ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్నగర్ లో ఉన్న ప్రభుత్వ బాలచెరసాల(జువనైల్ హోమ్)లో విచిత్రమైన కేసు నమోదయింది.
ముజాఫర్నగర్: ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్నగర్ లో ఉన్న ప్రభుత్వ బాలచెరసాల(జువనైల్ హోమ్)లో విచిత్రమైన కేసు నమోదయింది. 16 ఏళ్ల బాలుడు తోటి ఖైదీ(18)పై సహజ విరుద్ధమైన లైంగిక చర్య(పుంమైథునం)కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదించాడు.
బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితుడిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వారందరూ ఇదేం చోద్యమంటూ నోటిపై వేలు వేసుకుంటున్నారు.