అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సీవీసీ అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది.
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది. అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లు(సీవీవో) అందరూ తమ విధానాలతో పాటు వ్యూహాల్ని కమిషన్తో పంచుకోనున్నారు.
గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 15 లక్షల మంది ప్రజలతో పాటు 30,000 సంస్థలు అవినీతి నిర్మూలనకు ఈ–ప్రతిజ్ఞ చేశాయని సీవీసీ పేర్కొంది. సెమినార్లు నిర్వహించడంతో పాటు బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వాధికారులు, ప్రజల్లో అవినీతిపై అవగాహన కలిగిస్తామని కమిషన్ తెలిపింది.