
చైనాలో పర్యటించనున్న మోదీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 14 వ తేదీ నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే 14 వ తేదీ నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. మే 14 నుంచి 16 వరకు చైనాలో మోదీ
పర్యటించి.. ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. చైనా పర్యటనలో భాగంగా మోదీ జియాన్, బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించనున్నారు. అనంతరం 17వ తేదీన మోదీ మంగోలియా చేరుకుంటారు. అక్కడి దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత అంటే 18 ,19 తేదీల్లో మోదీ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అయితే మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ మంగోలియాలో పర్యటించనున్నారు.