుల గర్భిణి. పోస్టుమార్టంలో ఇది ఆత్మహత్యగా తేలినా... వైరల్ అయిన ఆమె 3 సెల్ఫీ వీడియో లు స్వాధీనం చేసుకున్నాం. ఇది సెల్ఫీయా? కాదా.. అనేది నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నాం. శ్రీనివాస్రెడ్డికి గతంలోనూ నేరచరిత్ర ఉందని తెలుస్తోంది. 25 ఏళ్ల కిందట వారింట్లో కొందరు చనిపోగా.. అతడి అనుచరుడిపై కేసు నమోదైంది. నరేశ్ హత్య జరిగిన రోజు అతడితో వచ్చిన తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి ఎవరో గుర్తించాల్సి ఉంది. నరేశ్తో వెళ్లిన తర్వాత ముంబైలో తన కుమార్తె గురైన ఆవేదనకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు శ్రీనివాస్రెడ్డి చెబుతున్నాడు. ఇందులో నిజానిజాలు నిర్ధారించాల్సి ఉంది. – మహేశ్ భగవత్, రాచకొండ సీపీ -
టీఆర్ఎస్ కార్యకర్తల బస్సులో మంటలు!
తృటిలో తప్పిన ముప్పు మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది యాదాద్రి: ఓరుగల్లులో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు బస్సులో వెళుతున్న పార్టీ కార్యకర్తలకు పెనుముప్పు తప్పింది. టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రయాణిస్తున్న బస్సు క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భువనగిరి బైపాస్ వద్ద ఈ ఘటన జరిగింది. డ్రైవర్తోపాటు, బస్సులోని వారు మంటలను చూడటంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మంటల్లో చిక్కుకున్న కారు
భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. -
మధుకర్రెడ్డి భార్య ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లావాసి మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యకు యత్నించింది. కొత్తపేట సౌభాగ్య పురంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న స్వాతి గురువారం అర్ధరాత్రి హార్పిక్ తాగింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన వైద్యం నిమిత్తం కొత్తపేట లోని ఓమ్ని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మధుకర్రెడ్డి మరణానికి కారణం స్వాతిఅని ఆరోపిస్తూ అతని కుటుంబసభ్యులు స్వాతిపై దాడికి పాల్పడిన విషయం విదితమే. -
‘కొట్టినా, తిట్టినా..మధుకర్ అంటే చాలా ఇష్టం’
భువనగిరి: అమెరికాలో వారం రోజుల కింద ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్రెడ్డి ఆత్మహత్య వివాదంలో అతడి భార్య స్వాతి స్పందించారు. తనపై మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఫోన్కాల్స్ రికార్డులను స్వాతి బుధవారం మీడియాకు వివరించారు. మధుకర్ రెడ్డి చివరిసారి మాట్లాడిన ఫోన్కాల్ రికార్డును స్వాతి..మీడియాకు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ మధ్య గొడవలు చాలా చిన్నవని, తన భర్త ఎప్పుడూ కొట్టడం, తిట్టడం చేసేవాడని...అయినా మధుకర్రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన భర్త పెళ్లయిన నాటి నుంచే డిప్రెషన్లో ఉన్నాడని, భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకున్నా, మధు బంధువులే అతడిని తప్పుదోవ పట్టించారన్నారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న గొడవలు తప్పా మేమిద్దరం అన్యోన్యంగానే ఉండేవాళ్లమని అయితే ఆస్తుల కోసం మధుకర్రెడ్డి తల్లిదండ్రులు తమ మధ్య సమస్యలు సృష్టించారని స్వాతి ఆరోపించారు. గత రెండు నెలల నుంచి మధుకర్ రెడ్డి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాడని స్వాతి అన్నారు. డిప్రెషన్ వల్లే తనను కొట్టి ఆ తరువాత క్షమాపణ కోరే వాడని తెలిపారు. మధుకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా తానే వేధింపులకు పాల్పడ్డానని అతని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తమని చాలా డిస్టర్బ్ చేశాడని, తన గురించి అతడు ఇక్కడ చెడుగా చెప్పేవాడని అన్నారు. ఈ విషయం తెలిసి మధు వారితో మాట్లాడటం మానేశారని స్వాతి తెలిపారు. మధు వాళ్ల అన్నకు రూ.40 లక్షలు, అక్కకు రూ.30 లక్షలు ఇచ్చారని, ఆర్థిక సమస్యలు కూడా మధును వేధించాయన్నారు. గత రెండు వారాలుగా మధు తనపై చాలా ప్రేమ చూపించాడని, చనిపోయే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాను ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చేసరకి మధు ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. తన భర్త మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని, తనపై భర్త కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారన్నారు. తనకు రక్షణ లేదని, తన పాపకు ఏమవుతుందోననే భయంగా ఉందన్నారు. తనతో పాటు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని స్వాతి కోరారు. ఉద్యోగం పోతుందనే భయం మధుకు మొదలైందని తెలిపింది. డిప్రెషన్లో ఉన్న తన భర్త ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పింది. కొంతకాలంగా తన భర్త మూడీగా ఉన్నాడని, ఈ విషయాన్ని తన అత్తమామలకు కూడా చెప్పినట్లు తెలిపింది. మానసిక ఒత్తిడి, ఉద్యోగ భయం, కుటుంబ సభ్యుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని స్వాతి వెల్లడించింది. గతంలో మధుకర్ రెడ్డి పంపిన ఈ మెయిల్ను ఆమె మీడియాకు చూపించింది. కాగా భర్త భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లిన స్వాతిపై ఆమె అత్తమామలు, బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. -
'నా కూతురు ఆరేళ్లుగా నరకం అనుభవించింది'
భువనగిరి: అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుకర్రెడ్డి అంత్యక్రియల సందర్భంగా మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతని భార్య స్వాతిపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. మధుకర్ మృతికి భార్యే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వాతి తనకు ప్రాణహాని ఉందంటూ తల్లిదండ్రులతో కలిసి భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన తన కుమార్తెపై దాడి చేయడం సరికాదని స్వాతి తల్లి అన్నారు. తన కూతురు గత ఆరేళ్లుగా నరకం అనుభవిస్తోందని ఆమె ఆరోపించారు. పాప కోసం సర్దుకుపోవాలంటూ ఇన్ని రోజులు తన కూతురికి చెప్పుకుంటూ వచ్చానన్నారు. అయితే అల్లుడి ఆత్మహత్యతో గత ఆరు రోజులుగా తమ కూతురు గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవద్దని స్వాతి తల్లి హితవు పలికారు. తన అల్లుడిది హత్యో, ఆత్మహత్యో త్వరలోనే తేలుతుందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాగా భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతితో మధుకర్రెడ్డి వివాహం జరిగింది. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మనస్తాపం చెందిన మధుకర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
భువనగిరికి మధుకర్రెడ్డి మృతదేహం
హైదరాబాద్ : కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న గూడూరు మధుకర్ రెడ్డి మృతదేహాన్ని కుటుంభసభ్యులు యాదగిరి గుట్ట మండలం భువనగిరికి తీసుకువచ్చారు. ఈ నెల 4వ తేదీన మధుకర్రెడ్డి అమెరికాలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించారు. మృతుడి మృతదేహానికి బంధువులు, ఎన్ఆర్ఐలు, గ్రామస్తులు నివాళులర్పించారు. అనంతరం సొంత వ్యవసాయ భూమిలో మధుకర్ అంత్యక్రియలు జరిగాయి. మధుకర్రెడ్డి భార్య స్వాతిపై దాడి మరోవైపు మధుకర్రెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన అతని భార్యపై బంధువులు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మధుకర్రెడ్డికి భార్య, కూతురు ఉన్నారు. దాడి నేపథ్యంలో తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ భువనగిరి పోలీసు స్టేషన్లో మధుకర్ భార్య స్వాతి, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య మమ్మీ.. నన్ను క్షమించు... -
నేడు భువనగిరికి ప్రకాశ్ జవదేకర్
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి కేంద్ర మానవవనరుల అభి వృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్జవదేకర్ శనివారం హాజరుకానున్నారు. ఉదయం 11గంటలకు యాదాద్రిలోని లక్ష్మీనరసింహæస్వామిని దర్శించుకుంటారు. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 1.30 గంటలకు డాల్ఫిన్ హోటల్ జరిగే స్థానిక పదాధికారుల సమావేశానికి హాజరవుతా రు. తిరిగి సాయంత్రం 3 గంటలకు సాయి కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని, రాత్రి 10 గంటలకు పుణే బయలుదేరి వెళ్తారు. -
మొరాయించిన రైలింజన్
- పలు రైళ్లు ఆలస్యం భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్ మొరాయించడంతో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
భువనగిరిలో దొంగల బీభత్సం
భువనగిరి: భువనగిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని జ్యూయెలర్స్ వీధిలో మంగళవారం రాత్రి తాళం వేసి ఉన్న బంగారు ఆభరణాల దుకాణాల్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. కాసోజు శ్రవణ్కుమార్కు చెందిన గోల్డ్షాపులో దొంగలు పడి 4 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు కొత నగదు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న ఎం. కొండల్కు చెందిన నాలుగు తులాల వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఇది గుర్తించిన వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం: ఇద్దరు చిన్నారుల దుర్మరణం
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి పట్టణంలోని ఫ్లైఓవర్పై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మామిళ్ల సమ్మయ్య, మంజుల దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై జనగామ నుంచి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో సాయిగణేష్(10), చరణ్(8) అక్కడికక్కడే మృతి చెందగా మరో చిన్నారి సహా సమ్మయ్య, మంజుల తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు జనగామ జిల్లా పాలకుర్తికి చెందినవారని పోలీసులు గుర్తించారు. -
ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు.. భారీగా ఆస్తులు
యాదాద్రి: ఆదాయ పన్ను కట్టకుండా ఎగనామం పెట్టిన ఓ సంతాన సాఫల్య ఆస్పత్రిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏక కాలంలో ఆ ఆస్పత్రికి చెందిన ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులు, వారి నివాసాలపై ఉదయం నుంచి సోదాలు ప్రారంభించి లెక్కకు మించిన ఆస్తులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. భువనగిరిలోని డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ ఆస్పత్రి ఉంది. అందులో డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరికి హైదరాబాద్లోని హబ్సీగూడలో కూడా సంతాన సాఫల్య కేంద్రం ఉంది. గత రెండేళ్లుగా ఈ ఆస్పత్రులకు చెందిన యాజమాన్యం ఆదాయ పన్నుకట్టడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఐటీ అధికారులు దాడులకు దిగారు. చట్ట విరుద్ధంగా నిర్వహించిన సరోగసి, పలు కాన్పుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు విలువైన పత్రాలు గుర్తించారు. -
'దేశంలో మన పోలీసులు నెంబర్ వన్'
నల్లగొండ: భువనగిరిలో మహిళా పోలీసుల విశ్రాంతి భవనాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ అని కొనియాడారు. మహిళల కోసం అన్ని పోలీస్స్టేషన్లలో విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు నీటి కోసం రోడ్లపైకి రాకుండా మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీటిని అందిస్తామని చెప్పారు. అనంతరం బీబీనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్స్టేషన్ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు నల్గొండ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భువనగిరిలో ‘బ్లాక్డే’ ర్యాలీ
భువనగిరి: బ్లాక్ డే సందర్భంగా మంగళవారం భువనగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి రైతు బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో ముస్లిం సంస్థలు డిసెంబర్ 6 ను బ్లాక్డేగా పాటిస్తున్న విషయం విదితమే. -
భువనగిరిలో పింఛనుదారుల నిరసన
భువనగిరి: యాదాద్రి జిల్లా భువనగిరిలోని బ్యాంకుల వద్ద పింఛనుదారులు నిరసన తెలిపారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద ప్రభుత్వ పింఛను దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రూ. 10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయగా రూ. 4 వేలే ఇస్తున్నారని నిరసన తెలిపారు. గంటలకొద్దీ క్యూలైన్లలో తాము నిలబడలేమని, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.4 వేలతో నెలంతా ఎలా గడపాలని ప్రశ్నించారు. వయోభారంతో ఉన్న తాము బ్యాంకుల చుట్టూ తిరిగి అస్వస్థత పాలైతే ఎవరు బాధ్యులని బ్యాంకు మేనేజర్ను నిలదీశారు. దీనిపై బ్యాంక్మేనేజర్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి అందిన నగదును ఆ నిష్పత్తి మేరకే పెన్షనర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వృద్ధులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కుక్కునూరు : మండలంలోని భువనగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పెనుబల్లి సత్యనారాయణ (30) పెళ్లయిన నాటి నుంచి అత్తవారిల్లు భువనగిరి వచ్చి నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అపస్మారకస్థితిలో నోటి నుంచి నురగలు కక్కుతూ పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సత్యనారాయణను భద్రాచలం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతికి అతని భార్య, అత్త కారణమని సత్యనారాయణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
రెవెన్యూ డివిజన్ కేంద్రం కోసం ఆందోళన
నల్లగొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం విపక్షాల నేతృత్వంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా తరలివెళ్లి తహశీల్దార్ ప్రమోదినికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం చిట్యాల -భువనగిరిరహదారిపై 200 మంది బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని నినాదాలు చేశారు. -
న్యాయవాది రహీం ఆచూకీ చెప్పండి
భువనగిరి బార్ అసోసియేషన్ భువనగిరి: పట్టణానికి చెందిన న్యాయవాది ఎంఏ రహీం ఆచూకీ చెప్పాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు డీఎస్పీ సాదు మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం ఉదయం బార్ అసోసియేషన్ కార్యవర్గం, ప్రతినిధులు, న్యాయవాదులు కలిసి డీఎస్పీని పట్టణ పోలీస్ స్టేషన్లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులుగా రహీం కన్పించడం లేదని దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారన్నారు. రహీం ఎక్కడ ఉన్నా వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. అయితే తమ అదుపులో రహీం లేడని డీఎస్పీ చెప్పారు. అతని ఆచూకీ తెలిస్తే వెంటనే చెబుతామని ఆయన న్యాయవాదులకుహామీ ఇచ్చారు. -
నయీం ఆగడాలపై ఫిర్యాదుల వెల్లువ
-
భువనగిరిలో నయీం బెదిరింపుల దందా
-
భువనగిరిలో సిట్ విచారణ
-నయీమ్ అనుచరులు సన్నిహితులపై నజర్ -అదుపులోకి తీసుకుని విచారణ భువనగిరి గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సిట్ స్పందిస్తోంది. ఇందులో భాగంగా సిట్ అధికారుల బృందం గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్య వర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్ను సిట్ అధికారులు విచారించారు. కాగా కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ కోసం తీసుకువచ్చిన వారిని కొందరిని విడిచిపెట్టగా మరికొందరిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. రిజిస్ట్రేషన్ అధికారిపై పెంచిన నిఘా భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నయీమ్కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ పరిశీలనలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ గుర్తించింది. -
‘నయీమ్’ ఎఫ్ఐఆర్లో మండలి డిప్యూటీ చైర్మన్
-
‘నయీమ్’ ఎఫ్ఐఆర్లో మండలి డిప్యూటీ చైర్మన్
నేతి విద్యాసాగర్ పేరు ప్రస్తావన ► నయీమ్ బారినుంచి కాపాడాలంటూ నేతి దగ్గరికెళ్లా.. నయీమ్తోనే నేరుగా మాట్లాడుకొమ్మన్నాడు ► తర్వాత తనే ఫోన్ చేశాడు.. నయీమ్ ఫోన్ చేస్తాడని చెప్పాడు ► భువనగిరి పీఎస్లో వ్యాపారి నాగేందర్ ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు సాక్షి ప్రతినిధి, నల్లగొండ గ్యాంగ్స్టర్ నయీమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు, ప్రజాప్రతినిధుల్లో కొందరు నయీమ్కు సహకరించారని ఇప్పటివరకు ఆరోపణలు పరోక్షంగా రాగా, తొలిసారి ఓ ప్రజాప్రతినిధి పేరును ఈ కేసులో పోలీసులే ప్రస్తావించడం రాజకీయ సంచలనానికి దారితీసింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పేరును నయీమ్ కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్)లో పోలీసులు ప్రస్తావించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ (57) ఈ నెల 17న ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి టౌన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (నంబర్ 234/2016)లో నేతి పేరు ప్రస్తావించారు. ‘‘నయీమ్ నుంచి నాకు బెదిరింపులు రావడంతో, కాపాడాలంటూ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ను కలిశా. నేరుగా నయీమ్ను కలిసి మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. తర్వాత కొన్ని రోజులకు మా పొరుగుంటికి విద్యాసాగర్ ఫోన్ చేశారు. నా సెల్ స్విచాఫ్ వస్తోందని, వెంటనే నాతో కాల్ చేయించాలని వారికి చెప్పారు. దాంతో నేను నా మొబైల్ నుంచి విద్యాసాగర్కు ఫోన్ చేశాను. ‘ఫోన్ స్విచాన్ చేసి పెట్టుకో. నయీమ్ ఫోన్ చేస్తాడు’ అని ఆయన నాకు చెప్పారు’’ అంటూ నాగేందర్ లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇలా మూడు నాలుగుసార్లు విద్యాసాగర్ పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఎఫ్ఐఆర్లో ఏముందంటే... భువనగిరిలో శివ పార్బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ పేరిట నాగేందర్ రైస్ మిల్లు వ్యాపారం చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మంచాల ఆటో సర్వీస్ పేరుతో భువనగిరిలోనే పెట్రోల్ బంక్ నడుపుతున్నారు. నయీమ్ను కలవాలంటూ అతని అనుచరులుగా చెప్పుకునే పాశం శ్రీనివాస్, మరో వ్యక్తి నాగేందర్ ఆఫీసు మేనేజర్ కృష్ణకు మార్చి 8న సమాచారమిచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మార్చి 17న నాగేందర్కు పాశం 9866144889 నంబర్ నుంచి కాల్ చేశాడు. ‘మర్నాడు నయీమ్ భాయ్ని కలవాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటా’యని బెదిరించాడు. నయీమ్కు తెలిసిన వ్యక్తి అయిన నేతి విద్యాసాగర్ (ఎమ్మెల్సీ) తనను రక్షించగలడని మార్చి 17న ఆయనను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో నాగేందర్ కలిశాడు. నయీమ్, అతని అనుచరుల నుంచి రక్షించాలని కోరాడు. నయీమ్నే నేరుగా కలిసి మాట్లాడుకొమ్మని విద్యాసాగర్ సూచించారు. మార్చి 18న పాశం, మరో ఇద్దరు కలిసి నాగేందర్ను భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి డస్టర్ కారులో కళ్లకు గుడ్డలు కట్టి ఘట్కేసర్, ఔటర్రింగురోడ్డు దాటించి తీసుకెళ్లారు. తర్వాత నలుపు ఎక్స్యూవీ 500 కారులోకి మార్చి చివరికి నయీమ్ వద్దకు తీసుకెళ్లారు. నయీమ్ ముగ్గురు 20 ఏళ్ల సాయుధ యువతులతో కలిసి ఉన్నాడు. తనకు రూ.5 కోట్లు తనకు ఇవ్వాలన్నాడు. లేదంటే నాగేందర్ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. చివరికి రూ.కోటి ఇచ్చేందుకు నాగేందర్ అంగీకరించాడు. ఏప్రిల్ 30లోపు డబ్బులివ్వాలని, లేదంటే నాగేందర్ కొడుకుల్లో ఒకరిని చంపేస్తానని, తర్వాత మిగతా వాళ్లనూ అంతం చేస్తానని నయీమ్ హెచ్చరించాడు. ‘‘మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని చంపినట్టుగానే నీ కొడుకునూ హత్య చేస్తా. రోడ్డు ప్రమాదంగా చిత్రిస్తా, ఎవరూ పసిగట్టలేరు కూడా’’ అని నాగేందర్ను బెదిరించాడు. తర్వాత నాగేందర్ను గంతలు కట్టి తీసుకెళ్లి భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి దగ్గర దింపేశారు. తర్వాత ఏప్రిల్ 30న నాగేందర్ పక్కింటి వ్యక్తికి ఎమ్మెల్సీ విద్యాసాగర్ ఫోన్ చేశారు. నాగేందర్ ఫోన్ స్విచాఫ్ వస్తోందని అతనికి చెప్పాడు. వెంటనే నాగేందర్తో తనకు ఫోన్ చేయించాలన్నాడు. దాంతో నాగేందర్ తన మొబైల్ నుంచి విద్యాసాగర్కు ఫోన్ చేశాడు. ‘నయీమ్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఆన్లోనే ఉంచుకో’ అని నాగేందర్కు విద్యాసాగర్ చెప్పాడు. ఉదయం 8:30 ప్రాంతంలో నాగేందర్కు నయీమ్ ఫోన్ చేశాడు. వెంటనే డబ్బు చెల్లించాలని బెదిరించాడు. తన అనుచరులు పాశం, సుధాకర్ల మీద నాగేందరే పీడీ యాక్టు పెట్టించాడని అనుమానించాడు. (ఇదంతా నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదులో ఉందని మాత్రమే ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించారు) -
నల్గొండ జిల్లాలోనూ నయీం అరాచకాలు
-
భువనగిరికి చేరిన నయీం మృతదేహం
పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం పోలీసుల ఆధీనంలో గ్యాంగ్స్టర్ ఇల్లు మఫ్టీలో అనుమానితుల ఫొటో, వీడియోలు తీసిన పోలీసులు భువనగిరి : మాజీ నక్సలైట్, గ్యాంగ్స్టర్ నయీం మరణంతో నల్లగొండ జిల్లాలోని భువనగిరి పట్టణం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన నÄæూమ్ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం భువనగిరిలోని ఖాజీమహల్లోగా నివాసగృహానికి తీసుకువచ్చారు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలె చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని చూడాలని.. మధ్యాహ్నం 3.07నిమిషాలకు నయీం మృతదేహాన్ని భువనగిరి ఎల్లమ్మగుడి వద్దకు.. 3.09నిమిషాలకు హైదరాబాద్ చౌరస్తా, 3.15 నిమిషాలకు ఇంటి వద్దకు చేరుకుంది. 3.16 నిమిషాలకు అంబులెన్స్ నుంచి ఆయన మృతదేహాన్ని బయటకి తీయడంతో ప్రజలు అంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం అక్కడి చేరుకున్నారు. 2007 తర్వాత నయీంను ఎవరూప్రత్యక్షంగా చూడకపోవడంతో ఆయన మృతదేహాన్ని చూడాలని చాల మంది అక్కడి వచ్చారు. వీరితోపాటు యువకులు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. కాగా నయీం కుటుంబ సభ్యులు ప్రత్యేక టవేరా వాహనంలో అంబులెన్స్ వెనకాలే వచ్చారు. వారంతా మృతదేహాంతో పాటు ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఇతరులను లోపలికి రాకుంండా ఇంటి షెటర్ కిందకు వేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నయీంను చూడడానికి ప్రజలు ఒక్కసారిగా లోపలికి వెళ్లే సమయంలో పోలీసులు ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నయీం ఇంటి వెనుక భాగంలో నుంచి కుటుంబసభ్యులు వచ్చి మీడియాతో మాట్లాడారు. చివరి సారిగా నయీంను అతడి భార్య, అక్క, పిల్లలు చూడాలని వెంటనే పోలీసులు వారిని తీసుకురావాలని, లేకుంటే శవాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు భీష్మించుకు కుర్చున్నారు. డీఎస్పీ మోహన్రెడ్డి, సీఐలు శంకర్గౌడ్, అర్జునయ్య, రఘువీర్రెడ్డిలతో పాటు గుండాల, బొమ్మలరామారం, భువనగిరిటౌన్, భువనగిరిరూరల్, ఆలేరు, బొమ్మలరామారం ఎస్ఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు భువనగిరి పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మెుహరించారు. ఖిలానగర్ నుంచి నల్లగొండ బైపాస్ రోడ్డు వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లగొండ నుంచి ప్రత్యేక పోలీసులను రప్పించారు. సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చారు. మఫ్టీలో వందల మంది పోలీసులు ప్రజల్లో కలిసిపోయారు. అవాంఛనీయ ఘటనలు ఎదురైనా ఎదుర్కోవడానికి రక్షక్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. భువనగిరి–చిట్యాల రోడ్డులో జంపుఖానగూడెం, నల్లగొండ రోడ్డు వద్ద భారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. వివిధ ప్రాంతాల నుంచి నయీం అనుచరుల రాక నయీం అంత్యక్రియలు జరుగుతున్నందున్న పలువురు అనుచరులు పట్టణానికి చేరుకున్నారు. భువనగిరితో పాటు వరంగల్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, అదిలాబాద్, మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పలువురు మాజీ నక్సలైట్లు, నయీం ముఠా సభ్యులు ఇక్కడి వచ్చారు. స్థానిక పోలీసులు జనంలో కలిసిపోయి అనుమానితుల ఫొటోలు, వీడియోలు తీశారు. -
దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ నయీమ్
-
ఎవరీ నయీం?
-
ఎవరీ నయీం?
సాక్షి, హైదరాబాద్: నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఉమ్మడి రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. నక్సలైట్ నుంచి కోవర్టుగా నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు. ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటారని వినిడికి. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతే ఇందుకు కారణమని తెలుస్తోంది. దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడా బయటికి రాకుండా నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు! అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. -
భువనగిరిలో వివాహిత అదృశ్యం
భువనగిరి అర్బన్ వివాహిత ఆదృశ్యమైంది. ఈ ఘటన భువనగిరిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ ంలోని హుస్నాబాద్కు చెందిన కొలిపాక మల్లయ్య కుమారుడు పాండుకు బీబీనగర్ మండలానికి చెందిన నాగరాణితో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గోడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగరాణి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో తన అమ్మగారి ఇంటికి వెళ్తానని పాండు పెద్దనాన్న కుమార్తె రేణుకతో కలిసి ఇంటి నుంచి బయలు దేరింది. హుస్నాబాద్ నుంచి స్థానిక కిసాన్నగర్కు వచ్చింది. రేణుకను అక్కడే వదిలి అమ్మగారి ఇంటికి పోతునట్లు భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ వైపునకు వెళ్లింది. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఇంటికి రాక పోవడంతో వెంటనే చుట్టు పక్కల ప్రాంతాలు, బంధువుల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఆమె భర్త పాండు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ ఎస్. మంజునాథ్రెడ్డి తెలిపారు. -
భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన ట్రాఫిక్
నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న మూసీ వరదతో నల్లగొండ జిల్లా భువనగిరి-పోచంపల్లి మధ్య మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఉన్న బీబీనగర్ మండలం బట్టుగూడెం వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
భువనగరి (నల్గొండ జిల్లా) : భువనగిరి మండల పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ భగవాన్, డీఎస్పీ సత్తెన్న, సీఐ శివశంకర్ గౌడ్, ఎస్ బాషాతోపాటు పలువురు పాల్గొన్నారు. రికార్డులను పరిశీలించి కళాశాలలో వసతులు ఎలా ఉన్నాయో చూశారు. వాత్సల్య, కేడీఆర్ ఇంజనీరింగ్, యూనిటీ ఫార్మసీ కళాశాలల్లో తనిఖీలు కొనసాగుతోన్నాయి. -
బైక్ను ఢీకొన్న లారీ: యువకుడు మృతి
భువనగిరి (నల్గొండ జిల్లా) : భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద జాతీయరహదారిపై బైక్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో రామన్న పేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన మందాడి ప్రమోద్కుమార్(27) అనే యువకుడు మృతిచెందాడు. బైక్పై హైదరాబాద్ నుంచి రామన్నపేట వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమోద్ హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులకు ప్రమోద్ ఒక్కడే కుమారుడు. దీంతో పండగపూట ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతల్లికి, పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య
నల్గొండ : పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరిలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. తన కన్న తల్లితో పాటు ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించిన రమేష్... అనంతరం అతడు అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు బాలికలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యలకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని బంధువులు చెబుతున్నారు. మృతులను పద్మ (62), రమేష్ (42), సర్వూప (8), కావేరి (4), నందిని (2)గా గుర్తించారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో నిలిచిన రెండు రైళ్లు
భువనగిరి (నల్గొండ జిల్లా) : డ్రైవర్ నిర్లక్ష్యంతో భువనగిరి రైల్వే స్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంటర్సిటీ, ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అంతకుముందు సికింద్రాబాద్ వైపు వెళ్లిన ఒక గూడ్సు రైలు బగిడిపల్లి ర్వైల్వే స్టేషన్లో సిగ్నల్ ఇవ్వకున్నా ముందుకు వెళ్లిపోవడంతో గత్యంతరం లేక అదే మార్గంలో వెళ్లనున్న రైళ్లను భువనగిరిలోనే ఆపడం జరిగింది. గూడ్సు రైలు సికింద్రాబాద్ చేరేవరకూ ఈ రైళ్లను ఇక్కడే ఆపేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. గూడ్సు రైలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థతి దాపురించిందని వారంటున్నారు. అదే మార్గంలో వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైళ్లను వదిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తాము ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
'గుణాదిగూడ కాలువ వెంటనే పూర్తి చేయాలి'
నల్గొండ : వ్యవసాయ సాగుకు ఎంతో ఉపయోగపడే నల్గొండ జిల్లా భువనగరి మండలంలోని గుణాదిగూడ కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. మంగళవారం భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ నేత నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ దీక్షకు స్థానిక కాంగ్రెస్పార్టీ నేత కుంభం అనిల్కుమార్రెడ్డి మద్దతు పలికారు. ఈ దీక్షలో సీపీఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
సాగు నీటి కోసం రిలే దీక్షలు
బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి పంటలకు నీరందించాలని కోరుతూ నల్లగొండ జిల్లా భువనగిరిలో రైతులు దీక్షలు ప్రారంభించారు. భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మొదలైన ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బునాదిగాని కాల్వపనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే పనులను పూర్తి చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలు మరో రెండు రోజులు కొనసాగుతాయి. 25న ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. -
జెండా ఆవిష్కరణపై నాయకుల కొట్లాట
భువనగిరి: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ విషయమై కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జగదేవ్పూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బర్రె జహంగీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతుండగా... నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం అనిల్కుమార్రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం కంభం అనికుమార్రెడ్డి పై జహంగీర్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన తెలంగాణ ఎక్స్ప్రెస్
భువనగిరి: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది. సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన రైలు 10.30 గంటల సమయంలో ఇంజన్ లో సమస్య వచ్చింది. వెంటనే గుర్దించిన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వేరే ఇంజన్తో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇంజన్ను భువనగిరి స్టేషన్కు తీసుకొచ్చి మరమ్మతులు చేపట్టారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ పునరుద్ధరణకు మరో అరగంటపాటు సమయం పడుతుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. -
యువకుడిని కొట్టి బంగారం చోరీ
భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరిలోని తారకరామనగర్లో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు పడి బంగారు చోరీ చేశారు. స్థానికంగా ఉండే రేణుక తెల్లవారుజామున లేచి పనికి వెళ్లిపోయింది. ఇంట్లో ఆమె కుమారుడు నవీన్ నిద్రపోతుండగా జొరబడిన దొంగలు నవీన్ను కొట్టి, తాడుతో కట్టేసి బీరువాలో ఉన్న 5 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. రేణుక పనులు ముగించుకుని ఇంటికొచ్చి చూడగా తలుపునకు గొళ్లెం పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా కొడుకును కట్టేసి ఉండటంతో విషయం బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటిని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగ బంగారంతో బ్యాంకులకు టోకరా
నల్లగొండ క్రైమ్: బ్యాంకులకు టోకరా వేసిన ఓ వ్యక్తిని నల్లగొండ జిల్లా భువనగిరిలో పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు... భువనగిరి పట్టణానికి చెందిన తంగెళ్లపల్లి గిరిధరాచారి హెడ్డీఎఫ్సీ, కెనరా బ్యాంకులకు గోల్డ్ అప్రెయిజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తెలిసిన వారితో నకిలీ బంగారాన్ని తాను పనిచేస్తున్న బ్యాంకు శాఖల్లో కుదువ పెట్టించి రూ. 83 లక్షల మేర రుణాలను పొందేలా చేశాడు. అలా దండుకున్న సొత్తుతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. అతడిలో ఆకస్మిక మార్పును గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా చారి మోసం వెలుగు చూసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. -
భువనగిరి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరి మున్సిపాలిటికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం టీఆర్ఎస్ తీర్చం పుచ్చుకున్నారు. ఇందుకు నిరసనగా మిగిలిన 14 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ సమావేశం జరుగుతుండగా నాటకీయంగా 16 మంది టీఆర్ఎస్లో చేరారు. ఇంతవరకూ టీఆర్ఏస్కు ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా లేదు. 30 మంది కూడా ఇతర పార్టీల వారే గెలిచారు. అయితే అధికార పార్టీ జరిపిన మంత్రాంగంతో 16 మంది టీఆర్ఎస్ లో చేరారు. కోరం ఉంది కాబట్టి తాము సమావేశం నిర్వహిస్తామని 16 మంది సమావేశానికి వెళ్లారు. అక్కడ మిగిలిన 14 మంది కౌన్సిలర్లు గొడవకు దిగారు. అయితే గందరగోళం మధ్యనే మున్సిపల్ సమావేశం జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సమావేశ హాలు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఓ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కీర్తి సాయికుమార్ (19), సింగిరెడ్డి దినేష్రెడ్డి (19), ఇప్పాలపల్లి హరీష్ (21)లు ఒకే బైక్పై టేకుల సోమారం గ్రామానికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్రెడ్డి, హరీష్లకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీకి తరలించారు. -
రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి
భువనగిరి (నల్లగొండ) : వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైల్లో నుంచి గుర్తుతెలియని వ్యక్తి(45) జారిపడి మృతిచెందాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్పిన్నింగ్ మిల్లో అగ్నిప్రమాదం
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ శివారులోని సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మిల్లులో నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
భువనగిరి అర్బన్ (నల్గొండ జిల్లా) : భువనగిరి మండలం రాయగిరి శివారు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంకటేశ్(25) అనే యువకుడు మృతిచెందాడు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వైపు బైక్పై వెళ్తున్న వెంకటేశ్ను యాదగిరిగుట్ట నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంకటేశ్ స్వస్థలం భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామం. -
55 మేకల్ని ఎత్తుకెళ్లిన దొంగలు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి 55 మేకలు చోరీకి గురయ్యాయి. మంగళవారం ఉదయం షెడ్డులో మేకలు లేకపోవడాన్ని గుర్తించిన మేకల యజమానులు శ్రీనివాస్, శంకరయ్య భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తుకెళ్లిన మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని తెలిపారు. -
రైతుల రాష్ట్రంగా తెలంగాణ
నల్గొండ: ఫాలిహౌజ్ సబ్సిడీలకు రూ. 250 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ జిల్లా భువనగిరిలో ఫాలిహౌజ్ను మంత్రి పోచారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుంట గుంటకు సాగు నీరు.... ఇంటింటికి మంచి నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. అప్పులు, ఆత్మహత్యలు లేని రైతుల రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దుతామని పోచారం స్పష్టం చేశారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
భువనగిరి: కుటుంబ కలహాలతో వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో సగానికి పైగా కాలిపోయిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం హన్మపురంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన జమాలుద్దీన్(38), జహంగీర్బీ(33) దంపతులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురైన జహంగీర్బీ ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతి
భువనగిరి అర్బన్ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామం వద్ద బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని దశరథ్(64)గా గుర్తించారు. బైక్పై దశరథ్ భువనగిరి నుంచి అనంతారం వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో దశరథ్ బైక్ డివైడర్ను ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. -
లాడ్జిలపై పోలీసుల దాడి
భువనగిరి అర్బన్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న 3 లాడ్జిలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాడ్జిలలో ఉన్న 10 జంటలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పట్టబడిన వారిని రూరల్ స్టేషన్కు తరలించారు. కాగా.. న్యూసెన్స్ ఎక్కువవుతోందనే ఫిర్యాదుతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
భువనగిరి (నల్లగొండ) : గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైలు పట్టాల మీద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు అంటున్నారు. -
భువనగిరిలో చైన్ స్నాచింగ్
భువనగిరి (నల్లగొండ) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వీరపల్లె గ్రామానికి చెందిన గుత్తికొండ అనసూయ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి భువనగిరికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల ఆమె వద్దకు వచ్చి ఆమెతో మాటలు కలిపి అకస్మాత్తుగా ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో ఆమె పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
గ్రామజ్యోతిలో తన్నులాట
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలో బుధవారం జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్, వార్డు మెంబర్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కార్యక్రమం నుంచి వెళ్లిన వెంటనే గ్రామంలోని సమస్యలపై సర్పంచ్ బి.విమల, ఎనిమిదో వార్డు సభ్యుడు యాదగిరి మధ్య వాదన జరిగింది. కోపంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు వారిని సముదాయించారు. -
భువనగిరిలో వ్యక్తి దారుణ హత్య
నల్లగొండ(భువనగిరి): నల్లగొండ జిల్లా భువనగిరిలో ఓ వ్యకి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. భువనగిరికి చెందిన పోటెట్టి పోచయ్య(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే పోచయ్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత గ్రామ శివారులో కత్తులతో పొడిచి హతమార్చినట్టు తెలుస్తోంది. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పంచాయతీ కార్మికుల ధర్నా
భువనగిరి: జీవో నంబర్ 11 ప్రకారం పారిశుధ్య కార్మికులకు కనీసం వేతనాన్ని రూ. 15 వేలకు పెంచి, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొడ జిల్లా భువనగిరిలో గ్రామపంచాయితీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. బుధవారం భువనగిరిలోని పాతబస్ స్టాండ్ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే తమకు కూడా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి, ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. -
భువనగిరిలో చోరీ
నల్లగొండ: ఇంట్లో ఎవరులేని సమయం చూసి దొంగలు పడి దోచుకెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లో లేని సమయంలో భార్యా పిల్లలు ఆరుబయట నిద్రపోతుండగా అదే సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 30 తులాల వెండి, తులం బంగారంతో పాటు రూ. 8 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కార్పియో బోల్తా : ఒకరి మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరి శివారులోని పఠాన్చెరు స్పిన్నింగ్ మిల్లువద్ద స్కార్పియో బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు...వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న స్కార్పియో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన దస్తగిరి (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంతో మరో ఇద్దరు గాయపడ్డారు. భువనగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. (భువనగిరి అర్బన్) -
భువనగిరిలో అగ్ని ప్రమాదం
భువనగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గంజి మార్కెట్ సమీపంలోని శ్రీ సోమేశ్వర స్వామి పెయింటింగ్ షాపు పూర్తిగా కాలిపోయింది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాపు యాజమాని వాపోయారు. షాపులోని కెమికల్స్, రంగులు ఇతర మెటీరియల్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కల్తీకల్లు తాగి ఒకరి మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలో కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. మండలంలోని బాలంపల్లిలో గ్రామానికి చెందిన కాశపాక మల్లేశ్(45)తో పాటు మరో నలుగురు మంగళవారం సాయంత్రం కల్లు తాగారు. అనంతరం వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతే బుధవారం ఉదయం మల్లేశ్ మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. (భువనగిరి) -
పసిపాపలతో పట్టాలపై...
ముగ్గురు కూతుళ్లతో రైలు కింద పడిన తల్లి చివరి నిమిషంలో పెద్దకుమార్తెను పక్కకు తోసేసిన ‘కన్న మనసు’ తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతి భువనగిరి: ఓ తల్లి ఇద్దరు కూతుళ్లు సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చివరి నిమిషంలో తన పెద్ద కుమార్తెను పక్కకు తోసేయడంతో ఆ చిన్నారి బతికిపోయింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని జగ్దేవ్పూర్ రైల్వేగేట్ వద్ద జరిగింది. ప్రాణాలతో బయటపడిన చిన్నారి వనజ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు శివారు ఎంకమ్మగూడేనికి చెందిన అరుణమ్మ (35)కు కుమార్తెలు వనజ (9), మౌనిక (3), పూజ (6 నెలలు) కు ఉన్నారు. కొద్ది నెలల క్రితం భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరిన అరుణమ్మ కూలీనాలీ చేసుకుని జీవిస్తోంది. ఆమెకు సోదరులు నర్సింహ, కిష్టయ్య, యాదయ్య, పెంటయ్య ఉన్నారు. ఆదివారం వారితో గొడవ పడిన అరుణమ్మ తన ముగ్గురు పిల్లలను తీసుకుని హైదరాబాద్ బస్స్టేషన్కు చేరుకుంది. రాత్రి అక్కడే నిద్రపోయిన నలుగురు సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులో భువనగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ జగ్దేవ్పూర్ గేట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కూతుళ్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని పట్టాలపై ఆఫ్లైన్లో కూర్చుంది. విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్తున్న రైలు దగ్గరకు రాగానే ఆ తల్లి హృదయం కరిగిందో తెలియదు కానీ... తన ఒడిలోని పెద్ద కుమార్తె వనజను పక్కకు నెట్టేసింది. రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తల్లి అరుణమ్మ, మౌనిక, పూజ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిసేపటి దాకా వనజకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత రోదిస్తూ సమీపంలోని గేట్మన్ వద్దకు వెళ్లి ‘మా అమ్మ, చెల్లెళ్లు రైలుకింద పడి చనిపోయారు’ అని చెప్పింది. రైల్వే పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బాణసంచా పేలి ఇద్దరి సజీవదహనం
నల్లగొండ జిల్లా భువనగిరి ఆర్పీ నగర్లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణసంచా పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆర్పీ నగర్లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడిపిస్తుంటారు. అతడు తన షాపులో దీపావళి బాణసంచా అమ్మకానికి ఉంచాడు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండటంతో ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావును పిలిపించారు. అక్కడ ఓ సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది. మరమ్మతులు చేస్తుండగానే సెల్ఫోన్ బాగా వేడెక్కడంతో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బాణసంచా కూడా అంటుకుంది. దాంతో ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావుతో పాటు, బాణసంచా కొనేందుకు వచ్చిన కళ్యాణ్ కూడా అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పోశెట్టి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి, అక్కడి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. -
భువనగిరి ఆర్బీనగర్లో బాణసంచా పేలుడు
-
భువనగిరిలో బతకమ్మ సందడి
-
భువనగిరిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం భువనగిరి బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఇండికా కారులో వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా.... ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్, మరొకరు కారు డ్రైవర్. వీరంతా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. -
మళ్లీ..నాలుగు చోట్ల వాయిదా
మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో శుక్రవారం ఆరు మండలాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయా మండలాల్లో రెండో రోజు శనివారం నాలుగుచోట్ల (భువనగిరి, యాదగిరిగుట్ట, మునగాల, ఆత్మకూర్.ఎస్) కోరం లేక వాయిదా పడ్డాయి. మునుగోడు ఎంపీపీగా టీఆర్ఎస్ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, చిట్యాల ఎంపీపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. భువనగిరి.. మళ్లీ వాయిదా భువనగిరి : భువనగిరి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక రెండవ రోజైన శనివారమూ వాయిదా పడింది. శుక్రవారం కోరం లేక ఎన్నికను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మొత్తం 14మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ సభ్యుడు, ఎక్స్అఫీషియో సభ్యుడైన స్థానిక శాసనసభ్యుడు ఎన్నికకు హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4 గంటల వరకు ఏ ఒక్క సభ్యుడూ హాజరుకాలేదు. దీంతో ఎన్నికల అధికారి దేవ్సింగ్ ఎన్నిక వాయిదా వే స్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎన్నికల కమిషన్ నుంచి తేదీ వచ్చిన తర్వాత సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. గుట్ట ఎంపీపీ ఎన్నిక నిరవధిక వాయిదా యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. 4వ తేదీన ఎన్నిక జరగకపోతే మరునాడే ఉంటుందని ప్రకటించిన అధికారులు గుట్టలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల మూలంగా శనివారం కూడా సమావేశం జరపకుండా నిరవధికంగా వాయిదా వేశారు. తదుపరి సమావేశం తేదిని నిర్ణయించేది రాష్ట్ర ఎన్నికల కమిషనేనని ఎన్నికల అధికారి డాక్టర్ అప్పారావు తెలిపారు. 4న టీఆర్ఎస్కు చెందిన 8మంది, ఒక స్వతంత్ర ఎంపీటీసీ సమావేశానికి హాజరుకాలేదు. కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆరుగురు, మరో స్వతంత్ర అభ్యర్థి మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. కోరం ఉండి కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటే ఎంపీపీ ఎన్నిక వాయిదాపడినా మరునాడే జరుపుతారు. కానీ కోఆప్షన్ సభ్యుడి ఎంపిక జరగకపోవడంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎంపీపీ ఎన్నిక చిట్యాల : చిట్యాల మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక శనివారం తీవ్ర ఉద్రిక్తతల నడమ నిర్వహించారు. ఎంపీపీగా టీఆర్ఎస్కు చెందిన బట్టు అరుణ ఎన్నికయ్యారు. శుక్రవారం కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు పోలీసు బందోబస్తుతో నల్లగొండ నుంచి చిట్యాలకు వాహనాలలో బయలుదేరారు. చిట్యాలలో ఉరుమడ్ల రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలోకి రాగానే టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు వస్తున్న బస్సుపై కొందరు రాళ్లతో దాడిచేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆనంతరం ఆ ఎంపీటీసీ సభ్యులు నిర్ణీత ఎన్నిక సమయానికి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ సభ్యులు కాగా, బస్సులోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, సీపీఎంకు చెందిన ఇద్దరు గైర్హాజరయ్యారు. అప్పటికే అదే గదిలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు ఆరుగురు పక్క గదిలోకి వెళ్లారు. కాంగ్రెస్కు చెందిన మరో ఇద్దరు సభ్యులు రాకపోవడంతో కోరం లేక అధికారులు ఎన్నికను ప్రారంభించలేదు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు మరికొందరు కార్యాలయంలోకి రావడంతో పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రాజేశ్వరావులతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సమావేశ గదికి చేరుకుని ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను కోరారు. టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన ఆరుగురు ఎంపీటీసీలకు తోడు కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పాల్గొనడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. దీంతో టీఆర్ఎస్కు చెందిన వనిపాకల ఎంపీటీసీ సభ్యురాలు బట్టు అరుణను ఎంపీపీగా పెద్దకాపర్తి ఎంపీటీసీ సభ్యురాలు ఓర్సు లక్ష్మమ్మ ప్రతిపాదించగా ఉరుమడ్ల ఎంపీటీసీ సభ్యుడుఅబ్బయ్య బలపర్చారు. బరిలో ఎవరూలేకపోవడంతో ఆమె ఎంపీపీ ఎన్నికైనట్టు ప్రకటించారు వైస్ ఎంపీపీగా టీడీపీకి చెందిన మల్లేష్ ఎన్నికయ్యారు. -
అన్టైడ్లో కోత
భువనగిరి : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) ద్వారా పీహెచ్సీలు, సబ్సెంటర్లకు కేటాయిస్తున్న అన్టైడ్(తిరిగి చెల్లించని) నిధుల్లో కోతపడింది. ఈ నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలు సమర్పించడంలో వైద్యసిబ్బంది అలసత్వం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం కోత విధించింది. దీంతో వైద్యసేవలకు విఘాతం కలగనుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్సెంటర్లలో.. జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 565 సబ్సెంటర్లు ఉన్నాయి. వీటిలో వసతుల కల్పన, అత్యవసర మందుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం ద్వారా 2005 నుంచి అన్టైడ్ నిధులు (ఆస్పత్రిస్థాయిని బట్టి) విడుదల చేస్తోంది. ఈ నిధులతో ఆయా పీహెచ్సీలు, సబ్సెంటర్లలో సౌకర్యాలు కల్పించడమే గాక అత్యవసర మందులు కొనుగోలు చేసి మెరుగైన వైద్యసేవలు అందించేవారు. అలాగే సబ్సెంటర్ల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శానిటేషన్ పనులు నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యం కాపాడేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకునేది. ఎస్ఓఈ సమర్పించకపోవడంతో.. ఏటా విడుదలయ్యే అన్టైడ్ నిధులు, చేసిన ఖర్చుల వివరాలు పీహెచ్సీ, సబ్సెంటర్లు ఎన్ఆర్హెచ్ఎంకు సమర్చించాలి. కానీ జిల్లాలో ఉన్న 50శాతం పీహెచ్సీలు, సబ్సెంటర్లు 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్ఓఈ (విడుదలైన నిధులు, ఖర్చులు వివరాలు)సమర్పించలేదు. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధుల్లో కేంద్రప్రభుత్వం కోత విధించినట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ నిధులు సరిపోక పీహెచ్సీలు, సబ్సెంటర్లలో సరైన వైద్యసేవలు అందే అవకాశం లేదు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జిల్లా అధికారులు సకాలంలో స్పందించకపోతే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిధుల దుర్వినియోగమే కారణమా? పీహెచ్సీలు, సబ్ సెంటర్లకు ఎన్ఆర్ హెచ్ఎం ద్వారా వస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా తప్పుడు నివేదికలను రూపొందించడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రావడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. నిధుల వినియోగంలో సరైన నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.