రూ. 10 కోసం నలుగురు వ్యక్తులు ఒకరిని హత్య చేశారు. బీహార్లోని కటిహార్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.
పాట్నా: రూ. 10 కోసం నలుగురు వ్యక్తులు ఒకరిని హత్య చేశారు. బీహార్లోని కటిహార్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. దీపక్కుమార్ యాదవ్ అనే యువకుడిని నలుగురు వ్యక్తులు గుట్కూ కొనుక్కునేందుకు పది రూపాయలు అడిగారు. అతడు అందుకు నిరాకరించడంతో వారు మూకుమ్మడిగా దాడిచేసి, కత్తులతో పొడిచి చంపారు.