యూపీలో రైలు ప్రమాదం | Mahakoshal express derails in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో రైలు ప్రమాదం

Published Thu, Mar 30 2017 7:39 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

యూపీలో రైలు ప్రమాదం

యూపీలో రైలు ప్రమాదం

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారు.

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా, లేదా అనేది తెలియాల్సిఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో మహాకోశల్‌ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.

ఝాన్సీ: 05101-1072

గ్వాలియర్‌: 0751-1072

బండా: 05192-1072




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement