రాజస్థాన్లో ఓ బీజేపీ ఎమ్మల్యేపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
జైపూర్: రాజస్థాన్లో ఓ బీజేపీ ఎమ్మల్యేపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దౌసాలోని మహ్వా నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ హుడ్లా ఏవో పనుల్లో తన ఇంట్లో ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు ఇంటి ప్రాంగణంలోకి చొరబడి కిటికిలో నుంచి కాల్పులు జరిపారు.
అయితే, అదృష్టవశాత్తూ ఆయనకు ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. ఆయన వెంటనే అలారం మోగించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.