
యూపీలో రైలు ప్రమాదం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్పూర్(మధ్యప్రదేశ్) నుంచి హజ్రత్నిజాముద్దీన్(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్పహాడ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారు.
ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా, లేదా అనేది తెలియాల్సిఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో మహాకోశల్ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
ఝాన్సీ: 05101-1072
గ్వాలియర్: 0751-1072
బండా: 05192-1072