మహిళలపై కాంగ్రెస్‌ నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు! | Congress leader comments on Women | Sakshi
Sakshi News home page

మహిళలపై కాంగ్రెస్‌ నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు!

Mar 28 2017 4:13 PM | Updated on Mar 18 2019 7:55 PM

మహిళలపై కేరళ కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు

త్రివేండ్రం: మహిళలపై కేరళ కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారని, కాబట్టి వారిని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి అనుమతించకూడదని పేర్కొన్నారు.

'రుతుస్రావం అనేది మలినమైనది. ఈ సమయంలో మహిళలను ఆలయాల్లోకి రానివ్వకూడదు. ఈ సమయంలో మహిళలకు రాకూడదన్న సూచన వెనుక సైంటిఫిక్‌ కారణం ఉంది. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదు. ఈ సమయంలో మహిళలు ఉపవాసం ఉండకూడదు. నా అభిప్రాయం ప్రకారం మహిళల శరీరం మలినంగా ఉన్నప్పుడు వారు ఆలయాలు, మసీదులు, చర్చిల వంటివాటికి వెళ్లకపోవడమే మంచిది' అని ఆయన పేర్కొన్నారు. కేరళ పీసీసీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. గతకొంతకాలంగా ఖాళీగా ఉన్న కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవిని తనకు సన్నిహితుడైన ఎంఎం హసన్‌కు మాజీ సీఎం ఊమెన్‌ చాందీ పట్టుబట్టి మరీ ఇప్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement