తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్దే: గవర్నర్ | governor narasimhan met rajnath singh at delhi | Sakshi
Sakshi News home page

తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్దే: గవర్నర్

Oct 5 2015 6:45 PM | Updated on Sep 3 2017 10:29 AM

తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్దే: గవర్నర్

తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్దే: గవర్నర్

చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించారు.

న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్  స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ మంత్రిగా కొనసాగుతుండటంపై  మీడియా ప్రశ్నించగా.. 'తలసాని శ్రీనివాస్ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ స్పీకరే' అని సమాధానమిచ్చారు. రాజ్ నాథ్ తోపాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కూడా గవర్నర్ కలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement